Army officer
-
కన్న తల్లికి జవాన్ సర్ ప్రైజ్
-
10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే
శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు. ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె -
ఆర్మీ అధికారి కాబోయే భార్యపై పోలీసుల వేధింపులు
భువనేశ్వర్: భారత ఆర్మీకి చెందిన అధికారికి కాబోయే భార్యపై పోలీసుల దాడి ఘటన ఒడిషాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అలాగే, జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి బాధితురాలు తన రెస్టారెంట్ను మూసివేసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో కొంత మంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆమెను వేధింపులకు గురిచేశారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. అనంతరం, ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆమె భరత్పూర్ పోలీసు స్టేషన్ వెళ్లారు. ఈ సందర్బంగా పీఎస్ కేవలం ఒక్క మహిళా కానిస్టేబుల్ మాత్రమే సివిల్ డ్రెస్లో ఉన్నారు. జరిగిన విషయం చెప్పి కేసు నమోదు చేయాలని కోరగా అందుకు కానిస్టేబుల్ నిరాకరించింది. కాసేపటి తర్వాత కొందరు పోలీసులు స్టేషన్కు వచ్చారు.Army officer’s fiance alleges sexual assault in #Odisha. The woman spoke about the #attack on her and her fiance, an army officer, on Thursday after being discharged from #AIIMS #Bhubaneswar pic.twitter.com/xfQ7HmIz65— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) September 20, 2024ఈ సందర్భంగా తనపై దాడికి సంబంధించిన ఘటనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు మహిళా పోలీసులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను లాకప్లో వేసి దారుణంగా హింసించారు. ఇన్స్స్పెక్టర్ ర్యాంక్ ఉన్న పోలీసు, మరో నలుగురు ఆమె వద్దకు వెళ్లి బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దారుణంగా సైగలు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల దెబ్బల కారణంగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తర్వాత ఆమె ఎయిమ్స్ చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో తనతో పోలీసులు ప్రవర్తించిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు.ఇక, ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళా పోలీసులతో పాటు, మరో ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆమెకు కాబోయే భర్త కోల్కతాలోని 22 సిక్కు రెజిమెంట్లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు.ఇది కూడా చదవండి: కోల్కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు -
Alma Cooper: మిస్ యూనివర్స్ బరిలో.. యువ ఆర్మీ ఆఫీసర్!
‘మిస్ మిచిగాన్’గా సుపరిచితురాలైన అల్మా కూపర్ ‘మిస్ యూఎస్ఏ 2024’ కిరీటాన్ని గెలుచుకుంది. నవంబర్లో జరగనున్న ‘2024 మిస్ యూనివర్స్’పోటీ కోసం సన్నద్ధమవుతోంది. ‘యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ’లో గ్రాడ్యుయేట్ అయిన కూపర్ ‘మిస్ మిచిగాన్ యూఎస్’ కిరీటం దక్కించుకున్న తొలి యాక్టివ్ డ్యూటీ ఆర్మీ ఆఫీసర్.వలస కార్మికురాలి కుమార్తె అయిన అల్మా కూపర్ కష్టపడుతూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్మీ ఆఫీసర్ అయింది. అందాలపోటీలపై ఆసక్తి ఉన్న కూపర్కు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ‘ఆహార అభద్రత సమస్యను పరిష్కరించడానికి, ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టే కార్యక్రమాలలో క్రియాశీలంగా ΄ాల్గొంటాను’ అని చెబుతుంది 22 ఏళ్ల అల్మా కూపర్. -
సియాచిన్ పైకి మహిళా సేనాని!
‘‘సియాచిన్ మాది’’ అంటోంది పాకిస్థాన్. ‘‘కాదు, మాది’’ అంటోంది భారత్. ప్రపంచంలోనే అతి ఎత్తైయిన ఈ యుద్ధక్రేత్రంలో రెండు దేశాల సైన్యాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతూనే ఉన్నాయి. భారత్ నలభై ఏళ్ల క్రితమే ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో సైనిక చర్య జరిపి సియాచిన్పై నియంత్రణ సాధించినా..పాక్ తన పట్టు వీడటం లేదు. ఈ పరిస్థితిని ‘‘చక్కబరచటానికి’’ భారత సైన్యం ఇటీవలే సియాచిన్ డ్యూటీకి ప్రత్యేకంగా ఒక ఆర్మీ ఆఫీసర్నుపంపింది. ఆ ఆఫీసరే.. సుప్రీత. కెప్టెన్ సుప్రీత. సియాచిన్పైకి వెళ్లిన తొలి మహిళా సేనాని!భారత సైన్యంలో 40 విభాగాలు ఉంటాయి. 14 ప్రధాన ఉప–విభాగాలు ఉంటాయి. ఈ ఉప విభాగాలను ‘కోర్స్’ అంటారు. వాటిల్లో ఒకటి ‘కోర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’. అందులో సైనికాధికారిగా విధులు నిర్వర్తిస్తుంటారు కెప్టెన్ సుప్రీత. సముద్ర మట్టానికి 18,875 అడుగుల ఎత్తున, హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంటుంది సియాచిన్ గ్లేసియర్. నది గడ్డ కట్టినట్లుగా ఉండే ఆ ్ర΄ాంతంలో కెప్టెన్ సుప్రీతకు డ్యూటీ పడింది! ఈ నెల 18నే.. వెళ్లి చేరారు. సియాచిన్ గ్లేసియర్లో విధులు నిర్వర్తిస్తున్న తొలి ఉమన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్గా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో.. ఒక అరుదైన విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కొత్తగా పెళ్లయిన ఒక యువ జంటలో – భర్త ఒక సైనిక దళానికి, భార్య మరొక దళానికి నేతృత్వం వహించారు! భర్తది తమిళనాడు. భార్యది కర్ణాటక. అనుకోకుండా ఇద్దరికీ ఢిల్లీ వేడుకల్లో దళాలను పరేడ్ చేయించే అవకాశం వచ్చింది. ఆ భర్త.. మేజర్ జెర్రీ బ్లైజ్. ఆ భార్య.. కెప్టెన్ సుప్రీత. అసలు మహిళలు ఆర్మీలోకి రావటమే గొప్ప సంగతైతే, సుప్రీత అక్కడి నుంచి సియాచిన్ వరకు ‘ఎదగటం’ చెప్పుకోదగ్గ విశేషం. భారత సైన్యంలో ఆమె కెరీర్ 2021లో లెఫ్ట్నెంట్గా మొదలైంది. చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒ.టి.ఎ.)లో ఆమె శిక్షణ ΄పోందారు. కాలేజ్లో ఎస్సీసీతో మొదలైన ఆమె దేశ రక్షణ దళ ప్రయాణం.. ముందు వరుస యుద్ధక్షేత్రం వరకు దృఢచిత్తంతో ముందుకు సాగింది.సుప్రీత మైసూర్ అమ్మాయి. అక్కడి కృష్ణరాజనగరంలోని సెయిట్ జోసెఫ్ స్కూల్లో చదివారు. మైసూరులోనే మరిమల్లప్ప ప్రీ–యూనివర్శిటీ కాలేజ్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవటానికి ముందు, జె.ఎస్.ఎస్. లా కాలేజ్లో డిగ్రీ చేశారు. ఆమె తండ్రి తిరుమల్లేశ్ మైసూరు దగ్గరి తలాకాడులోపోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. తల్లి నిర్మల గృహిణి. ఆర్మీపై తనకున్న ఇష్టాన్ని గౌరవించిన తన తల్లిదండ్రుల ్ర΄ోత్సాహంతో సుప్రీత ఎన్సీసీలో ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికెట్ సాధించారు. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ (రాజ్పథ్)లో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కర్ణాటక–గోవా నడిపించారు. 2016లో ఆలిండియా వాయు సైనిక్ క్యాంప్లో కర్ణాటకకు ్ర΄ాతినిధ్యం వహించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్నెంట్ అయ్యాక సియాచిన్ను అధిరోహించటానికి మళ్లీ ఓ.టి.ఎ.లో చేరారు. శిక్షణలో భాగంగా ఆమెను వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన అనంత్నాగ్, జబల్పూర్, లేహ్ ్ర΄ాంతాలకు పంపించారు. ఆ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు సుప్రీత. సుప్రీత, బ్లేజ్ల వివాహం గత ఏడాదే జరిగింది. సుప్రీత మామ గారు రిటైర్డ్ కల్నల్ రిచర్డ్ బ్లెయిజ్. సుప్రీత అత్తగారు లెఫ్ట్నెంట్ కల్నల్ విజయలక్ష్మి. పుట్టినింటి, మెట్టినింటి రెండూ ్ర΄ోత్సాహాలు సుప్రీత కెరీర్కు కలిసి వచ్చాయనే అనుకోవాలి. అంతకంటే కూడా ఆమె దీక్ష, పట్టుదల. -
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పెన్షన్, పీఎఫ్పై వివాదం.. స్పందించిన ఆర్మీ
అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సియాచిన్ గ్లేసియర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్కు చెందిన అన్షుమాన్ సింగ్కు.. మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రకటించింది.జూలై 5న ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. కాగా అయితే పెళ్లైన అయిదు నెలలకే అన్షుమాన్ మరణించడం, వారి ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి. ఈ వీడియోను రక్షణశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసిందిఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.కాగా వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఏజీఐఎఫ్), ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) , ఇతర స్థిరాస్తుల నుంచి బీమా పొందడం కోసం తమ తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అయితే వీటన్నింటికీ ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. కానీ పెన్షన్ కోసం ఒకే నామినీ ఉంటారు. జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని NOKకేగా పేర్కొంటారు. ‘నా కొడుక్కి వచ్చిన అవార్డును కోడలు తీసుకెళ్లింది. ఆమె మాతో ఉండటం లేదు. మేము కొడుకునే కాదు, అవార్డును కూడా కోల్పోయాం. కోడలు మాతో జీవించాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొడుక్కి వచ్చిన అవార్డుపై మాకూ అధికారం లేదా?‘ అని వాపోయారు. అయితే అత్తమామల ఆరోపణలపై సింగ్ భార్య స్మృతి సింగ్ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.అయితే కోడలు స్మృతి సింగ్పై దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా వచ్చి రూ.1 కోటి eర్థిక సాయం.. సింగ్ భార్య, తల్లిదండ్రులకు 50-50 శాతం విభజించనున్నట్లు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పీఎఫ్, పెన్షన్ మాత్రం భార్యకే చెందుతుందని తెలిపాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రూ. 50 లక్షల సహాయంలో రూ. 35 లక్షలు అతని భార్యకు, రూ. 15 లక్షలు అతని తల్లిదండ్రులకు అందించనున్నట్లు పేర్కొన్నాయి.Amid allegations made by the parents of late Captain Anshuman Singh against their daughter-in-law Smriti Singh, Army sources clarified that the AGIF of ₹1 crore was split between his wife and parents while the pension goes directly to the spouse. @dperi84 reports.… pic.twitter.com/UCJocN2TBA— The Hindu (@the_hindu) July 14, 2024 వీలునామాలో సింగ్ భార్య నామినేట్ అయినందునా ఆమెకు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అంతేగాక కెప్టెన్ సింగ్ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కావడంతో ఆయనకు స్వయంగా పెన్షన్ పొందున్నారు. మాజీ అధికారిగా ఇతర ప్రయోజనాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఆర్మీ పాలసీ ప్రకారం ఒక అధికారి వివాహం చేసుకున్న తర్వాత, అతని భార్య పెన్షన్ కోసం నామినీ అవుతుందని ఆర్మీ వర్గాలు వివరించాయి.అయితే సింగ్ తల్లిదండ్రుల ఆరోపణలపై పలువురు అధికారులు స్పందించారు. నామినీ అనేది ఖచ్చితంగా అధికారి ఎంపిక అని. అందులో జీవిత భాగస్వామి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు పూర్తిగా కుమారుడిపై ఆధారపడిన సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలను ఆర్మీ యూనిట్ పరిష్కరిస్తుందని తెలిపారు. -
కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్పై కేసు
న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్సింగ్ సతీమణి స్మృతిసింగ్పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. స్మృతిసింగ్పై సోషల్మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. -
ఆర్మీ ఆఫీసర్ ఏకబిగిన 25 పుల్-అప్లు : నెటిజన్లు ఫిదా
మంచి రోగ నిరోధక శక్తి, శారీరక దృఢత్వం కావాలంటే నిరంతర వ్యాయాయం చాలా కీలకం. దీనికి వయసుతో సంబంధంలేదు. అందులోనూ సైన్యంలో పనిచేసేవాళ్లకి ఫిట్నెస్ చాలా అవసరం. భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ప్రసన్న జోషి ఇదే నిరూపించారు. ఈయన్ ఫిట్నెస్కు ముగ్ధుడైన మాజీ సైనికాధికారి ఎక్స్లో షేర్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్గా మారింది.మేజర్ జనరల్ ప్రసన్న జోషి 56 ఏళ్ల వయసులో ఏకబిగిన 25 పుల్-అప్లు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ జేఎస్ సోధి షేర్ చేశారు. ‘ఆయన ఫిట్నెస్కి సెల్యూట్..2022, అక్టోబరులో భారత సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట శక్తిగా జర్మన్ ప్రచురణ స్టాటిస్టా పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు. భారత సైన్యానికి గర్వకారణం... జై హింద్’ అనే క్యాప్షన్తో ఈ వీడియో పోస్ట్ చేశారు. దీంతో యువ ఆర్మీ అధికారులు, నెటిజన్లు జోషి ఫిట్నెస్పై ప్రశంసలు కురిపించారు. ‘సిగ్గు పడుతున్నాను.. ఈ వీడియో జిమ్కు వెళ్లేలా ప్రేరేపించింది’ అంటూ భారతీయ వైమానిక దళ అనుభవజ్ఞుడు వినోద్ కుమార్ తెలిపారు. ప్రసన్న జోషి శారీరక దృఢత్వం భారత సైన్యం అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబం. ఆయన అంకితభావం, దేశానికి చేసిన సేవకు వందనం చేస్తున్నామంటూ మరో యూజర్ రాహుల్ థాపా పేర్కొన్నారు.Salute and respect to the physical fitness of Major General Prasanna Joshi of the Indian Army. No wonder the Indian Army has been rated as the finest fighting force in the world by the German publication Statista in October 2022. Proud of the Indian Army. Jai Hind🇮🇳 #IndianArmy… pic.twitter.com/xuCPTcHqfh— Lt Col JS Sodhi (Retd) (@JassiSodhi24) June 29, 2024 -
ప్రాణం తీసిన చైనా మాంజా!
సాక్షి, హైదరాబాద్/లంగర్హౌస్: హైదరాబాద్కు అక్రమంగా దిగుమతి అయిన చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరుకు చెందిన కాగితాల కోటేశ్వర్రెడ్డి ఆర్మీలో నాయక్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం లంగర్హౌస్లో ఉన్న మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య ప్రత్యూష, రెండేళ్ల కుమార్తెతో కలిసి బాపునగర్లో నివసిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై బాపునగర్ నుంచి లంగర్హౌస్ వైపు వస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లంగర్హౌస్ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తున్న ఆయన మెడకు ఎగురుకుంటూ వచ్చి న పతంగికు కట్టిఉన్న చైనా మాంజా చుట్టుకుంది. ఆయన అప్రమత్తమయ్యేలోపే మాంజా గొంతుకు బిగుసుకుని కోసుకుపోయింది. దీంతో గొంతుపై తీవ్రగాయమై కోటేశ్వర్రెడ్డి వాహనంపైనుంచి కింద పడిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానికులు చికిత్స కోసం ఆయన పనిచేసే మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రెండు గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. కోటేశ్వర్రెడ్డి చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.30 సమయంలో కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న లంగర్హౌస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కట్టడి చేసినా.. విచ్చలవిడిగా... మనుషులతో పాటు పక్షులు, ఇతర ప్రాణులకు ముప్పు కలిగించే చైనా మాంజాను కట్టడి చేయా లని నగర పోలీసులు గత నెల నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మాంజా రవాణా, నిల్వ, విక్రయంపై నిఘా ఉంచి అనేక కేసులు నమోదు చేశా రు. అయినప్పటికీ ధనార్జనే ధ్యేయంగా అనేక మంది వ్యాపారులు చైనా మాంజాను అక్రమంగా తీసుకువచ్చి విక్రయించారు. శని, ఆదివారాల్లో ఈ మాంజా ప్రభావం నగరవ్యాప్తంగా కనిపించింది. అనేక మంది వాహనచోదకులు దీని బారినపడి గాయప డ్డారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో పక్షులు ఈ మాంజా కారణంగా తీవ్రంగా గాయపడటం, చనిపోవడం కనిపించింది. నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లు ‘డేంజర్ జోన్లు’గా మారాయి. మాంజా కారణంగా వాహనాలు సడన్గా వేగాన్ని తగ్గించడం.. వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టడంతో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్బామ్ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్బామ్ను సీనియర్ సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్బామ్కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
పౌల్ట్రీ రంగంలో లాభాలతో దూసుకుపోతున్న రిటైర్ ఆర్మీ ఉద్యోగి
-
తప్పిదాలను సరిచేసుకుంటున్నాం
న్యూఢిల్లీ: ‘‘గుర్తింపుకు నోచుకోని యోధులను, అమర వీరులను భారత్ ఇప్పుడు స్మరించుకుంటోంది. తద్వారా పాత తప్పిదాలను సరి చేసుకుంటోంది. తన ఘన వారసత్వాన్ని పండుగలా జరుపుకుంటోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వలస పాలనలో రచించిన కుట్రపూరిత చరిత్ర వల్ల మన యోధులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. 1670ల్లో మొఘల్ సైన్యంపై పోరాడిన అహోం (అస్సాం) సైనికాధికారి లచిత్ బర్ఫూకన్ 400వ జయంతి వేడుకలు శుక్రవారం ఢిల్లీలో జరిగాయి. వాటిలో మోదీ ప్రసంగించారు. ‘‘దేశ చరిత్రంటే కేవలం బానిసత్వం గురించే కాదు. వీర సైనికుల పోరాటాలు, త్యాగాలు కూడా. చరిత్రంటే కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల పరిణామాలు మాత్రమే కాదు. నిరంకుశత్వం, దౌర్జన్యాలపై అసమాన ధైర్య సాహసాలతో జరిపిన పోరాటమే మన చరిత్ర’’ అన్నారు. దేశం కంటే ఏ బంధమూ గొప్ప కాదు స్వాతంత్య్రానంతరం కూడా వలసవాద భావజాలం కొనసాగిందని, చరిత్రను కుట్రపూరితంగా లిఖించడం దురదృష్టకరమని మోదీ అన్నారు. ‘‘రక్త సంబంధం కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యమని లచిత్ భావించారు. తప్పు చేస్తే దగ్గరి బంధువులనూ శిక్షించారు. కుటుంబాన్ని, కుటుంబ వారసత్వాన్ని పక్కనపెట్టి దేశం కోసం నిస్వార్థంగా పని చేయాలని గొప్ప సందేశమిచ్చారు. దేశ ప్రయోజనాల కంటే ఏ బంధమూ గొప్ప కాదని ఆయన జీవితం బోధిస్తోంది’’ అన్నారు. చిన్నారులతో ప్రచారం మోదీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చిన్న పిల్లలను వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నట్లున్న ఓ చిన్నారి వీడియోను ప్రధానితోపాటు, కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై పార్టీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. ‘‘ఇది పిల్లల హక్కులకు భంగం కలిగించడమే. తీవ్రమైన అంశమైనందున బాధ్యులపై చర్యలు తీసుకోండి’’ అ ని కోరింది. -
హాట్ టాపిక్గా పుతిన్ ఆరోగ్యం.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం దిగినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలన్ని పుతిన్ ఆరోగ్యంపై దృష్టి సారించాయి. పుతిన్ ఆరోగ్యం విషమంగా ఉందని ఇక ఆయన ఎన్నోరోజులు బతకరు అంటూ పలు వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత యూకే ఇంటెలిజెన్స్ పుతిన్కి క్యాన్సర్ అంటూ ఒక నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత గతేడాది మార్చిలో ఆయనపై హత్యయత్నం జరిగిందని త్రుటిలో తప్పించుకున్నట్లు వార్తలు కూడ వచ్చాయి. ఇప్పడు మళ్లీ ఆయన ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గుప్పుమంటున్నాయి. పుతిన్ ఆరోగ్యం బాగోలేదంటూ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పుతిన్ శరీరం రంగుమారిందని, వింత వింత గుర్తులు ఉన్నాయంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక రిటైర్డ్ బ్రిటీష్ ఆర్మీ అధికారి, హౌస్ లార్డ్స్ సభ్యుడు రిచర్డ్ డానాట్ ఒక మీడియా సమావేశంలో పుతిన్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. పుతిన్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. అతని చేతులు ఒక్కసారిగా నల్లగా మారిపోయి ఉన్నాయని, ఇలా ఏవైనా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడూ శరీరం కమిలి ఇలా రంగు మారుతుందని తెలిపారు. ఇతర భాగాల నుంచి ఇంజెక్షన్ తీసుకోలేనప్పుడూ ఇలా జరుగుతుందని చెబుతున్నారు. నిపుణులు కూడా పుతిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సంకేతం అని తేల్చి చెప్పారు. పుతిన్ ఇటీవలె 70 ఏళ్ల వయసులో అడుగుపెట్టారు. వయసు రీత్యా సమస్యలు ఉండటం అత్యంత సహజం. గానీ ఈ రష్యా ఏ ముహర్తానా ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిందో అప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం పెద్ద హాట్టాపిగా మారిపోయింది. (చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి) -
టు లెట్.. టేక్ కేర్
హిమాయత్నగర్: నగరంలోని ఇల్లు ఎవరిదైనా అద్దెకు ఉందని యాడ్ కనిపిస్తే చాలు. క్షణాల్లో కొత్త ఫోన్ నంబర్ నుంచి ఇంటి యజమానికి ఫోన్ వస్తుంది. ‘నేను ఆర్మీలో అధికారిని, మీ ఇల్లు అద్దెకు ఉన్న విషయాన్ని ఇప్పుడే వెబ్సైట్లో చూశాను. మీ ఇల్లు నాకెంతో నచ్చింది’, అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులంటే ప్రజల్లో ఉన్న ఓ గొప్ప నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ముందుగా మా అకౌంట్కు కొంత డబ్బు పంపండి అది ఓకే అయితే వెంటనే మీకు ఏడాదికి సరిపోయే ఇంటి అద్దె డబుల్ చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్తూ లక్షల రూపాయిలు కాజేస్తున్నారు. కేవలం ఆర్మీ అధికారులు మోసం చేయరనే ఒక నమ్మకంతో అమాయక ప్రజలు లక్షల పోగొట్టుకుంటూ సైబర్క్రైం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ కొట్టేస్తున్నారు ఆర్మీలో పనిచేసే అధికారుల ఇల్లు అద్దె అంతా కూడా ఆర్మీనే చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి సరిపోయే అద్దెతో పాటు ఆరు నెలల అడ్వాన్స్ ముందుగానే మీ అకౌంట్లో పడుతుందని చెబుతున్నారు. దీనికి ఇంటి యజమాని ఓకే చెప్పడంతో పథకాన్ని రచిస్తున్నారు. ముందుగా మీకొక లింకు పంపుతాము దానికి కేవలం రూ. 5 పంపండి మీకు రూ. 10 వస్తాయి మా ఆర్మీ నుండంటూ సూచిస్తున్నారు. వెంటనే వాళ్లు పంపిన లింకుకు రూ. 5 పంపగానే రూ. 10 వస్తున్నాయి. ఆ తర్వాత నెల అద్దె రూ. 12 వేలు ఉంటే రెండునెలలవి రూ. 24 వేలు పంపమంటున్నారు. అవి పంపినప్పటి నుంచి సైబర్ కేటుగాళ్ల డ్రామా మొదలవుతుంది. ఏదో టెక్నికల్ సమస్య ఉందంటూ మళ్లీ పంపాలని కాజేస్తున్నారు. ఇదే తరహాలో వారం క్రితం ఓ గృహణి పలు దఫాలుగా వారు చెప్పిన లింకుకు ఒక్కరోజులో రూ. 12 లక్షలు పంపింది. ఇంకా ఇంకా అడగడంతో అప్పటికి ఆమె మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్మీ అధికారుల పేర్లు చెబుతూ ఈ దందా చేస్తున్నవారంతా కూడా రాజస్థాన్, యూపీకి చెందిన వారిగా సైబర్క్రైం పోలీసులు గుర్తించారు. (చదవండి: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి) -
Army Officer: తల్లికి తగ్గ తనయుడు
చెన్నై: తన తల్లి అడుగుజాడల్లో నడిచి తాను అనుకున్నది సాధించాడు ఓ యువకుడు. తల్లికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. తల్లి ఎక్కడైతే శిక్షణ తీసుకుని ఆర్మీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్చించారో అదే అకాడమీ నుంచి 27 ఏళ్ల తర్వాత ఆర్మీ ఆఫీసర్గా ఎదిగాడు రిటైర్డ్ మేజర్ స్మితా చతుర్వేది కుమారుడు. తల్లీకుమారుల ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది భారత రక్షణ శాఖ. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్గా మారాయి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇటీవలే వేడుకలు నిర్వహించారు. మాల్దీవులకు చెందిన సైన్యాధినేత మేజర్ జెనరల్ అబ్దుల్లా శామాల్ హాజరయ్యారు. ఆ ప్రత్యేక రోజున రిటైర్డ్ మేజర్ స్మితా, ఆమె కుమారుడు ఉన్న ఫోటోను రక్షణ శాఖ చెన్నై అకాడమీ ప్రతినిధి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘27 ఏళ్ల క్రితం 1995లో రిటైర్డ్ మేజర్ స్మితా చతుర్వేది చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీ నుంచే సైన్యంలో చేరారు. అదే అకాడమీ నుంచి అదే రీతిలో ఆమె కుమారుడు సైతం సైన్యంలోకి వచ్చారు.’ అని రాసుకొచ్చారు. A rare euphoric moment for a Lady Officer: Major Smita Chaturvedi (Retd) Commissioned from Officers Training Academy, Chennai before 27 years in 1995, saw her son getting Commissioned in the same manner in the same Academy today. @artrac_ia @SpokespersonMoD @DefenceMinIndia pic.twitter.com/hGRaAbQS0k — Defence PRO Chennai (@Def_PRO_Chennai) July 30, 2022 ఇదీ చదవండి: రాకెట్ లాంచ్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ‘ఇస్రో’ బంపర్ ఆఫర్ -
హనీట్రాప్లో డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్/ పహాడీషరీఫ్: హనీట్రాప్లో పడి దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ మహిళా ఏజెంట్కు చేరవేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), బాలాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన దుక్కా మల్లికార్జున్రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టు (29) ఇంజనీరింగ్ పూర్తయ్యాక స్థానికంగా ఓ కంపెనీలో పనిచేసి 2018లో పటాన్చెరులోని క్వెస్ట్ కంపెనీలో చేరాడు. ఈ సమయంలో క్వెస్ట్ కి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ (డీఆర్డీఎల్) నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మీద మల్లికార్జున్రెడ్డి 2020 జనవరి వరకు పని చేశాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ఫిబ్రవరిలో మల్లికార్జున్రెడ్డి నేరుగా డీఆర్డీఎల్ అధికారులను సంప్రదించి.. అడ్వాన్స్డ్ నావెల్ సర్వీస్ ప్రొవైడర్ (ఏఎన్ఎస్పీ) ప్రాజెక్ట్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు. ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి..: ఈక్రమంలో మల్లికార్జున్రెడ్డి తాను డీఆర్డీఎల్లో పనిచేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రొఫైల్లో స్టేటస్ పెట్టుకున్నాడు. 2020 మార్చిలో మల్లికార్జున్కు పాకిస్తా న్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం ప నిచేస్తున్న నటాషారావు అలియా స్ సిమ్రన్ చోప్రా అనే మహిళ నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావటంతో యాక్సెప్ట్ చేశాడు. అలా స్నేహం పెంచుకున్న నటాషారావు, మల్లికార్జున్ చేస్తున్న వృత్తి, పని ప్రదేశం, కంపెనీ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. మల్లికార్జున్ రహస్య సమాచారాన్ని కూడా నటాషారావుకు చేరవేశాడు. అంతేకాకుండా మల్లికార్జున్ తన బ్యాంక్ ఖాతా నంబర్, ఇతరత్రా వివరాలను నటాషాకు పంపించాడు. ఈ నేపథ్యంలో డీఆర్డీఎల్ రహస్యాలు లీకవుతున్నాయని సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, బాలాపూర్ పోలీసులు మల్లికార్జున్ను మీర్పేట్ త్రివేణినగర్లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, సిమ్కార్డ్, లాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు. -
ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!
