నవంబర్‌ చివరినాటికి వీవీప్యాట్‌లు సిద్ధం | EVMs, VVPAT machines would be available well before the 2019 LS polls | Sakshi
Sakshi News home page

నవంబర్‌ చివరినాటికి వీవీప్యాట్‌లు సిద్ధం

Published Thu, Sep 27 2018 4:11 AM | Last Updated on Thu, Sep 27 2018 4:11 AM

EVMs, VVPAT machines would be available well before the 2019 LS polls - Sakshi

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన 17 లక్షల వీవీప్యాట్‌(ఓటు రశీదు) యంత్రాలను నవంబర్‌ చివరినాటికి సమకూర్చుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీవీప్యాట్‌లను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని వెల్లడించింది. ఇందుకోసం 17.45 లక్షల యూనిట్ల వీవీప్యాట్‌ మెషీన్ల తయారీకి బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 9 లక్షల యంత్రాలు సిద్ధమయ్యాయని, మిగిలిన 8 లక్షల యంత్రాలను నవంబర్‌ చివరినాటి అందిస్తామని ఆ రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement