అకాల వర్షాలు.. 28 మంది మృతి | Rains, Hailstorm Damage Standing Crops in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీని కుదిపేసిన అకాల వర్షాలు

Mar 14 2020 8:26 AM | Updated on Mar 14 2020 8:26 AM

Rains, Hailstorm Damage Standing Crops in Uttar Pradesh - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 28 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు.

లక్నో: గురువారం నుంచి ఉత్తర ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 28 మంది మృతి చెందారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గోడలు కూలడం, చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటి కారణాల వల్ల వీరంతా మృతి చెందినట్లు తెలిపారు. పిలిబిత్‌, సీతాపూర్‌, చాందౌలీ, ముజాఫర్‌నగర్‌, భాగ్‌పట్‌, బిజ్‌నోర్‌, ఔన్‌పూర్‌ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.

మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. పంట, పశువుల నష్టాన్ని అంచనా వేయాలని.. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించారు. వర్షాలకు తోడు గాలిదుమ్ముల కారణంగా గోధుమలు, ఆవాలు పంటలు బాగా దెబ్బతిన్నాయి. బంగాళా దుంపల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. (చదవండి: కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement