కేంద్ర మాజీమంత్రి మురళీ దేవరా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ...
ముంబయి : కేంద్ర మాజీమంత్రి మురళీ దేవరా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న మురళీ దేవరా ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా దేవ్రా మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేవ్రా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.