British Sikh Woman Makes History With Solo Trip To South Pole: బ్రిటీష్లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ ఒంటరిగా దక్షిణ ధృవ సాహా యాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ మేరకు చాందీ సాహసయాత్ర గతేడాది నవంబర్లో ప్రారంభమైంది. పైగా ఆమె అంటార్కిటికా అంతర్గత అధికారుల సహాయ సహకారాలు తీసుకోకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. (చదవండి: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!) అయితే ఆమె జనవరి 3న 700 మైళ్ల దూరాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రీత్ చాందీ మాట్లాడుతూ..." భూమిపై అత్యంత, ఎత్తైన, శీతలమైన పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివశించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది. అంతేకాదు దక్షిణ ధృవ సాహసయాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు నుంచి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా క్రేవాస్లో శిక్షణ తీసుకున్నా. చివరకు నేను మంచు కురుస్తున్న దక్షిణ ధృవానికి చేరుకున్నా" అని బావోధ్వేగంగా తెలిపింది. అంతేకాదు "పోలార్ ప్రీతీ" క్యాప్షన్ని జోడించి మరీ ఇన్స్టాగ్రామ్లో తన సాహాసయాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ మేరకు బ్రిటీష్ సైన్యం ప్రీత్ చాందీనిl అబినందించడమే కాక ధృఢమైన సంకల్పానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రశంసించారు. (చదవండి: ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు) View this post on Instagram A post shared by Preet Chandi (@polarpreet) -
ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు
చెన్నై: ఎంతటి వాడైన, ఎన్ని తప్పులు చేసిన ఏదో ఒక రోజు చేసిన నేరాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలా వంద మందిపైగా మహిళలను వేధించిన సైకోకి చెన్నై పోలీసులు చెక్ పెట్టారు. నార్త్ జగన్నాధన్నగర్కు చెందిన దినేష్ కుమార్ ఇటీవల ఓ రోజు ఆర్మీ అధికారి కూతురును వేధించడంతో దినేష్ బండారం మొత్తం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని క్యాటరింగ్ కళాశాలలో చదువుతున్న దినేష్ కుమార్, కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులలో పాల్గొంటూ, చెన్నై ఎగ్మోర్ పరిసరాల్లోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే అతను రాత్రి లేదా ఉదయాన్నే ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించేవాడు. ఈ క్రమంలో గత వారం ఓ యువతి తన సోదరి, తండ్రి ఆర్మీ ఆఫీసర్తో కలిసి ఉదయం వాకింగ్ చేస్తుండగా, ఆ సమయంలోనే దినేష్ ఉద్యోగానికి పోతున్నాడు. అయితే ఆ యువతి తన ఇద్దరు కుటుంబ సభ్యుల వెనుక నడుస్తోంది. (చదవండి: Drown In Pond:‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’.. ) దీంతో తను ఒంటరిగా ఉందని భావించి తనతో ఆసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన మహిళ తండ్రి దినేష్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన అప్పటికే అతను బైకు మీద ఉడాయించాడు. ఆర్మీ ఆఫీసర్ అతని బండి నంబర్ని నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని బైకు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అతని బండిని ట్రాక్ చేయడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీని పరీశిలించారు. చివరికి అతని ఆచూకి కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఇప్పటివరకూ 100 మంది మహిళలను వేధించానని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘ -
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో అమరుడైన ఆర్మీ జేసీఓ
శ్రీనగర్:జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) అమరుడైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రాజౌరీలోని తనమండి బెల్ట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు తిప్పికొట్టాయని పోలీసు అధికారులు తెలిపారు. జమ్మూ డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ మాట్లాడుతూ...ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) తీవ్రంగా గాయపడ్డారని, ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన అమరుడయ్యారని తెలిపారు. -
డెత్ సర్టిఫికెట్ కోసం ‘యుద్ధం’: స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం, సైన్యంలోనే కల్నల్ హోదాలో పనిచేస్తున్న ఆయన కుమారుడు జీహెచ్ఎంసీతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు మంత్రి కేటీఆర్ స్పందించడంతో సమస్య పరిష్కారమైంది. సైన్యంలో పనిచేసి పదవీ విరమణ అనంతరం సికింద్రాబాద్లోని సైనిక్పురిలో నివసిస్తున్న సత్యబ్రత దాస్గుప్తా (84)ఈ నెల 9వ తేదీన మృతి చెందారు. ఆయన కుమారుడు కల్నల్ జాయ్ దాస్గుప్తా కూడా ఒక బెటాలియన్కు కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న జాయ్, తండ్రి మరణవార్త తెలుసుకుని నగరానికి వచ్చారు. ఎన్నో ఇబ్బందుల మధ్య నేరేడ్మెట్ శ్మశానవాటికలో తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. తిరిగి విధుల్లో చేరాల్సి ఉండటంతో, తండ్రి డెత్ సర్టి ఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీన శ్మశానవాటికకు వెళ్లారు. అయితే శ్మశాన వాటిక నిర్వాహకులు అంత్యక్రియలకు సంబంధించిన రశీదు ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో మరణాలు పెరిగి, రశీదు పుస్తకాలు అయిపోయాయని, జీహెచ్ఎంసీ నుంచి కొత్త పుస్తకాలు రాలేదని వారు తెలిపారు. విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు కల్నల్ జాయ్ జీహెచ్ఎంసీ యాప్లో ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కాల్సెంటర్కు ఫోన్ చేసినా సమస్య పరిష్కారం కాలేదు. జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా వారు సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో పనిచేస్తున్న ఒకరు, దాస్గుప్తా పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్కు ఈ నెల 13వ తేదీన ట్వీట్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి, అధికారులతో మాట్లాడి సోమవారం డెత్ సర్టిఫికెట్ జారీ చేయించారు. ఇకముందు ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్కు కేటీఆర్ సూచించారు. -
Salaar: ప్రభాస్ డబుల్ యాక్షన్!
హీరో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా మారారు. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రం రూపొందుతోంది కదా. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్ పాత్ర అని ఫిల్మ్నగర్ టాక్. ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్గా ఉంటాయట. మరి... ప్రభాస్ ఇందులో రెండు పాత్రలు చేస్తున్నది నిజమే అయితే ఇంకో పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ‘సలార్’ షూటింగ్కి బ్రేక్ పడింది. కోవిడ్ వ్యాప్తి తగ్గిన తర్వాత తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. చదవండి: విషాదం: నటుడు కుట్టి రమేష్ కన్నుమూత -
ఆర్మీ అధికారి భార్య, కూతురు ఆత్మహత్య
వేలూరు: రైలు కిందపడి తల్లీకుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వేలూరు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు సమీపంలోని విరింజిపురం గ్రామానికి చెందిన రాజేశ్కుమార్ మేఘాలయలో ఆర్మీ అధికారి. ఇతని భార్య జయంతి(29), కుమార్తె నందిత(4) సొంత గ్రామంలో ఉంటున్నారు. రాజేశ్కుమార్ 20 రోజుల క్రితం సెలవుపై వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య శనివారం రాత్రి గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపం చెంది జయంతి ఆదివారం ఉదయం కుమార్తె నందితతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తల్లి, కుమార్తె ఇద్దరూ కలిసి విరింజిపురం వద్ద రైలు వచ్చే సమయంలో రైలు పట్టాలపై నిలబడ్డారు. రైలు ఢీకొని తల్లీ కుమార్తె ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చెరువులో మునిగి పిల్లలు సహా తండ్రి మృతి సాక్షి, చెన్నై:సెంబరంబాక్కం చెరువుకు వెళ్లిన తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతిచెందారు. కుండ్రత్తూరు సమీపంలోని తిరువళ్లువర్ నగర్కు చెందిన ఉస్మాన్ ఆదివారం సెలవు దినం కావడంతో కుమారుడు, కుమార్తెతో సమీపంలోని సెంబరంబాక్కం చెరువును చూసేందుకు వెళ్లారు. తండ్రితో కలిసి సరదాగా ఆడుకుంటూ, అక్కడున్న గోపురం వద్దకు పిల్లలు వెళ్లారు. అక్కడి నుంచి నీటిని చూస్తుండగా ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత మరొకరు పిల్లలు పడిపోయారు. దీనిని గుర్తించిన ఉస్మాన్ పిల్లల్ని రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. సమీపంలో ఉన్న వాళ్లు సైతం నీళ్లలోకి దూకి రక్షించే యత్నం చేశారు. ఉస్మాన్ను బయటకు తీసుకు రాగా, ఆయన మృతిచెందాడు. అయితే, ఇద్దరు పిల్లలు చెరువు బురదలో కూరుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి ఆ పిల్లల మృతదేహాల కోసంగా లిస్తున్నారు. చదవండి: విషాదం: 20 అడుగుల ఎత్తుకు ఎగిరి.. -
దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు!
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దిశా ఫ్యామిలీకి చెందిన ఓ న్యూస్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. దిశాకు సోదరి ఖుష్బూ, సోదరుడు సూర్యన్ష్ పటాని ఉన్నారు. సినిమా రంగంలో దూసుకుపోతున్న దిశాపటాని గురించి అందరికి తెలుసు కానీ ఆమె సోదరి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. దిశా సోదరి ఖుష్బూ ఏ వృత్తిలో ఉందో తెలుసా. ఆమె ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్నెంట్గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా పటాని ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో అప్పటి నుంచి ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఖుష్బూ భారత ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ దిశాలాగే ఫిట్నెస్ ప్రియురాలు. ఎప్పటికప్పుడు జిమ్, వర్కౌట్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఖుష్బూ వృత్తి తెలిసిన వారందరూ ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. కదన రంగంలో సేవలందిస్తున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆర్మీ ట్రైనింగ్లో ఉన్న ఖుష్బూ ఫోటోలు, ఇద్దరు సోదరీమణులు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి. ఇక ఇద్దరు సోదరీమణులు విభిన్నరంగాలు ఎంచుకొని ఎవరి రంగంలో వారు విజయం సాధించడం గొప్ప విషయంగా ఫాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోలు హీరోయిన్లలో ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన వారు చాలామందే ఉన్నారు. అక్షయ్ కుమార్ నాన్న ఆర్మీ ఆఫీసర్. ఇక హీరోయిన్లలో ప్రీతీ జింటా.. ప్రియాంక చోప్రా.. అనుష్క శర్మ లాంటి వారు ఆర్మీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే. -
ఆర్మీ అధికారి చనిపోతే ఇంత ఘోరమా?
బెంగళూరు: ఆర్మీ అధికారిగా సేవలందిస్తోన్న తన కుమారుడిని కడచూపు చూడాలని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అందుకోసం ఏకంగా 2,600 కి.మీ ప్రయాణించారు. వివరాలు.. ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పురస్కార గ్రహీత నవజోత్ సింగ్ ఆర్మీ ప్రత్యేక దళాల విభాగంలో పని చేస్తున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన గురువారం బెంగుళూరులో కన్నుమూశారు. అయితే ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న తమ తల్లిదండ్రులు బెంగళూరు రావడానికి ఏర్పాట్లు చేయాలని ఆ అధికారి సోదరుడు నవతేజ్ సింగ్ బాల్ కోరారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందును తాము రావడానికి ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. (కరోనా మిస్టరీలు) అయితే దీనికి ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో తాము ఎలాంటి సహాయం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో చేసేదేం లేక కల్నల్ కుటుంబ సభ్యులు రోడ్డు మార్గంలో కారులో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ ప్రయాణానికి సంబంధించిన వివరాలను కల్నల్ సోదరుడు నవతేజ్ సింగ్ సోషల్ మీడియాలో వివరిస్తూ వచ్చారు. ఈ విషయం గురించి మాజీ ఆర్మీ అధికారి వీపీ జనరల్ ట్విటర్లో స్పందిస్తూ.. "నా ప్రగాఢ సానుభూతి. క్షేమంగా ప్రయాణించండి. దీనికి భారత ప్రభుత్వ అధికారులు మీకు ఎలాంటి సహాయం చేయకపోవడం విచారకరం. చట్టాలేవీ బండరాళ్లపై రాయరు కదా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని మార్చుకోవాలి" అని ఘాటుగా కామెంట్ చేశారు. మరొకవైపు ఎలాంటి సహాయం చేయకుండా ఆ కుటుంబాన్ని అవమానించారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి(చెట్టంత కొడుకే పోయాడు.. ఆ బూడిదతో ఏం పని?) -
కరోనా: గొప్పవాడివయ్యా
ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్గా బార్డర్లో శత్రువులతో పోరాటం చేసే యోధుడు సుధీర్కుమార్. ఇప్పుడు కరోనా వైరస్పై జరిగే పోరులోనూ నేను సైతం అంటున్నాడు. సుధీర్కుమార్ వయసు 43. ప్రస్తుతం అమృత్సర్లో విధులను నిర్వర్తిస్తున్నాడు. నెలరోజుల దీర్ఘకాలిక సెలవు మీద బీహార్లోని మోతిహరి జిల్లా జత్వాలియా గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు కూతురు పెళ్లి జరిపించడానికి. పెళ్లి కోసమని 4 లక్షల రూపాయల లోను తీసుకున్నాడు. ఈ టైమ్లో లాక్డౌన్ వచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా మరికొన్ని రోజులు తన లీవ్ పొడిగించమని అతను పనిచేస్తున్న యూనిట్కు ముందుగానే మెసేజ్ పంపాడు. ఈ టైమ్లోనే సుధీర్ తన కుటుంబంతో కలిసి కరోనా వైరస్పై సమరశంఖం పూరించాడు. గ్రామంలో ఈ వైరస్కు సంబంధించిన సమాచారం ఇస్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాడు. అంతేకాదు మాస్కులు సొంతంగా తయారు చేస్తూ వాటితో పాటు పేదలకు కావల్సిన నిత్యాసవసర సరుకులన్నీ ఉచితంగా అందజేస్తున్నాడు. ఇంటి నుంచే పోరాటం.. ‘మేం మా అబ్బాయిని మాస్క్లు కొనుక్కురమ్మని పంపినప్పుడు విపరీతమైన డిమాండ్ ఉందని, మాస్క్లు దొరకడం లేదని తెలిసింది. అంతేకాదు, ఒక్కో మాస్క్ చాలా ఎక్కువ ధరకు అంటే దాదాపు రూ. 200కు అమ్ముతున్నారు. అయినా, వైరస్కు భయపడి ఖరీదైన మాస్క్లు కొనాలనే జనం ఆలోచన. ఆ మాస్క్లను చూసిన తర్వాత వాటిని ఇంట్లోనే ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నాడు సుధీర్. అతను శిక్షణ కోసం వెళ్లినప్పుడు అతని భార్య కుటుంబ పనుల్లో భాగంగా నేర్చుకున్న కుట్టుపని ఇప్పుడు సాయపడింది. దీంతో సుధీర్ నిర్ణయానికి కుటుంబం నుంచి వెంటనే బలం చేకూరింది. తన గ్రామంలోని ప్రజలకు ఫేస్మాస్క్లు తయారుచేసి పంపిణీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సుధీర్ చెప్పాడు. ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉంది. మరో కుట్టు మిషన్, ముసుగులు తయారు చేయడానికి కావల్సిన సరంజామాను సిద్ధం చేసుకున్నాడు. ఇలాంటి పరీక్ష సమయంలో దేశానికి ఎంతో కొంత సేవ చేయాలని సుధీర్ సంకల్పించాడు. రక్షణ కేంద్రంగా... సుధీర్ జిల్లా వైద్యాధికారితో సంప్రదించి, అతని సూచనలతో ఈ మాస్క్లను తయారుచేశాడు. భార్యతో కలిసి 4 వేల మాస్క్లను తయారుచేసి తమ ఊరివాళ్లకు, పొరుగూళ్లకు కూడా ఉచితంగా అందజేస్తున్నాడు. సుధీర్, అతని కుటుంబం ‘సామాజిక దూరం’ పాటించడంలో తమ గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సుధీర్ గ్రామం చిన్నదైనా జాగ్రత్తలు తీసుకోవడంలో రక్షణ కేంద్రంగా ఉంది. ‘రోజులో ఎక్కువ సమయం మాస్క్ ధరిస్తే మరో మాస్క్ కోసం నా దగ్గరకు వచ్చి తీసుకెళ్లు. కానీ, దానిని ఉతికి వాడాలనుకోకు’ అని మాస్క్ ధరించి మరీ చెబుతున్నాడు. కూతురి పెళ్లికోసం దాచిన డబ్బును... జూనియర్ ర్యాంక్ అధికారిగా ఉన్న సుధీర్ సంపాదన ఎక్కువేమీ కాదు. అతని సంపాదన కుటుంబ అవసరాలకే సరిపోదు. కానీ, దేశం సంక్షోభంలో ఉన్నందున తన కూతురు పెళ్లి కోసం తీసుకున్న వ్యక్తిగత రుణాన్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నాడు. గ్రామంలో పేదలకు కావల్సిన పప్పు, ఉప్పు, కూరగాయలను, ఇతర నిత్యావసరాలను ఉచితంగా అందిస్తున్నాడు. ఎవరికి ఎప్పుడు సరుకులు కావాలన్నా వచ్చి తీసుకెళ్లచ్చు అని బోర్డు పెట్టి మరీ చెబుతున్నాడు. ఇతరులకు సాయం చేయడం ద్వారా నాకు డబ్బు కొరత ఉండదు. కానీ, వెలకట్టలేనన్ని ఆశీస్సులు నాకు అందుతాయి’ అని అంటున్నాడు సుధీర్. – ఆరెన్నార్ -
కుక్కను కాపాడాడు.. కానీ చివరికి
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో విషాదం నెలకొంది. ఒక ఆర్మీ ఆఫీసర్ తన పెంపుడు కుక్కను మంటల నుంచి కాపాడి తాను అగ్నికి ఆహుతయ్యాడు. వివరాలు.. కశ్మీర్కు చెందిన అంకిత్ బుద్రజా గుల్మర్గ్ ఎస్ఎస్టీసీ మిలటరీ క్యాంపెయిన్లో మేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంకిత్ రెండు శునకాలను పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అంకిత్ ఉంటున్న ఇంటికి శనివారం రాత్రి నిప్పు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న తన కుటుంబసభ్యులతో పాటు ఒక కుక్కను బయటికి పంపించాడు.అయితే మరొక కుక్క లోపలే ఉండిపోవడంతో దానిని రక్షించడానికి వెళ్లి మంటల్లో చిక్కుకున్నాడు. అయితే ఎలాగోలా దానిని బయటకు పంపినా అప్పటికే అంకిత్ 90 శాతం కాలిపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అంకిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాన్మార్గ్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. -
భార్య హత్య కేసులో రిటైర్డ్ కల్నల్కు యావజ్జీవం
సాక్షి, న్యూఢిల్లీ : భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) సోమనాథ్ ఫరీదాకు భువనేశ్వర్ స్ధానిక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 24 మంది సాక్షులను విచారించి, సైంటిఫిక్ బృందం అందించిన ఆధారాలను పరిశీలించిన మీదట న్యాయస్ధానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2013లో ఓ కుటుంబ వివాదం ఘర్షణకు దారితీయడంతో రిటైర్డ్ సైనికాధికారి ఫరీదా (78) తన భార్య ఉషశ్రీ సమాల్ (61)ను స్టీల్ టార్చ్తో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని 300 ముక్కలుగా కోసి దానికి కెమికల్ను మిక్స్ చేసి స్టీల్, గ్లాస్ టిఫిన్ బాక్సుల్లో భద్రపరిచాడు. కాగా తన తల్లితో తాను మాట్లాడలేకపోతున్నానని ఈ దంపతుల కుమార్తె భువనేశ్వర్లో ఉండే తన మామగారికి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఆమె మామను సైతం అధికారి తన ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైనికాధికారి ఇంట్లోనే పలు చోట్ల ఆమె శరీర భాగాలను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు జర్పద జైలులో ఉన్నాడు. తనకు శిక్ష తగ్గించాలని ఫరీదా చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. -
ఆపరేషన్ కాక్టస్
రెండు రీమేక్ సినిమాల (‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశారు, ‘జెర్సీ’ని అదే టైటిల్తో హిందీలో రీమేక్ చేస్తున్నారు) తర్వాత ఓ స్ట్రయిట్ ప్రాజెక్ట్ ఓకే చేశారు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్. మాల్దీవుల్లో జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఈ సినిమాలో షాహిద్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ క్యాక్టస్’ అనే పేరుని పరిశీలిస్తున్నారట. ఆదిత్య నింబల్కర్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించనున్నారు. గతంలో కరణ్ నిర్మాణంలో ‘షాందార్’ అనే సినిమాలో నటించారు షాహిద్. -
నిరసన రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: సాక్ష్యాలేవీ లేకుండానే భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ను నిర్బంధంలో ఉంచడం, బెయిల్ను వ్యతిరేకించడంపై పోలీసుల తీరును ఢిల్లీ న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకపోవడం వల్లనే ప్రజలు వీధుల్లోకి వచ్చారని, ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతం పాకిస్తాన్కు చెందిదా? అన్నట్టు పోలీసులు ప్రవర్తించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ ఆ ప్రాంతం పాకిస్తాన్ దైనా శాంతియుతంగా ధర్నా చేసే అవకాశం అందరికీ ఉందని తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఆజాద్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆజాద్ బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ సందర్భంగా అడిషనల్ సెషన్స్ జడ్జి కామినీ లౌ మాట్లాడుతూ ఆజాద్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనేందుకు సాక్ష్యాలను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. అలాగే జామా మసీదు ప్రాంతంలో ప్రజలు గుమికూడరాదనే నిబంధనలను కూడా తెలపాలన్నారు. కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆందోళనలకు సంబంధించి తమ వద్ద డ్రోన్ రికార్డులు మాత్రమే ఉన్నాయని పోలీసులు విచారణ సందర్భంగా చెప్పడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. న్యాయ శాస్త్ర పట్టభద్రుడైన ఆజాద్ కోర్టుల్లోనూ నిరసన తెలపవచ్చునన్నారు. కాగా, జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు (ఎన్హెచ్ఆర్సీ) పోలీసుల దాడిలో గాయపడ్డ 50 జామియా మిలియా వర్సిటీకి చెందిన విద్యార్థుల వాంగ్మూలాలను మంగళవారం నమోదు చేశారు. -
ఎన్ఆర్సీలో గల్లంతయిన కార్గిల్ వీరుడు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఎన్ఆర్సీ నివేదికపై దేశ వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. నివేదికలో పలువురు పేర్లు గల్లంతవ్వడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ తరపున పనిచేసిన అర్మీ రిటైర్డు ఆఫీసర్ మహ్మద్ సనాఉల్లా ఖాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఎన్ఆర్సీ నివేదికలో సనాఉల్లా ఖాన్ పేరు లేకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నివేదికలో తన పేరు లేకపోవడంపై ఆర్మీ మాజీ అధికారి ఘాటుగా స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న సనాల్లాఖాన్, న్యాయం కోసం పోరాడుతానన్నారు. ప్రస్తుతం స్థానికతపై కేసు విచారణ హైకోర్టులో పెండింగ్లో ఉందని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకం ఉందన్నారు. జాబితాను రూపొందించిన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాటం చేసిన యోధుడు.. సరిహద్దు ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికుడి పేరునే తొలగించారంటే నివేదిక ఎలా రూపొందించారో తెలుస్తోంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 19 లక్షల మందికి ఎన్ఆర్సీ తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో వారు ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు. -
మాజీ సైనికులకు అమెజాన్లో ఉద్యోగాలు
సాక్షి, సిటీబ్యూరో: మాజీ సైనికులకు ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ఉద్యోగాలను కల్పించనుంది. మిలటరీ వెటరన్స్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పేరిట దీన్ని గురువారం ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. అమెజాన్ ఇండియా ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నామని, దీని ద్వారా సైనికులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిసెటిల్మెంట్ (డిజెఆర్), ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ (ఎడబ్లు్యపిఒ)లతో కలిసి దేశవ్యాప్తంగా సైనిక కుటుంబాల కోసం దీనిని నిర్వహిస్తున్నామన్నారు -
ఇదే నా చివరి ఫోటో కావొచ్చు..
లక్నో : చనిపోవడానికి కొన్ని గంటల ముందు కేతన్ శర్మ(29) తన ఫోటోను కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశాడు. అంతేకాక బహుశా ఇదే నా లాస్ట్ ఫోటో కావొచ్చు అనే సందేశాన్ని కూడా పంపాడు. అన్నట్లుగానే కొన్ని గంటల వ్యవధిలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందాడు. కేతన్ శర్మ పంపిన చివరి మెసేజ్ను తల్చుకుని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం గురించి కేతన్ శర్మ బావమరిది మాట్లాడుతూ.. ‘కేతన్ నుంచి మాకు మెసేజ్ రాగానే.. చాలా కంగారు పడ్డాం. తనకు కాల్ చేశాం. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆర్మీ అధికారులను కలవగా.. వారు సోమవారం అనంత్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కేతన్ శర్మ తీవ్రంగా గాయపడి మరణించినట్లు తెలిపారు’ అన్నారు. అంత్యక్రియల నిమిత్తం కేతన్ మృతదేహాన్ని మీరట్కు తరలించారు. వేలాది మంది ప్రజలు కేతన్కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చారు. కేతన్ అంకుల్ ఆర్మీలో పని చేస్తుండేవాడు. దాంతో అతను చిన్ననాటి నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోనే పెరిగాడు. ఆర్మీలో చేరాలని చిన్న వయసు నుంచే కలలు కన్నాడు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆర్మీలో చేరాడు. అతనికి భార్య ఏరా, ఓ కూతురు ఉన్నారు. కేతన్ మరణంతో కుటంబం అంతా శోక సంద్రంలో మునిగి ఉండగా ఇవేం తెలియని అతని చిన్నారి కుమార్తె తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం చూసి ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. #WATCH Army personnel console family members of Army Major Ketan Sharma who lost his life in Anantnag encounter yesterday. His mother says, "Mujhe batado mera sher beta kahan gaya? " #Meerut pic.twitter.com/Rl3wnpQ5gd — ANI UP (@ANINewsUP) June 18, 2019 -
గన్ టు గన్
బందిపోటుగా తుపాకీ పట్టిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ నెక్ట్స్ చిత్రం కోసం ఆర్మీ ఆఫీసర్గా గన్ను పట్టనున్నారు. ఆర్మీ డే సందర్భంగా ‘రైఫిల్ మేన్’ అనే సినిమాలో సోల్జర్గా నటించనున్నట్లు అనౌన్స్ చేశారు సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఈ సినిమాకు విక్రమ్ మల్హోత్రా, వసు భగ్నానీ నిర్మాతలు. ‘‘ఆధునిక శత్రుత్వం.. కాపాడుకోవాల్సిన సరిహద్దు.. ధైర్యవంతుడైన సైనికుడు’’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘కిజీ ఔర్ మన్నీ’ షూటింగ్ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న సుశాంత్ ఇప్పుడు తన బర్త్ డే కోసం ‘సంచిరియా’ షూట్ నుంచి బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో సుశాంత్ బందిపోటుగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. -
యువ సైనిక.. విజయ గీతిక
ఎంటెక్ పూర్తి చేశాడు. ఎన్నో ఉద్యోగ అవకాశాలు ముంగిట ఉన్నా దేశ సేవ చేయాలనుకున్నాడు. ఆర్మీలో చేరాలని కసరత్తు మొదలు పెట్టాడు. అనుకున్నట్లుగానే విజయం సాధించాడు. కఠోర శిక్షణను అధిగమించాడు. ప్రస్తుతం దేశ సరిహద్దులో లెఫ్ట్నెంట్గా దేశ రక్షణ రంగంలో సేవ లందిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఆదోనికి చెందిన వినోద్. ఇటీవల సెలవుపై పట్టణానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను ఆర్మీ ఉద్యోగాన్ని ఎంచుకోడానికి కారణాలు? తల్లిదండ్రుల ఆకాంక్ష, తాను ఇష్టమైన ఉద్యోగం సాధించేందుకు చేసిన కృషి, తదితర వివరాలు ఆయన మాటల్లో.. – ఆదోని ‘మా నాన్న కావలి రాజు భవన నిర్మాణ కార్మికుడు. ప్రస్తుతం మేస్త్రీగా పనులు చేయిస్తున్నారు. అమ్మ లీలావతి గృహిణి. ఇద్దరు పెద్దగా చదువుకోలేదు. నాకు తమ్ముడు విష్ణు, చెల్లలు వినీత ఉన్నారు. మా చదువంతా ప్రైవేట్ స్కూళ్లలోనే కొనసాగింది. ఇంటర్ పూర్తి కాగానే ఇంజిజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయగా అత్యుత్తమ ర్యాంక్ రావడంతో గీతం యూనవర్సిటీలో అడ్మిషన్ లభించింది. బీటెక్తో పాటు ఎంటెక్ కూడా అక్కడే పూర్తి చేశాను. ఆ తర్వాత ఆర్మీ చేరాలనే ధ్రుడమైన కోరికతో తమిళనాడుకు చెందిన మరో ఐదుగురు స్నేహితులతో కలిసి 2015లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలు రాశాను. నాకు మాత్రం ఆర్మీలో లెఫ్టెనెంట్ గ్రేడ్–1 ఆఫీసర్గా ఉద్యోగ అవకాశం లభించింది. ఉద్యోగంలో చేరగానే ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమిలో శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 18 నెలల పాటు శిక్షణ కొనసాగింది. దేశ రక్షణకు శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, తెగింపు, దేశభక్తి లాంటి పలు అంశాలపై జరిగే శిక్షణ కఠినంగా ఉంటుంది. రాత్రివేళల్లో అడవిలో జట్టుగా 30 నుంచి 60 కి.మీ. ఇందుకు నిర్దిష్టమైన సమయం ఇస్తారు. నిర్ణీత సమయంలో గమ్యం చేరుకోవాల్సి ఉంటోంది. వాహనాలు, హెలికాఫ్టర్, విమానం, డ్రైవింగ్తో పాటు వైద్య రంగంలో అత్యవసర వైద్య చికిత్స అంశాలు కూడా శిక్ష ణలో భాగమే. శిక్షణ విజయవంతంగా ముగించుకున్న తర్వాత లెఫ్ట్నెంట్ గ్రేడ్–1 ఆఫీసరుగా 2016 జూన్ 10వ తేదీన∙నియమిస్తూ ఆర్మీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదే రోజు నేను లెఫ్ట్నెంట్ గ్రేడ్–1 అధికారిగా బాధ్యతలు చేపట్టాను. ప్రాణాలర్పించడం అదృష్టంగా భావిస్తారు 2017లో లెఫ్ట్నెంట్గా బాధ్యతలు స్వీకరించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్నా. ఒక్కో బృందంలో 33 మంది దాకా సైనికులు ఉన్నారు. అవసరమైనప్పుడు ఈ సంఖ్య పెరుగుతోంది. దేశ సరిహద్దుపై డేగ కన్ను ఉంటోంది. ఉగ్రవాదులు, శత్రువుల కదలికలపై డేగ కన్ను ఉంటోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసే ఆదేశాల మేరకు నా బృందంతో పని చేయిస్తున్నాను. దేశంలోని కోట్ల మంది ప్రాణాలకు రక్షణగా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న నాతో సహా సైనికులందరూ ఎంతో గర్వ పడతారు. సైన్యంలో పనిచేయడమంటే పూర్వజన్మ సుకృతమన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సైన్యంలో ఉన్నవారికి దేశ ప్రజల కోసం ప్రాణార్పణకు వెనకాడరు. ప్రాణాలర్పించడాన్ని అదృష్టంగా భావిస్తారు. ఆనంద బాష్పాలు రాలాయి బాధ్యతలు చేపట్టిన రోజు అమ్మనాన్న లీలావతి, రాజును ఉత్తరఖండ్లోని డెహ్రడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమి కార్యాలయానికి పిలిపించారు. ర్యాంకిగ్ బ్యాడ్జ్ని అమ్మానాన్నతో నా ఆర్మీ యూనిఫాంకు తగిలించారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్ నుంచి పూలవాన కురిసింది. ఒక్క సారిగా సభికుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఉన్నతస్థాయి అధికారులు, దేశ పౌరులు, వేలాది మంది సైనికుల సమక్షంలో లభించిన గౌరవంతో అమ్మానాన్న ఆనందంతో ఉప్పొంగిపోయారు. నన్ను అలింగనం చేసుకున్న అమ్మనాన్న కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆర్మీలో చేరుందుకు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ సైన్యంలో రాష్ట్రానికి చెందిన వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇది బాధాకరం. ఏటా ఇతర రాష్ట్రాల నుంచి 50 నుంచి 60 మంది వరకు నా స్థాయి ర్యాంకు వాళ్లు ఆర్మీలో చేరుతున్నారు. అయితే మన రాష్ట్రం నుంచి వచ్చే వారి సంఖ్య ఐదారు మందికి మించడం లేదు. దీంతో ఆర్మీపై ప్రజలలో సరైన అవగాహన లేదనిపిస్తోపంది. ఆర్మీ అంటేనే అడవుల్లో కాపలా కాయడమని, కష్టాలను ఎదుర్కోవడమనే అపవాదు ఉంది. కొంత వరకు ఇది వాస్తమే అయినా ఇందుకు నాలుగింతలు ఉద్యోగ సంతృప్తి ఉంటోంది. ప్రభుత్వం, సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటోంది. అందుకే సెలవుల్లో వచ్చినప్పుడు యువతలో ఆర్మీ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని భావిస్తున్నాను. ఇతర రాష్ట్రాలకు సమానంగా మన రాష్ట్రం నుంచి కూడా ఆర్మీ చేరేందుకు ప్రోత్సాహం అందిస్తాను. -
అమెరికాలో మాజీ సైనికుడి కాల్పులు.. పోలీసు మృతి
ఫ్లోరెన్స్: సౌత్ కరోలినా రాష్ట్రం ఫ్లోరెన్స్ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ సైనికాధికారి జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని వింటేజ్ ప్లేస్ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ఫ్రెడరిక్ హాప్కిన్స్(74)పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన వారెంట్ అందజేసేందుకు బుధవారం సాయంత్రం ఏడుగురు పోలీసు అధికారులు అతడి ఇంటికి వెళ్లారు. వారిని దూరం నుంచి చూసిన హాప్కిన్స్ తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఏడుగురు పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో రెండు గంటలపా టు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు హాప్కిన్స్పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా పోలీసు అధికారి టెరెన్స్ కరావే(52) అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఆర్మీ అధికారి అదృశ్యం
గోపాలపట్నం (విశాఖపట్నం) : ఇంటి నుంచి విధులకు పయనమైన ఆర్మీ అధికారి ఆచూకీ లేకుండాపోయింది. అటు విధుల్లో చేరక.. ఇటు కుటుంబ సభ్యులకూ అందుబాటులోకి రాకపోవడంతో ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా గోపాలపట్నం సమీపంలోని నరవ గ్రామానికి చెందిన గవర శ్రీనివాసరావు (40) ఆర్మీలో 20 ఏళ్ల సర్వీసు చేశారు. సిపాయి (గన్ఫిట్టర్)గా చేరి ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం జలంధర్లో నాయక్గా పనిచేస్తున్నారు. భార్య యజ్ఞప్రియ, ఇద్దరు కొడుకులు పునీత్కుమార్(13), తరుణ్(10) ఉన్నారు. విధులు నిర్వహించే ప్రాంతంలోనే భార్యాపిల్లలతో ఉండేవారు. అయితే వచ్చే సెప్టెంబరు 30న ఆయన సర్వీసు పూర్తి కానుంది. ఈ తరుణంలో సొంతూరు నరవ గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సొంత ఇల్లు కట్టుకుని మే 2న గృహప్రవేశం చేశారు. పిల్లలిద్దరినీ ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్చారు. ఈ నేపథ్యంలో ఇటీవలే శ్రీనివాసరావుకు కపూల్తలాకు బదిలీ అయింది. ఉన్నది మూడు నెలల సర్వీసే. ఇంతలో బదిలీ అయిన తరుణంలో తాను అక్కడ సర్వీసు ముగించుకు వస్తానని మే 6న ఇంటి నుంచి బయలుదేరారు. దువ్వాడ రైల్వేస్టేషన్ వరకూ యజ్ఞప్రియ పిల్లలతో కలిసి భర్తను సాగనంపింది. జమ్మూ వెళ్లే రైలెక్కిన శ్రీనివాసరావు జలంధర్లో దిగి కపుల్తలాకు వెళ్లాల్సి ఉండగా... మే నెల 8న మధ్యాహ్నం తన ఫోన్, మనీ పర్సు పోయాయంటూ యజ్ఞప్రియకు తోటి ప్రయాణికుని నంబరుతో ఫోన్ చేసి చెప్పారు. తన ఏటీఎం కార్డు బ్లాక్ చేయాలని, తాను ఉన్న ప్రాంతానికి డబ్బులు తేవాలని శ్రీనివాసరావు కోరారు. తర్వాత నుంచి అతని జాడ లేదు. అలాగని అంతకు ముందు నెంబరుకి ఫోన్ చేస్తే తాను ఓ స్టూడెంట్నని సమాధానం వచ్చింది. ఫోన్ కావాలంటే ఇచ్చాను తప్ప తనకెలాంటి సంబంధం లేదని చెప్పడంతో యజ్ఞప్రియ కలవరపడింది. అదే రోజు జలంధర్ యూనిట్ ఉన్నతాధికారులకు ఫోన్లో తన భర్త సంగతి చెప్పి ఆందోళన వెలిబుచ్చింది. మే 15న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనస్థితిలో కుటుంబం : శ్రీనివాసరావు అదృశ్యమయ్యాడని తెలిసి యజ్ఞప్రియతో పాటు పిల్లలు, తల్లిదండ్రులు దీనంగా ఉన్నారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ముసలమ్మ, రాములుకు, అంగవైకల్యంతో ఉన్న సోదరుడు కనకరాజు, సోదరి నాగమణికి శ్రీనివాసరావు వెలుగుగా నిలిచారు. సోదరికి వివాహం చేశాడు. చివరికి సర్వీసు పూర్తి చేసుకుని ఉన్న ఊళ్లో స్థిరపడాలని ఆశలు పెట్టుకున్న ఆయన ఇపుడు కనిపించలేదని తెలిసి ఎవరికీ తిండి సహించడం లేదు. ఇంటిల్లపాదీ ఆందోళనతో గడుపుతున్నారు. మిస్టరీగా అదృశ్యం శ్రీనివాసరావు అదృశ్యం మిస్టరీగా మారింది. భార్య ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆర్మీ అధికారులకూ సమాచారం పంపారు. అదే సమయంలో యజ్ఞప్రియ జలంధర్, కపుల్తలాలో ఉన్న ఆర్మీ అధికారులను సంప్రదించింది. పానిపట్ నుంచి ఫోన్ చేశారని చెప్పి అక్కడా గాలించారు. అక్కడి స్టేట్ బ్యాంకులో మే 8న మధ్యాహ్నం శ్రీనివాసరావు తిరిగినట్లు, రూ.5 వేలు డ్రా చేసినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. అయితే అదే రోజు తన మనీ పర్సు, సెల్ఫోన్ పోయిందని, డబ్బులు తేవాలని చెప్పిన శ్రీనివాసరావు తర్వాత బ్యాంకులో డబ్బులు ఎలా డ్రా చేశారని ఆరా తీస్తే చెక్బుక్లు, పాస్బుక్లను చూపి నగదు పొందినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసిందని యజ్ఞప్రియ చెప్పారు. తన భర్త ఎలా అదృశ్యమయ్యారో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతోంది. జలంధర్లో రైలు దిగాల్సి ఉండగా, మార్గమధ్య పానీపట్లో ఎందుకు దిగినట్లు.. రైలెక్కాక ఎవరైనా పరిచయమై మోసగించారా.. లేక మరేం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. -
మహిళతో పట్టుబడ్డ సైనికాధికారి..
సాక్షి, శ్రీనగర్ : సైనిక అధికారి మహిళతో కలిసి ఓ హోటల్లో జమ్మూ కశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డారు. గత ఏడాది కశ్మీర్లో రాళ్ల దాడి ఘటనల నేపథ్యంలో ఓ యువకుడిని తన వాహన బానెట్పై లాక్కెళ్లిన సైనిక అధికారిగా ఆయనను గుర్తించారు. శ్రీనగర్లోని హోటల్ గ్రాండ్ మమతా నిర్వాహకుల నుంచి అందిన సమాచారం మేరకు సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. హోటల్ ప్రతినిధులు అందించిన వివరాలతో పోలీసు బృందం హోటల్కు చేరుకుని సైనికాధికారిని అదుపులోకి తీసుకుంది. సైనికాధికారిని కలుసుకునేందుకు మహిళ హోటల్కు వచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. వారి స్టేట్మెంట్లను నమోదు చేసుకున్న అనంతరం సైనికాధికారిని ఆయన యూనిట్కు అప్పగించామని, మహిళ స్టేట్మెంట్ను నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కాగా శ్రీనగర్ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంచే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఐజీ ఎస్పీ పాణి తెలిపారు. -
సూపర్ మామ్.. అతన్ని కాల్చి చంపింది
బ్రెసిలియా : రోడ్డుపై వెళుతున్న మహిళలకు తుపాకి గురి పెట్టి దోచుకోవాలని చూసిన ఓ దొంగను మహిళా ఆర్మీ అధికారి కాల్చి చంపింది. ఈ సంఘటన బ్రెజిల్లోని సావో పాలోలో చోటుచేసుకుంది. స్థాన్కి మీడియా తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఉదయం సావో పాలోలోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలోని రోడ్డుపై వెళుతున్న మహిళలపై అదే ప్రాంతానికి చెందిన ఎలివెల్టన్ నెవెస్ మొరైరా(21) గన్ను గురి పెట్టాడు. వారి దగ్గర ఉన్న నగదు, ఆభరణాలు ఇవ్వాలని లేకపోతే కాలుస్తానని బెదిరించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ పరుగులు తీయటం మొదలుపెట్టారు. కానీ అక్కడే సాధారణ దుస్తుల్లో ఉన్న ఓ మహిళా ఆర్మీ కార్పోరల్ కటియా సాట్రె అధికారి మాత్రం ధైర్యంగా తన వద్ద ఉన్న తుపాకితో అతనిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బుల్లెట్ గాయాలతో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆదివారం దొంగ మరణించాడు. మహిళా ఆర్మీ అధికారి కార్పోరల్ కటియా సాట్రె ధైర్య సాహసాలకు మెచ్చిన అక్కడి ప్రభుత్వం ‘మదర్స్ డే’ రోజున ఆమెను ఘనంగా సత్యరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆ క్షణంలో అక్కడున్న వారిని ఎలా కాపాడాలని మాత్రమే ఆలోచించానని, అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దొంగపై కాల్పులు జరిపాన’ని తెలిపారు. సాట్రె పదర్శించిన ధైర్య సాహసాలకు ఆమెను అందురు సూపర్ మామ్ అని పిలుస్తున్నారు. -
ఆర్మీ ఉద్యోగాల పేరుతో మోసం...
సాక్షి, హైదరాబాద్ : ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లాన్స్ నాయక్లాన్స్ అనే ఆర్మీ అధికారి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ అపాయింట్మెంట్ కాపీలు ఇచ్చి మొహం చాటేయడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మీ అధికారిని శనివారం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహరంలో లాన్స్ నాయక్లాన్స్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి విచారణ కొరకు నిందితుల్నికోర్టులో హాజరు పరచామని వారు తెలిపారు. -
ఆర్మీ ఆఫీసర్గా..
సంజయ్ దత్ ఇప్పుడు ఫుల్ బిజీ. ఒకేసారి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ‘తోర్భాజ్’ అనే సినిమా ఒకటి. మిగతా సినిమాల్లో ఎలా ఉన్నా ఈ సినిమాలో మాత్రం ఫిట్గా ఉన్న సంజయ్ని చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన ఇందులో ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. గరీష్ మాలిక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సూసైడ్ బాంబర్ కిడ్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగనుందట. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇది కాకుండా ‘కళంక్’, ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్స్టర్ 3’, ‘పానిపట్’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటిలో ‘కళంక్’, ‘పానిపట్’ వచ్చే ఏడాది రిలీజవుతాయి. ఇదిలా ఉంటే.. సంజయ్ జీవితం ఆధారంగా రణ్బీర్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన ‘సంజు’ జూన్ 29న విడుదల కానుంది. -
పెళ్లి చేయకుంటే చావే శరణ్యం
కుల్కచర్ల : ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని ఓ యువతి ఐదేళ్లుగా న్యాయం పోరాటం చేస్తోంది. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అలసిపోయానని.. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. తనకు నా అనే వారు ఎవరూ లేరని.. ఉన్న గ్రామంలోనూ తన ప్రేమకు మద్ధతు లభించడం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగకుంటే తనకు చావు తప్ప మరో దారి లేదని చెబుతోంది. న్యాయం కోసం ప్రేమించిన యువకుడి ఇంటి ముందు యువతి బైఠాయించిన సంఘటన మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన అనసూయ అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు గత 5 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఆ తరువాత ఆంజనేయులుకు ఆర్మీలో ఉద్యోగం రావడంతో ట్రైనింగ్ కోసం వెళ్లి తిరిగొచ్చాడు. గ్రామానికి వచ్చిన ఆంజనేయులను పెళ్లి చేసుకుందామని అనసూయ అడగడంతో నీతో నాకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో గ్రామంలొ కుల పంచాయతీ పెట్టారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో యువతి 2016 ఏప్రిల్ 7న కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో ఆంజనేయులుతో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అందరూ బెయిలుపై బయటకొచ్చారు. అనంతరం ఆంజనేయులు ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో 2017 మే 13న తనకు న్యాయం చేయాలని కోరుతూ అనసూయ యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. అతనితో పెళ్లి జరిపించాలని అక్కడే కూర్చుంది. కుల్కచర్ల పోలీసులు ఆమెను స్టేషన్కు తీసుకొచ్చి సర్తిచెప్పి పంపించారు. 15 రోజుల క్రితం ఆంజనేయులు ఉద్యోగం నుంచి రావడంతో అనసూయ గురువారం నుంచి అతడి ఇంటి ముందు బైఠాయించింది. ఆంజనేయులు ఇంటి వారు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ యువతికి మద్దతుగా పరిగి మహిళా సంఘం మహిళలు మద్దతు పలికారు. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. యువతికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మహిళలు తెలిపారు. ప్రేమించిన వ్యక్తికోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉందని.. న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే పెళ్లి... లేదంటే చావు నాకు ఉన్నవి రెండే దారులు. మొదటిది ఆంజనేయులుతో పెళ్లి.. లేదంటే ఆత్మహత్య చేసుకుని ఇక్కడే అతని ఇంటి ముందే చనిపోతా. ఇప్పటికే పోలీస్స్టేషన్లకు, కోర్డుల దగ్గరకు ప్రజాప్రతినిధుల దగ్గరకు, మహిళా సంఘాల వద్దకు, కుల పెద్దల దగ్గరకు తిరిగి అలసిపోయాను. గత మూడేళ్లుగా తిరుగుతూనే ఉన్నాను. నాకు అమ్మనాన్నలు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నే. మా గ్రామంలో కూడా నాకెవరూ మద్ధతు తెలుపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆంజనేయులతో వివాహం జరగకుంటే చావు తప్ప మరో మార్గం లేదు. – అనసూయ, అనంతసాగర్ బాధిత మహిళ -
చొరబడేందుకు సిద్ధంగా ఉగ్రవాదులు
శ్రీనగర్: కశ్మీర్లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖకు దగ్గర్లో అనేకమంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది కూడా ఆ ఉగ్రవాదులకు సహకరించడానికేనని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రణ రేఖకు ఆవల భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారమొచ్చింది’ అని శ్రీనగర్లోని లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ చెప్పారు. ఉగ్రవాదులు గుంపులు గుంపులుగా ఒక్కో చోట 30 నుంచి 40 మంది ఉన్నారని వెల్లడించారు. -
శోకాన్ని దిగమింగుకొని భర్త అంత్యక్రియలకు..
న్యూఢిల్లీ : ఓ మహిళా ఆర్మీ అధికారి శోకాన్ని దిగమింగుకొని తన ఐదు రోజుల పసి బిడ్డతో భర్త అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆర్మీ అధికారికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. మేజర్ కుముద్ దోగ్రా భర్త, భారత ఏయిర్ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ డీవాట్స్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 15న అస్సాం మజులీ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన మరణించిన రెండు రోజులకే కుముద్ దోగ్రా ఓ పాపకు జన్మనిచ్చింది. గత బుధవారం డీవాట్స్ అంతక్రియలు జరగగా ఆమె తన ఐదు రోజుల పాపతో హజరయ్యారు. కుముద్ దోగ్రాకు సెల్యూట్ అంటూ ట్విటర్లో ఈ ఫొటోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దేశం కోసం భారత్ సైన్యం ఎలాంటి త్యాగం చేస్తుందో అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని ఒకరు, ఆర్మీని విమర్శించే వారంత ఈ ఘటనను చూసి బుద్దితెచ్చుకోవాని ఇంకొకరు ఆమెకు మద్దతుగా పోస్ట్లు చేస్తున్నారు. -
ఈగ విలన్కు హాలీవుడ్లో ఛాన్స్
సాక్షి, సినిమా : కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ‘ఈగ’ సినిమాతో తెలుగువారికి కూడా చేరువయ్యాడు. ఈ క్రమంలో బాహుబలిలో కూడా ఓ చిన్న రోల్లో మెప్పించాడు కూడా. ఇక శాండల్వుడ్లో ఆయనకున్న ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకం. డూప్లు లేకుండా స్టంట్లు చేయటం ఆయనకు అలవాటైన పనే అయినా ఆ క్రమంలో తరచూ గాయాలపాలు అవుతుంటారు కూడా. ప్రస్తుతం మరో స్టార్ శివరాజ్కుమార్తో విలన్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న ఆయన.. ఇప్పుడు హాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయాడు. ఆస్ట్రేలియా ఫిల్మ్ మేకర్ ఈడై ఆర్య రూపొందించబోయే ఓ యాక్షన్ చిత్రంలో సుదీప్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. టైటిల్ నిర్ధారణ కాని ఆ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నానంటూ సుదీప్ స్వయంగా తెలియజేశాడు. రష్యాలో వేలాది మందిని బలి తీసుకున్న ఓ పేలుడు నేపథ్యంలో సినిమా తెరకెక్కబోతుందని.. అందులో ఫుల్గా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని.. అందుకే తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని సుదీప్ వెల్లడించారు. సమ్మర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందంట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైరా లో కూడా సుదీప్ ఓ పాత్రలో మెరవనున్న విషయం విదితమే. -
పట్టుకున్నారుగా.. శుభాకాంక్షలు!
ఆర్మీ అధికారితో ఉగ్రవాది దుజానా చివరి సంభాషణ శ్రీనగర్: లష్కరే టాప్ కమాండర్ అబూ దుజా నా మంగళవారం కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. అయితే ఎన్కౌంటర్కు ముందు ఓ ఆర్మీ అధికారి దుజానాతో ఫోన్లో మాట్లాడిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికులతో దుజానా నక్కిన ఇంటికి ఫోన్ చేయించిన ఆ ఆధికారి అతనితో జరిపిన సంభాషణ వివరాలివి. దుజానా: ఎలా ఉన్నారు? అధికారి: నేనెలా ఉన్నానో వదిలేయ్. నువ్వెం దుకు లొంగిపోవడం లేదు? దుజానా: ఎందుకు లొంగిపోవాలి? ప్రాణా లు అర్పించడానికే ఇంటిని వదిలి వచ్చాను. ఈరోజైనా, రేపైనా నేను చనిపోవాల్సిందే. అధికారి: తల్లిదండ్రుల గురించి ఆలోచించు. దుజానా: నేను ఇంటి నుంచి బయటకు వచ్చిన రోజే వాళ్లు చనిపోయారు. అధికారి: ప్రస్తుతం కశ్మీర్లో పరిస్థితి ఎం త దారుణంగా ఉందో నీకు తెలుసు కదా. ఇదంతా ఆటలో భాగంగా జరుగుతోంది. దుజానా: నాకు వ్యవస్థ గురించి, కశ్మీర్లో పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసు. ఎవరైనా ఆటలు ఆడాలనుకుంటే నేనేం చేయగలను? ఇంకేంటి విశేషాలు? మీరెలా ఉన్నారు? అధికారి: దీనికంతటికి ఇది సరైన సమయం కాదు. మేము బాగానే ఉన్నాం. దుజానా: (నవ్వుతూ..) కొన్నిసార్లు మీరు మా కంటే ముందున్నారు. మరికొన్ని సార్లు మేము ముందున్నాం. ఏదైతేనేం చివరికి మమ్మల్ని పట్టుకున్నారు. మీకు శుభాకాంక్షలు. అధికారి: మేమెవరిని చంపాలనుకోవట్లేదు. దుజానా: మీకు సమాచారం ఇచ్చిన వ్యక్తులు నేను చనిపోవాలని కోరుకుంటున్నారు. అధికారి: ఇది జిహాద్(పవిత్ర యుద్ధం) కాదు. అది మీకు కూడా తెలుసు. దుజానా: పోనివ్వండి. ఇప్పుడేం చేయలేం. అధికారి: అయితే లొంగిపోండి. మీరు మాత్రమే ఇతరులకు దిశానిర్దేశం చేయగలరు. కశ్మీర్లో రక్తపాతాన్ని ఆపగలరు. దుజానా: కశ్మీర్లో రక్తపాతానికి నేను కారణం కాదు. అది ప్రజలందరికి తెలుసు. అధికారి: లష్కరేలో నువ్వే ముఖ్యమైన కమాండర్వి. ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత నీపైన ఉంది. దుజానా: సరే నేను చూస్తాను... అంటూ కాల్ కట్ చేశాడు. -
సెల్ వాడొద్దన్నందుకు కాల్చి చంపాడు!
శ్రీనగర్: సరిహద్దుల్లో కాపలా విధులు నిర్వర్తిస్తున్న ఓ సైనికుడు సెల్ఫోన్ వాడొద్దని చెప్పిన పై అధికారిని కాల్చి చంపాడు. ఈ ఘటన భారత్-పాక్ సరిహద్దుల్లోని యూరి సెక్టార్లో చోటుచేసుకుంది. ఎల్వోసీ వెంట డ్యూటీలో ఉన్న ఓ సిపాయి సెల్ఫోన్లో మాట్లాడటంపై మేజర్ శేఖర్ థాపా అభ్యంతరం తెలిపారు. అయితే, ఆ జవాను ఆయన ఆదేశాల్ని లెక్కచేయలేదు. సదరు సిపాయి పదేపదే ఆజ్క్షల్ని ఉల్లంఘించటంపై ఇద్దరి మధ్యా వాదులాట జరిగింది. కోపంతో ఉన్న ఆ జవాను శేఖర్ను తన వద్ద ఉన్న తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన మేజర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆ జవానును అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. కుటుంబం నుంచి ఎక్కువగా కాలం దూరంగా ఉంచటం, పనిభారం, సౌకర్యాల లేమి తదితర కారణాలతో జవాన్లు సహనం కోల్పోయి పై అధికార్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కాల్పులు జరపటం వంటివి ఇక్కడ తరచూ జరుగుతున్నాయి. -
ఆ సైనిక అధికారికి క్లీన్చిట్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో పౌరుడిని జీపుకు కట్టివేసిన ఘటనలో సైనికాధికారిని ఆర్మీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంక్లిష్ట పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో వ్యవహరించినందుకు మేజర్ నితిన్ గొగొల్ను ఆర్మీ కోర్టు ఆఫ్ ఎంక్వైరీ(సీఓసీ) ప్రశంసించినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. సైనికుల ప్రాణాలకు ఆపద రాకుండా ఆయన చాకచక్యంగా వ్యవహరించారని కొనియాడినట్టు తెలిపాయి. ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్సభ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా బుద్గామ్లో ఆందోళనకారులు హింసకు దిగి భద్రతా సిబ్బందిపై దాడులకు ప్రయత్నించారు. ఆ సమయంలో 53 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన నితిన్ గొగొల్.. ఆందోళనకారులు రాళ్లు తమవైపు విసరకుండా ఉండేందుకు ఫరూక్దార్ అనే పౌరుడిని రక్షణ కవచంలా తమ జీపుకు ముందువైపు కట్టివేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు బయటకు రావడంతో విమర్శలు వెలువెత్తాయి. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నాయకులు సైనికుల చర్యను ఖండించారు. -
ఆర్మీ అధికారి కిడ్నాప్.. హత్య
► జమ్మూకశ్మీర్లో మిలిటెంట్ల ఘాతుకం ► పిరికిపంద చర్య: జైట్లీ శ్రీనగర్: సెలవులో ఉన్న ఓ యువ ఆర్మీ అధికారిని అపహరించిన మిలిటెంట్లు.. ఆపై అత్యంత దారుణంగా హతమార్చారు. షోపియాన్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరైన రాజ్పుటానా రైఫిల్స్ అధికారిని కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు.. అతనిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. కుల్గామ్ జిల్లా సుర్సోనా గ్రామానికి చెందిన లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్(22).. బాతాపురాలో బంధువుల వివాహానికి హాజరయ్యాడు. మంగళవారం రాత్రి పది గంటలకు ముగ్గురు మిలిటెంట్లు పెళ్లి జరుగుతున్న ఇంట్లోకి చొరబడి ఉమర్ను అపహరించారు. మిలిటెంట్ల హెచ్చరికలతో ఉమర్ కుటుంబ సభ్యులు కిడ్నాప్ గురించి పోలీసులకుగానీ, ఆర్మీకి గానీ సమాచారం ఇవ్వలేదు. అయితే బుధవారం ఉదయం ఉమర్ నివాసానికి సమీపంలో హర్మాన గ్రామంలో బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఉమర్ మృతదేహాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అతని మృతదేహంపై ఉన్న గాయాలను చూస్తే మిలిటెంట్లను ఉమర్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించినట్టు తెలుస్తోందని చెప్పారు. అత్యంత సమీపం నుంచి అతనిపై కాల్పులకు తెగబడ్డారని, తల, పొట్ట, ఛాతీ భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని వివరించారు. సైనిక లాంఛనాలతో ఉమర్ అంత్యక్రియలను పూర్తి చేశారు. సెలవు పెట్టి పెళ్లికి వచ్చిన ఉమర్ ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హెచ్చరించి విడిచిపెడతారని భావించే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కానీ ఇంత ఘోరం జరుగుతుందని భావించలేదని చెప్పారు. ఆయన రోల్ మోడల్: జైట్లీ ఫయాజ్ హత్యను రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ యువ అధికారి ఒక రోల్ మోడల్ అని కొనియాడారు. గత డిసెంబర్లో ఉమర్ ఆర్మీలో చేరాడని, బంధువుల పెళ్లి కోసం మొదటిసారిగా సెలవుపెట్టి వెళ్లాడని ఉన్నతాధికారులు చెప్పారు. హత్యను సీఎం మెహ బూబా, రాహుల్ గాంధీ ఖండించారు. -
నేనే రావణుణ్ణి రెడీ చేశా! - రకుల్ప్రీత్ సింగ్
డాడీ ఆర్మీ ఆఫీసర్ కావడంతో చిన్నప్పట్నుంచీ ఏ ఊరిలో ఉంటే అక్కడ దసరా జరుపుకునేవాళ్లం. దసరా అంటే.. ‘మనలో చెడుని అంతం చేసి, మంచి వ్యక్తిగా ఎదగడం’ అని అర్థం. ప్రతి విజయదశమికీ ఉదయం ఇంట్లో పూజ జరుగుతుంది. సాయంత్రం రావణుణ్ణి దహనం చేస్తారు కదా. ఆ దుష్ట దహన కార్యక్రమం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒకట్రెండు సార్లు నేనే రావణుణ్ణి రెడీ చేశా. హీరోయిన్ అయ్యాక దసరాకు ఇంటికి వెళ్లలేదు. ఏదో సినిమా షూటింగ్ ఉండేది. ఈ దసరాకు అమ్మానాన్నలు నాతోనే ఉంటున్నారు. అమ్మానాన్నలు నాతో ఉన్న ప్రతి రోజూ స్పెషలే. -
అదృశ్యమైన ఆర్మీ అధికారి యూపీలో తేలాడు
ఫైజాబాద్: అదృశ్యమైన ఆర్మీ అధికారి కెప్టెన్ శిఖర్ దీప్ ఆచూకీ లభ్యమైంది. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో ఆయన ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని శిఖర్ దీప్ తండ్రి ధ్రువీకరించారు. శనివారం ఉదయం తనతో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు. బిహార్కు చెందిన శిఖర్ దీప్ జమ్ము కశ్మీర్లో సైన్యంలో పనిచేస్తున్నారు. ఆయన తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ అనంత కుమార్ కూడా సైన్యంలో పనిచేస్తున్నారు. ఈ నెల 6న బిహార్ నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్తుండగా శిఖర్ దీప్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. కాగా ఆయన లగేజీ, ఫోన్ బోగీలోనే ఉన్నాయి. ఆ మరుసటి రోజు ఢిల్లీలో శిఖర్ దీప్ బంధువు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఉగ్రవాదులు ఎవరైనా శిఖర్ను కిడ్నాప్ చేసి ఉంటారా అనే అనుమానాలను ఆయన తండ్రి వ్యక్తం చేశారు. శిఖర్ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శిఖర్ గమ్యస్థానానికి చేరకుండా అదృశ్యంకావడం, ఆయన ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారన్న విషయాలు తేలాల్సివుంది. -
పాక్ దుశ్చర్య.. ఆర్మీ ఆఫీసర్ మృతి
జమ్మూకాశ్మీర్: పాకిస్థాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడగా దానిని నిలువరించే క్రమంలో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం మధ్యాహ్నం జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోగల నోగం సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటి వరకు బంకర్లో ఉన్న జూనియర్ కమిషన్డ్ రేంజ్ ఆర్మీ అధికారి బయటకు వచ్చిన సమయంలో పాక్ సైనికులు కాల్పులకు దిగారు. అయితే, ఆ వెంటనే భారత్ సైన్యం తీవ్రంగా స్పందించి కాల్పులు జరిపింది. అయితే, పాక్ వైపు ఏమైనా నష్టం జరిగిందా లేదా అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. గత రెండు వారాల నుంచి పాక్ వరుసక కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. -
రైలు పట్టాలపై ఆర్మీ ఆఫీసర్ మృతదేహం
విశాఖపట్నం : మణిపూర్ బెటాలియన్కి చెందిన ఆర్మీ ఆఫీసర్ బుధవారం ఉదయం విశాఖ రైల్వే స్టేషన్ మూడో నంబరు ప్లాట్ఫాం సమీపంలో పట్టాలపై శవమై కనిపించాడు. విధి నిర్వహణలో ఉన్న స్టేషన్ సూపరింటెండెంట్ కె.సన్యాసిరావు ఉదయం ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని గమనించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి రెండు భాగాలుగా విడిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. బీహార్ రాష్ట్రం రాజ్పూర్కు చెందిన పి.రంగేష్కుమార్గా గుర్తించారు. ఆయన లాన్స్నాయక్(ఎల్.ఎన్.కె) కేడర్లో మణిపూర్ ఆర్మీ బె టాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విశాఖలోని లాసన్స్బే కాలనీలో గల 13వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ శిక్షణ నిమిత్తం వచ్చాడు. మృతుని వద్ద దొరికిన పాస్పోర్టు, అతను శిక్షణ పొందుతున్న ఎన్సీసీ క్యాంపు ఆఫీసు నుంచి సమాచారాన్ని సేకరించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసుని విశాఖరైల్వే జీఆర్పీపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సైన్యాన్ని ముందుకు నడిపించే.. ఆర్మీ ఆఫీసర్
అప్కమింగ్ కెరీర్ దేశమాత సేవలో తరించేందుకు అవకాశం ఉన్న రంగం.. సైన్యం. దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడే సైనికులు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. అలాంటి వీర జవాన్లను ముందుండి నడిపించే నాయకుడే... ఆర్మీ ఆఫీసర్. బాధ్యతలు, సవాళ్లంటే ఇష్టపడే నేటి యువతకు సరిగ్గా సరిపోయే కెరీర్.. ఆర్మీ ఆఫీసర్. పురస్కారాలు, గౌరవ మర్యాదలు సరిహద్దుల రక్షణ, యుద్ధాల తోపాటు ప్రకృతి విపత్తుల్లోనూ సైన్యం సేవలందిస్తూ ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్లు తమ ర్యాంకును బట్టి ప్లాటూన్, కంపెనీ, డివిజన్, బ్రిగేడ్, కమాండ్, బెటాలియన్.. ఇలా వివిధ విభాగాలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా తమ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ముందుకు నడిపించాలి. జన్మభూమికి సేవ చేయాలన్న ఆశయం, ఉన్నతమైన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలన్న తపన ఉన్నవారు సైన్యంలోకి ప్రవేశించొచ్చు. ప్రస్తుతం ఆర్మీ ఆఫీసర్లకు భారీ వేతనాలు అందుతున్నాయి. పదవీ విరమణ అనంతరం కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చు. విధుల్లో భాగంగా ధైర్యసాహసాలు ప్రదర్శించే సైనికాధికారులకు అత్యున్నత పురస్కారాలు అందుతాయి. ప్రజల్లో విశేషమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. దీంతోపాటు వృత్తిపరమైన ఆత్మసంతృప్తి దక్కుతుంది. సైనికాధికారి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. ఆత్మవిశ్వాసం, అంకితభావం, పట్టుదల అవసరం. అర్హతలు: మిలిటరీ అకాడమీల్లో ప్రవేశానికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్; బ్యాచిలర్స డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షలు రాయొచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెక్నికల్ ఎంట్రీ ద్వారా సైన్యంలో ప్రవేశించొచ్చు. వేతనాలు: కమిషన్డ్ లెఫ్టినెంట్కు ప్రారంభంలో నెలకు రూ.25 వేల వేతనం అందుతుంది. లెఫ్టినెంట్ కల్నల్/కల్నల్కు దాదాపు రూ.70 వేల వేతనం ఉంటుంది. లెఫ్టినెంట్ జనరల్ నెలకు రూ.లక్షకు పైగానే పొందొచ్చు. దీంతోపాటు ఎన్నో రాయితీలు, భత్యాలు, వైద్య, బీమా సౌకర్యాలు ఉంటాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు * నేషనల్ డిఫెన్స్ అకాడమీ; వెబ్సైట్: www.nda.nic.in * ఇండియన్ మిలిటరీ అకాడమీ వెబ్సైట్: www.joinindianarmy.nic.in * ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వెబ్సైట్: www.joinindianarmy.nic.in సవాళ్లతో కూడిన కెరీర్! శ్రీఉజ్వల భవిష్యత్తుతోపాటు దేశ భద్రతలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించే కెరీర్ ఆర్మీ ఆఫీసర్. ఆర్మీలో కమిషన్డ్, నాన్కమిషన్డ్ అధికారులుంటారు. వారిలో సెకండ్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తదితర హోదాల్లో ఆర్మీ ఆఫీసర్లు పనిచేస్తారు. ఆర్మీ ఉద్యోగాలు సవాళ్లతో కూడినవే అయినప్పటికీ క్రమశిక్షణాయుతమైన జీవనం అలవడుతుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి కంటే మూడింతల మెరుగైన జీవితం ఆర్మీ ఆఫీసర్ సొంత్ంణ - మేజర్ జి. లక్ష్మణరావు, కెరీర్ కౌన్సెలింగ్ నిపుణులు,డెరైక్టర్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. -
ఐఎస్ఐ చేతికి ఆర్మీ మిస్సైల్స్ డేటా
* పటన్ అరెస్టుతో వెలుగుచూస్తున్న వాస్తవాలు * మిలటరీకి చెందిన ఫొటోలు, డాక్యుమెంట్లు అందజేత * మహిళా ఉగ్రవాది నుంచి పటన్ అకౌంట్కు రూ. 74 వేలు * ఉన్నతాధికారి కంప్యూటర్ నుంచి రహస్యాల చేరవేత సాక్షి, హైదరాబాద్: ఆర్మీ రహస్యాలు పాక్ ఉగ్రవాదులకు చేరవేసిన సైనిక అధికారి పటన్కుమార్ అరెస్టుతో దిమ్మతిరిగే విషయాలు గురువారం వెలుగు చూశాయి. పటన్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు వేసిన పిటిషన్పై నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ముద్దాయి తరఫున న్యాయవాది లేకపోవడంతో వాయిదా వేసినట్లు మేజిస్ట్రేట్ వెల్లడించారు. ముద్దాయి వాదన వినకుండా కస్టడీకి ఇవ్వలేమని, అతనికి పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. దీంతో పోలీసులు చంచల్గూడ జైలులో ఉన్న పటన్కు కస్టడీ పిటిషన్ విషయంపై వివరించారు. ఇలావుండగా పటన్ నుంచి 4 కంప్యూటర్లు, ల్యాప్టాప్, బ్లూటూత్, 3 సెల్ఫోన్లు, నాలుగు పెన్డ్రైవ్లు, 10 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్డిస్క్ను డీకోడ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ అధికారులు శ్రమిస్తున్నారు. డీకోడ్ అయితే పటన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్కు వెల్లడించిన మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. పటన్కుమార్ను సస్పెండ్ చేస్తూ పోలీసు శాఖకు ఆర్మీ అధికారులు సమాచారాన్ని అందజేసినట్లు తెలిసింది. పటన్కుమార్ వ్యవహార శైలిపై బీహార్, పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అతను పని చేసిన విభాగాల్లో అతని ప్రవర్తన, తీరుతెన్నులను తెలుసుకుంటున్నారు. అనుష్క అగర్వాల్ పేరిట చాటింగ్ చేసిన ఆ యువతి అసలుపేరు ఏమిటనేది తేలాల్సి ఉంది. పంపిన రహస్యాలు ఇవే ఆర్మీ మిస్సైల్స్ నిల్వ కర్మాగారాల వివరాలతో పాటు కీలక విభాగాల్లో ఉన్న 40 మంది ఆర్మీ అధికారుల వివరాలను పటన్ పంపినట్లు తెలుస్తోంది. ఆర్మీ డాక్యుమెంట్లు, ఫోటోలు కూడా పంపించాడు. దేశంలో ఉన్న 12 ఆర్మీ యూనిట్ల బ్రిగేడ్ల పేర్లు, ఆ ప్రదేశాల వివరాలు, పశ్చిమ సరిహద్దులోని ఆర్మీ సమాచారాన్ని ఫోన్లో అనుష్కకు చెప్పాడు. సైన్యం కదలికలు, ఎత్తుగడలు, కీలక స్థావరాలను ఆమెకు వెల్లడించాడు. జీ మెయిల్ ఐడీ ‘ప్రియాన్షూ1995’తో ఈ మెయిల్ సృష్టించిన పటన్ దాని ఐడీని అనుష్కకు చేరవేశాడు. పలు వివరాలను ఈ మెయిల్కు పంపగానే ఆమె వాటిని డౌన్లోడ్ చేసుకుంది. కాగా పాక్ మహిళా ఉగ్రవాదికి పలు రహస్యాల చేరవేతపై ఆర్మీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓ అధికారికి చెందిన కంప్యూటర్ను పటన్ ఉపయోగించాడని అధికారుల పరిశీలనలో తేలింది. ఆ అధికారి కంప్యూటర్ కోడ్ పటన్కు తెలియడంతో ఆ వివరాలను అనుష్కకు పంపినట్లు తెలిసింది. రహస్యాలకు పారితోషికం ఇక్కడి సమాచారాలు అనుష్కకు అందించినందుకు గాను మొదటిసారిగా 2013 మేలో బీహార్లోని ఎస్బీఐలో ఉన్న పటన్ బ్యాంక్ అకౌంట్లోకి పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని ఎస్బీఐ (మంగల్వాడి బ్రాంచి) నుంచి రూ.9,000ను అనుష్క పంపించింది. ఇలా ఏడాది కాలంలో రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.20 వేల చొప్పున రూ.74 వేలు వేసింది. తాను అడిగిన రహస్యాలు పంపితే హైదరాబాద్కు వచ్చి స్వయంగా కలుస్తానని, లండన్కు కూడా పంపిస్తానని చెప్పింది. తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసాడని పటన్ను నమ్మించింది. పటన్ చిక్కాడిలా పటన్ సెల్కు ఐఎస్ఐ మహిళా ఉగ్రవాది చేసిన సెల్ నంబర్ టవర్ లొకేషన్ను పోలీసులు గుర్తించారు. ఆమె వాడిన సెల్ఫోన్ ప్రదేశం పాక్ సరిహద్దుల్లోదని తేలింది. దీంతో ఆమె పాకిస్థాన్ నుంచే ఆర్మీ రహస్యాలను రాబట్టిందని విచారణలో తేలింది. పాక్ సరిహద్దుల్లో సెల్ఫోన్లను ఐబీ అధికారులు ట్రాప్ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి తరచూ ఫోన్లు వస్తున్నాయని గ్రహించారు. ఐబీ అధికారులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేయడంతో పటన్ గుట్టు రట్టయ్యింది. 15 రోజులు టాస్క్ఫోర్స్ పోలీసులు శ్రమించి పటన్ను పట్టుకోగలిగారు. పటన్ నేపథ్యమిదీ బీహార్ రాష్ట్రానికి చెందిన పటన్కుమార్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత ఇతని కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్థిరపడింది. 1996లో క్లర్క్గా ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. మొదటి పోస్టింగ్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో నిర్వహించాడు. 2010లో పెళ్లి చేసుకున్నాడు. 2006 నుంచి 2012 వరకు జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని ఆర్మీ సెంటర్లో పనిచేశాడు. 2012లో సికింద్రాబాద్కు బదిలీ అయ్యాడు. అతని భార్య, పిల్లలు మాత్రం బీహార్లోనే ఉంటున్నారు. అనుష్క ఎఫ్బీలో సైనికాధికారుల ఫొటోలు కాగా అనుష్క ఫేస్బుక్లో 20 మంది సైనికాదుకారుల పేర్లు, ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. వారి పాత్ర ఏ మేరకు ఉందనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఆర్మీ పీఆర్ఓ వివరణ పటన్ ఈఎంఈలో పనిచేయడం లేదని అతను ఆర్మీ ఆర్టిల్లరీ విభాగానికి చెందిన వాడని ఆర్మీ పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సికింద్రాబాద్లోని 151 ఎంసీ/ఎంఎఫ్ డిటాచ్మెంట్ వి భాగంలో పనిచేస్తున్నట్లు అందులో పేర్కొంది. -
అనుష్క పది లక్షలు ఇచ్చిన తర్వాతే..!
-
'అనుష్క నా అకౌంట్లో 10 లక్షలు జమ చేసింది'
హైదరాబాద్ : పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్మీ అధికారి పటన్కుమార్ పొద్దార్ నాయక్ (40) విచారణలో సరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. పాక్ మహిళ అనుష్క అగర్వాల్తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు పటన్ కుమార్ వెల్లడించారని చెప్పారు. అలాగే అనుష్క తన అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేసిందని చెప్పాడన్నారు. భారత్ - పాక్ సరిహద్దుల్లోని పూంచ్ సెక్టర్లో ఆర్మీ కదలికలపై అనుష్కకు సమాచారం అందించాడన్నారు. అయితే పటన్కుమార్ చెందిన రెండు అకౌంట్ల నుంచి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పటన్ కుమార్ను తమకు అప్పగించాలని నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు పటన్ కుమార్ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్నాయని తెలిపారు. పోలీసుల విచారణలో పొద్దార్ నాయక్ వెల్లడించిన విషయాలను పోలీసులు వెల్లడించారు. అనుష్క అగర్వాల్తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్తో ఉందని పోలీసులు వెల్లడించారు. -
సైనికాధికారి దేశద్రోహం
-
సైనికాధికారి దేశద్రోహం
* అరెస్టు చేసిన హైదరాబాద్పోలీసులు * మహిళా ఉగ్రవాది ట్రాప్లో పడి సైనిక రహస్యాల చేరవేత సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్న ఓ మిలటరీ అధికారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్ఐ సంస్థకు చెందిన ఓ మహిళా ఏజెంట్ మిలటరీ అధికారిని తన ఫేస్బుక్ ద్వారా ట్రాప్లోకి దింపింది. అతని ద్వారా మిలటరీ స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల సారాంశం, వారి రాకపోకల వివరాలను రాబట్టింది. ఈ మేరకు సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ దేశద్రోహిని అరెస్టు చేసి నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు బుధవారం హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు ఆ ప్రబుద్ధుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుడి నుంచి మరిన్ని రహస్య సమాచారాలు రాబట్టేందుకు ఏడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన పటన్కుమార్ పొద్దార్ నాయక్(40) సికింద్రాబాద్లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చిపోయే మిలటరీ అధికారులకు ఆహ్వానం పలకడం, వీడ్కోలు తెలపడం లాంటి విధులు నిర్వహించేవాడు. మిలటరీ అధికారులకు రిజర్వేషన్ టికెట్లు కూడా సమకూర్చేవాడు. ఏడాది క్రితం అనుష్క అగర్వాల్(పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ మహిళా ఉగ్రవాది, ఏజెంట్)తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య మరింత స్నేహం పెరిగింది. ఆమె తన నగ్న ఫోటోలను, నగ్న చిత్రాలను పటన్కు పంపింది. ఆమె వలలో పడ్డ పటన్ ఈమెయిల్, ఫేస్బుక్, ఫోన్ ద్వారా దేశానికి చెందిన మిలటరీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల తేదీలు, సమావేశాల సారాంశాలు, అధికారులు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు చేరవేసేవాడు. అతనిపై అనుమానం వచ్చిన మిలటరీ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ కేసును డీజీపీ అనురాగ్శర్మ, నగర పోలీసు కమిషనర్ ఎమ్.మహేందర్రెడ్డిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్కు డీజీపీ తెలియజేశారు. పటన్పై దేశద్రోహంతో పాటు అధికార రహస్య రక్షణ చట్టం -1923 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం.... పటన్ గురించి మరింత సమాచారం కోసం డీజీపీ అనురాగ్శర్మ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అతన్ని ఏడు రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ వేశారు. అక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు పటన్ను విచారించే అవకాశాలు ఉన్నాయి. ఉలిక్కిపడ్డ మిలటరీ వర్గాలు... నిన్న మొన్నటి వరకు తమతో పాటు విధులు నిర్వహించిన ఉద్యోగి పటన్కుమార్ పొద్దార్ నాయక్ (40) దేశద్రోహానికి పాల్పడి పట్టుబడడంతో సికింద్రాబాద్, మెహదీపట్నం, కంటోన్మెంట్లోని మిలటరీ కేంద్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇక్కడి స్థావరాల వివరాలు, అధికారుల పేర్లు, సెల్ నంబర్లు పాకిస్థాన్లోని మహిళా ఉగ్రవాదికి చేరడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించేందుకు ఢిల్లీలోని మిలటరీ ఉన్నతాధికారులు గురువారం నగరానికి రానున్నట్లు సమాచారం. మరోపక్క దర్యాప్తులో భాగంగా నగర పోలీసులు పటన్ వాడిన కంప్యూటర్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులోని హార్డ్డిస్క్ను డీకోడ్ చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారుల సహకారం తీసుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మిలటరీ అధికారులు రాకపోకలు సాగించే సమయంలో ఇతని వెంట ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఉండేవారా అనే కోణంలో స్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్ల నుంచి పటన్.. మహిళా ఉగ్రవాదితో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అతని సెల్ఫోన్ కాల్డేటా తీసిన అధికారులకు అందులో కీలకమైన కొన్ని సెల్ నంబర్లు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నంబర్లు ఉగ్రవాదులకు చెందినవా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. విదేశాలకు చెందిన ఫోన్ నంబర్లు కూడా అందులో ఉన్నట్లు సమాచారం. అతని గదిలో కీలకమైన కొన్ని ఆధారాలు లభించినట్లు తెలిసింది. అలాగే సెక్యూర్డ్ లైఫ్ అనే కంపెనీ పేరుతో మనీ సర్క్యులేషన్ నెట్వర్క్ను కూడా నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతనిపై మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. పటన్ మిలటరీ రహస్యాలను అందించింది అనుష్క అగర్వాల్ అనే మహిళకని, ఆమె పాకిస్థాన్కు చెందిన మహిళా ఉగ్రవాదిగా భావిస్తున్నారు. ఈమె తన పేరును మార్చి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో నివాముంటున్నట్లు ఫేస్బుక్ తెరిచింది. ఈ ఫేస్బుక్తోనే పటన్ను ఆమె వలలో వేసుకుంది.