uttarpradesh
-
యోగి సర్కారుకు ఎనిమిదేళ్లు.. యూపీలో సంబరాలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కారు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలోనూ బీజేపీ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జ్లు, కార్యకర్తలు ‘ఉత్తరప్రదేశ్ శ్రేయస్సు - ఎనిమిది వసంతాల బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదంతో గ్రామాలలో సందడి చేస్తున్నారు.ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం(State Government) మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు నిర్వహించనుంది. రాష్ట్రంలోని బూత్ల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాల వరకు అన్నిచోట్లా ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 24 నుండి జిల్లా స్థాయిలో వర్క్షాప్లు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పథకాలను, ఇందుకోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి చేరవేయనున్నారు. అసెంబ్లీ స్థాయిలో అభివృద్ధి సదస్సులు కూడా నిర్వహించనున్నారు.జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టుల గురించి అందరికీ వివరించేందుకు యువమోర్చా బైక్ ర్యాలీ(Bike rally)లు నిర్వహించనుంది. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి, అందరికీ తెలియజేయనున్నారు. ఏప్రిల్ 14న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేయనున్నారు.ఇది కూడా చదవండి: ‘రెండు కిలోల వెల్లుల్లి, రూ. 500 తెస్తేనే కేసు దర్యాప్తు’ -
రాహుల్ గాంధీకి కోర్టు రూ.200 జరిమానా.. ఎందుకంటే?
లక్నో: లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీకి (Rahul Gandhi) కోర్టు ఫైన్ విధించింది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (acjm)ముందు హాజరు కావాల్సి ఉంది.కానీ రాహుల్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. రాహుల్ తీరుపై ఏసీజేఎం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 ఫైన్ విధించారు. ఇదే కేసులో ఏప్రిల్ 14న కోర్టు విచారణకు తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. -
తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. బోగీలు రెండుగా విడిపోయి..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో(Uttar Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న రైలు బోగి రెండుగా విడిపోయాయి. 200 మీటర్ల మేర ప్రయాణించాయి. బోగి విడిపోవడంపై అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ రైలు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.పోలీసుల సమాచారం మేరకు..బీహార్ నుంచి ఒడిశాలోని పురి ప్రాంతానికి నందన్ కానన్ ఎక్స్ప్రెస్ (Nandan Kanan Express ) బయలుదేరాల్సి ఉంది. అయితే, మార్గం మధ్యలో ఉత్తర ప్రదేశ్లో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్ (Pandit Deen Dayal Upadhyaya (DDU) లో నందన్ కానన్ ఎక్స్ప్రెస్ బోగీ విడిపోయింది. #WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025ట్రైన్ ఆరు బోగీలు విడిపోయి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోయాయి. మిగతా 15 బోగీలు వెనకే ఉన్నాయి. బోగీలు విడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్ను నిలివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల్ని సురక్షితంగా మరో కోచ్కు తరలించారు. అనంతరం, రైలు బోగీ విడిపోవడంపై రైల్వే అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రైలు కప్లింగ్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని మళ్లీ అతికించారు. -
ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయణమనగానే ఎవరికైనా ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి పెద్ద నగరాలు గుర్తుకువస్తాయి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు ఇందుకోసం ఈ ఆయా నగరాలకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రాష్ట్రంలోని ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 487 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 34 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. ఇప్పుడు ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ విమానాశ్రయాలు యూపీలో ఎక్కడున్నాయనే వివరాల్లోకి వెళితే..అయోధ్యరామజన్మభూమి అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమైన దరిమిలా అక్కడ ‘మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో విదేశీ పర్యాటకులు నేరుగా అయోధ్యకు చేరుకోగులుగుతున్నారు.నోయిడా నోయిడాలోని జెవార్లో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. 40.0919 హెక్టార్ల భూమిలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం సాగింది. ఇక్కడ ఐదు ఐదు రన్వేలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.కుషీనగర్కుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.లక్నో -వారణాసియూపీలోని లక్నో, వారణాసిలో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
ఏయ్.. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?.. మంత్రి గారి మేనల్లుడు వీరంగం!
లక్నో : ఏయ్.. నాకే ఎదురు చెబుతావా? నేను ఎవరినో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అంటూ ఓ మంత్రి మేనల్లుడు వీధిలో వీరంగం సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడికి దిగాడు. ప్రస్తుతం ఆ ఘటన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు ఓ వీధిలో తన స్కార్పియోలో వెళుతున్నాడు. రద్దీగా ఉన్న వీధిలో స్కార్పియోకి ఎదురుగా ఓ రిక్షావాలా అడ్డొచ్చాడు. దీంతో అటు స్కార్పియో, ఇటు ఆటో ముందుకు కదల్లేని పరిస్థితి.ఆ సమయంలో అక్కడే పూలవ్యాపారం చేస్తున్న ఇద్దరు దంపతులు మంత్రి మేనల్లుడి స్కార్పియోను ముందుకు పోనివ్వాలని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న అతని సహాయకుడికి సూచించాడు. సహాయకుడు ముందు ఆటో పోనివ్వండి. ఆ తర్వాత స్కార్పియో ముందుకు కదులుతుందని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగింది.స్కార్పియోలో డ్రైవింగ్ సీట్లో ఉన్న మంత్రి మేనల్లుడు పూల వ్యాపారుల్ని అసభ్యంగా దూషించాడు. కారు దిగి దాడికి దిగాడు. పూల వ్యాపారిని కిందకి నెట్టి పిడిగుద్దులు గుద్దాడు.ఘర్షణపై సమాచారం అందుకు పూల వ్యాపారి బంధువులు సైతం మంత్రి మేనల్లుడిని రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారింది. గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.UP BJP minister @isomendratomar’s nephew seen beating a poor flower vendor over a free bouquet. Ram Rajya! pic.twitter.com/UfWVjDtfmj— Manish RJ (@mrjethwani_) February 23, 2025 -
అమ్మకానికి కుంభమేళా మహిళల పుణ్య స్నానాల వీడియోలు!
లక్నో : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) భక్తులు పెద్దఎత్తున తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 56 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈక్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న,కొనుగోలు చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు 103 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.యూపీ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ కుంభమేళాలో మహిళలు స్నానమాచరించడం, దుస్తులు మార్చుకునే వీడియోల్ని పలువురు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్రొఫైళ్లు, గ్రూపుల్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ మీడియాతో తెలిపారు. బుధవారం కుంభమేళాలో స్నానం చేయడంతో పాటు, దుస్తులు మార్చుకుంటున్న మహిళల వీడియోల్ని తీస్తున్నారు. వాటిని అమ్మకానికి పెడుతున్నట్లు సమాచారం వచ్చింది.ఆ వీడియోలను అమ్మేవారిని, కొనుగోలు చేసే వారిని అరెస్ట్ చేస్తాం. మా సోషల్ మీడియా టీమ్ నిరంతరం వీటిని మానిటర్ చేస్తోంది. ఎవరైతే మహిళల ప్రైవేట్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారో, వారి ప్రొఫైళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు లేదా గ్రూపులను గుర్తించారనే సమాచారంపై డీఐజీ వైభవ్ కృష్ణ స్పందించారు. 103 సోషల్ మీడియా ప్రొఫైళను గుర్తించాం. వీటిలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అకౌంట్లతో పాటు మహిళల ప్రైవేట్ వీడియోలను పోస్ట్ చేస్తున్న అకౌంట్లు ఉన్నట్లు వెల్లడించారు. 26 సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో కుంభమేళాలో స్నానమాచరించే మహిళల వీడియోల్ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్నవారందరిపై చర్యలు తీసుకుంటామని కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ హెచ్చరించారు. కాగా, కుంభమేళాలో మహిళల వీడియోల్ని తీస్తున్న దుండగులు ఒక్కో వీడియోను రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. -
‘మహా కుంభ్కాదు.. మృత్యుకుంభ్’ : దీదీ
కోల్కతా : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ‘మహాకుంభ మేళా’ను (Maha Kumbha Mela) మహా కుంభ్ కాదు.. మృత్యుకుంభ్ అని వ్యాఖ్యానించారు.పశ్చిమబెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మమతా బెనర్జీ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. ‘కుంభమేళాకు వెళ్లి భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.. యూపీ సర్కార్ వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసింది. సామాన్యుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.నేను మహా కుంభమేళాను గంగామాతకు గౌరవ సూచికంగా భావిస్తున్నాను. కానీ పేదలకు కనీస సదుపాయాలు లేవు. వీఐపీల కోసం మాత్రమే ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్గ్రేషియా అందలేదు. పోస్ట్మార్టం చేయకుండా మృతదేహాల్ని వారి కుటుంబాలకు అప్పగించారు. పోస్టుమార్టం చేసి, డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తేనే కదా ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా అందేది. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఎక్స్ గ్రేషియా ఎలా పొందుతారు’ అని ప్రశ్నించారు. కాగా, ప్రయాగ్రాజ్లో (Prayag Raj) జనవరి 13 ప్రారంభమైన మహాకుంభ మేళా 45 రోజులపాటు అంటే ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటన.. ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభం
New Delhi Railway Station Stampede Live Updates:న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న మహాకుంభమేళా (Kumbh Mela)లో పాల్గొనేందుకు వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station) తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మొత్తం 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2:00pmతొక్కిసలాటకు కారణాలేంటి?ప్రయాగ్ రాజ్కు వెళ్లే ప్రత్యేక రైళ్ల ఆలస్యం కారణంగా ఫ్లాట్ఫామ్పై వేల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులురద్దీ గమనించకుండా గంటలోనే 1500 జనరల్ టికెట్లను అమ్మిన రైల్వే శాఖ అప్పటికే ఫ్లాట్ఫామ్లపై ఉన్న రద్దీకి తోడు కొత్తగా టికెట్లు ఇవ్వడంతో పెరిగిన రద్దీ 16వ నెంబర్ ఫ్లాట్ఫామ్ పైకి స్పెషల్ ట్రైన్ వస్తుందని రైల్వే అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ విని 14,14,15 ప్లాట్ ఫామ్లో ఉన్న ప్రయాణికులు 16వ ప్లాట్ ఫామ్ పైకి పరుగులు పరుగులు తీయడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో కనీ విని ఎరుగని స్థాయిలో పెరిగిన రద్దీ ఈనెల 26వ తేదీతో మహాకుంభమేళా ముగుస్తుండడంతో ఎలాగైనా అక్కడికి చేరుకోవాలని భక్తులు ఆత్రుత సరైన మేనేజ్మెంట్ లేక చేతులెత్తేసిన రైల్వే శాఖ పోలీసులు ఫలితంగా 18 మంది ప్రయాణికుల మృతి 50 మందికి పైగా గాయాలుప్రస్తుతం రైల్వేస్టేషన్లో సాధారణ పరిస్థితి. యధావిధిగా ట్రైన్ ఆపరేషన్స్12:06pmన్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసిన రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ద్విసభ్య కమిటీలో నార్తన్ రైల్వేకు చెందిన నర్సింగ్ దేవ్,పంకజ్ గంగ్వార్లను సభ్యులుగా చేర్చింది. 11:40amఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కుంభమేళాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటన, కుంభమేళాకు వెళ్లే రైళ్ల జనరల్ భోగి టికెట్ల అమ్మకమే ప్రధాన కారణమని సమాచారం. 10:40amఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.9:40amఢిల్లీ దుర్ఘటన.. యూపీ పోలీసుల అప్రమత్తంఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జీల వద్ద భారీ ఎత్తున బందుబస్తు పటిష్టం చేశారు. రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. 8:50amతొక్కిసలాటకు ప్రభుత్వ అసమర్థతే కారణంన్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్ను కలచివేస్తోంది. మృతులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ ఘటన మరోసారి రైల్వే విభాగం వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోంది ప్రయాగ్రాజ్కు వెళ్తున్న భక్తుల విపరీతమైన సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, స్టేషన్లో మెరుగైన ఏర్పాట్లు చేయాల్సింది. ప్రభుత్వంతో పాటు పరిపాలన యంత్రాంగం కూడా నిర్లక్ష్యం, అసమర్ధతే ప్రయాణికుల ప్రాణాలు తీసింది. కుంభమేళాకు భక్తులు భారీగా వస్తారని తెలిసినా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ मचने से कई लोगों की मृत्यु और कईयों के घायल होने की ख़बर अत्यंत दुखद और व्यथित करने वाली है।शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।