జాదవ్‌కు కార్మికశాఖ | Department of labor given to Bhaskar Jadhav | Sakshi

జాదవ్‌కు కార్మికశాఖ

Jun 27 2014 10:53 PM | Updated on Sep 2 2017 9:27 AM

జాదవ్‌కు కార్మికశాఖ

జాదవ్‌కు కార్మికశాఖ

కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భాస్కర్ జాదవ్‌కు కార్మికశాఖను అప్పగించారు. జాదవ్‌కు అప్పగిస్తారని భావించిన జలవనరులశాఖ హసన్ ముష్రిఫ్‌కు కట్టబెట్టారు.

సాక్షి, ముంబై: కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భాస్కర్ జాదవ్‌కు కార్మికశాఖను అప్పగించారు. జాదవ్‌కు అప్పగిస్తారని భావించిన జలవనరులశాఖ హసన్ ముష్రిఫ్‌కు కట్టబెట్టారు. ఎన్సీపీ పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా సునీల్ తట్కరేను నియమించడంతో అప్పటిదాకా ఆ స్థానంలో కొనసాగిన భాస్కర్ జాదవ్ కు మంత్రిమండలిలో స్థానం కల్పించారు. అయితే సునీల్ తట్కరే నిర్వహించిన జలవనరులశాఖ బాధ్యతలను జాదవ్‌కు అప్పగించనున్నారని ఆ పార్టీ నేతలు గురువారం చెప్పినా అధిష్టానం మాత్రం హసన్ ముష్రిఫ్ నిర్వహిస్తున్న కార్మికశాఖను అప్పగించింది. తట్కరేకు రాష్ట్రాధ ్యక్ష పదవి దక్కడంతో ఖాళీ అయిన
 జలవనరుల మంత్రిత్వశాఖను హసన్ ముష్రిఫ్‌కు అప్పగించారు.
 
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ ఈ మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీలో జరుగుతున్న మార్పులపై కాంగ్రెస్ ఓ కన్నేసింది. ఆ పార్టీ చేస్తున్న మార్పులకు అనుగుణంగానే తమ పార్టీలో కూడా మార్పులు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఎన్నికల ప్రకటన వెలువడేనాటికి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మంత్రిత్వశాఖలో ఏ మంత్రి కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనిపై పార్టీ నేతల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే విశ్లేషకులు మాత్రం ఈ మార్పులు సత్ఫలితాలను ఇవ్వలేవని, ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తాయని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు కూడా సమర్థవంతంగా పనిచేయలేరని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement