హస్తినలో తెలంగాణ న్యాయవాదుల ఆందోళన | telangana lawyers mahadharna at Jantar Mantar in Delhi | Sakshi
Sakshi News home page

హస్తినలో తెలంగాణ న్యాయవాదుల ఆందోళన

Published Mon, Jul 25 2016 1:22 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

telangana lawyers mahadharna at Jantar Mantar in Delhi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తెలంగాణ న్యాయవాదులు సోమవారం మహాధర్నా నిర్వహిస్తున్నారు. హైకోర్టు విభజన చేయాలంటూ  తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆందోళన చేపట్టింది. హైకోర్టు విభజన అంశంపై నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పది జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైకోర్టు విభజన, తెలంగాణలో ఆంధ్రా న్యాయమూర్తుల నియామకాలు రద్దు చేయాలని, న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

న్యాయవాదుల ఆందోళనకు పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారుల విభజనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలన్నారు. హైకోర్టు విభజన జరిగేవరకూ తెలంగాణ న్యాయవాదులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement