
శ్రీనగర్: కశ్మీర్లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖకు దగ్గర్లో అనేకమంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది కూడా ఆ ఉగ్రవాదులకు సహకరించడానికేనని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రణ రేఖకు ఆవల భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారమొచ్చింది’ అని శ్రీనగర్లోని లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ చెప్పారు. ఉగ్రవాదులు గుంపులు గుంపులుగా ఒక్కో చోట 30 నుంచి 40 మంది ఉన్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment