‘సరి-బేసి’ నుంచి వారికి మినహాయింపు: సీఎం | Delhi women to be exempted from odd-even scheme, Says Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

‘సరి-బేసి’ నుంచి వారికి మినహాయింపు: సీఎం

Published Sat, Oct 12 2019 9:02 PM | Last Updated on Sat, Oct 12 2019 9:06 PM

Delhi women to be exempted from odd-even scheme, Says Arvind Kejriwal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సరి-బేసి’ వాహన విధానం నుంచి మహిళలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. నవంబర్‌ 4 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్న మూడో విడత సరి-బేసి విధానంలో మహిళలకు మినహాయింపు ఇచ్చినట్లు శనివారం వెల్లడించారు. ఒంటరిగా కారును నడిపే మహిళలు, 12 ఏళ్ల చిన్నారులతోపాటు ఉన్న మహిళలు, కారులో మొత్తం మహిళలు ఉన్నా కూడా సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే గతంలో సీఎన్‌జీ ప్రైవేటు వాహనాలపై ఇచ్చిన మినహాయింపును తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సీఎన్‌జీ స్టిక్కర్లతో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ద్విచక్ర వాహనదారులకు సరి-బేసి నుంచి మినహాయింపు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై నిపుణులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement