భారత్‌పై ఓఐసీ విమర్శలు... నఖ్వీ స్పందన | Mukhtar Abbas Naqvi Says India Heaven For Muslims After OIC Criticism | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఓఐసీ విజ్ఞప్తి... నఖ్వీ స్పందన

Published Tue, Apr 21 2020 1:09 PM | Last Updated on Tue, Apr 21 2020 1:17 PM

Mukhtar Abbas Naqvi Says India Heaven For Muslims After OIC Criticism - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలపై వివక్షను రూపుమాపి వారి హక్కులు కాపాడాలంటూ ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య(ఓఐసీ) భారత్‌కు విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఇస్లామోఫోబియా పెంచడాన్ని కట్టడి చేయాలని కోరింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఓఐసీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ముస్లింలకు భారత్‌ స్వర్గధామమని... సామాజికంగా, ఆర్థికంగా, మతపరమైన విషయాల్లో తమ హక్కులకు వచ్చిన ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు.(లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌‌: మంత్రుల సమావేశం!

‘‘భారత ముస్లింలు ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించే వారెవరూ వారికి స్నేహితులు కాబోరు’’ అని వ్యాఖ్యానించారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మీడియా ఉద్దేశపూర్వకంగానే ముస్లింలపై వివక్ష ప్రదర్శిస్తూ దుష్ప్రచారం చేస్తోందంటూ ఓఐసీ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేసింది. ఇక భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే సాకుగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాగ్యుద్దానికి దిగిన విషయం తెలిసిందే.(భారత్‌ పాక్‌ మధ్య మాటల యుద్ధం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement