అమెరికా అధ్యక్షుడు ఒబామా తాజ్ మహల్ పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ...
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ఒబామా తాజ్ మహల్ పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం అధికారికంగా వెల్లడించింది. కాగా షెడ్యూలు ప్రకారం జనవరి 27న ఒబామా తన సతీమణి మిషెల్లీతో తాజ్ను సందర్శించాల్సి ఉంది. అయితే ఒబామా సౌదీ అరేబియా పర్యటన కారణంగా తాజ్మహల్ పర్యటన రద్దు అయినట్లు యూపీ అధికారులు తెలిపారు.
దాంతో ఆగ్రా నుంచి అమెరికా భద్రతా బలగాలు వెనుదిగిగాయి. భారత్ పర్యటన అనంతరం ఒబామా సరాసరి సౌదీ వెళ్లనున్నారు. సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అబ్దుల్లా కుబుంబాన్ని ఒబామా పరామర్శించనున్నారు.
కాగా ఒబామా తాజ్మహల్ ఈ నేపథ్యంలో తాజ్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సెల్ ఫోన్లు పనిచేయకుండా ఎలక్ట్రానిక్ జామర్లు ఏర్పాటు చేశారు.