తప్పులో కాలేసిన విద్యాశాఖ మంత్రి | uttar pradesh minister says we celebrating 59th republic day | Sakshi
Sakshi News home page

తప్పులో కాలేసిన విద్యాశాఖ మంత్రి

Jan 26 2018 5:11 PM | Updated on Jul 11 2019 5:07 PM

uttar pradesh minister says we celebrating 59th republic day - Sakshi

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి సందీప్‌ సింగ్‌ తప్పులో కాలేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి బదులుగా 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనండంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అలీఘర్‌లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సందీప్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనమంతా కలిసి 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చాలా మంది నాయకులు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను కొల్పోయారని, వారి వలనే మనంమంతా సమాన హక్కులను పొందుతున్నామని చెప్పారు. సందీప్‌ సింగ్‌ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement