కశ్మీర్‌లో గ్రనేడ్‌ దాడి : 15 మందికి పైగా గాయాలు | Fifteen Injured In Grenade Attack In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో గ్రనేడ్‌ దాడి : 15 మందికి పైగా గాయాలు

Oct 28 2019 6:06 PM | Updated on Oct 28 2019 8:23 PM

Fifteen Injured In Grenade Attack In Jammu And Kashmir - Sakshi

జమ్ము కశ్మీర్‌లోని సొపోర్‌ బస్టాండ్‌ వద్ద ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడిలో 15 మందికి పైగా గాయపడ్డారు.

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సొపోర్‌లోని ఓ బస్‌స్టాండ్‌లో టెర్రరిస్టుల గ్రనేడ్‌ దాడిలో 15 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌కు తరలించారు. గ్రనేడ్‌ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొపోర్‌లోని హోటల్‌ ప్లాజా వద్ద సోమవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో గ్రనేడ్‌ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఆర్‌పీఎఫ్‌ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement