ఐదుగురు మిలిటెంట్ల హతం | Four Pakistani nationals among five militants killed in gunfights | Sakshi
Sakshi News home page

ఐదుగురు మిలిటెంట్ల హతం

Dec 1 2017 1:45 AM | Updated on Dec 1 2017 1:45 AM

Four Pakistani nationals among five militants killed in gunfights - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. బుద్గాం, బారాముల్లా జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫుత్లిపొరాలోని పకేపొరా ప్రాంతంలో మిలిటెంట్లు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి.

ఈ క్రమంలో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడటంతో ఎదురుకాల్పులు జరిపినట్లు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు మృతి చెందారని చెప్పారు. వీరు జైషే మొహమ్మద్‌తోపాటు పాకిస్తాన్‌కు చెందిన మరో ఉగ్ర సంస్థ మిలిటెంట్లని చెప్పారు. బారాముల్లా జిల్లాలోని బోమైలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో లష్కరే మిలిటెంట్‌ ముజామిల్‌ను హతమార్చారు.

ఈ ఏడాది 200 మంది హతం: డీజీపీ  
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో 200 మందికిపైగా మిలిటెంట్లను హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్‌ డీజీపీ ఎస్పీ వైద్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. దేశం, జమ్మూ కశ్మీర్‌లో శాంతి స్థాపనకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement