
అహ్మదాబాద్: కరోనా వైరస్తో పోరాడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ ఆదివారం కన్ను మూశారు. అతనికి కరోనా సోకడంతో ఎనిమిది రోజుల క్రితం అహ్మదాబాద్లోని ఎస్వీపీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన మరణించారు. అతను పేద ప్రజలకు సహాయం చేసే క్రమంలో వైరస్ బారిన పడ్డాడరని గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు శక్తిసిన్హ గోహిల్ పేర్కొన్నారు. అతని మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొంటూ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ స్థానిక అధికారులకు సహకరించాలని కోరారు. కాగా భారత్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 26,917కు, మరణాల సంఖ్య 826కు చేరిందని ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. (ఒక్కరోజులో 1,975 కేసులు)
Comments
Please login to add a commentAdd a comment