జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్, అజ్మీర్ లోక్సభ స్థానాలకు, మందల్గర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మరో సంవత్సరం(2019)లో లోక్సభకు సాధారణ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఈ ఉప ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా సుమారు 40 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అజ్మీర్లో బీజేపీ నేత సన్వర్లాల్ జాట్ కుమారుడు రామ్స్వరూప్ లాంబా కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘుశర్మపై పోటీలో ఉన్నారు. అలాగే అల్వార్లో రాజస్థాన్ మంత్రి జశ్వంత్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ కరణ్సింగ్ యాదవ్పై పోటీ చేస్తున్నారు. మందల్గర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి శాంతిసింగ్ హడా, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ధాకడ్ల మధ్య పోటీ ఉండనుంది. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ తీరుపై వివరాలందించేందుకు ప్రిసైడింగ్ అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన కొత్త పోర్టల్ను ఏర్పాటు చేశారు.
రాజస్థాన్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Jan 29 2018 11:15 AM | Updated on Mar 18 2019 9:02 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
Rajasthan Bypoll: రెబల్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
రాజస్థాన్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో (నవంబర్ 13న) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ రెబల్ నేత నరేష్ మీనాను కాంగ్రెస్ గురువారం ...
-
Lok Sabha Election 2024: ఫలోదీ సట్టా బజార్లో... తగ్గిన బీజేపీ హవా
లోక్సభ ఎన్నికల ఫలితాలపై రాజస్తాన్లోని ఫలోదీ సట్టా బజార్ తాజా అంచనాలు ఎలా ఉన్నాయి? కచి్చతమైన అంచనాలు, బెట్టింగ్లకు దేశమంతటా పేరొందిన ఫలోదీ మార్కెట్ ఇప్పటికీ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని నమ...
-
ట్రెండ్ మాకే అనుకూలం..గెలిచి తీరుతాం!
జైపూర్ : ఈ ఏడాది చివర్లో జరగబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ (40) ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నిక...
-
ముందస్తు ఎన్నికలు మరింత ముందుకు..!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్లోని రెండు లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల కేంద్రంలోని పాలకపక్షం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో ఆందోళన మొదలైంది. ...
-
రాజస్తాన్ ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్
జైపూర్/కోల్కతా: బీజేపీ జోరుకు రాజస్తాన్లో కళ్లెం పడింది. రాష్ట్రంలో రెండు లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. అల్వార్, అజ్మీర్ లోక్సభ స్థానాలను, మండల్గఢ...
Advertisement