
సాక్షి బెంగళూరు: జలక్షామం, వర్షాభావాన్ని నివారించేందుకు ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కప్పలకు వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉడుపి కిదియూర్ హోటల్ ఆవరణలో శనివారం ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లిబృందం బయలుదేరి పాత డయాన సర్కిల్ గుండా కవి ముద్దణ మార్గంలో ఉడుపి కిదియూర్ హోటల్ వద్దకు చేరుకుని, అనంతరం కప్పలకు వివాహం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment