ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7 నుంచి ఐదు రోజుల పాటు నాలుగు ఆఫ్రికా దేశాలలో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7 నుంచి ఐదు రోజుల పాటు నాలుగు ఆఫ్రికా దేశాలలో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంతో సంబంధాల పటిష్టతకు మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాల్లో పర్యటిస్తారు. అపార వనరులున్న ఆఫ్రికాలో పొరుగు దేశం చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టారు.
రాష్ట్రపతి ప్రణబ్జ్, ఉప రాష్ట్రపతి అన్సారీలు ఇటీవలే ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు. ఆఫ్రికా- భారత్ మధ్య అత్యున్నత రాజకీయ స్థాయిలో సన్నిహిత సంబంధాల నిర్మాణం, సహకార బలోపేతం, పెంపొందించటానికి మోదీ పర్యటన దోహదం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.