ఈ ఏడాదే రామమందిర నిర్మాణం | Image for the news result Ram temple will be built during BJP rule: Sakshi Maharaj | Sakshi

ఈ ఏడాదే రామమందిర నిర్మాణం

Published Mon, Jun 8 2015 3:35 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఈ ఏడాదే రామమందిర నిర్మాణం - Sakshi

ఈ ఏడాదే రామమందిర నిర్మాణం

అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీ పాలనలోనే పూర్తిచేస్తామని వివాదాస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ స్పష్టం చేశారు.

ఉనావ్(యూపీ): అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీ పాలనలోనే పూర్తిచేస్తామని వివాదాస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్  స్పష్టం చేశారు. మందిర నిర్మాణం ఈ రోజు కాకపోతే మరో రోజు పూర్తి చేస్తామన్నారు. తాము ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటామని,  ఈ ఏడాదిలో రామమందిర నిర్మాణం చేపడతామని శనివారమిక్కడ అన్నారు.దేశాభివృద్ధితో పాటు కాషాయదళ ప్రధాన ఎజెండా అయినా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడానికే మోదీ ప్రభుత్వం

 అధికారంలోకి వచ్చిందని విశ్వ హిందూ పరిషత్ నేత సురేంద్రజైన్ అన్నారు. కాగా, మహరాజ్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ వివరణివ్వాలని కాంగ్రెస్ నేత పీసీ చాకో డిమాండ్ చేశారు.  బీజేపీ పనిచేస్తోంది దేశాభివృద్ధికా? లేక ఆరెస్సెస్ ఎజెండాలకు న్యాయం చేయడానికా? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement