Department of Labor
-
India-US Relations: అంకురాలకు దన్ను
న్యూఢిల్లీ: అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్, అమెరికా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నవకల్పనలకు ఊతమిచ్చేందుకు, నిధుల సమీకరణలో ఎంట్రప్రెన్యూర్లు పాటించే విధానాలను పరస్పరం పంచుకునేందుకు, నియంత్రణపరమైన సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇది తోడ్పడనుంది. ఇరు దేశాల పరిశ్రమవర్గాల రౌండ్టేబుల్ సమావేశం సందర్భంగా ఎంవోయూ కుదిరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశమ్రల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ఇది సానుకూల ప్రభావం చూపగలదని వివరించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో నేతృత్వం వహించిన ఈ సమావేశంలో పలువురు భారతీయ వ్యాపారవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాల సీఈవోలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్ల వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చల కింద రూపొందించిన ఇండియా–యూఎస్ ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ కాన్సెప్టును ఈ సందర్భంగా గోయల్, రైమండో ఆవిష్కరించారు. డీప్ టెక్నాలజీ, క్రిటికల్ టెక్నాలజీ వంటి విభాగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాల నిబద్ధతకు ఎంవోయూ నిదర్శనంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. దీని కింద వచ్చే ఏడాది తొలినాళ్లలో భారత్, అమెరికాలో ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ ఈవెంట్లను నిర్వహించనున్నారు. -
భారతదేశం శ్రామికుడి శక్తి : ప్రధాని
తిరుపతి అర్బన్/తిరుపతి కల్చరల్: కార్మికుల సదస్సుకు పవిత్ర స్థలాన్ని వేదిక చేసుకోవడం అభినందనీయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తిరుపతి నగరంలోని తాజ్ హోటల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కార్మిక, ఉపాధి కల్పన, పెట్రోలియం, సహజవాయు శాఖల సహాయ మంత్రి రామేశ్వర్ నేతృత్వంలో నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని గురువారం వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశాన్ని తెలియజేశారు. భారతదేశం శ్రామికుల శక్తిగా అభివర్ణించారు. శ్రామికశక్తిని సామాజిక పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం శ్రామికుల సంక్షేమం, భద్రత కోసం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన, సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి బీమా యోజన తదితర పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మంది కార్మికులు దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఏడాదికి 28కోట్ల మందికి 400 ప్రాంతాల్లో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. దేశాన్ని ఒక్కటి చేయడంలో కార్మికుల పాత్ర అభినందనీయమన్నారు. గత 8 ఏళ్లుగా బానిసత్వం, పూర్వకాలపు చట్టాల రద్దుతోపాటు ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు చెప్పారు. ప్రధానంగా 29కార్మిక చట్టాలు, 4 సాధారణ చట్టాలుఘౠ మార్పు చేసినట్లు ఆయన వివరించారు. లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల సాధికారత, కనీస వేతనం, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. విజన్ 2047 నాటికి కార్మికశాఖ ప్రత్యేక ముందుచూపుతో నడుస్తుందని, ఎన్నో మార్పులతో కార్మికుడికి మంచి జరుగుతుందన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్గా మార్పు చేయడానికి దోహదపడుతుందన్నారు. మహిళా కార్మికశక్తిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవన కార్మికుల సెస్ వినియోగంపై మాట్లాడుతూ.. దేశంలో పలు రాష్ట్రాలు రూ.38 వేల కోట్లు ఉపయోగించలేదన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మిక శాఖ మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నేతల అరెస్ట్ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న కార్మిక మంత్రుల జాతీయ సదస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ పి.మధు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ సహా పలువురు నేతలు అరెస్టయిన వారిలో ఉన్నారు. -
ఈపీఎఫ్వోలోకి 18.36 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలోకి జూన్ నెలలో కొత్తగా 18.36 లక్షల మంది సభ్యులు చేరారు. అంతక్రితం ఏడాది జూన్ నెలలో కొత్త సభ్యులు 12.83 లక్షలతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఇందుకు సంబంధించి పేరోల్ గణాంకాలను కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మేనెలలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా జూన్లో 9.21 శాతం వృద్ధి కనిపిస్తోంది. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ఇక జూన్లో నికర కొత్త సభ్యులు 18.36 లక్షల మందిలో 10.54 లక్షల మంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్, 1952 కింద మొదటసారి చేరిన వారు కావడం గమనించాలి. 7.82 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం వల్ల కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ ప్రతి నెలా కొత్త సభ్యుల్లో వృద్ధి కనిపిస్తోంది. 22–25 వయసు నుంచి 4.72 లక్షల మంది కొత్తగా చేరిన వారున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.61 లక్షల మంది కొత్తగా చేరారు. మొత్తం కొత్త సభ్యుల్లో మహిళలు 4.06 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్వో మొత్తం సభ్యుల్లో మహిళల శాతం మే చివరికి 20.37 శాతంగా ఉంటే, జూన్ చివరికి 22.09 శాతానికి తగ్గింది. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) -
కార్మిక సంక్షేమం... మరింత సరళీకృతం
సాక్షి, హైదరాబాద్: కార్మిక సంక్షేమ కార్యక్రమాలను కార్మిక శాఖ మరింత సరళీకృతం చేసింది. ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ మండలి, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలి ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్మికులనుద్దేశించిన పథకాల ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. ♦భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ మండలి అన్ని నిర్మాణసంస్థల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేయగా వచ్చిన నిధులతో ఆ కార్మికుల ప్రయోజనం కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం బోర్డులో 19.68 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. కార్మికులకు వివాహ బహుమతి కింద రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే, సహా యం కింద రూ.6 లక్షలు, ఆసుపత్రుల్లో చేరితే నెలకు రూ.4,500 చొప్పున 3 నెలలు సాయం చేస్తారు. ప్రసూతి ప్రయోజనం కోసం రూ.30 వేలు, సహజ మరణమైతే రూ.లక్ష, శాశ్వత వైకల్యమైతే రూ.4 లక్షలు ఇస్తారు. పేర్లు నమోదు చేసుకోనివారికి రూ.50 వేలు, మరణించినవారి అంత్యక్రియలకు రూ.30 వేలు ఇస్తారు. ♦ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంస్థలు, మోటారు రవాణాసంస్థల కార్మికుల పిల్లలకు తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ రూ.1,000 నుంచి రూ.2,,000 వరకు స్కాలర్షిప్లు ఇస్తోంది. ♦రాష్ట్ర అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలిని ఇటీవలే ఏర్పాటు చేశారు. ఈ–శ్రమ్ పోర్టల్లో ఇప్పటివరకు 35.41 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ♦రవాణా, రవాణేతర ఆటోడ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డుల కోసం ప్రమాద మరణ బీమా పథకాన్ని కార్మిక శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తారు. -
1982 తర్వాత అమెరికాలో మళ్లీ మొదలైన ‘సెగ’
వాషింగ్టన్: అమెరికా ద్రవ్యోల్బణం సెగ చూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఫెడ్ పెద్ద చేత్తో మార్కెట్లోకి నిధులు కుమ్మరించింది. దీంతో గడిచిన ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 2022 జనవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరినట్టు అమెరికా కార్మిక శాఖ గురువారం ప్రకటించింది. ఇలా ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో కట్టలు తెంచుకోవడం అమెరికా చరిత్రలో చివరిగా 1982లో చోటు చేసుకుంది. ఆహారం, ఇంధనం, అపార్ట్మెంట్ అద్దెలు, విద్యుత్ చార్జీలు పెరగడం ద్రవ్యోల్బణం సెగలకు కారణాలు. 2021 డిసెంబర్ చివరి నుంచి చూస్తే ఒక నెలలో ద్రవ్యోల్బణం 0.6% పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్కు 0.9%, అక్టోబర్ నుంచి నవంబర్కు 0.7% చొప్పున ధరలు పెరిగాయి. ఫెడ్ పెద్ద ఎత్తున నిధులు జొప్పించడం, వడ్డీ రేట్లు అత్యంత కనిష్ట స్థాయిలో ఉండడం, బలమైన వినియోగ డిమాండ్ ద్రవ్యోల్బణం రెక్కలు విప్పుకోవడానికి తోడ్పడ్డాయి. -
తొమ్మిది కీలక రంగాల్లో ఉద్యోగులు 3.10 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ తొమ్మిది కీలక రంగాల్లో 2021–22 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.10 కోట్లకు చేరిందని కార్మిక శాఖ త్రైమాసిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. త్రైమాసికంగా చూస్తే, (ఏప్రిల్–జూన్) ఈ సంఖ్య రెండు లక్షలు పెరిగిందని పేర్కొంది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ ఉద్యోగుల సంఖ్య 3.08 కోట్లు. 2013–14లో తొమ్మిది రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 2.37 కోట్లు. ఆర్థిక రికవరీకి తాజా గణాంకాలు సంకేతమని వివరించింది. గణాంకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021 ఏప్రిల్లో మొదలైన కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత అధిక ఉపాధి సంఖ్య నమోదయ్యింది. ఇది ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. ► 10 మంది లేదా అంతకుమించి ఉద్యోగులు ఉన్న సంస్థలను మాత్రమే సర్వేలో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సర్వేకు మొత్తం 12,038 సంస్థలను ఎంపికచేయగా, వాటిలో 11,503 సంస్థలను స్వయంగా ఫీల్డ్ ఆఫీసర్లు సందర్శించారు. ► ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 32.1 శాతంకాగా, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 29.3 శాతంగా ఉంది. ► సర్వే రంగాల్లో ఉద్యోగుల శాతాన్ని పరిశీలిస్తే తయారీ రంగం వాటా 30 శాతంగా ఉంది. విద్య రంగానికి 20 శాతంకాగా, ఆరోగ్యం, అలాగే ఐటీ–బీపీఓ రంగాల వాటా 10 శాతం చొప్పున ఉన్నాయి. వాణిజ్య, రవాణా రంగాల వాటా వరుసగా 5.3 శాతం, 4.6 శాతంగా ఉన్నాయి. ► మొత్తం సర్వేలోని సంస్థల్లో 90 శాతం 100 మంది కన్నా తక్కువ పనిచేస్తున్నారు. ఐటీ–బీపీఓ సంస్థల్లో 30 శాతం కనీసం 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, 12 శాతం సంస్థల్లో 500 ఆపైన ఉద్యోగులు ఉన్నారు. ఆరోగ్య రంగంలో 19 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రవాణా రంగం విషయంలో 14 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ► మొత్తం ఉద్యోగుల్లో రెగ్యులర్ వర్కర్లు దాదాపు 87 శాతం మంది ఉన్నారు. క్యాజువల్ వర్కర్ల శాతం 2 శాతంగా ఉంది. నిర్మాణ రంగంలో 20 శాతం మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉండగా, 6.4 శాతం మంది క్యాజువల్ వర్కర్లు ఉన్నారు. ► సంస్థల్లో 53.9% గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, 2017 కింద కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. 27.8 శాతం షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1958 పనిచేస్తున్నాయి. ► విద్య, ఆరోగ్య రంగాలను మినహాయిస్తే, మిగిలిన ఏడు రంగాల్లో ఉద్యోగుల విద్యార్హతలను సర్వే పరిశీలిసింది. వీటిల్లో 28.4 శాతం మంది ఇంటర్మీడియట్, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదివారు. 37 శాతం మంది గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేశారు. ఐటీ–బీపీఓ రంగాల్లో గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేసిన వారి సంఖ్య అత్యధికంగా 91.6 శాతం ఉంటే, ఫైనాన్షియల్ సేవల విభాగంలో ఇది 59.8 శాతంగా ఉంది. ఆరోగ్య రంగంలో ఇంటర్మీడియట్, 10వ తరగతి ఆలోపు చదివినవారి సంఖ్య 18 శాతం. విద్యా రంగంలో ఈ తరహా విద్యార్హత నాన్ టిచింగ్ స్టాఫ్లో 26.4 శాతం మంది ఉన్నారు. ఈ రెండు రంగాల్లో (ఆరోగ్యం, విద్య) కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి సంఖ్య 40 శాతంగా ఉంది. ► 16.8 శాతం సంస్థలు తమ స్వంత ఉద్యోగుల కోసం అధికారిక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ను అందిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అ ం శా ల్లో ఇది ఒకటని కార్మికశాఖ ప్రకటన తెలిపింది. తొమ్మిది రంగాలు ఇవి... సర్వే జరిపిన తొమ్మిది కీలక రంగాల్లో తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం, ఐటీ–బీపీఓ, ఫైనాన్షియల్ సేవలు ఉన్నాయి. వ్యవసాయేతర సంస్థలకు సంబంధించి మెజారిటీ ఉపాధి కల్పనా అవకాశాలను ఈ రంగాలు అందిస్తున్నాయి. -
ఖాళీ ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండని చెప్పా..
సాక్షి, అమరావతి: పోలీసులు రైతులకు చెందిన ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండని చెప్పిన మాట వాస్తవమని, తాను చెప్పిన దాంట్లో ఎక్కడైనా దౌర్జన్యంగా, తప్పుగా మాట్లాడింది లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధిలోను, సంక్షేమంలోను దూసుకెళుతుండటంతో ఎల్లో మీడియాకు వార్తలు కరువై తనలాంటి వారిపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డా రు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన లోకేశ్కు తన గురించి మాట్లాడే యోగ్యతే లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. లోకేశ్ అడ్డదారుల్లో రాజకీయాల్లోకి వచ్చి పదవులు వెలగబెట్టిన నేత అని దుయ్యబట్టారు. మాటకొస్తే టీడీపీ నేతలు దందాలు దందాలు అంటారని, దందాగిరీ చేసేందుకు తానేమీ అంతర్రాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ని కాదని చెప్పారు. నిజంగా పోలీసులతో దౌర్జన్యంగా మాట్లాడితే అది తప్పవుతుందన్నారు. రైతులపై అభిమానంతో వారి ఖాళీ ట్రాక్టర్లు వదలండి అని మాత్రమే చెప్పానన్నారు. ఖాకీ యూనిఫాం నిఖార్సుగా పనిచేస్తున్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనేనని పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపన కోసం ప్రయత్నించే సీఎం జగన్ ఇలాంటివి ప్రోత్సహించరని చెప్పారు. తనపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవద్దని టీడీపీ నేతలను కోరుతున్నానన్నారు. బుధవారం సీఎం జగన్ను కలుసుకున్నానని, నియోజకవర్గ సమస్యలపైన మాత్రమే మాట్లాడానని చెప్పారు. సీఎంతో సమావేశంలో ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదన్నారు. ఆవగింజ అంత సిగ్గు కూడా లోకేశ్కు లేదని విమర్శించారు. తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దున ఉంటుందని చెప్పారు. అర కిలోమీటరు దూరంలోనే పక్క రాష్ట్రంలో మద్యం దొరుకుతుంటే కొందరు వెళ్లి తాగి వస్తుంటారని, ఇది తన దురదృష్టమని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా అవాకులు చెవాకులు మాట్లాడుతున్న లోకేశ్.. బహిరంగంగా వస్తే తాను మాట్లాడతానని చెప్పారు. అక్కడ తాగి ఇక్కడికి వచ్చేవారిని చూసి మద్యం ఏరులై పారుతోందంటే తానేం చేయగలనన్నారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎంగా జగన్ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. రాజ్యాంగం చెప్పినదానికి మించి రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతోందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఇక టీడీపీకి భవిష్యత్తు ఉండదని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్లకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ’జామాత దశమ గ్రహం’ అని ఎన్టీఆర్ ఆనాడే సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. -
కార్మికులకు మెరుగైన వైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుణదల మోడల్ డిస్పెన్సరీలో ఆన్లైన్ విధానాన్ని సోమవారం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మితో కలిసి మంత్రి జయరాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్మికుల సొమ్మును కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సొమ్మును వారి వైద్యం, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే.. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో సీఎం వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్ సేవల విధానాన్ని 78 డిస్పెన్సరీలు, 4 ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అమలు చేస్తామన్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ ఎల్ఎస్బీఆర్ కుమార్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు కాశీనాథన్ పాల్గొన్నారు. -
ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) యథాతథంగా 8.5 శాతంగా కొనసాగనుంది. రిటైర్మెంట్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ (ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ కీలక నిర్ణయం తీసుకుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో కూడా ఈపీఎఫ్ఓ 8.5 శాతం వడ్డీని తన చందాదారులకు అందించింది. ప్రకటన ప్రకారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో గురువారం కార్మిక, ఉపాధి శాఖల సహాయంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) సంతోష్ కుమార్ నేతృత్వంలో సీబీటీ సమావేశం జరిగింది. వడ్డీరేటుపై తన నిర్ణయాన్ని సీబీటీ ఆర్థిక శాఖ ఆమోదం కోసం నివేదిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం తన క్రియాశీల చందాదారుల అకౌంట్లలో 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. ఐదు కోట్లకుపైగా చందాదారులు ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఐదు కోట్లకుపైగా చందాదారులను కలిగిఉంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీటీ తాజా నిర్ణయం తీసుకుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీ అసెట్స్లో తన మొత్తం నిధుల్లో 5%తో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు ప్రస్తుతం 15%కి చేరాయి. 2018–19లో ఈపీఎఫ్ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65%. దీన్ని 8.5%కి తగ్గిస్తూ, గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నం గా ట్రస్టీల బోర్డ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
హెచ్ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ
వాషింగ్టన్: హెచ్1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేతనాలు, అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు మంగళవారం అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ (డీఓఎల్) ప్రకటించింది. తాజా మార్పులతో హెచ్ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్తో యూఎస్లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. తాజా నిబంధనలు ఈ సంవత్సరం మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. తాజా నిబంధనల ప్రకారం.. సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా ఏటా జారీ చేసే 85 వేల హెచ్1బీ వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆక్యుపేషనల్ ఎంప్లాయిమెంట్ స్టాటిస్టిక్స్ (ఓఈఎస్) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా (4 లెవెల్స్) విభజించి, డీఓఎల్ నియంత్రిస్తుంది. తాజా మార్పుల ప్రకారం.. ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది. అలాగే, భారత్ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్ల అనుభవం ఉన్నవారిపైనా ప్రభావం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులపై, అలాగే, కాలేజీ అనంతరం ఒకటి, రెండేళ్ల అనుభవం ఉన్నవారిపై కూడా ఈ మార్పులు భారీగా ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలను జారీ చేసే విధానంలో.. అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు ప్రాధాన్యత లభించడం వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు ఆ మేరకు నష్టపోనున్నారు. విదేశీ విద్యార్థులు ప్రధానంగా లెవెల్ 1 పరిధిలోకి వస్తారు. అయితే, తాజా నిబంధనలు విద్యార్థులపై ప్రభావం చూపబోవని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) పేర్కొంది. వారి ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) సమయాన్ని అధిక వేతనం పొందగల స్థాయికి వెళ్లేలా అనుభవం పొందేందుకు వినియోగించుకునే అవకాశముందని వివరించింది. అయితే, కేవలం ‘స్టెమ్’ విద్యార్థులకు మాత్రమే మూడేళ్ల ఓపీటీ ఉంటుంది. మిగతా విభాగాల విదేశీ విద్యార్థులు కేవలం ఒక సంవత్సరం ఓపీటీకే అర్హులు. మరోవైపు, మాస్టర్స్ డిగ్రీ ఉన్న, ఓపీటీ ద్వారా కొంత అనుభవం పొందిన విద్యార్థులు లెవెల్ 2 ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. కానీ, ఈ లెవెల్ హెచ్1బీ వీసా దరఖాస్తుల్లో పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో వారికి వీసా లభించడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 50% పైగా దరఖాస్తులు ఈ లెవెల్ నుంచే వస్తాయన్నారు. ఈ ప్రతిపాదనలపై గతంలో జరిపిన అభిప్రాయ సేకరణలో పలు విశ్వవిద్యాలయాలు ఈ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగం లభించే విషయంలో నెలకొనే అనిశ్చితి వల్ల విదేశీ విద్యార్థులు అమెరికాను ఉన్నత విద్యకు ఎంపిక చేసుకోకపోవచ్చని పేర్కొన్నాయి. -
శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆ శ్యామలదేవి ఎవరో కూడా తెలియదు. నా భూమి పక్క భూమి ఆమెది అని తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ... నన్ను ఇప్పటివరకూ కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. (మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు) కాగా భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఈ నెల 6వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది. -
మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
దుండిగల్: ఓ భూవివాదంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఆరో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, మంత్రితో పాటు ఆయన కుమారుడు, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పద్మావతి కుమార్తె శ్యామలాదేవి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బాధితురాలు శ్యామలాదేవి ఫిర్యాదు ప్రకారం... తల్లి పొన్నబోయిన పద్మావతి పేరుపై సూరారం సర్వే నంబర్ 115, 116, 117లలో 2.13 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని విక్రయించాలంటూ మంత్రి తన అనుచరులతో బెదిరించారు. దీనిపై 2017లో పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో తల్లి పద్మావతితో కలిసి కోర్టులో మల్లారెడ్డిపై భూవివాదానికి సంబంధించిన పిటిషన్ వేసేందుకు న్యాయవాది లక్ష్మీనారాయణను ఆశ్రయించారు. అయితే మంత్రితో చేతులు కలిపిన న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకని బాధితులనుంచి స్టాంప్ పేపర్పై సంతకాలు తీసుకున్నాడు. వాటి ఆధారంగా మల్లారెడ్డి అనుచరుడు గూడూరు మస్తాన్కు ఆ భూమిని అమ్మేందుకు రూ.ఎనిమిది లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీ అగ్రిమెంట్ పేపర్లను తయారు చేశారు. దీన్ని అడ్డుపెట్టుకొని పద్మావతి, శ్యామలాదేవిలను ఆ భూమిలోకి రానివ్వలేదు. ఈ ఒత్తిడులు ఇలా ఉన్న సమయంలోనే కొన్ని నెలల క్రితం శ్యామలాదేవి తల్లి పద్మావతి, సోదరి మరణించారు. దీంతో ఒంటరిగా ఉన్న తనకు ప్రాణహాని ఉందంటూ, మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామలాదేవి దుండిగల్ పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. దీంతో కోర్టులో శ్యామలాదేవి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. -
హెచ్1బీ శిక్షణకు 1,105 కోట్లు
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి వచ్చే మధ్యస్త, ఉన్నత స్థాయి నైపుణ్యాలు గల వారికి శిక్షణ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం రూ.1,105 కోట్లు ఖర్చు చేయనుంది. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, రవాణా తదితర రంగాల్లో హెచ్–1బీ వీసా హోల్డర్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో నైపుణ్యం పెంచేందుకు తాజా పెట్టుబడులు ఉపయోగపడతాయని కార్మిక శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంతో భారతీయ నిపుణులు ఎక్కువగా లాభం పొందనున్నారు. విద్యార్థులు, పరిశోధకుల వీసాలకు నిర్ణీత గడువు విదేశీ పరిశోధకులు, విద్యార్థులు, జర్నలిస్టులకు ఇచ్చే వీసాలకు నిర్ణీత గడువు విధించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న సులువైన వీసా విధానం దుర్వినియోగం అవుతోందనీ, దీనివల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. పైన పేర్కొన్న మూడు రకాల వీసాలతో చైనీయులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అయితే, నూతన విధానం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదని ప్రభుత్వం అంటోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. నాన్ ఇమిగ్రాంట్ విభాగంలోని ఎఫ్, జే (విద్యార్థులు, పరిశోధకుల) వీసాల కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. -
మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ భారీ స్కామ్లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. పితాని హయాంలోనూ అవే అక్రమాలు ► పితాని మంత్రిగా వ్యవహరించిన కాలంలోనూ అవే అక్రమాలు, అవకతవకలు కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. ► పితానికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మురళీమోహన్, పితాని కుమారుడు వెంకట సురేష్లను నిందితులుగా చేర్చింది. ► హైదరాబాద్కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఈఎస్ఐ అధికారులకు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా తన హయాంలో లావాదేవీలు జరగలేదని, ఆ తర్వాతే జరిగాయని ఏసీబీ విచారణలో స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు తన తర్వాత పితాని ప్రమేయాన్ని చెప్పకనే చెప్పినట్టయ్యింది. ► తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కాంట్రాక్టర్లతో లావాదేవీలు జరిపారని, బిల్లులు చెల్లింపులు వంటి అంశాలపై సురేష్ నేరుగా అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడేవారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ► ఇందుకు సంబంధించి పితాని కుమారుడి ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ► పితాని వ్యక్తిగత కార్యదర్శిని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ► పితాని కుమారుడు, అతడి మాజీ పీఎస్ ముందస్తు బెయిల్కు ప్రయత్నించగా.. హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో పితాని కుమారుడిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ బృందాలు పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల, భీమవరం, విశాఖపట్నం, హైదరాబాద్లలో గాలింపు ముమ్మరం చేశాయి. అచ్చెన్న బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ గురువారానికి వాయిదా పడింది. మంగళవారం అచ్చెన్నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ అధికారులు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పాటించకుండానే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని చెప్పారు. ఇలాంటప్పుడు బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. ఆ తీర్పు కాపీలు న్యాయమూర్తి ముందు లేకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
లేఖతో.. లెక్కలేనన్ని అక్రమాలు
సాక్షి, అమరావతి: ‘కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో అచ్చెన్నాయుడు అధికార దర్పంతో ఇచ్చిన లేఖలు లెక్కలేనన్ని అక్రమాలకు బీజం వేశాయి. అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చి, గుర్తింపులేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేలా చేశారు. ఆయన ఇచ్చిన మూడు లేఖలే ఏకంగా రూ.150 కోట్ల అవినీతికి ఊతమిచ్చాయి’ అని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై ఏసీబీ అధికారులు ఐపీసీ 409, 420, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగానికి పాల్పడేలా మందులు, పరికరాల కొనుగోళ్లు, టెలీ హెల్త్ సర్వీసెస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేలా ఈఎస్ఐ అధికారులపై వత్తిడి తెస్తూ అచ్చెన్నాయుడు రాసిన మూడు లేఖలతోపాటు పలు ఆధారాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టుకు జత చేశారు. రిమాండ్ రిపోర్టులో అంశాలు ఇలా ఉన్నాయి. – టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు కాంట్రాక్టులు ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు మూడుసార్లు ఒత్తిడి చేశారు. 2016 అక్టోబర్ నుంచి నవంబర్లోగా అప్పటి డైరెక్టర్ రమేష్కుమార్కు మూడుసార్లు లేఖలు ఇచ్చారు. – ఎటువంటి టెండర్లు పిలవకుండా, నిబంధనలు పాటించకుండా టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్ధతిలో కేటాయించడం వెనుక అచ్చెన్నాయుడు ఒత్తిడే కారణం. – అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే రూ.4.15 కోట్లను విడుదల చేశామని అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. – నిబంధనలను పాటించకుండానే టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదు. బడ్జెట్ ఆమోదం కూడా లేదు. కాంట్రాక్టు పొందిన సంస్థకు గత అనుభవం కూడా లేదు. – మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు చాలా పలుకుబడి ఉంది. ఈ కేసులో చాలా మందిని విచారించాల్సి ఉంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉంది. అయితే అచ్చెన్నాయుడి పలుకుబడి ఈ కేసుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. – ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో మొదటి నిందితుడు డాక్టర్ రమేశ్కుమార్, రెండవ నిందితుడు అచ్చెన్నాయుడులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలి. -
అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి/గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. శుక్రవారం ఆయనను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి శనివారం తెల్లవారుజామున ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని ఏసీబీ అధికారులు, ఆయన తరఫు న్యాయవాది ప్రస్తావించడంతో రిమాండ్ విధించిన న్యాయమూర్తి.. వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దీంతో ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించి రిమాండ్ ఖైదీగా నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 1573 కేటాయించారు. గుంటూరు జీజీహెచ్కు తరలింపు – జైలులో రిమాండ్ నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం శనివారం ఉదయం అచ్చెన్నాయుడిని గుంటూరులోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి(జీజీహెచ్)కి వైద్య సేవల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. – ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని తెలిపారు. – ఇన్ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చని చెప్పారు. 90 శాతం ఆయనకు మళ్లీ ఆపరేషన్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. షుగర్ నార్మల్గానే ఉందని, బీపీకి మందులు కొనసాగిస్తున్నామని వివరించారు. – ఇదిలావుంటే.. అచ్చెన్నాయుడు సోమవారం నాటికి కోలుకుని సబ్జైలుకు తరలించే అవకాశం ఉంటే.. విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. – అరెస్ట్ చేసిన వెంటనే అచ్చెన్నాయుడిని కోర్టుకు తరలించినందున ఈఎస్ఐ కుంభకోణంలో మరింత లోతైన విచారణ చేసే అవకాశం లేకపోయిందని, అందువల్ల మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఏసీబీని కోరనున్నట్టు సమాచారం. చంద్రబాబుకు అనుమతి నిరాకరణ అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరు వచ్చారు. అచ్చెన్నాయుడిని కలిసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని పోలీసులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. జైళ్ల శాఖ సైతం అనుమతి నిరాకరించింది. దీంతో చంద్రబాబు బయటి నుంచే అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ కుటుంబంపై బురద చల్లేందుకే.. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబం అచ్చెన్నదని, ఆ కుటుంబంపై బురద చల్లేందుకే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 24 గంటల్లో 500 కిలోమీటర్లు తిప్పడం వల్ల రక్తస్రావం అయ్యిందన్నారు. 300 మంది పోలీసులు అచ్చెన్నాయుడి ఇంటిని చుట్టుముట్టి ఉన్నపళంగా అరెస్ట్ చేసి తీసుకువచ్చారన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, విజిలెన్స్ రిపోర్టులతో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రలోభాలకు గురిచేసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వశపర్చుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర, కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు ఉన్నారు. భౌతిక దూరం మరిచి... అచ్చెన్నాయుడి పరామర్శ పేరుతో జీజీహెచ్కు వచ్చిన టీడీపీ నాయకులు భౌతిక దూరాన్ని మరిచారు. గుంపులు గుంపులుగా చంద్రబాబు చుట్టూ చేరారు. భౌతిక దూరం పాటించాలని పోలీసులు చెబుతున్నా పట్టించుకోకుండా గుమిగూడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రోగులు, వ్యాధిగ్రస్తులు ఉండే జీజీహెచ్లోకి టీడీపీ నాయకులు గుంపులుగా రావడం, భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
విధుల్లోకి చేర్చుకోకపోతే మీకు జైలు తప్పదు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 అధికారి అయిన ఏఎం ప్రసాదరాజును కార్మిక శాఖ సహాయ కమిషనర్గా కొనసాగించాలని, లేదంటే కార్మిక శాఖ కమిషనర్ నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని, రూ.2 వేలు జరిమా నా కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రసాదరాజుకు 2019 ఫిబ్రవరి నుంచి వేతనాన్ని 7 శాతం వడ్డీతో 6 వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. ఏఎం ప్రసాదరాజు ఉమ్మడి ఏపీలోని ఏపీపీఎస్సీ–2005 గ్రూప్–2 కేడర్ అధికారి. 2018లో వరంగల్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. అయితే 2005 నాటి గ్రూప్–2 అధికారుల లిస్ట్ను సవరించేసరికి ప్రసాదరాజు పేరు జాబితాలో గల్లంతయ్యింది. జోన్ 4లో ఏపీలోని కర్నూలుకు డిప్యూటీ కేడర్ లిస్ట్లో ఆయన పేరు చేరింది. దీంతో ప్రసాదరాజును 2018 జూన్ 29న తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ రిలీవ్ చేశారు. గ్రూప్–2 అధికారులు సుప్రీంను ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది. దీం తో ప్రసాదరాజును కర్నూలులో విధుల్లో చేర్చుకునేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. ఈ నేప థ్యంలో ప్రసాదరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రసాదరాజును అసిస్టెం ట్ లేబర్ ఆఫీసర్గా కొనసాగించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడిందని తిరిగి ప్రసాదరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేశాక తమకు సంబంధం లేదని తెలంగాణ సర్కార్ వాదించింది. ఈ వాదనల తర్వాత తామిచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసే వరకూ ప్రసాదరాజును విధుల్లోకి తీసుకోవాలని, ఉపాధి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులు కోర్టు ఖర్చుల నిమిత్తం పిటిషనర్కు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, పి. కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. -
కాలితో తొక్కితే చాలు.. చేతిలోకి శానిటైజర్ చుక్కలు..
సాక్షి, హైదరాబాద్: ఇకపై శానిటైజర్ బాటిల్ను చేతితో నొక్కాల్సిన పనిలేదు. కాలితో తొక్కితే చాలు...మీ చేతిలో శానిటైజర్ చుక్కలు పడతాయి. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేకంగా మెషిన్ రూపొందించింది. ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ) విద్యార్థుల సాయంతో దీన్ని తయారు చేసింది. చేతితో శానిటైజర్ బాటిల్ను పట్టుకోవడంతో వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే వాదన ఉంది. ఈ క్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కొందరు ఐటీఐ విద్యార్థులు ఈ పరికరానికి రూపకల్పన చేశారు. దీన్ని ఇటీవల మేడ్చల్ పోలీస్ స్టేషన్కు ఉచితంగా అందించారు. త్వరలో వంద మిషన్లు తయారు చేసి డిమాండ్ ఉన్న సంస్థలకు అందించనున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కె.వై.నాయక్ తెలిపారు. 40వేల మాస్కుల ఉచిత పంపిణీ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో కుట్టుమిషన్ ట్రేడ్ ఉన్న వాటిల్లో మాస్కుల తయారీకి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆదేశించింది.ప్రస్తుతం 15 ప్రభుత్వ ఐటీఐలు, 5 ప్రైవేటు ఐటీఐలలో మాస్కులను తయారు చేస్తున్నారు. ఐసీఎంఆర్, వైద్య,ఆరోగ్య శాఖ సూచనల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు. మాస్కులు కొనుగోలు చేయలేని కూలీలు, పేదలకు వీటిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి.. ఇప్పటివరకు తయారు చేసిన 40వేల మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్టు ఆ శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్ తెలిపారు. ఆన్లైన్లో ఐటీఐ శిక్షణ: ఐటీఐల్లోనూ ఆన్లైన్ బోధన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైన్నైలోని నేషనల్ ఇన్స్ట్రక్షన్ మీడియా ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఫ్యాకల్టీ సాయంతో ప్రస్తుతం 63 ప్రభుత్వ ఐటీఐలు, 13 ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా... ఈ వారాంతంలోగా అన్ని ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందుబాటులోకి రానుంది. -
నిర్మాణ రంగ కార్మికులకు...ఆర్థిక భరోసా..!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు కార్మిక శాఖ రూపొందించిన ఆర్థిక సాయం ప్రతిపాదనలను సమీక్షిస్తోంది. రాష్ట్రంలో నెల రోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఫలితంగా భవన, ఇతర నిర్మాణ రంగంలో పనులన్నీ నిలిచిపోయాయి. కొత్త ప్రాజెక్టుల సంగతి అటుంచితే ఇప్పటివరకు కొనసాగుతున్న పనులు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రభావం దృష్ట్యా ఇది పొడిగించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్లో సడలింపులు ఇచ్చినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కఠినంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో నిర్మాణ పనులకు ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి లేదు. ఫలితంగా ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈక్రమంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి(టీఎస్బీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ) ద్వారా ఆర్థిక సాయం అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ బోర్డు ద్వారా కార్మికులకు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రమాదవశాత్తు గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం, అదేవిధంగా కార్మికుల పిల్లలకు చదువుకుంటున్న కోర్సుకు తగినట్లు ఉపకారవేతనాలు అందించడం వంటి కార్యక్రమాలను బోర్డు అమలు చేస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో కార్మికులకు ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త ఊరట ఇవ్వాలని భావించిన బోర్డు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. రిజిస్టర్డ్ లేబర్ 15.45 లక్షల మంది.. రాష్ట్రంలో భవన, ఇతర నిర్మాణ రంగంలో దాదాపు 54 రకాల విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు 20 లక్షల మంది ఉన్నారు. అయితే బోర్డులో వివరాలను నమోదు చేసుకుని పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 15.45 లక్షల మంది. వీరిలో పురుషులు 9.22 లక్షలు, మహిళలు 6.23 లక్షల మంది ఉన్నారు. వీరు తమ వివరాలను బోర్డులో ఏటా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెన్యువల్ చేసుకున్న వారు 8.28 లక్షలు. అయితే బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న వారికి రూ.1,000 లేదా రూ.1,500 వంతున ఆర్థిక సాయం ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.బోర్డు వద్ద ఉన్న నిధులకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే ఆర్థిక సాయం చేసే అంశానికి మార్గం సుగమమవుతోంది. కుటుంబానికా... ఒక్కొక్కరికా... బోర్డులో పేరు నమోదు చేసుకున్న వారు 15.45 లక్షలు మంది ఉన్నారు. వీరిలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. చాలావరకు భార్య, భర్త ఇరువురి పేర్లున్నాయి. వీరికి ఆర్థిక సాయం ఎలా చేయాలనే దానిపై అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా సాయం అందిస్తే ఎక్కువ మొత్తంలో నిధులు అవసరమవుతాయని భావించిన అధికారులు... కుటుంబంలో ఒకరికి సాయం చేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదేవిధంగా ఒక్కో సభ్యుడికి విడిగా సాయం అందిస్తే ఖర్చయ్యే మొత్తాన్ని కూడా మరో ప్రతిపాదనగా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం కోసం చూస్తున్నారు. -
వేతనాలిచ్చిన సంస్థలకే రాయితీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం అమలుపై కార్మిక శాఖ దృష్టి సారించింది. గత నెల 24 నుంచి కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. వచ్చే నెల 3 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వందలోపు కార్మికులున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా ను ప్రభుత్వం భరించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులకు నెలవారీ వేతనం చెల్లించిన సంస్థలే ఈపీఎఫ్ రాయితీలను పొందే వీలుంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈసీఆర్ జనరేట్ చేయాల్సిందే.. వందలోపు ఉద్యోగులుండి అందులో 90 శాతం మంది వేతనాలు 15 వేల లోపు ఉన్న సంస్థలకే ఈపీఎఫ్ రాయితీ వర్తిస్తుంది. ఇలాంటి కంపెనీలోని ఉద్యోగుల వేతనం ప్రకారం.. కంపెనీ వాటా12%తో పాటు ప్రభుత్వం చెల్లించే వాటా 12% కలుపుకుని మొత్తం 24% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగులకు నెలవారీ వేతనం చెల్లించిన తర్వాత ఈపీఎఫ్ చందాను ఆన్లైన్ పద్ధతిలో చెల్లించిన తర్వాత ఈసీఆర్ (ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్)ను కార్మిక శాఖకు, ఈపీఎఫ్ఓకు సమర్పిస్తుం ది. తాజాగా రాయితీ పొందే సంస్థలు వేతనాల ను చెల్లించి ఆ వివరాలను కార్మిక శాఖకు సమర్పించాలి. అలా ఈసీఆర్లను సమర్పించిన తర్వా త కార్మిక శాఖ అధికారులు వాటిని పరిశీలించి ఉద్యోగుల ఈపీఎఫ్ చందాను వారి యూఏఎన్ నంబర్కు బదిలీ చేస్తారు. ఈ క్రమంలో రాయితీ పొందే ప్రతి కంపెనీ ఉద్యోగి పూర్తి వేతనాలను సక్రమంగా చెల్లించాల్సిందే. వేతనంతో కూడిన సెలవులు.. లాక్డౌన్ కాలంలో ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసింది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ వేతనాలు చెల్లించాలి. కొన్ని కంపెనీలు పనిచేసిన కాలానికే వేతనాలు ఇస్తున్నట్లు కార్మిక శాఖ దృష్టికి వచ్చింది. వీటిపై కార్మికులు లేదా ఉద్యోగులు కార్మిక శాఖను సంప్రదించి ఫిర్యాదు చేస్తే కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చీఫ్ లేబర్ కమిషనర్ స్పష్టం చేశారు. -
ఏ ఒక్కరినీ తొలగించొద్దు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించరాదని, మే నెలలో కూడా కార్మికులు, ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. పరిశ్రమలు మూతపడటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందని,∙విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలసి సోమ వారం జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం నుంచి అన్నిజిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపు విషయంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించిందని గుర్తు చేశారు. వారి బాధ్యత మనమీదే... శాశ్వత ఉద్యోగులతో పాటు వలస కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మానవీయకోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ.500 నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీల వద్దే ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్కార్డులేని వారికి బియ్యం, నగదు మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కల్పించామన్నారు. పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వలస కార్మికులు రోడ్డు మీదకు వస్తే ఇప్పటి వరకు అమలు చేసిన లాక్డౌన్ వృథా అవుతుందని, అందుకే ఎక్కడి కార్మికులను అక్కడే ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లలోనే రంజాన్ పవిత్ర రంజాన్ నెల ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకుంటూ కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరిం చనున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స్ కోసం వచ్చిన మంత్రి కేటీఆర్ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలను ముస్లిం మత పెద్దలు ఖుబుల్ పాషా సత్తారి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మహ్మద్ పాషా, ఇఫ్తెకారి పాషాల బృందం స్వచ్ఛందంగా కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించడానికి తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. -
కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బట్టబయలైంది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులను నామినేషన్పై అప్పగించాలని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ ఇచ్చినట్లు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెలుగులోకి రావడం తెలిసిందే. అనంతరం కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి మంత్రి పితాని సత్యనారాయణకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తాజా లేఖలు వెల్లడిస్తున్నాయి. కార్మిక రాజ్య బీమా సంస్థ పరిధిలోని దాదాపు 12.5 లక్షల మంది కార్మికులు, 38 లక్షల మంది కుటుంబ సభ్యులు గత సర్కారు అవినీతి వ్యవహారాల వల్ల సరైన వైద్యం పొందలేకపోయారు. ఆ ఇద్దరూ.. ఇష్టారాజ్యం నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నామినేషన్పై పనులు కట్టబెట్టాలని లేఖలో సూచించగా అనంతరం ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన పితాని ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరిపారు. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలి. ఈమేరకు ఓ ఉన్నతాధికారి మెమో కూడా జారీ చేశారు. అయితే పితాని సత్యనారాయణ కార్మికశాఖ బాధ్యతలు చేపట్టగానే మరో మెమో ఇచ్చారు. 2017 నవంబర్ 28న అధికారులు ఇచ్చిన మెమోను అభయెన్స్లో పెడుతూ 2018 ఫిబ్రవరిలో మరో మెమో జారీ అయింది. ఈఎస్ఐ ఉన్నతాధికారులకు అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖ పితాని తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపి కమీషన్లు అందుకున్నారని పేర్కొంటున్నారు. ఆయన కుమారుడు చిన్న కాగితం రాసిచ్చినా ఆర్డర్లు ఇచ్చారు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్కు ముందు జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో 500కిపైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ఫైలు పెట్టారు. దీనిపై ‘సాక్షి’లో కథనం వెలువడటంతో అప్పటి సీఎస్ అనిల్చంద్ర పునేఠా ఈ ప్రతిపాదనను రద్దు చేశారు. ఐదేళ్లలో ఇద్దరు మంత్రులూ కార్మికుల కడుపుకొట్టారని, ఏ ఒక్కరికీ మెరుగైన వైద్యం అందలేదని ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న వైద్యులు పేర్కొంటున్నారు. ఈఎస్ఐ స్కామ్లో పలువురు అధికారులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా అదే తరహా చర్యలు తప్పవనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. 2017లో ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలని ఇచ్చిన మెమోను నిలుపుదల చేస్తూ ఇష్టారాజ్యంగా చెల్లింపులు చేసుకోవచ్చంటూ అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని ఇచ్చిన మరో మెమో. అచ్చెన్నకు కొత్త కాదు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో నీరు– చెట్టు పనులనూ తన అనుయాయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, డిజైన్ లేకుండా చెక్డ్యామ్లను నిర్మించారు. నీరు చెట్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవున రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టారు. కలెక్టర్తో నిమిత్తం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండానే అచ్చెన్నాయుడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించేవారు. ఈఎస్ఐలో ప్రధాని మోదీ చెప్పినట్టే చేశా: అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో నామినేషన్ కింద వర్క్ ఆర్డర్లు ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ చెప్పినట్లే చేశామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన హయాంలో ఈఎస్ఐలో జరిగిన కుంభకోణంపై శుక్రవారం ఆయన వివరణ ఇచ్చారు. టెలి హెల్త్ సర్వీసెస్కి సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలన్న ప్రధాని సూచన మేరకు వ్యవహరించామని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. తొలుత తెలంగాణలో దీన్ని ప్రారంభించారని, అక్కడ మాదిరిగానే ఏపీలోనూ చేయాలని నోట్ పంపానన్నారు. నామినేషన్పై ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. కావాలంటే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అప్పటి రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు. సగటున 132 శాతం అధిక ధరకు కొనుగోలు వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132 శాతం అధికంగా చెల్లించి కొన్నారంటే నాటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య ఎంత భారీ స్థాయిలో లావాదేవీలు నడిచాయో బోధపడుతోంది. 2017–18 మధ్య ఏకంగా 198.66 శాతం అధికంగా చెల్లించారు. ఆ ఏడాది కొన్ని మందుల వాస్తవ విలువ రూ.10.82 కోట్లు కాగా ఏకంగా రూ.32.31 కోట్లు వెచ్చించి కొన్నారు. విజిలెన్స్ నివేదికలో ముఖ్యాంశాలు - రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు రూ.698.36 కోట్లు చెల్లించారు. - టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో రూ.కోట్లలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం. - ల్యాబొరేటరీ పరికరాలను ఎలాంటి టెండరు లేకుండా లెజెండ్ అనే సంస్థకు ఇచ్చారు. - శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా 129.32 శాతం అధిక రేట్లకు తమకు నచ్చిన కంపెనీకి ఇచ్చారు. - ఫర్నీచర్ కొనుగోళ్లకు టెండర్లు లేకుండా రూ.6.62 కోట్లు చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70 శాతం అధికం. - ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో ఇ.రమేష్బాబు, కె.ధనలక్ష్మి తదితరులున్నారు - రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. - రూ.కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించుకోకుండా మూలన పడేశారు. - జెర్సన్ ఎంటర్ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డా.సీకే రమేష్కుమార్ రూ.9.50 కోట్లు చెల్లించారు. - రూ.16,992 విలువైన బయోమెట్రిక్ యంత్రాలను రూ.70,760 చొప్పున కొనుగోలు చేశారు. అవి ఎక్కడా పనిచేయడం లేదు. -
కార్మిక న్యాయస్థానానికే బాధ్యతలు..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచనలు చేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. కార్మికుల డిమాండ్లు పరిశీలించి 2 వారాల్లో పరిష్కరించాలని, లేకుంటే కార్మిక న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కార్మిక శాఖ పరిధిలో పరిష్కారమవుతాయా? లేక కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు అప్పగించాలా అనేదానిపై ఆ శాఖ తర్జనభర్జన పడుతోంది. కార్మిక శాఖ పరిధిలో సమస్య పరిష్కారమవ్వని పక్షంలో కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు ఇవ్వాల్సి వస్తే.. అందుకుగల కార ణాలను స్పష్టం చేయాలి. దీంతో కార్మిక శాఖ కమిషనరేట్ యంత్రాంగం కార్మిక చట్టాలు, నిబంధనలు తదితరాలను పరిశీలిస్తోంది. తీర్పు ప్రతి రాగానే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కార్మిక శాఖ కమిషనరేట్ పరిధిలో సాధ్యమయ్యే అవకాశాలు లేవని ఆ శాఖ భావిస్తోంది. కార్మికుల డిమాండ్లన్నీ ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోనివి. ఇందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. దీంతో వీటి పరిష్కారానికి కార్మిక శాఖ కంటే కార్మిక న్యాయస్థానమే సరైందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం కార్మిక న్యాయస్థానాన్ని కోరేందుకు కార్మిక శాఖ కార్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చి 3 రోజులవుతున్నా.. కోర్టు నుంచి అధికారికంగా తీర్పు ప్రతి రాలేదు. క్రమపద్ధతిలో తీర్పు ప్రతి అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ముందు నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య కార్మిక శాఖ సంప్రదింపులు మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణీత గడువు ముగిసినప్పుడే కార్మికులు సమ్మె చేపట్టాలి. కానీ సంప్రదింపుల సమయంలోనే కార్మికులు సమ్మెకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమా లేదా అనేది కార్మిక న్యాయస్థానం తేల్చాలి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం 2 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన క్రమంలో గడువులోగా కార్మిక న్యాయస్థానానికి పూర్తి వివరాలు, ఆధారాలతో నివేదికను సమర్పించేందుకు కార్మిక శాఖ చర్యలు వేగిరం చేసింది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కార్మిక శాఖ భావిస్తోంది. 6 నెలల్లో పరిష్కారం కష్టమే.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కార అంశం కార్మిక న్యాయస్థానానికి అప్పగించేందుకు సిద్ధమవుతున్న కార్మిక శాఖ.. కార్మిక చట్టాల్లోని క్లాజ్ల ప్రకారం 6 నెలల వ్యవధి లో పరిష్కరించేలా సూచన చేయనుంది. వాస్తవానికి చట్టంలో పొందుపర్చిన విధంగా 6 నెలల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉన్న ప్పటికీ.. ఆధారాల సమర్పణ, విచారణ అంశం అంత సులువైన ప్రక్రియ కాదని నిపుణులు చెబుతున్నారు. కార్మికుల వాదనలన్నీ కార్మిక న్యాయస్థానం ప్రత్యక్షంగా వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమ్మెలో 48 వేలకుపైగా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క కార్మికుడి వాదన వినాల్సి ఉండటంతో ఈ వ్యవధి చాలదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో కేసు విచారణకు మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదు. -
ఉద్యోగం కావాలంటే ఈ యాప్ ఉండాలి గురూ..!
సాక్షి, హైదరాబాద్ : ఇకపై ఉద్యోగ ప్రయత్నం మరింత సులభతరం కానుంది. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్పేజీ తెరిచింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులు ఈ యాప్ లేదా వెబ్పేజీలో వివరాలు నమోదు చేసుకుంటే చాలు.. వారి అర్హతకు తగ్గ ఉద్యోగాల జాబితా ప్రత్యక్షమవుతుంది. ఇంతకుముందు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ... అవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఉద్యోగం వచ్చిన తర్వాత.. లేదా ఉద్యోగాల జాబితా ప్రచురణకు వెబ్సైట్ నిర్వహణ సంస్థకు రుసుము చెల్లించాల్సి వచ్చేది. తాజాగా కార్మిక ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ మాత్రం పూర్తిగా ఉచితం. కంపెనీలల్లో ఖాళీల నమోదుకు ఎలాంటి చెల్లింపులుండవు. ఉద్యోగ ప్రయత్నం చేసే అభ్యర్థికి సైతం పూర్తిగా ఉచిత సేవలందిస్తారు. గుర్తింపు ఉన్న కంపెనీల్లోనే.. డీట్ యాప్, వెబ్పేజీల్లో గుర్తింపు ఉన్న కంపెనీల్లో ఖాళీల ప్రదర్శనకు కచ్చితమైన నిబంధనలు పాటిస్తుంది. ఉద్యోగ ఖాళీలున్నట్లు వచ్చే నోటిఫికేషన్ల తాలూకు కంపెనీ పూర్వాపరాలు ముందుగా యాప్ నిర్వాహకులు పరిశీలిస్తారు. మొబైల్ ఫోన్ వెరిఫికేషన్, ఈ–మెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత క్షేత్ర పరిశీలన చేసి నిర్ధారిస్తారు. అలా మూడు దశల్లో ఆమోదం పొందిన తర్వాతే సదరు నోటిఫికేషన్లను యాప్, వెబ్పేజీల్లో ప్రదర్శిస్తారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని నిర్వహించే కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు రంగ కంపెనీలైనా.. సంబంధిత శాఖల సలహాలు, సూచనలు సైతం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. యాప్ డౌన్లోడ్ ఇలా.. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో డీట్ (deet) అని టైప్ చేసి సెర్చ్ చేస్తే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో యాప్ ప్రత్యక్షమవుతుంది. ఇన్స్టాల్ చేసుకుని.. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత అవకాశాలను బట్టి ఉద్యోగం ఇచ్చే కంపెనీతో చాట్ చేసే వీలుంటుంది. ఆ కంపెనీ ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుని ఉద్యోగ పరిస్థితి, ఇంటర్వూ్య తదితర ప్రక్రియల కోసం ముందుకెళ్లొచ్చు. అలాగే https://tsdeet.com వెబ్సైట్ ద్వారా కూడా ఉద్యోగాల శోధన చేయొచ్చు. డీట్ యాప్, వెబ్పేజీలను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి డీట్ యాప్, డీట్ వెబ్పేజీలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా ఉచితంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాప్, వెబ్పేజీ నిర్వహణ కోసం ఏటా రూ.10 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కార్మిక ఉపాధి కల్పన డైరెక్టర్ కేవై నాయక్, మోహిత్కుమార్ పాల్గొన్నారు. ఓకే చోట పరిశీలన ఉద్యోగావకాశాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుంది. అక్కడ ఉద్యోగాలున్నా అవి అభ్యర్థి అర్హతలకు సరిపోతాయో లేదోనన్న సందేహం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే కంపెనీలు వెబ్పేజీల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఆయా కంపెనీల పేజీలను ఒక్కొక్కటిగా వీక్షించడంతో సమయం ఎక్కువ పడుతుంది. వీటిన్నింటిని అధిగమించి సులభంగా ఒకే వేదికగా ఉద్యోగాలను చూసుకునే వీలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఈ యాప్/వెబ్పేజీలు ప్రారంభదశలో ఉన్నాయి. ఇప్పటికే 45 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారం ఉంది. – చల్లా మణికాంత్, సీఈవో స్టోరీటెక్ -
జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటికే 400 జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను తెరిచి కార్మిక కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సనత్నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించతలపెట్టిన ఓపీడీ భవనానికి బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్తగా నిర్మించనున్న ఓపీడీ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.124 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్లాకులో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. కారి్మకుల సంఖ్య తక్కువ ఉన్న చోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు కాని వారికి కూడా సేవలు అందించనున్నట్లు వివరించారు. దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కారి్మకులకు నెలవారీగా రూ.3,000 పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించాలి సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. వైద్య సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐకి సంబంధించిన పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈఎస్ఐ ఆసుపత్రుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. రాష్ట్రంలో 18 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ పరిధిలో ఉన్నారని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తెలిపారు. -
‘కనీస వేతనం’పై సలహా బోర్డు: కార్మిక శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న రంగాల్లో కనీస వేతనాన్ని నిర్ధారించడానికి సలహా బోర్డును నియమించనున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ‘జాతీయ కనీస వేతనాన్ని నిర్ధారించడానికి కేంద్రం సలహా బోర్డును ఏర్పాటుచేస్తుంది. అవసరాలు, నైపుణ్యాలు, ఉద్యోగ స్వభావం తదితరాల ఆధారంగా ఒక్కో రంగం, ప్రాంతంలో ఒక్కోలా కనీస వేతనాలు నిర్ణయిస్తాం’ అని కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్కే గుప్తా చెప్పారు. కేంద్రం ఇప్పటి వరకు జాతీయ కనీస వేతనాలను ప్రకటించలేదని, ఉద్యోగులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని అన్నారు. అది మీ పాపమే కదా.! -
కాసులు కురిపిస్తున్న ఉద్యోగాలు
ఉపాధి కల్పనలో ఆ శాఖ తీరే సెప‘రేటు’ - ఫోర్జరీ సంతకాలతో చక్రం తిప్పుతున్న మధ్యస్థాయి ఉద్యోగులు - బ్యాంకు ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులకు బురిడీ - మిగులు ఉద్యోగులకు అడ్డగోలు నియామకాలు తప్పు చేస్తే శిక్ష ఉంటుంది...ఇది సహజ న్యాయసూత్రం...కానీ తప్పు చేస్తే రక్షణ ఉంటుంది...ఇది జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో విచిత్రం... ఫోర్జరీ సంతకాలతో లేని ఉద్యోగాలు కట్టబెట్టినా...ఏకంగా బ్యాంకు ఉద్యోగాలు ఇస్తానంటూ నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చినా... బేఖాతర్... కార్మిక శాఖలో కీలక నేత అండదండలు ఉంటే చాలు...ఆయన్ను ‘తగినవిధంగా ’ ప్రసన్నం చేసుకుంటే చాలు... జిల్లాలో సరిగ్గా అదే జరుగుతోంది. కుంభకోణాలకు పాల్పడ్డ అధికారులపై ఎలాంటి చర్య లేకపోవడమే ఇందుకు నిదర్శనం.! – సాక్షి, అమరావతి బ్యూరో సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఓ మధ్యస్థాయి అధికారి బ్యాంకు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు. ఉత్తుత్తి ఇంటర్వూలు చేసి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చి పంపించారు. నిజమేనని నమ్మి బ్యాంకుకు వెళ్లిన నిరుద్యోగులకు అసలు విషయం తెలిసింది. నిరుద్యోగులతోపాటు బ్యాంకు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఉపాధి కల్పన కార్యాలయంలోని ఆ అధికారిపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టు కూడా చేసి రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలుకు పంపారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. కీలక నేత అభయహస్తం... బ్యాంకు ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఆ అధికారిపై కార్మిక శాఖ చర్యలు తీసు కోలేదు. సస్పెన్షన్ కాదుకదా కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ అధికారికి కార్మిక శాఖలో ఓ కీలక నేత అభయహస్తం అందించారు. దాంతో ఆ అధికారి మళ్లీ యథావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయంలో ఉన్నతాధికారికి సమాచారం కూడా ఇవ్వకుండా తన సీటులో కూర్చుంటున్నారు. కానీ ఆయన చేస్తున్న సంతకాలను ఆ ఉన్నతాధికారి రౌండప్ చేయసాగారు. ఈ విషయాన్ని కార్మిక శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎందుకంటే కీలక నేత అండతోనే ఆ అధికారి తన సీటులో కూర్చున్నట్లు గ్రహించారు. దాంతో ఏం చేయాలో పాలుపోక ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ‘మిగులు ఉద్యోగాల’ మాయాజాలం హైదరాబాద్లోని ఇరిగేషన్ కార్పొరేషన్ను రద్దు చేసి ఉద్యోగులకు అన్ని బెనిఫిట్లు చెల్లించేసి సెటిల్ చేసేశారు. కానీ వారిలో 41మందిని మిగులు ఉద్యోగులుగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నియమించారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఓ మధ్యస్థాయి అధికారితోపాటు మరో ఉద్యోగ సంఘ నేత దీనికి సూత్రధారులు. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షలు చొప్పున రూ.80లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారి అనుమతిస్తున్నట్లు ఫోర్జరీ సంతకంతో అధికారిక పత్రం చూపించారు. అనంతరం ఆ మిగులు ఉద్యోగులకు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు కూడా ఇచ్చేశారు. దీనిపై ఎన్సీసీ విభాగానికి సందేహం వచ్చి విచారించడంతో మొత్తం డొంకంతా కదిలింది. కార్మిక శాఖ కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టి రికార్డులు సీజ్ చేశారు. ఉద్యోగాల కుంభకోణానికి బాధ్యులని భావిస్తున్న ఇద్దరికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ దాదాపు ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ... ఉద్యోగాల కుంభకోణంలో పాత్రధారులైన ఇద్దరు అధికారులు జిల్లా ఉన్నతాధికారిని కలిసినట్లు తెలిసింది. ఆయన సంతకమే ఫోర్జరీ చేసి ఉద్యోగాలు ఇచ్చేసినట్లు ప్రధాన ఆరోపణ. తన సంతకం ఫోర్జరీపై ఆయనే తీవ్రంగా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూడాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులకు ఆయన అండగా నిలవడం గమనార్హం. ఆయన కూడా కార్మిక శాఖలోని కీలక నేతను సంప్రదించి ‘అసలు విషయం’ మాట్లాడుకున్నారు. అంతే మిగులు ఉద్యోగుల కుంభకోణం విచారణ ఫైలు అటకెక్కింది. కుంభకోణానికి పాత్రధారులైన వారిలో ఓ అధికారి బదిలీపై రాయలసీమ వెళ్లిపోగా, మరో ఉద్యోగ సంఘాల నేత విజయవాడలోనే దర్జాగా విధులు నిర్వహిస్తున్నారు. -
బాలకార్మికుల లెక్క తేల్చేద్దాం
జిల్లాల వారీగా సర్వే చేపట్టాలని కార్మిక శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: బాలల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ ప్రత్యేకంగా చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. చాలాచోట్ల 14 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయిస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో బాల కార్మికుల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో తొలుత ఇక్కడి నుంచే సర్వే ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో జిల్లాల వారీగా సర్వే చేపట్టేం దుకు కార్మికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. బాలకార్మిక సర్వే నిమిత్తం జిల్లాల వారీగా సర్వే నిర్వహిస్తుండగా.. ఇందుకు ఒక్కో జిల్లాకు రూ.4లక్షలు కేటాయించింది. సర్వే వివరాల ఆధారంగా కొత్తగా జాతీయ బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇటీవల ప్రకటించారు. సరిగా పనిచేయని ప్రస్తుత ప్రాజెక్టులు.. పూర్వ జిల్లాల ప్రకారం రాష్ట్రంలో పదింటా 8 జిల్లాల్లో జాతీయ బాల కార్మిక నిర్మూలన ప్రాజెక్టులున్నాయి. వీటిలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ప్రాజెక్టులు ఐదేళ్లుగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మిగతా ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టుల్లో అరకొరగా కార్యక్రమాలు సాగుతున్నాయి. నిర్మాణ రంగంతో పాటు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్నవారిలో ఎక్కువగా బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఈ క్రమంలో వారి పిల్లల్ని సైతం పనుల్లో పెడుతున్నట్లు అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. -
ప్రకటన సరే.. ఉత్తర్వులేవీ?
- బాణసంచా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లింపు కోసం వెలువడని జీఓ - జిల్లా నిధుల నుంచి తక్షణ సాయం అందించిన కలెక్టర్ - ఇది చంద్రన్న బీమా పరిహారమని ప్రకటించిన మంత్రి నారాయణ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట వద్ద అనధికారిక బాణసంచా తయారీ కేంద్రంలో గత నెల 31వ తేదీ సంభవించిన పేలుడులో మృతులకు పరిహారం పంపిణీలో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. మృతుల కుటుంబాల దయనీయ పరిస్థితి చూసిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూడకుండా జిల్లా నిధుల నుంచి సాయం అందించారు. నూతన సంవత్సర వేడుకలకు ఒక రోజు ముందు నెల్లూరు నగరంలో జరిగిన పేలుడు జిల్లా వాసులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో నాగరాజు (40), లక్ష్మయ్య (35) అక్కడిక్కడే మృతి చెందగా, ఒకరి ఆచూకీ తెలియలేదు. 13 మందిని విషమ పరిస్థితుల్లోను, ఒకరిని కొంత మేరకు గాయాలతో నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. సాయం అందజేతకు ఉత్తర్వులేవీ? పై సంఘటన జరిగిన రోజే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బాధితులకు తక్షణ సాయం కింద ఈ మొత్తం చెల్లించడానికి అవసరమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు స్పందించి మృతుల కుటుంబాలకు ఆదివారం రూ.5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయించారు. చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ ఈ మొత్తం చంద్రన్న బీమా నుంచి పంపిణీ చేశామని ప్రకటించారు. అయితే బీమా మొత్తం చెల్లింపునకు కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో కార్మిక శాఖ అధికారులు అంతిమ సంస్కారాల కోసం కొంత మొత్తాన్ని మాత్రమే అందించారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇండ్ల పోలయ్య,(35) శ్రీకాంత్ (16) ఆదివారం కన్ను మూశారు. శనివారం నాటి ఘటనలో ఆచూకీ లేకుండా పోయిన జి. రమేష్ (18) కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఆనవాళ్లు లభించాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు వైద్యానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించినా, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటనేది పాలకులు పట్టించుకోలేదు. శ్రీకాంత్, పోలయ్య కుటుంబా లకు కూడా రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించడానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి సోమవారం కూడా జీఓ విడుదల కాలేదు. దీంతో ఈ కుటుంబాలకు కూడా జిల్లా నిధుల నుంచే రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మృ తుల కుటుంబాలను ఏదో ఒక నిధి నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించామనీ, ప్రభుత్వం ఏ నిధుల నుంచి దీన్ని సర్దుబాటు చేస్తుందో చూడాల్సి ఉందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. 17 కుటుంబాలకు సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషాదకర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వేగంగా స్పందించక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఈఎస్ఐసీ నుంచి కొత్త పథకం
హైదరాబాద్: బండారు దత్తాత్రేయ నేతృత్వంలోని కేంద్ర కార్మిక శాఖ తాజాగా ప్రతి కార్మికుడినీ ఈఎస్ఐ స్కీమ్ కవరేజీ పరిధిలోకి తెచ్చేందకు ఒక పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థలు/కంపెనీలు వారిఉద్యోగులను ఈఎస్ఐ స్కీమ్లో భాగస్వాములను చేయవచ్చని ఈఎస్ఐ కార్పొరేషన్ తెలిపింది. ఈ పథకం వచ్చే జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అంటే మూడు నెలలపాటు అందుబాటులో ఉంటుంది. అలాగేఈఎస్ఐ కేంద్రాల్లోని వైద్య సదుపాయాల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈఎస్ఐ కార్పొరేషన్... రాష్ట్రాలతో కలిసి వెచ్చించే వ్యయ పరిమితిని రూ.2,150 నుంచి రూ.3,000 (ఇన్సూరెన్స్ కలిగిన వ్యక్తి చొప్పున)పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ప్రయోజనాలు 2020 వరకు అందుబాటులో ఉంటాయి. ఇటీవల జరిగిన ఈఎస్ఐ కార్పొరేషన్ 170వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. -
ఈపీఎఫ్పై 8.8% వడ్డీ!
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ డిపాజిట్లపై 2016–17 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ రేటును కొనసాగించేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. 4 కోట్లకు పైగాగల చందాదారులకు సంబంధించిన ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆర్థిక మంత్రిని కలిశారు. అయితే 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్వో నిర్ణాయక బోర్డు (సీబీటీ) సూచన మేరకు వడ్డీని 8.8 శాతంగాకాక, 8.7 శాతంగా కేంద్రం తొలుత నిర్ణయించింది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళనలకు దిగడంతో వడ్డీని 8.8 శాతంగా నిర్ణయించారు. ఈసారి అలాంటి ఆందోళనకు తావులేకుండా చేయాలని భావించి, ముందస్తుగా ఆర్థిక శాఖ అనుమతి పొందాలని భావిస్తున్నారు. -
మైనార్టీ సంక్షేమానికి రూ.100 కోట్లు
నిధుల మంజూరుకు కేంద్రంతో మాట్లాడతా: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి రూ.100 కోట్లు నిధులిచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సోమవారం మంజీర అతిథి గృహంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలతో దత్తాత్రేయ సమావేశమై మైనార్టీల సంక్షేమం, కార్మిక శాఖ చర్యలపై సమీక్షించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. మైనార్టీ మహిళలను చిన్న, కుటీర పరిశ్రమల స్థాపన వైపు ప్రోత్సహించాలని సూచించారు. ముస్లిం కుటుంబాల్లో పేదరికాన్ని తరిమేయాలని.. మహిళలు, పిల్లల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చాలని, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేక గ్రాంటు వచ్చేలా కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో మాట్లాడతానని చెప్పారు. కార్మిక శాఖ కార్యక్రమాలపై సమీక్షిస్తూ, గోషామహల్లో 100 పడకలు.. ఎర్రగడ్డ, బోరబండలో 300 పడకల ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని, అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించగా, సీఎం దృష్టికి తీసుకెళ్తానని హోం మంత్రి చెప్పారు. ఈఎస్ఐ పరిధిని రూ.21 వేల వేతనం వచ్చే కార్మికులకు కూడా వర్తింప జేస్తున్నామని, దీని ద్వారా 35 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారిని నగదు రహిత చెల్లింపుల వైపు మళ్లించాలని సూచించారు. వర్దా తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నష్టం సంభవించిందని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తానన్నారు. పీవీ రాజేశ్వరరావు మృతి పట్ల సంతాపం మాజీ పార్లమెంటు సభ్యులు పీవీ రాజేశ్వరరావు మృతి పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సంతాపం తెలియజేశారు. రాజేశ్వరరావుతో తనకున్న మైత్రిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. -
వీసా దుర్వినియోగాలపై విచారణ: ట్రంప్
అధికారం చేపట్టగానే దర్యాప్తునకు ఆదేశాలు వాషింగ్టన్: వీసా దుర్వినియోగాలకు సంబం ధించి వచ్చిన అన్ని రకాల అభియోగాలపై తాను అధికారం చేపట్టిన తర్వాత విచారణ జరిపిస్తానని అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికన్లకు ఉద్యోగాలను దూరం చేస్తున్న ఇలాంటి దుర్వినియోగాలపై దర్యాప్తు జరపాలని తాను అధికారం చేపట్టిన తర్వాత కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. దీంతో ట్రంప్ పాలనలో భారతీయులు సహా విదేశాలకు చెందిన కార్మికులు వీసాలకు సంబంధించి కఠినమైన పరిశీలనను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అయితే వీసా ఆరోపణలకు సంబంధించి ఏ ఒక్కరి పేరును ట్రంప్ ప్రస్తావించలేదు. గత కొన్నేళ్లుగా పలు కంపెనీలు హెచ్1బీ వీసాల దుర్వినియోగానికి పాల్పడుతున్నాయంటూ చట్ట సభల సభ్యులు ఆం దోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ వలస విధానాలను కట్టుదిట్టం చేస్తామని ప్రకటించారు. భారత్, చైనా లాంటి దేశాలకు కంపెనీలు ఉద్యోగాలను బదలారుుస్తున్నాయని ఆరోపించారు. మిషిగన్లో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్లర్సన్? డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో ఎక్సాన్ మొబిల్ సీఈవో రెక్స్ టిల్లర్సన్కు విదేశాంగ మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పదవికి రేసులో టిల్లర్సన్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఇద్దరు రిపబ్లికన్ పార్టీ టాప్ సెనేటర్లు మాత్రం టిల్లర్సన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో టిల్లర్సన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఆయన అభ్యర్థిత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే విదేశాంగ మంత్రి ఎంపికకు సంబంధించిన ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నైపుణ్యాభివృద్ధి విధానం తీసుకొస్తాం
- ప్రణాళిక శాఖ సమావేశంలో మంత్రి నాయిని - విదేశాల్లో డిమాండ్ ఉన్న రంగాలు గుర్తించి.. యువతకు శిక్షణ - కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు చర్యలు.. సాక్షి, హైదరాబాద్: ‘విదేశాల్లో నైపుణ్య ఆధారిత ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. వాటిలో ప్రాధాన్యమున్న రంగాలను గుర్తిస్తే రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇవ్వొచ్చు. ఇందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి విధానాన్ని (స్కిల్ డెవలప్మెంట్ పాలసీ) అమల్లోకి తీసుకొస్తున్నాం’ అని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. స్కిల్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శనివారం సచివాలయంలో ప్రణాళిక శాఖ సమావేశంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంజీ గోపాల్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సాంకేతిక శాఖ సంచాలకులు వాణీప్రసాద్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కిషన్, పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు. నైపుణ్యాభివృద్ధితో నిరుద్యోగం లేకుండా చేస్తామని, ఈ విధానానికి కేంద్ర నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని నాయిని అన్నారు. పారిశ్రామిక సంస్థలు సీఎస్ఆర్ కింద నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నాయని, వీటిని ఒకే గొడుగు కిందకు చేర్చితే మంచి ఫలితాలు వస్తాయని నిరంజన్రెడ్డి తెలిపారు. వివిధ శాఖలు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు ప్రణాళిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పాపారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్లలోపు వారు 2.2 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 1.51 కోట్ల మంది యువతేనని పేర్కొన్నారు. 2022 నాటికి రాష్ట్రంలో 50.9 లక్షల మ్యాన్పవర్ అవసరమని బీపీ ఆచార్య అన్నారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వలేం
- కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి - తాత్కాలిక సచివాలయంలో పేషీ ప్రారంభం సాక్షి, అమరావతి: నిరుద్యోగ భృతి ఇవ్వలేమని కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కుండబద్దలు కొట్టేశారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి తన పేషీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే ఎన్నికల హామీ ఏమైందని విలేకరులు ప్రశ్నించగా మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఇచ్చే భృతిపై అధ్యయనం చేశామని, చాలా తక్కువగా ఇస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టామన్నారు. ఇందుకోసం యూత్పాలసీని తీసుకు రావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ సబ్ప్లాన్ మాదిరి యూత్ సబ్ప్లాన్ కూడా తీసుకు రావాలని సీఎం వద్ద ప్రతిపాదన పెడుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై కొత్త సచివాలయంలోని తన కార్యాలయంలో మొదటి సంతకం చేశారు. యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కాగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా వెలగపూడిలో తన కార్యాలయాన్ని ప్రారంభించారు. -
జిల్లా స్థాయిలో డీసీఎల్ పోస్టులు రద్దు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా కార్మికశాఖ కొన్ని సంస్కరణలు చేపట్టింది. కొత్త జిల్లాలు చిన్నవి కావడంతో కార్మికశాఖ ప్రస్తుతం ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ (డీసీఎల్) స్థాయిలను రద్దు చేసి కేవలం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఏసీఎల్) స్థాయి అధికారులను నియమించాలని నిర్ణయించింది. జిల్లాస్థాయి అధికారుల ఎంపిక, క్యాడర్ల ఏర్పాట్లు తదితర ప్రక్రియ పూర్తయింది. లేబర్ డిపార్టుమెంట్లో డీసీఎల్ స్థాయి అధికారులు 10 మంది, ఏసీఎల్ స్థాయి అధికారులు 10 మంది, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్(ఎఎల్వో) 99, సీనియర్ అసిస్టెంట్లు 36, జూనియర్ అసిస్టెంట్లు 21, సబార్డినేట్లు 31 మంది ఉన్నారు. ఏ యే జిల్లాకు ఎవరెవరు వెళ్లాలనే దానిపై ఉద్యోగులకు కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దసరా రోజు నుంచి నూతన జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. నూతనంగా ఉద్యోగులెవరినీ చేర్చుకోకపోవడంతో ఉన్నవారితోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జూనియర్ అధికారులకు కొత్త జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారుల విషయంలో కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నూతన జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించింది. -
4 విభాగాలుగా కార్మిక చట్టాలు: దత్తాత్రేయ
12న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న 44 కార్మిక చట్టాలను 4 విభాగాలుగా విభజించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మికులకు ఉద్యోగ, ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేలా వేతనబోర్డు, ఇండస్ట్రియల్ రిలేషన్స్(ఐఆర్), సామాజిక భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ మేరకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిజిటల్ ఇండియాలో భాగంగా చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం చట్టాలను సరళీకరిస్తున్నట్లు తెలిపారు. అయితే కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా పరిశ్రమ మూతపడితే కార్మికునికి 3 నెలల వేతనం లభించేలా చట్టం రూపొందించినట్లు చెప్పా రు. అక్టోబర్ 12న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. ఇదివరకే సీఎం కేసీఆర్ను ఆహ్వానించానని, సోమవారం లేక్వ్యూ అథితిగృహంలో ఏపీ సీఎం చంద్రబాబును కలసి ఆహ్వానించినట్లు చెప్పారు. అమరావతిలో కార్మికశాఖ తరఫున సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని చంద్రబాబు కోరినట్లు తెలిపారు. -
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ దేశానికే ఆదర్శం
- కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ - తెలంగాణలోని కార్మికుల పిల్లలకు 40 శాతం సీట్లు - వృద్ధులు, వికలాంగులకు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ప్రత్యేక సేవలు - ఇంటి నిర్మాణానికి ఈపీఎఫ్ నిధులు వినియోగించే అవకాశం సాక్షి, హైదరాబాద్ : కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ దేశంలోని అన్ని కాలేజీలకు ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఫ్యాకల్టీ, సిబ్బంది వివరాలు, హాజరు శాతం తదితర వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ అనుసరిస్తున్న విధానాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) మెచ్చుకుని.. అన్ని కాలేజీలూ ఇదే విధానాన్ని అనుసరించాలని ఆదేశాలిచ్చిందని చెప్పారు. ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలోని వంద సీట్లలో 40 శాతం తెలంగాణలోని కార్మికుల పిల్లలకే కేటాయించినట్లు తెలిపారు. కార్మిక శాఖ సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల ఐపీ కార్డుదారులను ఆన్లైన్ చేశామని, దీని ద్వారా కార్మికులకు సకాలంలో వైద్య సేవలు అందుతాయన్నారు. అలాగే 24 గంటలు పనిచేసే హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి ఈపీఎఫ్ నిధులు ఇంటి నిర్మాణం, కొనుగోలుకు ఈపీఎఫ్ నిధులు పూర్తిస్థాయిలో వాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. దేశంలో ఎక్కడ కొనుగోలు చేస్తామన్నా పీఎఫ్ నిధులు అందజేస్తామన్నారు. అవసరమైతే పీఎఫ్ నిధులతో హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈపీఎఫ్వో జోనల్ కార్యాలయాలను పది నుంచి 21కు పెంచుతున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులు రూ.18 వేల కోట్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరువు ఛాయలు అలముకున్నాయని.. వేసిన పంటలు ఎండిపోయి రైతాంగం ఆందోళన చెందుతోందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. పుష్కర స్నానానికి వెళ్లిన తనను.. రైతులు కలసి తమ ఆవేదన వెలిబుచ్చారన్నారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు రాకపోతే జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు ఎండిపోయే ప్రమాదముందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కోరారు. -
భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ
- టీఆర్ఎస్ కార్మిక విభాగం సదస్సులో హోం మంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్ భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించే యోచనలో వున్నట్లు రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ కార్మిక విభాగం (టీఆర్ఎస్కేవీ) నిర్విహంచిన తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సదస్సు’లో నాయిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని.. ప్రమాదాలకు గురైనా పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. వీటిని కార్మికుల్లోకి తీసుకెళ్లాలని నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా వుంటుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని వివరిస్తూ.. కార్మికులు టీఆర్ఎస్కు అండగా నిలవాలన్నారు. సదస్సు అనంతరం టీఆర్ఎస్ కేవీ అనుబంధ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర, గ్రేటర్ హైదరాబాద్ కమిటీలను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నత్తి మైసయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎం.విజయకుమార్.. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడుగా కె.చెన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా పల్లపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. రాష్ట్ర సదస్సులో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రూప్ సింగ్, నాయకులు రాంబాబు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పి.నారాయణ తదతరులు పాల్గొన్నారు. -
కొత్తగా11 ప్రభుత్వ ఐటీఐలు
* అందుబాటులోకి మరో 2,400 సీట్లు * రూ. 37.74 కోట్లు కేటాయించిన కార్మిక శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కార్మికశాఖ పచ్చజెం డా ఊపింది. వాటిని త్వరతగతిన ఏర్పాటు చేయాలని నిర్ణయించి స్థలాలు అందుబాటులో ఉన్న తొ మ్మిది ప్రాంతాల్లో ఐటీఐల నిర్మాణానికి రూ. 37.74 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిగిలి న రెండు ఐటీఐల నిర్మాణానికి స్థలాలను త్వరతగతిన ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 62 ప్రభుత్వ, 250 ప్రైవేటు ఐటీఐలలో 39,029 సీట్లు ఉండగా కొత్త ఐటీఐల రాకతో మరో 2,400 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఐటీఐలను ఎక్కువగా పారిశ్రామికవాడలకు దగ్గరగా ఉన్న చోటనే ఎంపిక చేశారు. ఐటీఐల్లోకి విద్యార్థుల క్యూ: ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులకు దీటుగా ఐటీఐలలో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. 62 ప్రభుత్వ ఐటీఐలలో 9 వేల సీట్లు, 250 ప్రైవేటు ఐటీఐలలో 28 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉండగా వొకేషనల్ ట్రైనింగ్లో 1,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి కౌన్సెలింగ్లో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వ ఐటీఐలలో 6,500 సీట్లు, ప్రైవేటు ఐటీఐలలో 10 వేల సీట్లు భర్తీకాగా వొకేషనల్ సర్టిఫికెట్ కోర్సు (ఎస్సీవీటీ)లో 750 సీట్లు భర్తీ అయ్యాయి. భరోసా కల్పిస్తున్న కార్మికశాఖ: ఐటీఐ పూర్తి చేస్తే కచ్చితమైన ఉపాధి కలిగేలా కార్మికశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. ప్రతి ఐటీఐకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఎంసీ)ను ఏర్పాటు చేసి ఒక్కో పరిశ్రమతో అనుసంధానించింది. తద్వారా ప్రతి విద్యార్థికీ అప్రెంటిషిప్ వచ్చేలా చూడటంతోపాటు విద్యార్థులకు నైపుణ్యశిక్షణ ఇప్పిస్తోంది. అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం లభించేలా కృషి చేస్తోంది. ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారికి దాదాపు నిరుద్యోగ సమస్య ఉండదనే భరోసాను అధికారులు కల్పిస్తుండటంతో డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ వంటి కోర్సులకు ఆదరణ పెరిగినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా రానున్న ఐటీఐలు జహీరాబాద్ (మెదక్), కుల్చారం (మెదక్), మర్పల్లి (రంగారెడ్డి), తాండూరు (రంగారెడ్డి), చర్లపల్లి (రంగారెడ్డి), బిచ్కుంద (నిజామాబాద్), ఆసిఫాబాద్ (ఆదిలాబాద్), తాడ్వాయి (వరంగల్), కమలాపూర్ (కరీంనగర్), సిరిసిల్ల (కరీంనగర్), హుజూర్నగర్ (నల్లగొండ) -
గురుకులాల్లో ‘ఔట్సోర్సింగ్’ చిక్కులు
- తాము చెప్పిన వారికి ఇవ్వాలంటున్న ఎమ్మెల్యేలు - కాదంటున్న సంక్షేమ శాఖలు.. - భారీగా చేతులు మారుతున్న డబ్బులు సాక్షి, హైదరాబాద్ : వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భర్తీ అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా 221 గురుకులాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులు, సిబ్బంది నియామకానికి ఐదారు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల అంచనా. అయితే ఆయా సేవలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకుని తమ తమ నియోజక వర్గాల్లో ప్రారంభం కానున్న గురుకులాల్లో తాము చెప్పిన వారినే ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో భర్తీ చేయాలని ఆయా సంక్షేమ శాఖలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎస్సీ గురుకులాల్లోనే ఈ పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 133 కొత్త ఎస్సీ గురుకులాల్లో 900 మందిని ఔట్సోర్సింగ్పై నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఈ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. కార్మికశాఖ ఆమోదం పొందిన ఏజెన్సీలకే ఈ కాంట్రాక్ట్ను ఇవ్వాల్సి ఉంటుందన్న నిబంధనలున్నాయి. అయినా ఎమ్మెల్యేలు తమ వారిని నియమించాలని తమ లెటర్ప్యాడ్లపై అధికారులకు లేఖలు కూడా పంపిస్తున్నారు. ఎస్సీ గురుకులాల కార్యాలయం నుంచి మాత్రం ఎస్ఆర్ శంకరన్ పేరిట ఉన్న ఏజెన్సీకి చెందిన వారినే ఈ పోస్టుల్లో భర్తీచేయాలని లేఖ అందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల లేఖలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, సందట్లో సడేమియా అన్నట్లు సచివాలయంలోని ఓ మంత్రి పేషీతో పాటు ఒక సంక్షేమ శాఖ కార్యదర్శి పేషీలోని సిబ్బంది ఈ పోస్టులను ఇప్పిస్తామంటూ పలువురి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ కార్యదర్శి పేషీలో పోస్టు ఇప్పించాలని లేదంటే డబ్బు తిరిగివ్వాలని సిబ్బంది, బయట వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. -
ఇక 24 గంటలూ మాల్స్, హాల్స్
మోడల్ షాప్ చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: రాత్రి11 అయితే దుకాణాలు కట్టేస్తారన్న ఆందోళన ఇకపై అక్కర్లేదు. ఇకపై 24 గంటలు, 365 రోజులూ దుకాణాలు తెరిచి ఉంచేలా ‘ద మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ (ఉద్యోగం, సేవల వసతి నియంత్రణ) చట్టం-2016’ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. పదిమంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న దుకాణాలు, కంపెనీలు (తయారీ సంస్థలు తప్ప) ఏడాదిపాటు దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దుకాణాలు తెరుచుకోవచ్చు. దీంతో పాటు సరైన భద్రత కల్పించటం ద్వారా రాత్రి షిఫ్టులో మహిళలను పనిలో పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేయాలంటే ఉద్యోగులందరికీ సరైన తాగునీరు, క్యాంటీన్, శిశు సంరక్షణ కేంద్రం, ప్రాథమిక చికిత్సతోపాటు మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు. ఇది నేరుగా అమల్లోకి వస్తుంది. దీని వల్ల దుకాణ, కంపెనీ యజమానులు మరిన్ని ఎక్కువ గంటలు కార్యకలాపాలు నడపటం ద్వారా ఎక్కువ ఉపాధి పెరిగేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అన్ని రాష్ట్రాలు దీన్ని అమల్లోకి తీసుకురావటం ద్వారా దేశమంతా ఉద్యోగుల నిబంధనల విషయంలో సమరూపత వస్తుందని కేంద్రం తెలిపింది. కార్మిక శాఖ చేసిన ఈ ప్రతిపాదనలను రాష్ట్రాలు తమకు అనుకూలంగా స్వల్ప మార్పులతో స్వీకరించవచ్చని అధికారులు తెలిపారు. నిర్ణయం భేష్: రిటైలర్లు, థియేటర్లు: దుకాణాలు, కంపెనీలను 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని దుకాణాలు, మాల్స్, సినిమా హాళ్ల యాజమాన్యాలు స్వాగతించాయి. దీని వల్ల దేశ రిటైల్ రంగంలో సరికొత్త మార్పులు వస్తాయని.. వేల మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయన్నాయి. దీంతోపాటు వినియోగదారులకు చాలా మేలు జరుగుతుందన్నాయి. షాపర్స్ స్టాప్, వాల్మార్ట్ వంటి పెద్ద సంస్థలు కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతించాయి. హైదరాబాద్ సహా ఎనిమిది చోట్ల ఏర్పాటుచేయనున్న కొత్త ఐఐటీల ఏర్పాటు (నిర్మాణానికి)కు సవరించిన ఖర్చు అంచనాలకు(గతం కంటే రెట్టింపు నిధులు) కేబినెట్ ఓకే తెలిపింది. -
జూలై 19న ‘ఆర్టీసీ’ ఎన్నికలు
- షెడ్యూల్ ప్రకటించిన రిటర్నింగ్ అధికారి - ఈనెల 25న తుది ఓటర్ల జాబితా ప్రకటన - అమలులోకి ఎన్నికల నియమావళి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. జూలై 19న ఎన్నికలు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి గంగాధర్ ప్రకటించారు. జూన్ 1 నాటికి ఆర్టీసీ మస్టర్స్లో పేరు నమోదై ఉండి కనిష్టంగా ఆరు మాసాల సర్వీసు పూర్తి చేసుకున్న కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. సోమవారం 12 కార్మిక సంఘాలతో గంగాధర్ సమావేశమై.. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. జూన్ 13న ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. కార్మిక సంఘాల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈనెల 17న స్వీకరించి వాటి ఆధారంగా మార్పుచే ర్పులు చేసి ఈనెల 25న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈనెల 30న కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. జూలై 19న ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అన్ని డిపోలు, వర్క్షాపులు, కార్యాలయాల్లో ఓటింగ్కు అవకాశం ఉంటుంది. ఆరోజు విధి నిర్వహణలో ఉండి ఓటు హక్కు వినియోగించుకోలేనివారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చు. 19న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్కు జూలై 25, 26 తేదీలను కేటాయించినందున అధికారికంగా ఎన్నికల ఫలితాలను ఆగస్టు 6న ప్రకటిస్తారు. కానీ 19న రాత్రికే అనధికారికంగా విజేతల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీఎస్ ఆర్టీసీలో తొలి ఎన్నికలు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్లో జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్- తెలంగాణ మజ్దూర్ యూనియన్లు పొత్తుపెట్టుకుని సంయుక్త విజేతలుగా నిలిచాయి. రెండేళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగగా, 2014తో గడువు పూర్తయింది. రాష్ట్ర విభజన, కార్మిక సంఘాల మధ్య అంతర్గత విభేదాలు, సకాలంలో కార్మిక శాఖ స్పందించకపోవటం తదితర కారణాల వల్ల ఎన్నికల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈసారి మొత్తం 12 సంఘాలు ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. 11 సంఘాలు టీఎస్ ఆర్టీసీ పేరుతో పోటీ పడుతుండగా, ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ తె లంగాణ శాఖ పేరుతో 12వ సంఘం కోర్టు అనుమతితో బరిలో నిలువనుంది. టీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ పేరుతో ఓ సంఘం తొలి 11 సంఘాల్లో ఒకటిగా ఉంది. కార్మికుల సంక్షేమం కోసం గుర్తింపు సంఘం కూటమిగా బాగా పనిచేశామని ఈయూ, టీఎంయూ చెప్పుకొంటుండగా... అవినీతికి పాల్పడడం, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి నేతలు ప్రభుత్వానికి కొమ్ముకాశారంటూ ఇతర సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినట్టయింది. ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయాలను ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే అవకాశం లేదు. -
‘టామ్కామ్’పై విస్తృత ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీస్ (టామ్కామ్)కు విస్తృత ప్రచారం కల్పించాలని కార్మిక శాఖ నిర్ణయించింది. టామ్కామ్ ఆన్లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చి నెల రోజులు కావొస్తున్నా ఆశించిన స్పందన లభించడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో టామ్కామ్వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించడం కోసం లఘు చిత్రాల ప్రసారం, కరప్రతాల పంపిణీ చేయాలని కార్మిక శాఖ నిర్ణయిం చింది. మొదటి దశలో ఐదు చిత్రాలను టీవీలు, సినీ థియేటర్లలో ప్రసారం చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ప్రారంభించనుంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం యువత దళారులను ఆశ్రయించి మోసపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పించాలని టామ్కామ్కు రూపకల్పన జరిగింది. -
కమిషనర్ కావలెను
పెద్దదిక్కు లేని రిజిస్ట్రేషన్ల శాఖ ♦ వారం రోజులుగా కమిషనర్ పోస్టు ఖాళీ ♦ ఇన్చార్జి నియామక ఫైలు సీఎం వద్ద పెండింగ్ సాక్షి, హైదరాబాద్: కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కమిషనర్ను ప్రభుత్వం నియమించలేదు. గత రెండేళ్లుగా ఇన్చార్జి అధికారుల పాలనలోనే రిజిస్ట్రేషన్ల విభాగం కొనసాగుతోంది. అయితే వారం రోజులుగా ఇన్చార్జి కమిషనర్ కూడా లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేసే నాథుడు కరువయ్యారు. కార్మిక శాఖ కమిషనర్గా ఉన్న అహ్మద్ నదీమ్ కొంతకాలంగా రిజిస్ట్రేషన్ల విభాగానికి ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక పరిశీలకునిగా ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం అక్కడకు పంపింది. దీంతో కార్మిక శాఖ ఇన్చార్జి బాధ్యతలను వేరొకరికి అప్పగించిన సర్కారు.. రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలను మాత్రం గాలికి వదిలేసింది. నదీమ్ స్థానంలో కార్మిక శాఖ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన అధికారికే రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు అప్పగించాలని ఆ శాఖ ఇన్చార్జి ముఖ్య కార్యదర్శి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వారం రోజులుగా ముఖ్యమంత్రి వద్ద ఈ ఫైలు పెండింగ్లో ఉండిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిస్థాయి కమిషనర్ను నియమించే సంగతి అటుంచితే, ఇన్చార్జి కమిషనర్ కూడా లేకపోవడంతో ఫైళ్లు పేరుకుపోయాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించేందుకు వీలు లేకుండా పోయింది. బడ్జెట్ లేక మార్చి నెల వేతనాలు, కమిషనర్ లేక ఏప్రిల్ నెల వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. -
కనీస వేతనం 10 వేల కన్నా ఎక్కువే
♦ హోం, కార్మిక మంత్రి నాయిని ♦ కేంద్రం ప్రకటించిన దానికంటే ఎక్కువ ఉండేలా చూస్తాం ♦ ఘనంగా మేడే వేడుకలు,పలువురికి అవార్డుల ప్రదానం సాక్షి, హైదరాబాద్: ‘‘దేశ వ్యాప్తంగా కనీస వేతనం రూ.10 వేలు ఉండేలా చట్టం చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. కానీ తెలంగాణలో కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కనీస వేతనం రూ.10 వేల కంటే ఎక్కువగనే ఉంటది. మేడే సందర్భంగానే దీనిని ప్రకటించాలనుకున్నాం. కానీ అధికారుల బదిలీల కారణంగా సాధ్యం కాలేదు. ఈ నెలాఖరులోగా తీపి కబురు వింటరు’’ అని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. మేడే వేడుకలను పురస్కరించుకుని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాయిని ప్రసంగించారు. దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలోనే కనీస వేతనం మెరుగ్గా ఉండేలా చూస్తున్నామని, ఇప్పటికే కంపెనీ యాజమాన్యాలు, ట్రేడ్ యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఈ నెలాఖరు లోగా తుది నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతిని, సంక్షేమ రంగం మీదనే రూ.35 వేల కోట్లు ఖర్చుపెడుతోంద న్నారు. కార్మికుల ప్రమాద బీమాను మేడే సందర్భంగా రూ.5 లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచినట్లు చెప్పారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత, నైపుణ్యం పెంపొందించేందుకు రూ.10 కోట్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన పేపర్ మిల్లును తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అలాగే వరంగల్లో మూతపడిన పేపర్మిల్లును కూడా తెరిపిస్తామన్నారు. మేడే సందర్భంగా కార్మికులు దీక్షాదివస్కు పూనుకోవాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కాంట్రాక్టు ఎబాలిషన్ బోర్డును రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాశారని ఎమ్మెల్సీ రాములు నాయక్ దుయ్యబట్టారు. కాంట్రాక్టు ఎబాలిషన్ బోర్డును తీసుకొచ్చి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కాగా, మేడే వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్, శ్రమశక్తి అవార్డులను అందజేసింది. శ్రమశక్తి అవార్డు గ్రహీతలు.. కె.శ్రీనివాస్(సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూరు), బి.వెంకటేశం(ఎస్సీసీఎల్), మిరియాల రాజు రెడ్డి, ఇ.ఆగయ్య, కనకం శాంసన్, ఎం.శ్రీనివాసరావు, ఎండీ ప్యారేమియా(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం), ఎం.రాజయ్య(హెచ్ఎంఎస్), ఇ.శ్రీధర్(టీఎస్ఈఈ), జె.జగన్నాథరావు(ఎస్పీపీ ఎంప్లాయిస్), వి.వరప్రసాదరెడ్డి(టీఆర్టీయూసీ), పి.జీవన్రావు (తెలంగాణ ఎన్టీపీసీ ఎంప్లాయిస్), వి.దానకర్ణాచారి (భారత్ డైనమిక్ తెలంగాణ ఎంప్లాయిస్), బీజే థామ్సన్(వీఎస్టీ వర్కర్), కె.ఐలయ్య(భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం), ఎస్.పద్మశ్రీ(హెచ్ఎంఎస్), పి.రాములు(ఎంఆర్ఎఫ్ వర్కర్), జి.రాంబాబు, బి.విజయలక్ష్మీ, వేముల మరయ్య(టీఆర్ఎస్ కేవీ), బీఆర్ సుబ్రమణ్యరావు(టీఎన్టీయూసీ), ఎన్.మహేశ్వర్రెడ్డి(డా.రెడ్డీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎంప్లాయి), రూప్చంద్(తెలంగాణ షాపు ఎంప్లాయిస్ ఫెడరేషన్), ఐ.శ్రీనివాసరావు, కొండా మనోహర్ (హెచ్ఎంఎస్), ఎంఏ వజీర్ (తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయి), వి.శ్రీనివాస్(తెలంగాణ బీడీ వర్కర్స్) జె.అశోక్(తెలంగాణ ఫుడ్స్ అండ్ ఎంప్లాయిస్ స్టాఫ్), సీహెచ్ శంకర్(టీ-ఎలక్ట్రిసిటి ఎంప్లాయి) సింగరేణికి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 60.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 15 శాతం వృద్ధిరేటుతో జాతీయ బొగ్గు రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. బొగ్గు రవాణాలోనూ అగ్రస్థానంలో నిలిచి రికార్డులను తిరగరాసింది. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పారిశ్రామిక సంబంధాల విషయంలో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ చూపిన చొరవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డునిచ్చింది. మంత్రి నాయిని చేతుల మీదుగా శ్రీధర్ అవార్డు అందుకున్నారు. సింగరేణీయుల సహకారంవల్లే సంస్థ అభివృద్ధి సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయనన్నారు. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్స్.. 1.సింగరేణి కాలరీస్ కో-లిమిటెడ్(ఎన్.శ్రీధర్, ఐఏఎస్), 2. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్(ఎన్.నారాయణరెడ్డి),3.మై హోం ఇండ్రస్ట్రీస్ ప్రై లిమిటెడ్(జె.రంజీత్ రావ్), 4.మిహీంద్రా అండ్ మహీద్రా(వీఎస్ రమణ, కేబీఎన్ రావు), 5.ఎంఆర్ఎఫ్(మైఖేల్ రబేరో), 6.పెన్నార్ (జె.నిరుపేందర్ రావు), 7.వీఎస్టీ ఇండస్ట్రీస్(ఎన్.సాయిశంకర్), 8.కిర్బీ బిల్డింగ్ సిస్టం (బి.సదానంద్, డి.రాజు) 9. టీజీఎన్ ఇండస్ట్రీస్(ఎంకే పటౌడియా), 10.హెచ్ఎస్ఐఎస్ లిమిటెడ్(డి.అరుణ్ కుమార్), 11.వసుధ ఫార్మా(ఎం.ఆనంద్), 12. ఐటీసీ లిమిటెడ్(ఎం.మురళీధర్) -
‘పీఎఫ్పై 8.7 శాతం వడ్డీనే ఇవ్వగలం’
న్యూఢిల్లీ: భవిష్యనిధి(పీఎఫ్)పై ఇచ్చే వడ్డీరేటును 8.7 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సమర్థించుకుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిధులపై వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నందున అంతకుమించి ఇవ్వలేమంది. 8.7 శాతం ఇవ్వడానికే గతేడాది మిగిలిన మొత్తాన్ని వాడుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామంది.మరోవైపు 8.8 శాతం వడ్డీ ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. -
ప్రభుత్వ శాఖల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన
కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్కుమార్ సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందని కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్కుమార్ నాయక్ అన్నారు. సదరు శాఖలు కూడా నిబంధనలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకొంటామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మంచి పరిపాలనా పద్ధతులు, కార్మిక విధానాలను అనుసరించాలని సూచించారు. మెరుగైన పని విధానం, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్, యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, కార్మికుల మధ్య ఆరోగ్యకర వాతావరణం తదితర అంశాలకు సంబంధించి విధానపరమైన మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. ‘శ్రమ సువిధ’ పోర్టల్లో చట్టాల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. శుక్రవారం సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు, కార్మిక సంఘాలు, కార్మిక, ఇతర శాఖల అధికారులతో అనిల్కుమార్ సమీక్ష నిర్వహించారు. కార్మికుల న్యాయపరమైన హక్కులను పరిరక్షించడమే తమ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పరిశ్రమల్లో కార్మిక చట్టాల అమలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కాలంలో మొత్తం 3,500 పారిశ్రామిక వివాదాల్లో 1,700 కేసులను పరిష్కరించామని, సెంట్రల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్లో ఇంకా 700 కేసులున్నాయని తెలిపారు. కాగా, సమీక్షకు ఉద్దేశపూర్వకంగానే తమకు ఆహ్వానాలు పంపలేదని సీఐటీయూకు చెందిన ఎస్.నరసింహారెడ్డి అరుణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. కార్మిక శాఖ యాజమాన్యాలకే మద్దతు పలుకుతోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచడం లేదని వెంకటరావు (సింగరేణి కాలరీస్ సంఘం) చీఫ్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. కార్మికుల సమస్యలపై... సీతారామయ్య (సింగరేణి కార్మిక సంఘం), మంత్రి రాజశేఖర్ (విశాఖ స్టీల్స్-ఐఎన్టీయూసీ), గట్టయ్య(ఏఐటీయూసీ), తుమ్మల మల్లేష్, జె.ఉపేందర్ (సింగరేణి గనికార్మిక సంఘం), ప్రకాష్ (ఏపీ సీఐటీయూ), సతీష్ (ఓఎన్జీసీ), సారంగపాణి, మల్లేశం ఆయనకు వివరించారు. ఏపీ, టీఎస్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కేవీ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఎఫ్ కమిషనర్ కేకే జలానా, తెలంగాణ, ఏపీ లేబర్ కమిషనర్లు ఎన్.కృష్ణారావు, ఎస్కే మిశ్రా పాల్గొన్నారు. -
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందడుగు వేస్తున్నాయి. దేశంలో చాలా పరిశ్రమలు నైపుణ్యం కలిగిన కార్మికులు లభించక సతమతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికోసం శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా మోడల్ కెరీర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో శిక్షణ కేంద్రాలను నెలకొల్పాలని రాష్ట్ర కార్మికశాఖ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కార్మికశాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన విభాగం కసరత్తు చేస్తోంది. సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి నివేదికలు పంపించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో మూడు సెంటర్లకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్లోని మల్లేపల్లి శిక్షణ కేంద్రంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్లో ఏర్పాటు చేసిన సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి నిర్వహణ ఖర్చుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేసింది. త్వరలో మరో మూడు సెంటర్లకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. వాటిని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లలో ఏర్పాటు చేయాలని ఉపాధి కల్పనశాఖ యోచిస్తోంది. నిరంతరాయంగా శిక్షణ తరగతులు.. ఈ సెంటర్లలో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణతోపాటు ఎలాంటి చదువులతో మెరుగైన ఉపాధి లభిస్తుందో వివరిస్తారు. ఈ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. కాగా, జిల్లాల్లో ఉపాధి కల్పన కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందినే ఈ సెంటర్లలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు. -
ఎస్బీఐలో ఖాతాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేయండి
వలస కార్మికుల విషయంలో ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికుల వేతనాలను బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లించాలని, ఇందుకు వారి పేర్ల మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఖాతాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేయాలని తెలుగు రాష్ట్రాల కార్మిక శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. శాశ్వత చిరునామా లేకపోయినా ఖాతాలు తెరిచేందుకు సహకరించాలని సూచిం చింది. ఇందుకు బ్రాంచ్ మేనేజర్లకు ప్రత్యేక సర్క్యులర్లు జారీ చేయాలని ఎస్బీఐ ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికుల చేతులను నరికివేసిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు 2014లో సుమోటోగా విచారణ చేపట్టింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల దుస్థితిపై అటు ఒడిశా, ఇటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. వాటిని పరిశీలించిన సుప్రీం కోర్టు.. తమ ముందున్న వ్యాజ్యాన్ని అటు ఒడిశా హైకోర్టు, ఇటు ఏపీ, తెలంగాణాల ఉమ్మడి హైకోర్టులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్బీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏడాది కాలానికి కార్మికుల పేరు మీద ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో అన్ని బ్రాంచ్ మేనేజర్లకు తగిన సర్క్యులర్లు జారీ చేసినట్లు వివరించారు. -
ఇదో పెద్ద కుంభకోణం: విష్ణుకుమార్
సాక్షి, హైదరాబాద్: వైజాగ్లో ఉన్న బ్రాండిక్స్ దుస్తుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న 18 వేల మంది కార్మికుల పొట్టగొట్టడానికి కార్మిక శాఖ సహకరించిందని, కార్మికుల కనీస వేతనాలను నిర్థారిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న వేతనాలు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో-362లో లేవని, వేతనాలను తగ్గించి జీవో ఇచ్చారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు ఆరోపించారు. ఫలితంగా 2011 నుంచి ఏటా రూ.72 కోట్ల చొప్పున ఐదేళ్లలో కార్మికులు రూ.360 కోట్లు నష్టపోయారని, ఇదో పెద్ద కుంభకోణమని, అప్పటి, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న వారికి ముడుపులు అందడం వల్లే మౌనం వహిస్తున్నారని, కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. -
కార్మిక శాఖకు కోతలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖను ప్రభుత్వం నిరాశపరిచింది. గత బడ్జెట్తో పోల్చితే భారీగా కోత విధించింది. గత బడ్జెట్లో కింద రూ.70 కోట్లు ప్రకటించగా, ఈసారి 36.53 కోట్లతో సరిపెట్టింది. మొత్తం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ.425.32 కోట్లు కేటాయించింది. కార్మికుల బీమా వైద్య సదుపాయాలకు ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు. ఉపాధి శిక్షణకు పెద్దపీట.. ఉన్నంతలో ఉపాధి శిక్షణ విభాగానికి కాస్త పెద్దపీట వేసింది. ఇటీవల యువతకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అలాగే విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీస్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో కూడా ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహిస్తోంది. దీంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.26.17 కోట్లు కేటాయించింది. -
వారంలో నాచారానికి ఈఎస్ఐ ఆస్పత్రి
♦ సనత్నగర్ మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్ ♦ దత్తాత్రేయ, నాయిని సమక్షంలో ఎంవోయూ సాక్షి, హైదరాబాద్: వారం రోజుల్లోగా ఈఎస్ఐ సనత్నగర్ ఆస్పత్రిని నాచారం తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెడికల్ కాలేజీ కోసం రాష్ట్ర కార్మికశాఖ నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రిని కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని నాచారానికి, అక్కడున్న కార్పొరేషన్ ఆస్పత్రిని సనత్నగర్కు మార్చుతూ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో అధికారులు శనివారం ఎంవోయూ కుదుర్చుకున్నారు. నాచారం మెడికల్ సూపరింటెండెంట్ దేశ్పాండే, రాష్ట్ర ఈఎస్ఐ డెరైక్టర్ సీహెచ్, దేవికారాణి సంతకం చేసిన ఫైళ్లను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... సనత్నగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్క్లియర్ అవడం సంతోషంగా ఉందన్నారు. సనత్నగర్ ఈఎస్ఐని నాచారానికి తరలిస్తే ప్రస్తుతం 200 బెడ్స్ తగ్గిపోతాయన్నారు. ఈ నష్టం పూడ్చుకునేందుకు త్వరలో కేంద్రం తమ నిధులతో నాచారంలో అదనంగా 250 పడకల ఆస్పత్రిని విస్తరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అలాగే కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతంలో స్థలం చూపిస్తే 500 పడకల ఆస్పత్రిని కూడా నిర్మిస్తామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారన్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ మెడికల్ కాలేజీ నిర్వహణ వల్ల కార్మికుల పిల్లలకు 40శాతం సీట్లు లభిస్తాయన్నారు. గోషామహల్లో పశుసంవర్ధ్దకశాఖ స్థలాన్ని కేటాయిస్తే 100 పడకల ఆస్పత్రిని నిర్మించి ఇస్తామన్నారు. ఏప్రిల్ 1నుంచి ఆటో రిక్షా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామన్నారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 4.70 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్మికుల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకొని 10మంది పనిచేసే సంస్థలను పీఎఫ్ కిందకు తీసుకొచ్చేందుకు పార్లమెంటులో చట్టసవరణ చేయనున్నట్లు వివరించారు. కార్మికుల కనీస వేతన సవరణను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. -
పీఎఫ్ ఉపసంహరణ చట్టాలు కఠినతరం
న్యూఢిల్లీ: పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ నిబంధనల్ని ఈపీఎఫ్వో కఠినతరం చేసింది. నిబంధనల ప్రకారం 54 సంవత్సరాలు వచ్చే వరకూ పీఎఫ్ సొమ్ము తీసుకునేందుకు వీలులేదు. ఈ వయసును 57కు పెంచామని కార్మిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సొమ్ము ఎల్ఐసీకి బదిలీచేసి వరిష్ఠ పెన్షన్ బీమా యోజనలో పెట్టుబడి పెట్టనున్నారు. కొన్ని సంస్థల్లో పదవీవిరమణ వయసు 55 లేదా 56గా ఉండడంతో 54 ఏళ్లకు 90 శాతం సొమ్ము తీసుకునేందుకు అనుమతించేవారు. ఏడాదిలోపు పీఎఫ్ సొమ్ము బ్యాంకు ఖాతాకు జమచేసేవారు. ప్రస్తుతం అన్నిచోట్లా పదవీవిరమణ వయసు 58 ఏళ్లకు పెంచడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. -
మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు
ఈపీఎఫ్వో, ఈఎస్ఐసీకి కార్మిక శాఖ ఆదేశం న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. ప్రారంభమైన మూడేళ్ల దాకా రిటర్నుల దాఖలు నుంచి, తనిఖీల నుంచి వాటికి మినహాయింపులిచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్వో, కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసీకి కే ంద్ర కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత 9 కార్మిక చట్టాలను సక్రమంగా పాటిస్తున్నట్లు స్వయం ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. తొలి ఏడాది ఇందుకు సం బంధించి ఆన్లైన్లో సెల్ఫ్-డిక్లరేషన్ ఫారం సమర్పిం చాల్సి ఉం టుంది. తదుపరి రెండేళ్లు కూడా తనిఖీలు, రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు విశ్వసనీయమైన ఫిర్యాదు రాతపూర్వకంగా వచ్చిన పక్షంలో ఆయా విభాగాలు తనిఖీలు చేయొచ్చు. -
ఏసీబీకి పెద్ద చేపలు కనిపించవా?
కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రశ్న ♦ కార్మికులకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం ♦ ఈపీఎఫ్కు ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ)కి కేవలం వీఆర్వో వంటి చిన్నస్థాయి ఉద్యోగులు తప్ప పెద్ద, పెద్ద అవి నీతి చేపలు కనపడవని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అవినీతిని అంతమొందిస్తేనే సుపరిపాలనకు సార్థకత లభిస్తుందన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా శుక్రవారమిక్కడ ‘సామాజిక భద్రత- సుపరిపాలన’ అనే అంశంపై జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. నీరు పల్లం ఎరుగునట్లు.. అవినీతి కూడా పైస్థాయి నుంచి కిందకు పాకుతుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర పరిధిలోని 44 చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి నాలుగు విభాగాల ద్వారా సేవలందిస్తామన్నారు. దేశంలోని 40 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు ‘యూ విన్’ స్మార్ట్ కార్డులు అందజేసి సామాజిక భద్రత కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈఎస్ఐ కార్డు కలిగిన కార్మికులందరికీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్స అందజేస్తామన్నారు. సనత్నగర్లోని ఈఎస్ఐ మెడికల్ కాలేజిలో 40 శాతం సీట్లను కార్మికుల పిల్లలకే కేటాయించామన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఈఎస్ఐ తరఫున ఆరు బెడ్ల ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు. కార్మికశాఖలో టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల రూ.1,700 కోట్లు ఆదా చేసినట్లు వివరించారు. సామాజిక మాధ్యమంలోకి ఈపీఎఫ్ కార్మికులకు మరింత చేరువయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సామాజిక మాధ్యమంలోకి ప్రవేశించింది. పీఎఫ్కు సార్వత్రిక గుర్తింపు సంఖ్య(యూఏఎన్)తోపాటు ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈఫీఎఫ్కు ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఈపీఎఫ్ కమిషనర్ కె.కె.జాలన్, ఈపీఎఫ్ అదనపు కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, బీఎంఎస్ అధ్యక్షుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధం
సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్న కార్మిక శాఖ ఫిబ్రవరి చివర్లో ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కార్మిక శాఖకు లిఖితపూర్వకంగా తెలిపిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం తొలి నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. కార్మిక సంఘాలనుంచి కొన్ని వివరాలను కార్మిక శాఖ ఆ నోటిఫికేషన్లో కోరనుంది. అనంతరం రెండో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇందులో ఓటర్ల జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలతో సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల తేదీని ఖరారు చేస్తారు. ఆ తేదీని ప్రకటిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. తొలి నోటిఫికేషన్ జారీ చేసిన 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఏపీలో కదలికతో... పాలనాపరంగా ఆర్టీసీ విభజన జరిగినా సాంకేతికంగా ఇంకా ఉమ్మడిగానే కొనసాగుతోంది. ఆస్తులు, అప్పుల పంపకం తర్వాతనే ఆర్టీసీ విభజన పూర్తిగా జరిగినట్టు పరిగణిస్తారు. ఆస్తులు, అప్పుల పంపకం, తుది విభజన కేంద్రప్రభుత్వం చేతిలో ఉంది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించటం ఎలా అన్న విషయంలో కార్మిక శాఖ తర్జనభర్జన పడుతూ వస్తోంది. అయితే... పాలనాపరంగా విభజన పూర్తయి ఎవరి కార్యకలాపాలు వారికే ఉన్నందున ఎన్నికలు నిర్వహించాలంటూ రెండు రాష్ట్రాల కార్మిక సంఘాలు కార్మిక శాఖల దృష్టికి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ తాజాగా ఏపీఎస్ ఆర్టీసీలో ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణ కార్మిక శాఖ కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. -
‘స్థానికత‘కు చుక్కెదురు
♦ ఏపీ నుంచి 21 మంది ఉద్యోగుల కేటాయింపు ♦ ఉద్యోగులను చేర్చుకోని కార్మిక శాఖ కమిషనర్ ♦ బోర్డుల విభజనతో ముడిపెడుతూ ప్రభుత్వానికి లేఖ ♦ కమిషన్కు నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ♦ చేర్చుకోకుంటే 12న సమ్మెకు సై.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖలో ‘స్థానికత’కు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి స్థానికత ఆధారంగా రాష్ట్రానికి కేటాయించి, రిలీవ్ అయిన ఉద్యోగులను చేర్చుకునేందుకు కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ నిరాకరించారు. కార్మిక బోర్డు విభజనతో స్థానికతను ముడిపెడుతూ ఉద్యోగులను చేర్చుకునే అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏపీ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో టీఎన్జీవో కార్మిక శాఖ విభాగం.. కమిషనర్కు నోటీసులు అందజేసింది. ఈ నెల 11 వరకు ఉద్యోగులను చేర్చుకోకుంటే 12న సమ్మెకు దిగుతామని ఆ విభాగం అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ గౌడ్ అల్టిమేటం ఇచ్చారు. 21 మంది కేటాయింపు కమలనాథన్ కమిటీ నిర్ణయం మేరకు ఏపీ కార్మిక శాఖలో పనిచేస్తున్న 21 మంది ఉద్యోగులను స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించారు. వారిని అక్కడి నుంచి రిలీవ్ చేసి తెలంగాణ రాష్ట్ర కమిషనరేట్లోరిపోర్టు చేయాల్సిందిగా గత నెల 30న ఏపీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేరోజు రిపోర్టు చేసేందుకు వచ్చిన ఉద్యోగులను చేర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనరేట్ వర్గాలు అంగీకరించలేదు. కమిషనర్ వర్గాలు గత వారం రోజులుగా తెల్లకాగితంపై పేర్లు రాసి సంతకాలు పెట్టించుకుంటూ ఉండటంతో ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. బోర్డులతో స్థానికత ముడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులు... రాష్ట్ర భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు, కార్మిక సంక్షేమ నిధి బోర్డులతో కలిపి విభజన చేయాలని తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ ముందస్తుగానే కమలనాథన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కమలనాథన్ పరిధిలోకి కార్మిక బోర్డులు, మండలిలు రాని కారణంగా స్థానికత ఆధారంగా ఉద్యోగుల జాబితాలో అభ్యంతరాలు లేని వారిని తెలంగాణకు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోర్డు సమస్యలుంటే ఇరు రాష్ట్రాల కమిషనర్లు సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో చర్చించి తేల్చుకోవాలని సూచించింది. స్పష్టత కోసం.. బోర్డుల విభజన జరగక ముందే స్థానికత ఆధారంగా వచ్చిన ఉద్యోగులను చేర్చుకునే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ ఈ నెల 4న లేఖ రాశారు. మరోపక్క స్థానికత ఆధారంగా వచ్చిన ఉద్యోగులను చేర్చుకోకపోవడం విభజన చట్టం ఉల్లంఘనే అవుతుందని, వెంటనే చేర్చుకోకుంటే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు నోటీసులు అందజేశాయి. -
ఆఖరి రోజు !
తెనాలి రూరల్ : ఏపీ డ్రైవర్ల సామాజిక భద్రత పేరిట అసంఘటిత రంగంలో పనిచేస్తున్న డ్రైవర్ల కోసం అమలు చేస్తున్న బీమా పథకం వెలవెలబోతోంది. బుధవారం నాటితో గడు వు ముగుస్తున్నా పథకంలో చేరేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదు. లారీ, ట్రక్కు, టాక్సీ, ఆటో డ్రైవర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే అధికారుల ప్రచారలోపం పథకం లక్ష్యం నెరవేరడం లేదు. ఇవీ ప్రయోజనాలు.. జిల్లాలో 54 వేల మంది డ్రైవర్లు ఉండగా, ఇప్పటి వరకు 16,500 డ్రైవర్లు మాత్రమే ఈ పథకం కోసం పేర్లు నమోదు చేయించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మరణిస్తే రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యం బారిన పడితే రూ. 75 వేలు, సగం వైకల్యం ఏర్పడితే రూ. 37,500 చొప్పున అందిస్తారు. డ్రైవర్ సహజంగా మ రణిస్తే అతని కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయంగా అందిస్తారు. బీమా చేయించుకున్న డ్రైవర్ల పిల్లలకు 9,10 తరగతులు, ఇంటర్మీడియెట్, ఐటీఐలో ఏడాదికి రూ.1,200 చొప్పున ఉపకారం వేతనం అందిస్తారు. గడువు పొడిగించినా.. ఈ పథకంపై అవగాహన కల్పించడ ం, పేర్లు నమోదు చేయించడంలో అధికారు లు తగిన శ్రద్ధ చూపకపోవడంతో డ్రైవర్ల నుంచి స్పందన కరువైంది. లెసైన్స్తో పాటు బ్యాడ్జి కలిగిన లారీ, ట్రక్కు, ఆటో, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం లో చేరేందుకు అర్హులు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసు వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ ఏడాది మే 31 వరకు ఈ పథకానికి గడువు ఇవ్వగా, ప్రచార లోపంతో డ్రైవర్ల నుంచి ఆదరణ లభించలేదు. దీంతో ఆగస్టు నెలాఖరు వరకు గడువు పెంచారు. అయినా ఇప్పటి వరకు 30 శాతం మంది డ్రైవర్లు కూడా తమ పేర్లు నమోదు చేయించుకోలేదు. దీంతో తిరిగి సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు పొడిగించారు. ఇవి కావాలి.. డ్రైవర్ పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటో, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్, రేషన్కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్(ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పనిసరి), నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్సు, పిల్లలు 9,10, ఇంటర్, ఐటీఐ చదువుతుంటే వారి వివరాలను కార్మికశాఖ కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తు ఉచితంగా లభిస్తుంది. యూజర్ చార్జీల కింద ఇంటర్నెట్, మీ సేవా కేంద్రాల్లో రూ. 25 చెల్లించాలి. కార్మికశాఖ, ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ కార్యాలయాల్లో లేదా మీ సేవా కేంద్రాల్లోగానీ నమోదు చేయించు కోవచ్చు. ఫోన్ నంబర్లు సేకరించి సమాచారం ఇస్తున్నాం.. డ్రైవర్ల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి సమాచారం అందిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు గడువు పెంచడంతో పూర్తి స్థాయిలో డ్రైవర్లను భాగస్వాములను చేయాలన్న పట్టుదలతో ఉన్నాం. ఇటీవల తెనాలి డివిజన్లో ఐదు వేల మందిని పథకంలో చేర్పించాం. - ఆర్. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్, కార్మిక శాఖ, తెనాలి -
రాబడులుంటే మరిన్ని పెట్టుబడులు
స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్మెంట్స్పై దత్తాత్రేయ న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్లో వచ్చే ఏడాది మార్చి కల్లా రూ.5,000-6,000 వరకూ ఈపీఎఫ్ఓ పెట్టుబడులు పెడుతుందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ పెట్టుబడులపై వచ్చే రాబడులను పరిశీలించిన తర్వాతనే మరిన్ని పెట్టుబడులు పెట్టే విషయం ఆలోచిస్తామని ఈపీఎఫ్ఓ ట్రస్టీ బోర్డ్కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఆయన వెల్లడించారు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను 5 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యక్తం చేసిన అభిప్రాయానికి దత్తాత్రేయ స్పందించారు. ఈపీఎఫ్ఓ పెట్టుబడులు పెట్టడం వల్ల స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గుతాయని జయంత్ అభిప్రాయపడ్డారు. జాగ్రత్తగా వ్యవహరిస్తాం.. ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడుల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి పెట్టుబడులు పెంచడాన్ని పరిశీలిస్తామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయమై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రిటైర్మెంట్ నిధి, ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) స్టాక్ మార్కెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం నిధులను ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
డ్రైవరన్నా.. బీమా చేయించుకో
♦ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా ♦ సహజ మరణానికి రూ.30వేల పరిహారం ♦ ట్రాన్స్పోర్టు, బ్యాడ్జీ నంబర్ ఉన్న డ్రైవర్లకు వర్తింపు ♦ 30తో దరఖాస్తు గడువు ముగింపు కార్మిక శక్తి పోరాట ఫలితంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీమా భద్రత పథకం డ్రైవర్లకు ప్రయోజనకరంగా మారింది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు డ్రైవర్ మరణిస్తే ఆయన కుటుంబం రోడ్డున పడకుండా భరోసా దక్కుతోంది. సహజంగా మరణిస్తే చేయూత అందుతోంది. ఇదంతా డ్రైవర్ల సామాజిక భద్రతా పథకం-2015 కింద అమలవుతోంది. ఈ పథకం దరఖాస్తుకు గడువు సమీపిస్తోంది. - కర్నూలు(రాజ్విహార్) నిత్యం ప్రమాదపుటంచుల్లో జీవించే ట్రాన్స్పోర్టు డ్రైవర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్టు డ్రైవర్ల సామాజిక భద్రతా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది మే 1 నుంచే ఆచరణలోకి తీసుకొచ్చి లెసైన్స్ పొందిన (బ్యాడ్జ్ నంబరు ఉన్న) ట్రాన్స్పోర్టు డ్రైవర్ల ఈ పథకం వర్తింపజేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు డ్రైవర్ మరణిస్తే రూ.5లక్షల బీమా సొమ్మును కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు. సహజంగా మరణిస్తే రూ.30 వేలు ఇస్తా రు. శాశ్వత అంగ వైకల్యం కలిగితే రూ.75వేలు, శాశ్వత రీతిలో సగం అంగ వైకల్యతకు రూ.37,500 అందిస్తారు. మృతుడి పిల్లలకు 9వ తరగతితోపాటు 10, ఇంటర్, ఐటీఐ చదువుతున్న ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి రూ. 1,200 స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. నందికొట్కూరు పట్టణంలోని శేషశయనా రెడ్డి నగర్కు చెందిన డ్రైవర్ పి. శాలిమియ్య ఈ ఏడాది మే15న ప్రమాదవశాత్తు మరణించాడు. డ్రైవర్ల భద్రతా పథకం ఆ కుటుంబానికి కార్మిక శాఖ రూ.5లక్షలు ఇచ్చి ఆదుకుంది. కోవెలకుంట్ల మండ లం వెలగటూరు గ్రామానికి చెందిన డ్రైవర్ పి. బాలరాజు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు అందించారు. వీరితోపాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మృత్యువాత పడిన 21 మంది డ్రైవర్ కుటుంబీకులకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపించారు. రిజిస్ట్రేషన్ ఇలా కార్మిక శాఖ వెబ్సైట్ ఠీఠీఠీ.్చఛౌఠట.్చఞ.జౌఠి.జీ లో రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఒక పాస్పోర్టు సైజు ఫొటో, ట్రాన్స్పోర్టు లెసైన్సు వివరాలు, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబరు ఇవ్వాలి. కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్, మీసేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఐడీ కార్డు జనరేట్ కావడంతో పథకం అమలులోకి వస్తారు. జిల్లాలో మొత్తం 32,224 మంది డ్రైవర్లు ఉండగా 20,207 మంది డ్రైవర్లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 30 లోపు దరఖాస్తు చేసుకోండి డ్రైవర్ల సామాజిక భద్రత పథకం కింద ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అప్పగించారు. మరో 21 మందికి పరిహారం కోసం ప్రతిపాదనలు పంపాం. బ్యాడ్జీ నంబరు కలిగిన ట్రాన్స్పోర్టు డ్రైవర్లు దీని ద్వారా లబ్ధి పొందేందుకు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. - అబ్దుల్ సయీద్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ -
కార్మిక శాఖలో ఫైళ్లు మాయం
- విచారణ ఫైళ్లకు తిలోదకాలు - విజిలెన్స్ విభాగంలో అవినీతి తిష్ట - ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర - కమిషనరేట్ అవినీతి మయం సాక్షి, హైదరాబాద్ : కార్మిక శాఖ కమిషనరేట్లో ఫైళ్ల మాయమవడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు అధికారికంగా అందుతున్న ఫైళ్లే మాయమవుతున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్లో మగ్గుతున్నాయి. అధికారులు వాటిపై నివేదికలు తెప్పించుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురిచేస్తోంది. విజిలెన్స్ విభాగంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అవినీతి తిమింగలంపై అభియోగాలు వచ్చినా స్థాన చలనం కలుగడం లేదు. కొత్తగా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాలపై ప్రేక్షక పాత్ర పోషించడం కార్మిక శాఖ కమిషనరేట్లో చర్చనీయాంశంగా మారింది. లేదని చెబుతూ... కార్మిక శాఖలోని అంతర్గత అవినీతి ఆరోపణలపై రెండేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగానికి అధికారికంగా (లెటర్ నంబర్ ఏ/5002/2013/ తేది. 07-11-2013) ఒక ఫైలు చేరింది. అందులో ‘కార్మిక శాఖలో పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్గా విధుల్లో చేరి 13 నెలల పాటు జీతాన్ని అక్రమంగా డ్రా చేసుకున్నారు’ అనే అభియోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతో అధికారికంగా పరిపాలన, విజిలెన్స్ విభాగానికి ఫైలు అందింది. కానీ రెండేళ్లు గడిచినా దానిపై విచారణ జరుగలేదు. తాజాగా ఆ ఫైలు పురోగతిపై ఆరా తీస్తే .. కొం దరి చేతివాటంతో మాయమైనట్లు తెలిసింది. సంబంధిత అధికారులు సైతం ఆ దస్త్రం పరిపాలన, విజిలెన్స్ విభాగాలల్లో లేదని స్పష్టం చేయడం గమనార్హం. నిండా నిర్లక్ష్యమే.. కార్మిక శాఖలో అంతర్గత అవినీతి, అక్రమాలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్లో మగ్గుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సంబంధిత విభాగాల పర్యవేక్షకుల అవినీతి, అక్రమాలతో ఇవి కదలడం లేదు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012 తేది.25-08-2012) అధికారికంగా ఒక ఫైలు చేరింది. అందులో ‘రంగారెడ్డి జిల్లా డీసీఎల్ అధికారి ఒకరు ఆఫీస్ రికార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు’ అనే అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ అందిన 15 నెలల తర్వాత సంబంధిత విభాగం నుంచి రంగారెడ్డి జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్కు ఆఫీస్ మెమో నంబర్ ఏ1/11679/2011. తేదీ 12/11/2013 ద్వారా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని మెమో జారీ అయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి నివేదిక ఆ విభాగానికి చేరలేదు. దాని కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
కార్మిక శాఖలో ఫైళ్లు మాయం
విచారణ ఫైళ్లకు తిలోదకాలు విజిలెన్స్ విభాగంలో అవినీతి తిష్ట ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర కమిషనరేట్ అవినీతి మయం సిటీబ్యూరో: కార్మిక శాఖ కమిషనరేట్లో ఫైళ్ల మాయమవడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు అధికారికంగా అందుతున్న ఫైళ్లే మాయమవుతున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్లో మగ్గుతున్నాయి. అధికారులు వాటిపై నివేదికలు తెప్పించుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురిచేస్తోంది. విజిలెన్స్ విభాగంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అవినీతి తిమింగలంపై అభియోగాలు వచ్చినా స్థాన చలనం కలుగడం లేదు. కొత్తగా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాలపై ప్రేక్షక పాత్ర పోషించడం కార్మిక శాఖ కమిషనరేట్లో చర్చనీయాంశంగా మారింది. లేదని చెబుతూ... కార్మిక శాఖలోని అంతర్గత అవినీతి ఆరోపణలపై రెండేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగానికి అధికారికంగా (లెటర్ నంబర్ ఏ/5002/2013/ తేది. 07-11-2013) ఒక ఫైలు చేరింది. అందులో ‘కార్మిక శాఖలో పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్గా విధుల్లో చేరి 13 నెలల పాటు జీతాన్ని అక్రమంగా డ్రా చేసుకున్నారు’ అనే అభియోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతో అధికారికంగా పరిపాలన, విజిలెన్స్ విభాగానికి ఫైలు అందింది. కానీ రెండేళ్లు గడిచినా దానిపై విచారణ జరుగలేదు. తాజాగా ఆ ఫైలు పురోగతిపై ఆరా తీస్తే .. కొం దరి చేతివాటంతో మాయమైనట్లు తెలిసింది. సంబంధిత అధికారులు సైతం ఆ దస్త్రం పరిపాలన, విజిలెన్స్ విభాగాలల్లో లేదని స్పష్టం చేయడం గమనార్హం. నిండా నిర్లక్ష్యమే.. కార్మిక శాఖలో అంతర్గత అవినీతి, అక్రమాలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్లో మగ్గుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సంబంధిత విభాగాల పర్యవేక్షకుల అవినీతి, అక్రమాలతో ఇవి కదలడం లేదు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012 తేది.25-08-2012) అధికారికంగా ఒక ఫైలు చేరింది. అందులో ‘రంగారెడ్డి జిల్లా డీసీఎల్ అధికారి ఒకరు ఆఫీస్ రికార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు’ అనే అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ అందిన 15 నెలల తర్వాత సంబంధిత విభాగం నుంచి రంగారెడ్డి జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్కు ఆఫీస్ మెమో నంబర్ ఏ1/11679/2011. తేదీ 12/11/2013 ద్వారా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని మెమో జారీ అయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి నివేదిక ఆ విభాగానికి చేరలేదు. దాని కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
కార్మికశాఖ విజిలెన్స్లో అవినీతి తిష్ట..!
- మూడుస్లారు తప్పించినా అదే స్థానంలో ‘పర్యవేక్షకుడు’ - ఏళ్ల తరబడి పెండింగ్లోనే ‘విచారణ’ ఫైళ్లు సాక్షి,సిటీబ్యూరో: కార్మికశాఖ కమిషనరేట్లోని విజిలెన్స్ విభాగానికి అవినీతి చెద పట్టింది. కార్మికశాఖ నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలకు సిఫార్సు చేయాల్సిన విజిలెన్స్ విభాగం అవినీతిమయంగా మారింది. దీర్ఘకాలికంగా ఇక్కడ తిష్ట వేసిన ‘పర్యవేక్షకుడు’ పై అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని ఈ విభాగం నుంచి ముచ్చటగా మూడుసార్లు తప్పించినప్పటికీ మళ్లీ అదే స్థానానికి రావడం విస్మయం కలిగిస్తోంది. సాక్షాత్తు సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల అమలు సైతం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కార్మిక శాఖ కమిషనర్గా డాక్టర్ అశోక్ ఉన్నప్పుడు విజిలెన్స్ విభాగం పర్యవేక్షకుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో అతడిని అక్కడి నుంచి తప్పించారు. కమిషనర్ డాక్టర్ అశోక్ బదిలీ కావడంతో తిరిగి పాతస్థానం చేజిక్కించుకోవడంలో సదరు పర్యవేక్షకుడు సఫలీకృతమయ్యాడు. మళ్లీ అవినీతి ఆరోపణలు రావడంతో కొత్త కమిషనర్ అతడ్ని అక్కడి నుంచి తప్పించారు. తాజాగా రాజకీయ పైరవీలతో మళ్లీ ఆయన అదే స్థానంలో చేరడం కార్మిక శాఖలో చర్చనీయంశంగా మారింది. తొక్కి పెట్టుడు... కార్మికశాఖ విజిలెన్స్ విభాగానికి విచారణ కోసం ఫైల్ను తొక్కి పెట్టడం ఆనవాయితీగా మారింది. ఉదాహరణకు రెండేళ్ల క్రితం ‘ పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్గా విధుల్లో చేరి 13 నెలల జీతాన్ని అక్రమంగా తీసుకున్నారు’ అనేఅభియోగాలపై విజిలెన్స్ విభాగానికి (లెటర్ నంబర్ ఏ/5002/2013, తేదీ 7-11-2013) అధికారికంగా ఒక ఫైల్ చేరింది. కానీ ఇప్పటి వరకు ఆ ఫైల్ విచారణకు నోచుకోకుండా పెండింగ్లోనే ఉంది. సదరు అధికారి పదవీ విరమణ కూడా జరిగిపోయింది. అలాగే, రంగారెడ్డి జిల్లా డీసీఎల్ ఒకరు ఆఫీస్ రికార్డును ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడిన అభియోగంపై విజిలెన్స్ విభాగానికి (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012.తేదీ 25-08-2012) మరో ఫైల్ చేరింది. ఏళ్లు గడుస్తున్నా ఆ ఫైల్ కూడా విచారణకు నోచుకోలేదు. అసలు ఫైల్ ఉందా? అదృశ్యమైందా..? తెలియని పరిస్థితి నెలకొంది. సదరు డీసీఎల్ సైతం ఇప్పటికే పదవీ విరమణ చేశారు. ఏసీబీ విచారణ జరిపించండి: రిటైర్డ్ డీసీఎల్ కార్మిక శాఖ విజిలెన్స్ విభాగం అవినీతిపై ఏసీబీ విచారణ జరిపించాలని అదే శాఖకు చెందిన రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఎస్. రాజేందర్ కమిషనర్ అహ్మద్ నదీమ్కు లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయంలోని విజిలెన్స్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఆ లేఖలో వివరించారు. -
ఉద్యోగులకు శుభవార్త!
♦ పెయిడ్స్ లీవ్స్ కోసం పని దినాలు తగ్గించిన ప్రభత్వుం ♦ 240 నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం ♦ వెల్లడించిన కార్మిక శాఖ ముంబై : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు శుభవార ్త. పెయిడ్ లీవ్స్ కోసం పని దినాలను 240 నుంచి 90 రోజులకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను 1948 ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించింది. ఈ మేరకు కార్మిక శాఖకు చెందిన అధికారులు ఆదివారం వెల్లడించారు. రాత్రి వేళల్లో మహిళలు పని చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ప్రస్తుతం ఫ్యాక్టరీల చట్టం ప్రకారం మహిళలకు సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు పని చేయకూడదు. మరోవైపు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కార్మిక శాఖ అధికారులు అంటున్నారు. వారంలో అన్ని రోజులు షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం 1948 ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్’ చట్టంలో మార్పులు చేసిందని, అయితే ప్రతి ఉద్యోగికి ఒక రోజు సెలవు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మందిని షాపు యజమానులు నియమించుకుంటారని, ఎక్కువ వ్యాపారం జరుగుతుందని అంటున్నారు. వారంలో అన్ని రోజులు తెరిచి ఉంచేందుకు దుకాణాలు లెసైన్సు పొందాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనికోసం ప్రభుత్వం ఒక తీర్మానం చేసిందని వెల్లడించారు. వారం రోజుల్లో ప్రభుత్వం లెసైన్సు మంజూరు చేయకపోతే డబ్బులు చెల్లించిన రసీదును లెసైన్సుగా పరిగణిస్తామన్నారు. కాగా, వారం రోజులు షాపులు తెరిచి ఉంచడానికి కాంట్రాక్టు లెసైన్సు కూడా అవసరమన్నారు. దరఖాస్తు చేసుకున్న వారంలోపు ఈ లెసైన్సు అందకపోతే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులకు సంబంధించిన రసీదును లెసైన్సుగా పరిగణిస్తామన్నారు. బాయిలర్లకు స్వీయ ధ్రువీకరణ బాయిలర్లు, ఎకనమైసర్లకు స్వీయ ధ్రువీకరణ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని కార్మికశాఖ అధికారులు అన్నారు. ఫ్యాక్టరీలలో యంత్రాల తయారీకి స్టీమ్ బాయిలర్లు అవసరమని, బాయిలర్లను ఏడాదికొకసారి, ఎకనమైజర్లను రెండేళ్లకొకసారి పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. ఇంతకు ముందు వార్షిక తనిఖీ కోసం ఫ్యాక్టరీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేద న్నారు. 1000 చ దరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న కంపెనీలు ప్రస్తుతం బాయిలర్ పనులకు సంబంధించి ఇంజినీర్లను నియమించుకుంటున్నాయని, వీరు స్వీయ ధ్రువీకరణ, వార్షిక తనిఖీ చేసి కార్మిక శాఖకు నివేదిక అందిస్తారని తెలిపారు. -
ఈటీఎఫ్ల్లోకి ఈపీఎఫ్ఓ నిధులు
⇒ 2015-16లో 5 శాతం ఇన్వెస్ట్మెంట్కు అనుమతి ⇒ మార్కెట్లోకి రూ.5,000 కోట్లు..! ⇒ ప్రణాళికను నోటిఫై చేసిన కార్మిక శాఖ న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిధుల్లో కొంత మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధమయ్యింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 5 శాతాన్ని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడులుగా పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పెట్టుబడుల ప్రణాళిక, విధివిధానాలను రెండు రోజుల క్రితం కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. కార్మిక శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ఇక్కడ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2015-16) దాదాపు రూ.5,000 కోట్ల ఈపీఎఫ్ఓ నిధులు మార్కెట్లోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలుత నిధిలో ఒక శాతాన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని, అటు తర్వాత దీనిని క్రమంగా ఐదు శాతం వరకూ పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందని అగర్వాల్ తెలిపారు. ఈటీఎఫ్ అంటే... ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్పై ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది. 2001లో భారత్లో ఈటీఎఫ్ల ప్రొడక్ట్ ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్ల హవా భారీగా ఉంది. ఈపీఎఫ్ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్ఈ ఈటీఎఫ్లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్- డీఓబీ) చర్చలు జరిపింది. డిజిన్వెస్ట్మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దీనికి కార్మిక మంత్రిత్వశాఖ సానుకూలంగా ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు. 2014లో సీపీఎస్ఈ ఈటీఎఫ్ను ఏర్పాటు చేశారు. 10 ప్రభుత్వ రంగ సంస్థల షేర్లతో ఈ ట్రేడెడ్ ఫండ్ బాస్కెట్ ఉంటుంది. ఈ ఫండ్లో పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్లు ఓఎన్జీసీ, గెయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఇంజినీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్లో సహవాటాదారుల అవకాశాన్ని పొందగలుగుతారు. సీపీఎస్ఈ ఈటీఎఫ్లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని త్వరలో నిర్ణయిస్తామని అగర్వాల్ పేర్కొన్నారు. నిధి... రూ.6.5 లక్షల కోట్లు... ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. 2015-16 బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కూడా కనీసం 5 శాతం వరకూ ఈపీఎఫ్ఓ నిధులను ఈక్విటీ, సంబంధిత పథకాల్లో పెట్టుబడులను ప్రతిపాదించారు. గరిష్టంగా 15 శాతం వరకూ ఈ నిధులు ఉండవచ్చని సైతం ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు స్వయంగా కార్మిక శాఖ కార్యదర్శి తెలిపారు. అయితే ఆచితూచి వ్యవహరిస్తూ, ఈ దిశలో ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. తొలుత ఈటీఎఫ్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ఈ ‘జాగరూకతే’ కారణమనీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనుభవాలను చూస్తే... ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వల్ల అధిక లాభాలు వస్తాయన్న విషయం రుజువవుతోందని కార్మిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 2014-15లో ఈపీఎఫ్ఓ ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ.80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇవి దాదాపు రూ. లక్ష కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈపీఎఫ్ఓ సామాజిక భద్రతా పథకాల కింద కవరేజ్కు నెలవారీ వేతన సీలింగ్ను రూ.6,500 నుంచి రూ.15,000 కు గత ఏడాది సెప్టెంబర్లో పెంచడం దీనికి ఒక కారణం. -
దత్తాత్రేయకు కార్మిక శాఖ!
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెరొక సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఆదివారం జరిగే మంత్రి వర్గ విస్తరణంలో తెలంగాణలో బీజేపీకి ఏకైక ఎంపీగా ఉన్న బండారు దత్తాత్రేయ స్థానం లభించనుంది. ఆయనకు కార్మిక శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి పోర్ట్ ఫోలియో లభించనున్నట్టు తెలుస్తోంది. దత్తాత్రేయ గతంలో 1998-2002లో వాజ్పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా... 2002-04 మధ్య రైల్వేశాఖ సహాయ మంత్రిగా చేశారు. ఈ సారి కూడా ఆయనకు సహాయ పదవి దక్కనున్నట్టు తెలిసింది. తాజా మంత్రివర్గ విస్తరణలో చివరి నిమిషంలో దత్తాత్రేయకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలోనే తెలంగాణ నుంచి దత్తాత్రేయకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించినా అలా జరగలేదు. అయితే దత్తాత్రేయకు పదవి ఇవ్వకుంటే కేంద్రం తెలంగాణను చిన్నచూపు చూస్తోందన్న టీఆర్ఎస్ ఆరోపణ నిజమవుతుందని బీజేపీ శ్రేణులు చెప్పడంతో ఆయనకు మోదీ చోటు కల్పించనున్నారు. -
కార్మికుల డీఏ నిర్ధారణ కోసం ‘ధరల సూచిక’ విడుదల
హైదరాబాద్: పారిశ్రామిక కార్మికుల డీఏను నిర్ణయించేందుకు వినియోగించే ‘వినియోగదారుల ధరల సూచిక’లను శుక్రవారం కార్మిక శాఖ విడుదల చేసింది. 2014 జూన్తో ముగిసిన అర్ధ వార్షికానికి సంబంధించి పారిశ్రామిక కార్మికులకు 1116 పాయింట్లు.. పార్ట్-2లో ని వ్యవసాయ కార్మికులకు 822 పాయింట్లు కేటాయిం చింది. ఈ పాయింట్లు 2014 అక్టోబర్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు అమలులోకి ఉంటాయని తెలిపింది. -
ప్రజా పోలీస్... ప్రభుత్వ లక్ష్యం
సంగారెడ్డి మున్సిపాలిటీ: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు లండన్ తరహాలో నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఇందుకోసం 3జీ, 4జీ టెక్నాలజీ గల వాహనాలతో పాటు గల్లీ గల్లీలో గస్తీ నిర్వహించేందుకు 1,500 మోటర్ సైకిళ్లు, 2వేల సీసీ కెమెరాలు ఉపయోగిస్తామన్నారు. గురువారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేరాలను అరికట్టేందుకే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా సంఘటన జరిగితే 10 నిమిషాల్లోపు సంఘటనా స్థలానికి చేరుకునేలా పోలీసు శాఖకు అధునాతన టెక్నాలజీ గల 1,650 ఇన్నోవా వాహనాలను సమకూరుస్తున్నామన్నారు. అంతేకాకుండా సున్నిత ప్రాంతాలకు పోలీసులు వేగంగా చేరుకునేందుకు 1,500 మోటర్ సైకిళ్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. డీజీపీ, డీఐజీ పర్యవేక్షణలో కంట్రోల్రూంను ఏర్పాటు చేసి నేరాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో పేకాట క్లబ్లను మూసివేయించామని, జిల్లా స్థాయిలో కూడా అలాంటి క్లబ్లను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నిరంతర ప్రజాసేవలో ఉండే పోలీసులు కుటుంబంతో కలిసి ఓ రోజు గడిపేందుకు వారాంతపు సెలవు మంజూరు చేస్తున్నామన్నారు. పోలీసుల యూనిఫాంపై కూడా చర్చిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు ఎస్పీలకు ఉత్తర్వులిచ్చామన్నారు. జెన్కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని హోంమంత్రి తెలిపారు. జెన్కో ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, అందువల్ల ప్రభుత్వమే జెన్కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుందని నాయిని తెలిపారు. నిధులు...నీరు...ఉద్యోగం తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ మేరకు పాలన ఉంటుందన్నారు. సమావేశంలో కార్మిక శాఖ జాయింట్ సెక్రటరీ అజయ్, డి ప్యూటీ సెక్రటరీ నరేశ్కుమార్, ఇన్చార్జి కలెక్టర్ శరత్లు ఉన్నారు. -
జాదవ్కు కార్మికశాఖ
సాక్షి, ముంబై: కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భాస్కర్ జాదవ్కు కార్మికశాఖను అప్పగించారు. జాదవ్కు అప్పగిస్తారని భావించిన జలవనరులశాఖ హసన్ ముష్రిఫ్కు కట్టబెట్టారు. ఎన్సీపీ పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా సునీల్ తట్కరేను నియమించడంతో అప్పటిదాకా ఆ స్థానంలో కొనసాగిన భాస్కర్ జాదవ్ కు మంత్రిమండలిలో స్థానం కల్పించారు. అయితే సునీల్ తట్కరే నిర్వహించిన జలవనరులశాఖ బాధ్యతలను జాదవ్కు అప్పగించనున్నారని ఆ పార్టీ నేతలు గురువారం చెప్పినా అధిష్టానం మాత్రం హసన్ ముష్రిఫ్ నిర్వహిస్తున్న కార్మికశాఖను అప్పగించింది. తట్కరేకు రాష్ట్రాధ ్యక్ష పదవి దక్కడంతో ఖాళీ అయిన జలవనరుల మంత్రిత్వశాఖను హసన్ ముష్రిఫ్కు అప్పగించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ ఈ మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీలో జరుగుతున్న మార్పులపై కాంగ్రెస్ ఓ కన్నేసింది. ఆ పార్టీ చేస్తున్న మార్పులకు అనుగుణంగానే తమ పార్టీలో కూడా మార్పులు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఎన్నికల ప్రకటన వెలువడేనాటికి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మంత్రిత్వశాఖలో ఏ మంత్రి కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనిపై పార్టీ నేతల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే విశ్లేషకులు మాత్రం ఈ మార్పులు సత్ఫలితాలను ఇవ్వలేవని, ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తాయని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు కూడా సమర్థవంతంగా పనిచేయలేరని చెబుతున్నారు. -
బిచ్చగాళ్ల వ్యవస్థపై నిషేధం విధించాలి
వారికి పునరావాసం కల్పించాలి.. హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగాళ్ల వ్యవస్థపై నిషేధం విధించి, వారికి తగిన పునరావాసం కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ అధ్యక్షురాలు జి.భార్గవి దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తెలంగాణలో బిచ్చగాళ్లు గౌరవప్రదంగా జీవించేలా చేయడంతో పాటు, వారి హక్కులను రక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. దేశవ్యాప్తంగా 7.3 లక్షల మంది యాచకులు ఉన్నారని, వారు ఏటా రూ.180 కోట్లు ఆర్జిస్తున్నారని, ఒక్క హైదరాబాద్లోనే 11 వేల మంది బిచ్చగాళ్లు రూ.15 కోట్లపైనే ఆర్జిస్తున్నారని వివరించారు. -
‘కనీస వేతన’ వివరాలను ఆన్లైన్లో ఉంచండి
న్యూఢిల్లీ: సంఘటిత, అసంఘటిత రంగంలోని పనివారికి ఇప్పటికే ప్రకటించిన విధంగా కనీస వేతనాలను అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ సదరు యాజమాన్యాలను ఆదేశించింది. వేతనాల చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలను ఉద్యోగుల జాబితా మేరకు వెబ్సైట్లో పొందు పరచాలని కోరింది. ఆయా వివరాలను ఆన్లైన్లో పొందు పరిచేందుకుగాను యాజమాన్యాలకు 90 రోజుల గడువు ఇస్తున్నట్టు కార్మిక శాఖ వెల్లడించింది. యాజమాన్యాలు కార్మికులకు చెల్లించే వేతనాలను ఈసీఎస్ లేదా చెక్కుల ద్వారా మాత్రమే చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించని యాజమాన్యాలపై సంబంధిత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ అధికారులు హెచ్చరించారు. కార్మికులను కాంట్రాక్టు పద్ధతిపై నియమించుకోవడాన్ని తగ్గించుకోవాలని, అది సాధ్యం కాకపోతే శాస్వత కార్మికులకు ఇస్తున్న వేతనాలనే కాంట్రాక్టు ఉద్యోగులకూ వర్తింపజేయాలని అధికారులు స్పష్టం చేశారు.