Ram temple
-
రామాలయంలో రథానికి నిప్పు
-
అయోధ్యలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
యూపీలోని అయోధ్యలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సకల ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాదే ప్రారంభమైన ఈ ఆలయంలో తొలిసారిగా రామనవమి జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుగుతోంది.ట్రస్టు సభ్యులు డా అనిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈరోజున బాలరామునికి ఒకటిన్నర క్వింటాళ్ల నైవేద్యాన్ని సమర్పించనున్నామని తెలిపారు. నేడు రోజుంతా భజన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించామన్నారు. సాయంత్రం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. -
'స్కై డైవింగ్ స్టంట్'తో రామభక్తి చాటుకున్న 22 ఏళ్ల మహిళ!
అయోధ్యలో నూతన రామాలయం జనవరి 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అదికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు కూడా. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్రాజ్కు చెందిన 22 ఏళ్ల అనామిక శర్మ అనే మహిళ అద్భుతమైన స్టంట్ని ప్రదర్శించింది. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలోనే అనామిక బ్యాకాంక్లో ఈ స్కై డైవింగ్ స్టంట్తో తన రామభక్తిని ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు అనామిక శర్మ బ్యాంకాక్లో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో 'జైశ్రీరామ్' అనే జెండాతో ఈ స్కై డైవింగ్ స్టంట్ చేసింది. తాను తన భక్తిని ఈ స్కై డైవింగ్తో ముందు తీసుకువెళ్లాలనుకుంటున్నా అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా,జనవరి 22న జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సుమారు 4 వేలకు పైగా సాధువులు, పలువురు ఇతర ప్రముఖులు హాజరకానున్నారు. కాగా, అయోధ్యలో ఈ రామ మందిర ప్రతిష్టాపన వేడుకను సందర్శకులు అపూర్వమైన మరుపురాని అనుభవంగా ఉండేలా అభివృద్ధిక కార్యక్రమాలతో అందంగా తీర్చిదిత్తున్నారు సీఎం యోగి. ఈ నూతన రామాలయం రాష్ట్ర దేశవాలయంగా భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామజికి చిహ్నంగా అలారారుతుందని ఆదిత్యనాధ్లో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అయోధ్యలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేశాలే అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు యోగి. VIDEO | 22-year-old Anamika Sharma of Prayagraj showed her devotion for Ram Temple in Ayodhya by skydiving with a ‘Jai Shri Ram’ flag from 13,000 feet in Bangkok. pic.twitter.com/Y6S8qOS9yf — Press Trust of India (@PTI_News) January 3, 2024 (చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!) -
యోగి ఆదిత్యనాథ్కు బాంబు బెదిరింపులు .. ఇద్దరి అరెస్టు
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అయోధ్య రామాలయంలపై బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్, అయోధ్యలోని రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితులను తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) బృందం గుర్తించింది. నిందితులు లక్నోలో విభూతి ఖండ్ ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరించారని పోలీసులు గుర్తించారు. బెదిరింపు పోస్టుల్లో నిందితులకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు ఉన్నట్లు తేలింది. ఈమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్ సింగ్ ఈమెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది. నిందితులు ఇద్దరూ గోండా నివాసితులు. పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసును ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది. నిందితులే ఈ చర్యకు పాల్పడ్డారా? లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్ నేతలు అలర్ట్! -
పునర్వైభవ తార్కాణం: అమిత్ షా
అహ్మదాబాద్: దేశ అమృత కాలపు ఆరంభంలోనే అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన జరగనుండటం యాదృచ్చికమేమీ కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అభిప్రాయపడ్డారు. రానున్న పాతికేళ్లలో ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరి పునర్వైభవం సాధించనుందనేందుకు ఇది తార్కాణమన్నారు. వందల ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయి. దేశవాసుల ప్రార్థనలు, సాధు సంతుల తపస్సులు, అసంఖ్యాత భక్తుల ప్రయత్నాలు ఫలించాయి. అడ్డంకులన్నీ తొలగాయి. శ్రీరాముడు తన జన్మస్థానంలో ఎట్టకేలకు వైభవంగా కొలువు దీరనున్నాడు’’ అని అన్నారు. అయోధ్య మాత్రమే గాక కాశీలో నాడు ఔరంగజేబ్ ధ్వంసం చేసిన విశ్వనాథ్ కారిడార్ను కూడా మోదీ ప్రభుత్వం బ్రహా్మండంగా పునర్నిర్మించిందని గుర్తు చేశారు. -
‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’
జమ్మూకశ్మీర్: ఆయోధ్యలో రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనుంది. రామమందిర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రామమందిర ఏర్పాట్లపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాత్రిపగలు కష్టపడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్దేశంలో సోదరభావంగా తగ్గిపోతోందని దానిని పునరుద్దరించాలని అన్నారు. రాముడు కేవలం హిందువలకు మాత్రమే సంబంధించి దేవుడు కాదని.. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన దేవుడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నానని చెప్పారు. భగవన్ రాముడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ దేవుడని అన్నారు. ఈ విషయం ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల్లో సైతం రాయబడి ఉందని తెలియజేశారు. అయితే రాముడు సోదరభావం, ప్రేమ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఐకమత్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. మతాలకు సంబంధం లేకుండా అందరిని సమభావంతో చూడాలని రాముడి సందేశాల్లో ఉందని తెలిపారు. ఆయన విశ్వమానవులకు ఈ సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రాముడు చెప్పిన సోదరభావం కొరవడిందని.. ప్రజలంతా కూడా సోదరభావాన్ని పాటించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు హాజరుకాన్నారు. కాగా.. కొంతమంది ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం అందగా.. మరికొంత మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం గమనార్హం. ఇక బీజేపీ రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా మలుచుకుంటోందని ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Varanasi: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
రామ మందిర ప్రతిష్టాపన: విపక్ష నేతలకు ఆహ్వానం
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కీలక విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు అందే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు గౌర్హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయి. జనవరి 15 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయి. ప్రాణ ప్రతిష్ట పూజ జనవరి 16న ప్రారంభమై జనవరి 22కు ముగియనుంది. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలో భాగంగా జనవరి 17న 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముడి జీవితంలోని దృశ్యాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి వనవాసం వరకు సాగిన జీవితం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి చిత్రాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు. ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు -
అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకి జనవరి 22 ముహూర్తం..?
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 20–24 మధ్య ఉంటుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. మూడంతస్తుల్లో నిర్మాణం జరుపుకుంటున్న రామాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి నాటికి సిద్ధమైపోతుందని వెల్లడించారు. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట జరిపే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు. జనవరి 20–24 మధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు దివ్యంగా ఉన్నాయని ప్రధాని రావడానికి ఏ రోజు వీలవుతుందో అదే రోజు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆ తేదీని పీఎంఒ కార్యాలయం ఖరారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మంగళవారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చారు. అందులో ఆయన పలు విషయాలు వెల్లడించారు. చదవండి: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు -
ఆయోధ్య రాముడికి మర్చిపోలేని కానుక..ఏకంగా 108 అడుగుల..
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా ఆ అయోధ్య రాముడి కోసం గుజరాత్ని వడోదరాలో తర్సాలీ గ్రామం తమ వంతుగా మర్చిపోలేని ఓ గొప్ప కానుక ఇవ్వాలనుకుంది. అందులో భాగంగా భారీ అగరబత్తి తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అంతేగాదు ఈ భారీ అగర్బత్తి కారణంగా ప్రతిరోజు రాముడికి ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందట. తొలుత ఈ భారీ అగరబత్తిని తయారు చేయాలని సంకల్పించింది విహాభాయ్ అనే రైతు. అయనకు రాముడంటే అమితమై భక్తి. ఈ నేపథ్యంలోనే ఆయన 108 అడుగులు పోడవు ధూపం తయారు చేయాలని సంకల్పించారు. అందుకోసం 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్ మెటీరియల్, 1475 కిలోల ఆవు పేడ పొడి తదితరాలను వినియోగించినట్లు విహాభాయ్ తెలిపారు. ఇలా మొత్తంగా సుమారు 3,400 కిలోల బరువు ఉన్న అగరుబత్తిని సిద్ధం కానుంది. ఆయనకు ఈ అగరుబత్తిన తయారు చేయడంలో గ్రామస్తులు కూడా తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు కావాల్సిన ముడి సరుకును, ఉపయోగించే పదార్థాలను సమకూర్చి ఆయనకు తగినంత సాయం అందించారు. ఈ విధంగా అక్కడున్న వారంతా రాముడిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతేగాదు ఈ భారీ అగరుబత్తి తయారయ్యిన తదనంతరం డిసెంబర్ 2023 కల్లా భారీ ఊరేగింపుగా రామజన్మ భూమి అయోధ్యకు తరలిస్తామని ఆనందంగా చెబుతున్నారు విహాభాయ్. ఈ భారీ పంచద్రవ్య ధూపదీపం(అగర్బత్తి) తయారీ పనులు కూడా తుదిదశకు చేరుకున్నట్లు వెల్లడించారు విహాభాయ్. (చదవండి: ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో? దశరథుని మాటల్లో..) -
అయోధ్యలో 18 లక్షల ప్రమిదలతో దీపోత్సవం
అయోధ్య: అయోధ్యలో ఆదివారం జరిగే దీపోత్సవ్లో 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. దీపావళి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సరయు నది ఒడ్డున రామ్ కి పైడి వద్ద 22 వేల మంది వలంటీర్లు 15 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగిస్తారని అయోధ్య డివిజనల్ కమిషనర్ నవ్దీప్ రిన్వా చెప్పారు. మిగతా ప్రమిదలను ప్రముఖ కూడళ్లు, ప్రాంతాల్లో వెలిగిస్తారన్నారు. లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఉంటాయన్నారు. బాణాసంచా కాలుస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన కళాకారులు రామ్లీలా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఆదివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని మోదీ రామాలయంలో పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేస్తారని పేర్కొంది. సరయు తీరంలో హారతిలో పాల్గొంటారని, దీపోత్సవ్ను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. చదవండి: గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన -
తీరని శోకం.. రాములవారి భజనలో అపశ్రుతి..
కొణిజర్ల: పండుగపూట విషాదం నెలకొంది. ఆలయంలోకి బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లి పాడులో ఆదివారం రాత్రి చోటు చేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు అభయాంజనేయ స్వా మి దేవాలయంలో ఏర్పాటు చేసిన భజనకు తుమ్మలపల్లికి చెందిన 25 మంది వచ్చారు. కొందరు పిల్లలను వెంటబెట్టుకొచ్చారు. పెద్ద లు భజన చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటున్నా రు. రాత్రి 9 దాటాక ఖమ్మం నుంచి దిద్దుపూడికి వేగంగా వెళ్తున్న బొలేరో ఆలయ సమీపానికి రాగానే అదుపు తప్పింది. పక్కన ఉన్న వి ద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, అదేవేగంతో దేవాలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం గో డ విరిగి పక్కనే ఆడుకుంటున్న పగడాల దేదీప్య(9), పగడాల సహస్ర(7)తో పాటు ఇజ్జగాని అలేఖ్యపై పడింది. తీవ్రగాయాలైన చిన్నారులను ఖమ్మం తరలిస్తుండగా దేదీప్య, సహస్ర మృతి చెందారు. అలేఖ్య గాయాలతో బయట పడింది. వాహనం డ్రైవర్ మద్దెల పోతురాజు, వాహనంలో ఉన్న నాగటి వెంకన్న సైతం తీ వ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం తరలించారు. తీరని శోకం.. తుమ్మలపల్లికి చెందిన పగడాల ఆదినారాయణ, శిరీష దంపతులకు ఇద్ద రూ ఆడపిల్లలే. ఆదినారాయణ పెయింటర్గా పనిచేస్తూనే ఆలయాల్లో భజనలకు తబలా వాయిద్యకారుడిగా వెళ్తుం టాడు. పల్లిపాడులో భజనకు భార్యాభర్తలు వెళ్తూ, కుమార్తెలు దేదీప్య, సహస్రను కూడా వెంట తీసుకెళ్లారు. ఊహించని విధంగా జరి గిన ప్రమాదంలో చిన్నారులిద్దరూ మరణించడంతో ఆ దంప తుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. -
మోదీ స్వీయ నిర్బంధంలోకి వెళ్తారా?
సాక్షి, ముంబై : అయోధ్య భూమిపూజ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ హోం క్వారంటైన్లోకి వెళ్తారా అని శివసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది. ప్రధాని మోదీ కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ నిలదీశారు. ఈ మేరకు ఆదివారం తమ పార్టీ పత్రిక సామ్నాలో రోక్తోక్ అనే తన కాలమ్లో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆగస్ట్ 5 న జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజలో మహంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆయన మాస్కు పెట్టుకోలేదు. ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. మోదీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారు. అందుకే మోదీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి’అని రౌత్ డిమాండ్ చేశారు. (చదవండి : కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్ ) అలాగే కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్పై కూడా సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న మేఘవాల్ వ్యాఖ్యలపై రౌత్ మండిపడ్డారు. భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయిందని, రష్యా మాత్రం కోవిడ్ -19 కు వ్యాక్సిన్ కనిపెట్టి ఆత్మ నిర్భరతను చూపిందన్నారు. మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటామని కేంద్రంపై రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి : వాజ్పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ) కాగా, అయోధ్య భూమి పూజలో పాల్గొన్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, ఆగస్ట్ 13న కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా క్వారంటైన్లోకి వెళ్లాలని శివసేన డిమాండ్ చేస్తోంది. -
కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్
మధుర: రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, గురువారం కోవిడ్-19 నిర్ధారణ అయింది. కృష్ణ జన్మాష్టమి వేడుకల నిమిత్తం మధుర వెళ్లిన ప్రస్తుతం ఆయనకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని బృందం మెరుగైన చికిత్స అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహంత్ ను మెరుగైన చికిత్స కోసం గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించనున్నామని మధుర జిల్లా మేజిస్ట్రేట్ రామ్ మిశ్రా వెల్లడించారు. గతవారం (ఆగస్టు 5న) ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వేదికను పంచుకున్న ఈయన తాజాగా కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన రేపింది. ఇదే వేదికపై యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఉండటం గమనార్హం. కాగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు కొన్ని రోజుల ముందు, పూజారి ప్రదీప్ దాస్ సహా మరో 14 మంది పోలీసులకుకూడా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. -
కలియుగ ఊర్మిళ : 28 ఏళ్ల ఉపవాసం ముగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఓ మహిళ 28 సంవత్సరాలుగా చేస్తున్న నిరాహార దీక్షకు ముగింపు లభించనుంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే 81 సంవత్సరాల మహిళ అయోధ్యలో డిసెంబర్ 6, 1992లో వివాదాస్పద కట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాస దీక్షకు పూనుకున్నారు. అయోధ్యలో రాముడికి మళ్లీ గుడి కట్టిన అనంతరం మాత్రమే ఆహారం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజు ఆమె ఎంతో ఆనందించారు. అమె కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఎంతగా వేడుకున్నా ఆమె తన ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. తాను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించడం తనకు పునర్జన్మ వంటిదని ఆమె అన్నారు. భూమిపూజ అనంతరం అయోధ్యకు వెళ్లి, సరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష విరమిస్తానని ఊర్మిళ స్పష్టంచేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ‘‘శ్రీరాముడు తన భక్తులను ఎప్పటికీ నిరాశ పరచడు. త్రేతాయుగం నాటి శబరి అయినా ఈ యుగం నాటి ఊర్మిళమ్మ (ఊర్మిళ చతుర్వేది) అయినా! అమ్మా, మీ భక్తికి ప్రణమిల్లుతున్నాను. పూర్తి భారతదేశం మీకు వందనాలు అర్పిస్తోంది! జై శ్రీరాం!’’ అని ట్వీట్ చేశారు. -
రామాలయ పూజకు రాజకీయ రంగు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల ఆకాంక్ష అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓవైపు చకచకా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు భూమి పూజపై రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ఆగస్ట్ 5 జరగబోయే రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పూర్వ సంఘ్ నేతలను సైతం కీలక ఘట్టానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ ప్రారంభ కార్యక్రమంపై భిన్న స్వరాలతో పాటు రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లౌకిక రాజ్యమైన భారతదేశంలో ఓ వర్గానికి చెందిన దేవాలయ పూజా కార్యక్రమానికి ప్రధానమంత్రి ఎలా హాజరవుతారంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలతో రాజకీయ వేడిని లేపారు. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక) మరోవైపు ఆలయ శంకుస్థాపక కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడ్డ ఉద్ధవ్ ఠాక్రే పేరు లేదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆల్లైన్ వేదికగా జరపాలన్న ఠాక్రే వ్యాఖ్యలపై మోహన్ భగవత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం పట్ల శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ముంబై వర్గాల సమాచారం. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శివసేన ఎంతో పాటుపడిందని, ఎన్నో కార్యక్రమాలకు ఠాక్రే పిలుపునిచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇదిలావుండగా.. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆలయ నిర్మాణం చేపట్టడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం పలు వ్యాఖ్యలు చేశారు. (ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు) రామాలయ నిర్మాణంతో కరోనా అంతమయిపోతుందన్న భ్రమను కొంతమంది నేతలు కల్పిస్తున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభంలో లేనిపోని హడావిడిని ప్రదర్మిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా ఆగస్ట్ 5 జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటినే ఆహ్వానాలను పంపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతీ, కళ్యాస్ సింగ్, యోగి ఆదిత్యానాథ్, మోహన్ భగవత్లకు ఆహ్వానం పంపింది. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు సైతం హాజరవుతారని సమాచారం. -
నేను ముస్లింనే, కానీ శ్రీరామ భక్తుడిని
అయోధ్య: మహ్మద్ ఫైజ్ ఖాన్.. పేరు రీత్యా ముస్లిం, కానీ అతను శ్రీరామచంద్రుడి భక్తుడు.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం భూమి పూజను కళ్లారా వీక్షించేందుకు వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఇతను రాముడి తల్లి కౌసల్యాదేవి జన్మస్థానంగా చెప్పుకుంటున్న చత్తీస్గఢ్లోని చంద్ఖురి గ్రామవాసి. ఆయనకు హిందూ దేవుళ్లంటే అమితమైన భక్తిగౌరవాలు. ఎంతోమంది దేవుళ్లను స్మరించుకుంటూ పరవశించిపోతాడు. ఎన్నో ఏళ్ల నుంచి కల గంటున్న అయోధ్య రామమందిరానికి పునాదులు పడుతుండటంతో భూమి పూజకు వెళ్లేందుకు కాలినడకన బయలు దేరాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని అనుప్పుర్కు చేరుకున్నాడు. (ఆగస్టులో రామాలయం పనులు) ఈ సందర్భంగా ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. "ఇలా ఆలయాలను సందర్శించడం నాకు తొలిసారేం కాదు. 1500 కి.మీ నడిచి ఎన్నో గుళ్లు, ఆశ్రమాల్లో బస చేశాను. వీటితో పోలిస్తే ఈ ప్రయాణం కేవలం 800 కిలోమీటర్లు మాత్రమే. ఇప్పటివరకు ఏ ఒక్కరూ నాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. నేను ముస్లింనే.. కానీ, మా పూర్వీకులు హిందువులు. పాకిస్తాన్ జాతీయ కవి అల్లామా ఇక్బాల్.. రాముడిని భారత దేశానికే దేవునిగా పేర్కొన్నారు. అందుకే నా భక్తి కొద్దీ కౌశల్యా జన్మస్థలమైన చంద్ఖురి నుంచి అయోధ్యకు మట్టి తీసుకెళ్తున్నాను" అని తెలిపారు. కాగా అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రామమందిర నిర్మాణానికి వచ్చే నెల 5న భూమి పూజ చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరు కానున్నారు. (రామాలయం పునాది, కరోనా అంతానికి నాంది) -
‘రామయ్య తిరిగొచ్చిన ఆ రోజే దీపావళి’
లక్నో: భవ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగే రోజున దీపావళి నిర్వహిస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. భూమి పూజ జరిగే ఆగస్టు 5 ను శ్రీరాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజుగా భావించి ఈ వేడుక నిర్వహిస్తామని ప్రకటించారు. ఆగస్ట్ 4, 5వ తేదీల్లో అయోధ్యలోని అన్ని ఆలయాలు, ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. రామమందిర భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ఆయన అయోధ్యలో పర్యటించారు. భూమిపూజ జరిగే ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో సమావేశమయ్యారు. ఆగస్టు 5 న ప్రధాని మోదీ చేతులమీదుగా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగనున్నది తెలిసిందే. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక) -
ఆయోధ్య ట్రస్ట్లో 15 మంది సభ్యులు
-
రామ మందిరం ఎలా వుండాలంటే...
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు చాలా సంతోషాన్ని కలిగించిందనీ, రాముడు ఉత్తరప్రదేశ్లోని నగరంలోనే జన్మించాడనేది నిరూపితమైందని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. రామమందిరాన్ని నిర్మించడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశంపై స్వరూపానంద స్పందిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అయోధ్యలో అనేక దేవాలయాలున్నాయని సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీం ఆదేశాలపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిపాదిత రామమందిరం డిజైన్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా వెలుగొందుతున్న కంబోడియాలోని "అంగ్కోర్ వాట్ దేవాలయం" అంత ఘనంగా, అంత విశాలంగా ఉండాలని స్వరూపానంద సరస్వతి అభిలషించారు. -
‘బంగారు ఇటుకలతో రామ మందిర నిర్మాణం’
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో నిర్మించబోయే రామమందిర నిర్మాణంలో పూర్తిగా బంగారపు ఇటుకలు వాడాలని హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ‘రామ మందిర నిర్మాణంపై త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు రానుంది. మందిర నిర్మాణానికి అనుకూలంగానే తీర్పు రాబోతుంది. మందిరాన్ని పూర్తిగా బంగారపు ఇటుకలతో నిర్మించాలి’ అని డిమాండ్ చేశారు. కాగా భారత రాజకీయాలను ప్రభావితం చేయగల ‘రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసు తీర్పు నవంబర్లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థల వివాదానికి సంబంధించి కేసులో ఇరు పక్షాల తరఫున వాదనలను అక్టోబర్ 18కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇరుపక్షాలను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు తీర్పు మరో రెండు నెలల్లో వెలువడనుంది. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా ఇరుపక్షాల వారు వివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే అందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. -
బీజేపీకి వీహెచ్పీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ బీజేపీకి షాక్ ఇచ్చింది. రామమందిర నిర్మాణాన్ని మేనిఫెస్టోలో పెడితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని స్పష్టంచేసింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న వీహెచ్పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమకు అన్ని దారులు మూసేసిందని.. రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రామమందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్పీ ధర్మ సన్సద్ను నిర్వహించనున్న నేపథ్యంలో...అలోక్కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా వీహెచ్పీ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. అయోధ్య కేసును సుప్రీంకోర్టులో అడ్డుకుంటోంది కాంగ్రెస్ ఎంపీలేనని గుర్తుచేశారు. రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. -
రాజ్నాథ్ ప్రసంగాన్ని అడ్డుకున్న రామభక్తులు
లక్నో: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు ఉత్తర ప్రదేశ్లో చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లక్నోలో ఆదివారం పర్యటించిన ఆయనకు రామభక్తులు ఊహించని ఝలక్ ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో రాజ్నాథ్ మాట్లాడుతుండగా.. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మించిన వారికే తాము ఓటువేస్తాం. వారినే ఎన్నుకుంటాం’’ అంటూ నినాదాలు చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డుపడి ఒక్కింత ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో రాజ్నాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడున్న పోలీసులు కల్పించుకుని సంయమనం పాటించాలని కోరడంతో వారు వెనుక్కి తగ్గారు. -
ఏనాటి నుంచో ఈనాటి ‘ఈ బంధం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో రాజకీయాలకు, మతానికి మధ్యనున్న తెర క్రమంగా తొలగిపోతోంది. ఇక మనది లౌకిక రాజ్యాంగం అనడానికి వీల్లేకుండా అర్థం మారిపోతోంది. పొరుగునున్న భూటాన్ దేశం మత రాజకీయ వ్యవస్థకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు వేస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భారత్ లౌకికవాద ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వస్తి చెప్పి మత వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలకు మతానికి మధ్య ఆమడ దూరం ఉండాలని భావించి అలా ఉంచేందుకు ప్రయత్నించారు. రాజకీయ నాయకులు స్వాములను, సాధువులను సందర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడంతో మొదలైన రెండింటి మధ్య బంధం, స్వాములనే ఎన్నికల్లో నిలబెట్టి, వారి ఆదేశాలను ఆచరించే స్థాయికి పెనవేసుకుపోయింది. పీఠాలు, పీఠాధిపతుల వద్దకే కాకుండా రాజకీయ నాయకులు కర్ణాటకలోని మఠాలు, పంజాబ్, హర్యానాలోని డేరాలను కూడా సందర్శిస్తుంటే వారే ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలో ప్రజలకు సూచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా మత రాజకీయాలను ఆచరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లినా దేవాలయాలను సందర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివాలయాలు తిరుగుతూ క్షీరాభిషేకాలు చేస్తున్నారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా కేంద్రంలో చంద్రస్వామి నిర్వహించిన పాత్రను మనం మరచిపోలేం. యోగా గురువు రామ్దేవ్, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్లు బీజేపీకి మద్దతుగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర తెల్సిందే. ఆ ఎన్నికల సందర్భంగా వారు సూచించిన అభ్యర్థులకు కూడా బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు మహేశ్ గిరి ఇంతకుముందు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఎన్నికల రాజకీయాల కోసం మతాలను ఉపయోగించుకోవడం ఇటు భారతీయ జనతా పార్టీకి, అటు శిరోమణి అకాలీ దళ్కు కొత్త కాదు. బీజేపీ హిందూ మత పార్టీ అని, అలాంటప్పుడు హిందూత్వ ఎజెండాను దాచుకోవాల్సిన అవసరం లేదని ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గోరక్నాథ్ మఠం పీఠాధిపతి ఆదిత్యనాథ్ యోగి, అటు పీఠాధిపతిగా, ఇటు యూపీ ముఖ్యమంత్రిగా రెండు పదవులు నిర్వహిస్తున్నారు. అందుకేనేమో పాపం! ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి సమయం దొరకడం లేదు. ఉమాభారతి నుంచి మొదలు పెడితే సాధ్వీ నిరంజన్ జ్యోతి, స్వామి ఆదిత్యనాథ్ వరకు, సాక్షి మహరాజ్ నుంచి సత్పల్ మహరాజ్ వరకు బీజేపీలో స్వాములు జాబితా చాంతాడులా పెరిగిపోతోంది. మొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదుగురు హిందూ గురువులను పిలిపించి ఏకంగా మంత్రి హోదాను కల్పించారు. నర్మదా నది ప్రాంతంలో జల వనరులను, అడవులను రక్షించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారితోని ఓ కమిటీని వేశారు. నర్మదా నది వెంట అక్రమ మైనింగ్ను అరికట్టకపోతే తాను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని హెచ్చరించిన నామ్దేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబుకు నలుగురితోపాటు మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాబాలను మంచి చేసుకోవడం మంచిదని మన శివరాజ్ సింగ్ చౌహాన్ భావించారు. ఢిల్లీలో నవంబర్ 4,5 తేదీల్లో అఖిల భారతీయ సంత్ సమితి ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 124 తెగలకు చెందిన మూడువేల మంది సాధువులు హాజరై అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తీర్మానించడంతోపాటు ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. 2019, మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 2019, జనవరి–మార్చి మధ్యన జరుగనున్న మహా కుంభమేళాకు ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి అత్యంత ఆర్భాటంగా నిర్వహించాలని పాలకపక్షం బీజేపీ నిర్ణయించినట్లు తెల్సింది. భూటాన్లో ఒకప్పుడు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో బౌద్ధ మతం ఉండేది, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా బౌద్ధ గురువులు జోక్యం చేసుకునేవారు. 2008లో భూటాన్లో తొలిసారిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి అక్కడ మత గురువులు ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, ఎన్నికల వ్యవహారాల్లోనే జోక్యం చేసుకోవడం లేదు. వారికి ఓటు వేసే హక్కు కూడా లేదు. రాజకీయాలకు మతం అతీతంగా ఉండాలనే దృష్టితో మత గురువులు రాజకీయాలకు గుడ్బై చెప్పారు. ఆ దేశానికి భిన్నంగా మన మత గురువులు రాజకీయాల్లోకి వస్తున్నారు. మున్ముందు పార్లమెంట్లో వీరి సంఖ్య పెరిగితే ‘జై శ్రీరామ్’ నినాదాలతో పార్లమెంట్ హాలు మారుమోగి పోవచ్చు. ఇక అక్కడ ప్రార్థనలు, పూజలు కూడా మొదలు వెడితే ప్రజలు కూడా ఎంచక్కా భక్తి ఛానళ్లను కట్టేసి పార్లమెంట్ ఛానల్ను చూస్తూ పారవశ్యంతో తరించవచ్చు. -
సుప్రీం కోర్టు మాది; బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
లక్నో: రామ మందిరం విషయంలో బీజేపీ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మంత్రి ముకుత్ బిహారీ వర్మ మాట్లాడుతూ..‘ బీజేపీ హామీ ఇచ్చినట్టుగానే అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరుతాం.. ఎందుకంటే సుప్రీం కోర్టు మాది’ అని వ్యాఖ్యానించారు. బహ్రయిచ్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి ప్రణాళికతో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. తప్పకుండా రామ మందిరం నిర్మించి తీరుతాం. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది.. సుప్రీం కోర్టు మాది. న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, దేశం అలాగే రామ మందిరం కూడా మాదే’నని పేర్కొన్నారు. ఈ కామెంట్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వర్మ వెనక్కితగ్గారు. సుప్రీం కోర్టు మాది అంటే దేశ ప్రజలందరిది అనే ఉద్దేశంతో అన్నానని.. మాది అంటే తమ ప్రభుత్వానిది కాదని వివరణ ఇచ్చారు. గతంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మౌర్య మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకొస్తుందని అన్నారు. అన్ని దారుల మూసుకుపోతే తాము ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
‘ఒవైసీ, బాబ్రీ కమిటీతో రాహుల్ కుమ్మక్కు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, ఒవైసీ తదితరులతో... రాహుల్ కుమ్మక్కయ్యారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రాహుల్ పూర్తిగా బాబర్ భక్తుడని, ఖిల్జీ వారసుడని వ్యాఖ్యానించారు. బాబర్ రామాలయాన్ని ధ్వంసం చేస్తే ఖిల్జీ సోమ్నాధ్ దేవాలయాన్ని ఛిద్రం చేశారని, నెహ్రూ వారసులు దేశంపై దండెత్తిన ఇస్లాం పాలకులకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపిస్తున్న కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసులో కోర్టు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే కారణంగా నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జులై 2019 వరకూ వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరిన నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
‘చట్టబద్దంగానే రామ మందిరం నిర్మాణం’
జైపూర్: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చాలా సంవత్సరాల నుంచి చర్చలో ఉంది. తాము అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ చాలాసార్లు చెప్పింది. ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి పార్టీ అభిప్రాయాన్ని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన రాజస్థాన్ వెళ్లారు. జైపూర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరం పరస్పర చర్చల తర్వాత చట్టబద్దంగా నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గత నాలుగు లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో తమ పార్టీ ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలలో బాగా సంపాదించిన కుటుంబాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి మినహాయించాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ విషయంపై పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలనే విషయం అన్ని పార్టీలతో చర్చించి తరువాతనే ఎన్నికల కమిషన్ తో మాట్లాడుతామన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలనే తాము కోరుకుంటున్నామని అమిత్ షా తెలిపారు. బీజేపీకి ఈ విషయంపై నమ్మకం ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్ని రాజకీయ పార్టీలతో ఈ విషయంపై చర్చలు జరుపుతారని ఆయన అన్నారు. అంతేకాక బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అంశాలను ఆయన గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, షెల్ కంపెనీల ముసివేసిన అంశాలను గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో జీఎస్టీ అమలును బీజేపీ వ్యతిరేకించలేదని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. వారు చేసిన డిమాండ్లను మేము అంగీకరించామూ, కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు మాతోనే ఉన్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆందోళన చేశాయి. కానీ దేశంలోని ప్రజలు దీనిని అంగీకరించారని ఆయన తెలిపారు. గో సంరక్షణ పై ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని తీసుకరానుందనే ప్రశ్నకు.. బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాలలో ఇప్పటికే ఇటువంటి చట్టాలు అమలులో ఉన్నాయని అమిత్ షా తెలిపారు. -
హజ్ యాత్ర అడ్డుకుంటాం..
కాన్పూర్: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై రాజకీయ నేతలు తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గతంలో కేంద్రమంత్రి ఉమాభారతి సైతం రామ మందిరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడబోనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే . తాజాగా ఉత్తర ప్రదేశ్, ఛర్కారీ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్భూషణ్ రాజ్పుత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న వందకోట్ల మంది హిందువుల మనోభావాలను గౌరవించాలన్నారు. లేకపోతే వారి అభిప్రాయాలను గౌరవించేది లేదని స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తే వారి హజ్ యాత్రలను అడ్డుకుంటామని సోషల్మీడియా ఫేస్బుక్ లైవ్లో తెలిపారు. ముస్లింల మైనారిటీ హోదాను ఉపసంహరించుకోవాలని, హజ్ యాత్రకు ఇచ్చిన రాయితీని రద్దు చేయాలి అని రాజపుత్ డిమాండ్ చేశారు. ఇది తన అభిప్రాయం కాదని వందకోట్ల హిందువుల అభిమతమని అన్నారు. ఫేస్బుక్లో తాను చేసిన వీడియోకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని రాజ్పుత్ తెలిపారు. -
రామ మందిర నిర్మాణానికి భారీగా రాళ్లు
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి మూడు ట్రక్కుల ద్వారా ఎర్రరాళ్లు చేరాయి. రామ మందిరం నిర్మాణం కోసం రాజస్థాన్కు చెందిన భరత్పూర్ సంస్థ ఈ రాళ్లను పంపించినట్లు రామ జన్మభూమి వీహెచ్పీ ప్రతినిధి ప్రకాశ్ కుమార్ గుప్తా తెలిపారు. రామ్సేవక్ పురమ్ వీహెచ్పీ వర్క్పాష్ సమీపంలోని రామ్ జన్మభూమి న్యాస్ ప్రాంతంలో క్రేన్స్ ద్వారా ఈ రాళ్లను దించారు. కాగా రామమందిర నిర్మాణం కోసం కావాల్సిన రాళ్లను ఇక్కడే చెక్కుతున్నారు. అయితే అప్పటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఇటుకల తరలింపుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అటువంటి ఆంక్షలు విధిస్తుందని తాము అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మందిర నిర్మాణానికి ఇటుకలను సేకరించి పంపాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నిందితుడిగా ఉన్న మహంత్ నృత్య గోపాల్ దాస్...రామ్ జన్మభూమి న్యాస్కు నేతృత్వం వహిస్తున్నారు. -
‘అఖిలేశ్’కు రామమందిర నిర్మాణం ఇష్టం లేదు’
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఆయా ప్రాంతాల నుంచి శిలలను సేకరిస్తోంది. ప్రస్తుతం దేశంలోనూ అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్లోనూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమయాన్ని ఉపయోగించుకుని వీహెచ్పీ రామమందిర నిర్మాణం ప్రారంభించే యోచన చేస్తున్నట్లు సమాచారం. విశ్వహిందూ పరిషత్ అతర్జాతీయ జాయింట్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ ‘వేర్వేరు రాష్ట్రాల నుంచి రామమందిరం కోసం శిలలను తీసుకొచ్చిన సందర్భాలు మీరు చూశారు. అవన్నీ కూడా ఏదో ఒక చోట ఆయా రాష్ట్రాల సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి(ఉత్తరప్రదేశ్లోకి) రావాలి. కానీ, అవి వచ్చినప్పుడు పరిపాలనలో ఉన్న సమాజ్వాది ప్రభుత్వం వాటిని ప్రవేశించనీయకుండా నియంత్రణలు పెట్టింది. ఎందుకంటే అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి రామమందిరం నిర్మించడం ఇష్టం లేదు. అందుకే అప్పుడు రాళ్లను అడ్డుకుంది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ఉండటంతో ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయి మా పని తేలికైంది’ అని చెప్పారు. రామ శిలలు కూడా ఎక్కడి నుంచో తీసుకురావడం లేదని ఒక్క రాజస్థాన్ నుంచే తీసుకొస్తున్నామని, వాటిని తమ వర్క్ షాపుల్లోకి తీసుకొచ్చి సిద్ధం చేస్తామని అన్నారు. -
భద్రాద్రిలో సెల్ఫోన్లతో నో ఎంట్రీ
- 16 నుంచి రామాలయంలో అమలు - బయట కౌంటర్లో అప్పగించాల్సిందే.. భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక నుంచి సెల్ఫోన్లు తీసుకురావటానికి వీల్లేదు. ఈనెల 16 నుంచి రామాలయం ప్రాంగణంలోకి సెల్ఫోన్లను అనుమతించకుండా ఈవో ప్రభాకర శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆలయ భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు. భక్తులు తీసుకొచ్చే సెల్ఫోన్లను ఆలయం బయట భద్రపరిచేందుకు గాను ఇప్పటికే టెండర్లను నిర్వహించి, ఓ కాంట్రాక్టర్కు లైసెన్స్ ఇచ్చారు. దీనికి విపరీతమైన పోటీ ఏర్పడి ఏడాదికి రూ.10.40 లక్షలు పలికింది. ఇక నుంచి కౌంటర్లలోనే సెల్ఫోన్లను పెట్టి భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లాలి. అయితే, దీనిపై భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గర్భగుడిలోకి వెళ్లేవారికి ఈ నిబంధన పెడితే ఓకే కానీ.. ఆలయ ప్రాంగణంలోకి తేవద్దనడం సమంజసం కాదని అంటున్నారు. కాగా, గర్భగుడిలోకి సెల్ఫోన్లను నిషేధించటం మంచిదేనని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. గతంలో కూడా ఇలాగే సెల్ఫోన్లను లోపలకి అనుమతించకుండా బయట కౌంటర్లు ఏర్పాటు చేశారు. కానీ, భక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావటంతో కొద్దికాలానికే ఈ నిబంధనను ఎత్తివేశారు. ఆలయంలో భద్రత చర్యలు పర్యవేక్షించేందుకు ఎస్టీఎఫ్ సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం హోంగార్డుల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. సెల్ఫోన్లను గర్భగుడిలోకి తీసుకెళ్లకుండా లేదా స్విచ్ఛాఫ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. కానీ, ఆలయ అధికారులు వీటిపై దృష్టి సారించకుండా ఏకంగా ఫోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని భక్తులు అంటున్నారు. -
‘అయోధ్య’పై నవాబ్ భారీ ప్రకటన
లక్నో: అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ బకల్ నవాబ్ అన్నారు. రామ జన్మభూమిలో ఆలయం నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తనకు భూ పరిహారం కింద రానున్న రూ. 15 కోట్లకు మందిరం నిర్మాణానికి విరాళంగా ఇస్తానని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ‘శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడు కాబట్టి ఇక్కడే రామమందిరం కట్టాల్సిందేన’ని నవాబ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి ఆయనకు 30 కోట్ల రూపాయల భూ పరిహారం అందుతుందని భావిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు సన్నిహితుడైన బకల్ నవాబ్ మందిర నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
వచ్చే ఏడాదే రామమందిరం: స్వామి
అయోధ్య: వివాదాస్పద అయోధ్య రామమందిర విషయాన్ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ లేవనెత్తారు. వచ్చే ఏడాది రామమందిరం నిర్మాణం ప్రారంభం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణం విషయంలో తమకు అనుకూల తీర్పు వస్తుందని నమ్ముతున్నానని, ఈ ఏడాది నవంబర్నాటికి ఆ తీర్పు విషయంలో స్పష్టత వస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆదివారం విశ్వ సంవాద్ కేంద్రం నిర్వహించిన నరద్ సమ్మాన్ సమరో కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామమందిరంపై ఇలా వ్యాఖ్యానించారు. రామమందిరం, బాబ్రీ మసీదు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్న ఆయన నవంబర్ నాటికి క్లియర్ అవుతుందనుకుంటున్నానని చెప్పారు. 2024నాటికి రామాలయం నిర్మాణం ప్రారంభమవుతుందని గత మార్చిలో స్వామి చెప్పిన విషయం తెలిసిందే. -
‘మందిరం’ కోసం చావడానికైనా రెడీ
ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు లక్నో: రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని, మందిరం కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. ‘రామ మందిరం విశ్వాసానికి సంబంధించిన అంశం. దానిపై నాకెంతో గౌరవం ఉంది. మందిరం కోసం జైలుకెళ్లడానికైనా, ఉరేసుకోడానికైనా సిద్ధం’ అని చెప్పారు. ‘రామ మందిరంపై చర్చించాల్సిందేమీ లేదు. ఈ అంశం మాకేం కొత్త కాదు. రామ మందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు అవైద్యనాథ్ నాయకుడు’ అని వివరించారు. -
‘కోర్టుతోనే రామమందిరం.. మోదీ సునామీ’
పాట్నా: ఆయోధ్యలోని రామమందిర నిర్మాణ అంశం చట్టపరంగా పరిష్కారం కావాల్సిందేనని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ‘కోర్టు తీర్పు ద్వారా మాత్రమే ఆయోధ్య సమస్య పరిష్కారం కావాలి’ అని ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. రామమందిరం, జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని నిబంధన 370వంటి అంశాలను కూడా ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్తోసహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఓట్లకోసం ఆలోచించి మోదీ కూడా ఈ అంశాలను ప్రస్తావించలేదని, దానికి బదులుగా అభివృద్ధి, అవినీతి నిర్మూలనవంటివాటినే ప్రస్తావించారని చెప్పారు. పేద ప్రజల శక్తియుక్తులను మరింత పటిష్టం చేసేందుకు మోదీ నడుంకట్టారని అన్నారు. అభివృద్ధిని సాధించుకుంటూ అవినీతిని అంతమొందిస్తూ మోదీ చూపించిన మార్గంలోనే యోగి ఆదిత్యనాథ్ వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మోదీ సునామీతో ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. -
తెరపైకి రామ మందిరం!
లక్నో: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎంపికతో రామ జన్మభూమిలో మందిర నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పలు వేదికలపై యోగి రామ మందిర నిర్మాణం చేపట్టి తీరతామని బహిరంగంగానే ప్రకటించటం.. యాదృచ్ఛికంగా అదే వ్యక్తి సీఎంకానుండటంతో ‘అయోధ్య’పై హిందువుల్లో ఆశలు పెరిగాయి. 2014 బీజేపీ మేనిఫెస్టోలోనూ రామమందిర అంశం ప్రముఖంగా ఉంది. తాజా ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని చేర్చినా అభివృద్ధి ఎజెండాతోనే బీజేపీ ప్రచారం చేసింది. ప్రముఖులను పక్కనపెట్టి యోగిని హఠాత్తుగా తెరపైకి తీసుకోవటం వెనక కచ్చితమైన కారణం అంతుచిక్కటం లేదు. అయితే కొత్త సీఎంను.. 2019 ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఎంపిక చేయనున్నట్లు పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వారం రోజులు తీవ్ర తర్జన భర్జనలు జరిపిన అనంతరం హిందుత్వ ఐకాన్గా పేరున్న ఆదిత్యనాథ్ను సీఎంగా ఎంపిక చేసింది. ఇదంతా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హిందువుల ఓటును ఆకర్శించేందుకే అయిఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆరెస్సెస్ మూలాలున్న కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలను కాకుండా అసలు ఆరెస్సెస్ వాసనలేమీ లేని ఖట్టర్ హిందూనేత ఆదిత్యను ఎంపిక చేశారనుకుంటున్నారు. ప్రస్తుతానికి మందిర నిర్మాణం అంశం కోర్టు పరిధిలో ఉన్నా.. అడపాదడపా దీన్ని ప్రజలకు గుర్తుచేస్తూ వచ్చిన ఆదిత్య సీఎం అయితే.. మందిర నిర్మాణం తప్పక జరుగుతుందని హిందువులు భావిస్తున్నారు. -
బీజేపీ విక్టరీ: మళ్లీ తెరపైకి రాం మందిరం
ముంబై : ఉత్తరప్రదేశ్ లో భారీ ఆధిక్యంలో విజయం సాధించిన బీజేపీకి శివసేన అభినందనలు తెలిపింది. అభినందనలతో పాటు మళ్లీ రాం మందిరం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయోధ్యలో రాం మందిరం త్వరలో కడతారని ఆశిస్తున్నామని శివసేన పేర్కొంది. ''రాముడిని వనవాసంలో ఉంచే కాలం ముగిసింది. ఇప్పుడిక అయోధ్యలో రాం మందిరం కడతారని మేము ఆశిస్తున్నాం'' అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు తెలిపారు. ఎంతోకాలంగా కలిసిమెలిసి ఉన్న శివసేన, బీజేపీలు ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేశాయి. నువ్వానేనా అంటూ పోటీపడిన ఎన్నికల్లో శివసేన గెలుపొందింది. నేడు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 15 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ యూపీలో తన విజయ భావుటా ఎగురవేసింది. బీజేపీ విక్టరీని తాము స్వాగతిస్తున్నామని, ఈ గెలుపుకు ప్రధానికి కంగ్రాట్స్ చెబుతున్నట్టు సంజయ్ రౌత్ చెప్పారు. ప్రజలు మార్పుకు ఓటు వేశారని, ఈ మేరకే విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమిల ఓటమిపై స్పందించిన సంజయ్ రౌత్, ఎన్నికల్లో ఓడిపోయిన వారు శివసేన ప్రాధాన్యతను, పవర్ ను గుర్తించాలన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఎలాగైతే తాము మహారాష్ట్రను పాలించకుండా ఆపగలిగామో తెలుసుకోవాలన్నారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో యూపీ 324స్థానాలను కైవసం చేసుకుని, భారీ విజయాన్ని దక్కించుకుంది. -
ఎన్నికలు–నోట్ల రద్దు వేరువేరు!
ఐదు రాష్ట్రాల్లో విజయం మాదే! ► రామమందిరం జాతీయ స్వాభిమానాంశం ► అభివృద్ధే ఎజెండా ► సాక్షి ఇంటర్వ్యూ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షి ప్రతినిధి : దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారంలో ఉన్న బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో యూపీతోపాటుగా పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్లలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల్లో నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఎంత? అభివృద్ధి నినాదం పనిచేస్తుందా? లేక రామమందిరం మరోసారి ఊపిరిపోస్తుందా? మణిపూర్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? అనే అంశాలపై మణిపూర్లో పార్టీ బాధ్యతలు చూస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంట ర్వ్యూవిశేషాలు. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిపై... ఈ ఐదు రాష్ట్రాల్లో గెలవటం మాకు చాలా కీలకం. ఐదుచోట్లా గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ ఏకమై బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ప్రజలకు మోదీ పాలనపై అపారమైన విశ్వాసం ఉంది. ప్రజలు అభివృద్ధినే విశ్వసిస్తారు. మా ప్రచారం కూడా అభివృద్ధి ఎజెండాగానే సాగుతోంది. యూపీలో కచ్చితంగా కనీస మెజారిటీని సంపాదిస్తాం. పంజాబ్లో గట్టిపోటీ ఉంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత సహజమే. అయినా మాకే విజయావకాశాలున్నాయి. గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ల్లోనూ గెలుస్తాం. ఓట్లకోసమే ‘రామమందిరం’ మళ్లీ తెరపైకి తెచ్చారన్న విమర్శలపై ఈ ఆరోపణలు అర్థరహితం. 1989 నుంచీ బీజేపీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జాతీయ స్వాభిమానాంశంగా గుర్తించి మేనిఫెస్టోలో పెడుతూ వస్తోంది. దీన్ని మతపరమైన అంశంగా మేమెప్పుడూ గుర్తించలేదు. రామమందిర నిర్మాణం అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించటం సరికాదు. ట్రిపుల్ తలాక్పై..: ట్రిపుల్ తలాక్ అంశం మేం లెవనెత్తింది కాదు. ముస్లిం మహిళలే తమ స్వాభిమానం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాతే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పమని సుప్రీంకోర్టు అడిగినప్పుడే ప్రభుత్వం స్పందించింది. మణిపూర్లో పరిస్థితేంటి? మణిపూర్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. దీనికి కారణం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే. తన పీఠాన్ని కాపాడుకునేందు కు నాగాలు, మైతీల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెడుతూ వచ్చింది. అదే నేటి పరిస్థితి (బంద్లు హింసాత్మకంగా మారాయి)కి కారణమైంది. చాలా సమస్యలు మణిపూర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మేం కూడా ‘చేంజ్, ప్రొగ్రెస్, డెవలప్మెంట్’ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. నోట్లరద్దు... బీజేపీకి వరమా? శాపమా? నోట్లరద్దు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం. అయినా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే విశ్లేషణ చేయాలి. ఒకటి మాత్రం స్పష్టం. దేశంలో 70–80 శాతం ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం. 2019 ఎన్నికలే మోదీ ప్రభుత్వం పనితీరుకు రెఫరెండం. -
రామమందిరంపై వీహెచ్పీ కొత్త ప్రకటన
పాట్నా: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ)నేత ప్రవీణ్ తొగాడియా భారీ ప్రభావం పడే ప్రకటన చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి వీహెచ్పీ ఎలాంటి ఆందోళన కార్యక్రమం ప్రస్తుతం చేయాలని అనుకోవడం లేదని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు వరకు తాము అలాంటి ప్రతిపాదనతో ఏ కార్యక్రమం చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే, రామ మందిరం నిర్మాణం విషయంలో వీహెచ్పీ కట్టుబడి ఉందని అన్నారు. 'అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుంది. ఇది రూఢి అయిన వాస్తవం' అని ఆయన మంగళవారం పాట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అదే సమయంలో బిహార్లో మద్యం నిషేధాన్ని అమలు జరుపుతుండటంపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, రామమందిరం అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తీసుకొస్తే ముస్లిం ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉందని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలోనే తొగాడియా ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేసినట్లుందని పలువురు రాజకీయ మేథావులు అంటున్నారు. -
సుబ్రహ్మణ్య స్వామి కొత్త టార్గెట్స్ ఇవే!
న్యూఢిల్లీ: ట్విట్టర్లో వరుస విమర్శలు చేస్తూ సొంత పార్టీ బీజేపీని ఇరకాటంలో పడేసిన ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా పంథా మార్చారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై నేరుగా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై పరోక్షంగా స్వామి చేసిన ఆరోపణలు బీజేపీలో గగ్గోలు రేపిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఈ ఆరోపణలు తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఒక వారంపాటు ట్విట్టర్కు కొంత దూరంగా ఉంటానని స్వామి తాజాగా ప్రకటించారు. ఈ వారం రోజుల్లో అయోధ్యలో రామాలయం, కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీ ప్రమేయమున్న నేషనల్ హెరాల్డ్, ఎయిర్సెల్-మాక్సిస్ కేసులపై దృష్టి పెడుతానని ఆయన తెలిపారు. అదేసమయంలో భారత జీడీపీ మీద ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాలను ఒకింత విస్మయపరిచింది. భారత జీడీపీ గణన, ఆర్బీఐ వడ్డీ రేట్లపై సామ్యూల్సన్-స్వామి థీయరీ వర్తింపజేసి విశ్లేషిస్తే.. అది పార్టీ వ్యతిరేక చర్య అంటూ మీడియా గగ్గోలు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. రామాలయం కేసు, నేషనల్ హెరాల్డ్, ఎయిర్సెల్ మాక్సిస్ , సీఎస్కే తదితర కేసులపై దృష్టి పెడుతున్నందున ట్విట్టర్లో పెద్దగా కనిపించకపోవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు. -
రామ మందిరాన్ని కూల్చింది.. ఔరంగజేబు!!
‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకంలో మాజీ ఐఏఎస్ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అయోధ్యలో ‘రామ మందిరం’ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. మందిరాన్ని కూల్చివేసింది బాబర్ హయాంలో కాదని, ఔరంగజేబు హయాంలో నేలమట్టం చేశారని ఓ మాజీ ఐపీఎస్ అధికారి తన పుస్తకంలో పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి పాత ఫైళ్లు, కొన్ని పురాతన సంస్కృత గ్రంథాలు, పురావస్తు తవ్వకాలకు సంబంధించిన సమీక్షలను ఉటంకిస్తూ.. ‘అయోధ్య రీవిజిటెడ్’ అనే పుస్తకంలో 1972 బ్యాచ్, గుజరాత్ కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ కునాల్ ఈ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ‘1528 సంవత్సరంలో బాబర్ హయాంలో రామమందిరాన్ని కూల్చివేయలేదు. 1660లో ఔరంగజేబు హయాంలో, ఆయనకు ఫిడాయ్ ఖాన్ గవర్నర్గా ఉండగా కూల్చివేత జరిగింది. రామ మందిరాన్ని కూల్చివేయాలని బాబర్ ఆదేశించారనడంలో నిజం లేదు. మందిరాన్ని బాబర్ చూడనేలేదు. 1528లో బాబ్రీ మసీదు నిర్మించారన్న చరిత్రకారుల వాదన కూడా కల్పితమే’ అని పేర్కొన్నారు. ‘అయోధ్య చరిత్రకు సంబంధించిన కొత్త కోణాన్ని రచయిత తెలియజేశారు. సాధారణ విశ్వాసాలకు, పలువురు చరిత్రకారుల అభిప్రాయాలకు విరుద్ధమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు’ అని పుస్తకానికి ముందుమాట రాసిన మాజీ సీజేఐ జస్టిస్ జీబీ పట్నాయక్ పేర్కొన్నారు. -
'రామమందిర నిర్మాణం ఎప్పుడో చెప్పండి'
ముంబై: ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ఒక తేదీని ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ను శివసేన కోరింది. రామ మందిరాన్ని తాను బతికుంగానే నిర్మిస్తామని మోహన్ భగవత్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నాలో శనివారం ఈ అంశంపై సంపాదకీయం రాసింది. 'మోహన్ భగవత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. అయితే నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ఒక తేదీని ప్రకటించాలి. ఒక సారి నిర్మించిన తరువాత దాన్ని మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఉండదు' అని పేర్కొంది. 'ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రామాలయాన్ని నిర్మించే దైర్యం ఉంది. ఈ విషయంలో బాధ్యత తీసుకున్నప్పుడే ఆయన ప్రతిష్ట మరింత పెరుగుతుంది' అని శివసేన పేర్కొది. ఒకవేళ ఇప్పుడు నిర్మించకపోతే ఇంకెప్పుడూ ఆలయాన్ని నిర్మించలేరని, ఈ అంశానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని, దీనిని సాగదీయటం సబబు కాదని శివసేన అభిప్రాయపడింది. -
మిత్రుడి ప్రాణాలు రక్షించబోయి.. మృత్యు కౌగిలికి
తాడేపల్లిగూడెం : పాఠశాలకు సెలవు దినం కావడంతో సరదాగా మిత్రులతో కలిసి కాలువలోకి స్నానానికి వెళ్లి, ప్రమాదవశాత్తు మునిగిపోతున్న మిత్రుని రక్షించే క్రమంలో అదే కాలువలో మునిగి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మంగళవారం తాడేపల్లిగూడెంలో జరిగింది. స్థానిక శివాలయం వీధిలో రామాలయం రేవు వద్ద నివాసం ఉంటున్న వర్మ తన ముగ్గురు మిత్రులతో కలిసి చిన్న బలుసులమ్మ ఆలయం వద్ద ఉన్న కాలువలో ఈత కొట్డడానికి దిగాడు. సరదాగా ఈత కొడుతుండగా ముగ్గురు మిత్రులలో ఒకరికి ఈత రాకపోవడంతో కాలువలో మునిగిపోతూ రక్షించమంటూ చేతులు పెకైత్తి కేకలు వేశాడు. మిత్రుడిని రక్షించేందుకు ఈత వచ్చిన వర్మ వెళ్లాడు. మిత్రుడిని రక్షించి గట్టు పైకి తీసుకువచ్చే క్రమంలో వర్మ మునిగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వర్మ కాపాడిన మిత్రుడు, మిగిలిన ఇద్దరూ సంఘటనా స్థలం నుంచి ఉడాయించారు. కాలువలో వర్మ మునిగిపోయిన విషయం బయటకు రావడంతో అదే ప్రాంతానికి చెందిన 20 మంది యువకులు జట్టుగా శివాలయం దగ్గర నుంచి జువ్వలపాలెం కాలిబాట వంతెన వరకు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళాధికారి వి.సుబ్బారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్మ మునిగిపోయిన ప్రాంతంగా చెబుతున్న ఏరియాలో సిబ్బంది వై.ఉమామహేశ్వరరావు, వి.భాస్కరరాజు ద్వారా యువకుల సాయంతో గాలించారు. అదే ప్రాంతంలో వర్మ దొరికాడు. అతనికి ప్రాణం ఉందని భావించిన యువకులు వర్మ సపర్యలు చేశారు. కొన వూపిరితో వర్మ ఉన్నట్టు భావించి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వర్మ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సుమారు మూడు గంటలకు పైగా వర్మ కాలువలో ఉండిపోయి ఊపిరి అందక మరణించి ఉంటాడని చెబుతున్నారు. యువకులు మూడు గంటలకు గాలింపు చేపట్టి వర్మను రక్షించామని అనుకున్నారు. వర్మ తల్లితండ్రులు తమ బిడ్డకు జీవం ఉందనుకున్నారు. తీరా ఆసుపత్రికి వెళ్లాక వైద్యులు చెప్పిన విషయం విని వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చిన్నోడా వెళ్లిపోయావా.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే పాలెపు నర్సింహమూర్తి, ధనావతి దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు ధనుంజయవర్మ (15) పట్టణంలోని ఒక ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ప్రత్యేక హోదా కోసం బంద్ పాటించడంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ క్రమంలో మిత్రులతో కలిసి కాలువకు స్నానానికి వెళ్లాడు. మిత్రుడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నోడా వెళ్లిపోయావా అంటూ అతని తల్లి ఆక్రందనలు చూపరులను కలిచివేశాయి. ఇదే కుటుంబంలో వర్మ సోదరునికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాడు. ఇటీవలే అతను కోలుకున్నాడు. బిడ్డ బాగున్నాడని ఆ కుటుంబం సంతోషించే లోగా మరో బిడ్డ మృత్యువాతపడటం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. 13 వ వార్డు కౌన్సిలర్ దొడ్డిగర్ల కృష్ణ బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు . -
రామ మందిరం కోసం శిలాసేకరణ: వీహెచ్పీ
అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మా ణం కోసం దేశవ్యాప్తంగా శిలాసేకరణ ప్రారంభిస్తామని మంగళవారం విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. మందిర నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ సృష్టించొద్దని ముస్లింలకు విజ్ఞప్తి చేసింది. రామ మందిర నిర్మాణానికి మొత్తం 2.25 లక్షల నలుచదరపు శిలలు అవసరమవుతాయని, వాటిలో 1.25 లక్షల శిలలు ప్రస్తుతం వీహెచ్పీ ప్రధాన కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని, మిగతా లక్ష శిలలను సంవత్సరం లోగా హిందూ భక్తుల నుంచి సేకరిస్తామని వీహెచ్పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్ తెలిపారు. అయోధ్యలో రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ కార్యనిర్వాహక సభ్యుల భేటీ అనంతరం సింఘాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలు శాంతియుతంగా జీవించాలంటే అయోధ్య, మథుర, కాశి పుణ్యక్షేత్రాలపై వారు తమ వాదనలను వదులుకోవాలన్నారు. -
'అజెండాలో ఉన్నాయి.. కానీ పాలన ఫస్ట్'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే నిబంధన 370 రద్దు అంశాలు తమ అజెండాలోనే ఉన్నాయని, అయితే, ప్రస్తుతం తమ దృష్టంతా పరిపాలన మీదే ఉందని బీజేపీ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. దేశానికి అత్యుత్తమ పాలన అందిస్తూ అభివృద్ధి పథంలో పయనించేలా చేయడమే ప్రస్తుతం మోదీ సర్కార్ లక్ష్యం అని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రామమందిరం, 370 నిబంధన అంశాలను ఇప్పటికే తాను రాజ్యసభలో ప్రస్తావించానని గుర్తుచేశారు. దీనిపై ఇప్పటికే నిర్ణయం జరిగిందని, ఇక వెనుకకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అయితే, అంతకుముందు ఈ అంశాలను పలు రాజకీయ పార్టీలతో చర్చించాల్సిన అవసరం ఉందని, చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. -
ఈ ఏడాదే రామమందిర నిర్మాణం
ఉనావ్(యూపీ): అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీ పాలనలోనే పూర్తిచేస్తామని వివాదాస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ స్పష్టం చేశారు. మందిర నిర్మాణం ఈ రోజు కాకపోతే మరో రోజు పూర్తి చేస్తామన్నారు. తాము ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటామని, ఈ ఏడాదిలో రామమందిర నిర్మాణం చేపడతామని శనివారమిక్కడ అన్నారు.దేశాభివృద్ధితో పాటు కాషాయదళ ప్రధాన ఎజెండా అయినా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడానికే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విశ్వ హిందూ పరిషత్ నేత సురేంద్రజైన్ అన్నారు. కాగా, మహరాజ్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ వివరణివ్వాలని కాంగ్రెస్ నేత పీసీ చాకో డిమాండ్ చేశారు. బీజేపీ పనిచేస్తోంది దేశాభివృద్ధికా? లేక ఆరెస్సెస్ ఎజెండాలకు న్యాయం చేయడానికా? అని ప్రశ్నించారు. -
ములాయం రామమందిరం కడతారా?
ఉన్నవ్(యూపీ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలోనే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని వివాదస్పద ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్ల సమయం ఉన్నందున ఎప్పుడైనా మందిర నిర్మాణం జరగొచ్చని చెప్పారు. 'రామమందిరం నిర్మాణం బీజేపీ హయంలో జరగకపోతే కాంగ్రెస్ పాలనలో మందిర నిర్మాణం సాకారమవుతుందా? ములాయం లేదా మాయావతి కడతారా? బీజేపీ పాలనలోనే రామమందిరం నిర్మిస్తాం. ఈరోజు కాకపోతే రేపు. రేపు కాకపోతే తర్వాత రోజు. మా ప్రభుత్వానికి ఏడాది మాత్రమే పూర్తయింది. ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటాం' అని సాక్షి మహరాజ్ అన్నారు. మోదీ ప్రభుత్వం అభివృద్ధి అజెండాతోనే అధికారంలోకి రాలేదని కాషాయ అజెండాతో 'పవర్'లోకి వచ్చిందని వెల్లడించారు. -
'రామమందిరం కట్టకపోతే మోదీ సర్కారు గతి అంతే'
అయోధ్యలో రామమందిరం నిర్మించని పక్షంలో నరేంద్రమోదీ సర్కారుకు కూడా గతంలోఅటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని వీహెచ్పీ హెచ్చరించింది. గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసింది కేవలం అభివృద్ధిని చూసి మాత్రమే కాదని, వాళ్ల ప్రధాన ఆకాంక్షలను కూడా నెరవేరుస్తారని భావించారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి, జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, తమ ఆశలు మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రధాన ఆకాంక్షలు నెరవేర్చాలంటే లోక్సభలో బీజేపీకి 370 సీట్లు కావాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాము అభివృద్ధిపైనే దృష్టి పెట్టాము తప్ప.. ఇతర అంశాలపై కాదని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంతకుముందు అన్నారు. రామమందిర నిర్మాణం కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న విషయాన్ని సురేంద్ర జైన్ గుర్తుచేశారు. ఈ అంశంపై వాళ్లు ఎలా వెనక్కి వెళ్తారని ఆయన ప్రశ్నించారు. గత ఎన్డీయే ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించలేదు కాబట్టే ఓటర్లు వాళ్లను తిప్పి పంపేశారని చెప్పారు. బీజేపీ నాయకులు తమ గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఆధ్యాత్మిక పెద్దలతో కూడిన కమిటీ ఒకటి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, రామమందిర నిర్మాణం గురించి ఆయనకు విజ్ఞప్తి చేయాలని సురేంద్ర జైన్ కోరారు. ఆయోధ్యలో మందిరం గురించి కూడా నరేంద్రమోదీ తన 'మన్ కీ బాత్'లో చెప్పాలని బీజేపీ మిత్రపక్షం శివసేన ఇటీవల డిమాండు చేసిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదు - రామజన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. -
'దివ్యమైన రూపంతో రామమందిరం నిర్మిస్తాం'
ఉన్నవ్(యూపీ): బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వివాదస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామాలయం నిర్మాణం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 2019 లోక్ సభ ఎన్నికల ముందు నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. దివ్యమైన రూపంతో మందిరాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. గతంలో అయోధ్యలో రామమందిరం ఉండేదని, భవిష్యత్తులోనూ అది ఉంటుందని అన్నారు. రామమందిరం నిర్మాణం అనేది బీజేపీకి సంబంధించిన విషయం కాదని, సాధువులుగా ఆ బాధ్యత తమపై ఉందని విలేకరులతో చెప్పారు. గతంలో మందిర ఉద్యమానికి మద్దతు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని, బీజేపీ మాత్రమే తమకు దన్నుగా నిలిచిందని తెలిపారు. -
'ఎన్డీయే హయాంలోనే రామమందిర నిర్మాణం'
జలంధర్: ఎన్డీఏ ప్రభుత్వ కాలపరిమితి ముగియక ముందే అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తవుతుందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ శుక్రవారం అన్నారు. బీజేపీ దళిత మోర్చ జాతీయ కార్యవర్గ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే రామమందిర నిర్మాణపనులు అయోధ్యలో ప్రారంభమవుతాయన్నారు. ఈనెల 25 నుంచి రెండురోజులు పాటూ వీహెచ్పీ మార్గదర్శక్ మండల సమావేశాలు హరిద్వార్లో జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే రామమందిర నిర్మాణం పై తుదినిర్ణయం తీసుకుంటామని సాధ్వి ప్రాచీ చెప్పారు. -
'అయోధ్యలో రామ మందిరాన్ని మేమే నిర్మిస్తాం'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని ద్వారక పీఠాధిపతి, అధ్యాత్మిక మతగురువు సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య తెగేసి చెప్పారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తే రాజకీయ మద్దతు లేకున్నా రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ఇకనైనా రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడం ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మ సంసద్ ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో మెజారిటీ లేకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టం తీసుకు రావడం సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. మొఘల్ రాజు బాబర్ పేరుతో రాజకీయం చేయాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని శంకరాచార్య స్వరూపానంద మండిపడ్డారు. అయోధ్య హిందువుల పవిత్ర స్థలం అనే వాస్తవాన్ని ఆయన గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపైనా, ఎన్డీయే సర్కారుపైనా శంకరాచార్య విరుచుకుపడ్డారు. 'మీకు చేతులెత్తి నమస్కరిస్తా.. దయచేసి రామ జన్మభూమి గురించి మాట్లాడకండి. మేం అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తాం. దేవుడి దయ వల్ల రాజకీయ నాయకులు డబ్బులు మాకు అవసరం లేదు. దయచేసి ఈ చర్చను ఆపండి.. ప్రజలు, సాధువులు సహాయ సహకారాలతో మేము రామ మందిరాన్ని నిర్మిస్తాం' అన్నారు. నాయకుల్లో ఆధ్మాత్మిక పరిజ్ఞానం కొరవడిందని ఆగ్రహం ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ జపాన్ రాజుకు భగవద్గీతను బహుమతి ఇవ్వడానికి బదులుగా భారతదేశంలో పిల్లలకు గీతను ప్రబోధించే ఏర్పాటు చేసి ఉంటే తాను ఇంకా సంతోషించేవాడినని వ్యాఖ్యానించారు. -
'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'
మాథూరా: అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. 2016లో రామమందిరం నిర్మాణం ప్రారంభించకపోతే కోర్టుకెక్కడం సహా ఇతర మార్గాలు ఎంచుకుంటామని ఆయన చెప్పారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంగ్లేయులు రూపొందించిన సిలబస్ నే ఇప్పటికీ విద్యాలయాల్లో బోధిస్తున్నారని, దీన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతమున్న హిందూ జనాభాను రాజకీయ పార్టీలు చీల్చాయని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. -
మరికొంత సమయం వేచి చూస్తాం: భయ్యాజీ జోషీ
లక్నో: అయోధ్య రామమందిరం నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారన్న విశ్వాసాన్ని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషీ వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రామమందిరం నిర్మాణ అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. మరి కొంత సమయం వేచి చూస్తామని భయ్యాజీ జోషీ చెప్పారు. ** -
అయోధ్యలో రామాలయం కట్టాల్సిందే: వీహెచ్పీ
అయోధ్యలో రామాలయాన్ని వీలైనంత త్వరగా కట్టి తీరాల్సిందేనని వీహెచ్పీ నాయకుడు అశోక్ సింఘాల్ మరోసారి అన్నారు. బీజేపీ మాజీ ఎంపీ, 'శిలాన్యాసం' మూలపురుషుడు అయిన మహంత్ అవైద్యనాథ్ స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే.. అదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. గోరఖ్నాథ్ ఆలయం మాజీ ప్రధాన పూజారి కూడా అయిన మహంత్ అవైద్యనాథ్ స్మారకార్థం ఓ శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. మహంత్జీ ఆశయాల మేరకు ఆలయాన్ని వీలైనంత త్వరగా కట్టాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ సింఘాల్ అన్నారు. దీనిపై విలేకరులు అమిత్ షాను ప్రశ్నించగా, ఆయన మాత్రం నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అవైద్యనాథ్ గొప్ప సంఘ సంస్కర్త అని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. -
బీజేపీ మెనిఫెస్టోలో రామాలయం, 370 ఆర్టికల్!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణం, జమ్మూ,కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న 370 ఆర్టికల్ లాంటి అంశాలను బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. ఆర్ధికాభివృద్ది, అభివృధ్ది అంశాలకు మెనిఫెస్టోలో పెద్ద పీట వేశారు. రామాలయం, 370 ఆర్టికల్ గురించి మెనిఫెస్టో చివరిపేజిలో రెండు లైన్లు రాశారు. రాజ్యాంగ పరిధిలో రామాలయ నిర్మాణానికి ఓ ఫ్రేమ్ వర్క్ రూపొందించడానికి సాధ్యసాధ్యాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. హిందుత్వ అంశం ఎన్నికల ఎజెండా కాదని, హిందుత్వ అంశాన్ని ఎన్నికల్లో వాడుకోబోమని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అన్నారు. హిందుత్వ అంశం కేవలం సాంస్కృతికపరమైన అంశమే అని అన్నారు. కాశ్మీర్ లోయకు కాశ్మీరి పండితులను వెనక్కి పంపడానికి చర్యలు తీసుకుంటామని జోషి తెలిపారు.