यह घटना एक बार फिर रेलवे की नाकामी और सरकार…— Rahul Gandhi (@RahulGandhi) February 16, 2025 మృతులకు ఎక్స్ గ్రేషియాఢిల్లీ తొక్కిసలాట మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయాపడిన వారికి రూ.2.5లక్షలు,స్వల్పంగా గాయపడిన వారికి ఒక లక్ష ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిన్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పెను విషాదంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు. ‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనతో ఆందోళనకు గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.— Narendra Modi (@narendramodi) February 15, 2025మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి : రాష్ట్రపతి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. Deeply anguished to know about the loss of lives in a stampede at New Delhi Railway station. I extend my heartfelt condolences to the bereaved families and pray for speedy recovery of those injured.— President of India (@rashtrapatibhvn) February 16, 2025 పరిస్థితి అదుపులోనే ఉంది : అశ్విని వైష్ణవ్రైల్వే స్టేషన్లో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు, నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. Situation under control at New Delhi railway station (NDLS) Delhi Police and RPF reached. Injured taken to hospital. Special trains being run to evacuate sudden rush.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 15, 2025 న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్తో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తేవాలని, సహాయక సిబ్బందిని నియమించాలని సీఎస్ను ఆదేశించాం. ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను నియంత్రించాలని సీఎస్ అండ్ సీపీని ఆదేశించాం. నిరంతరం కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. There has been an unfortunate incident at New Delhi Railway Station. Have spoken to Chief Secretary & Police Commissioner and asked them to address the situation. CS has been asked to deploy relief personnel. Have instructed CS & CP to be at the site and take control of…— LG Delhi (@LtGovDelhi) February 15, 2025ప్రయాణికులు మా మాట వినలేదున్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై మరో ప్రత్యక్ష సాక్షి ఐఏఎఫ్ సార్జెంట్ అజిత్ మీడియాతో మాట్లాడారు. ‘రైల్వే స్టేషన్లో మాకు ట్రై సర్వీస్ కార్యాలయం ఉంది. నేను నా డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రయాణికులు కిక్కిరిపోయారు. దీంతో నేను ముందుకు వెళ్లలేకపోయాను. గుమిగూడొద్దని నేను ప్రయాణికులకు చెప్పి చూశా. రైల్వే అధికారులు సైతం ప్రయాణికులు గుమిగూడకుండా ఉండేలా చూసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ప్రయాణికులు ఎవరూ వినలేదు’అని తెలిపారు. "Administration working hard to prevent any mishap, but no one was listening": Eyewitness IAF sergeant recounts NDLS stampedeRead @ANI Story | https://t.co/XPLjbQzxn3#Stampede #Crowdsurge #NDLS pic.twitter.com/wpGCdXoNcr— ANI Digital (@ani_digital) February 16, 2025 విషాదంపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షి రవి మాట్లాడుతూ.. సుమారు 9.30 గంటల సమయంలో అనుకుంటా. కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఫ్లాట్ఫారమ్స్ మారనప్పటికి కిక్కిరిసిన 13వ నంబర్ ప్లాట్ఫారమ్లోని ప్రయాణికులు 14, 15 ప్లాట్ఫారమ్లో రైళ్లను చూసి అటువైపు పరిగెత్తారు.రద్దీ విపరీతంగా ఉండటంతో పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో విషాదకరమైన తొక్కిసలాటకు దారితీసింది -
ఫస్ట్ క్లాస్ జర్నీలో ‘హౌస్ అరెస్ట్’.. వీడియో వైరల్
మహా కుంభ మేళా ఇంకా కొన్ని రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో అక్కడకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోంది. ఒకసారి మహా కుంభ మేళా వెళ్లి అక్కడ పుణ్య స్నానం రావాలనేది భక్తుల తాపత్రయం. ఈ క్రమంలోనే ఎవరికి దొరికిన వాహనాల్లో వారు ప్రయాగ్ రాజ్ కు పయనం అవుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది రైలు మార్గంలోనే ప్రయాగ్ రాజ్కు చేరుకుంటున్నారు. ఇందులో కొందరు టికెట్ తీసుకుని వెళ్లేవారైతే, కొందరు టికెట్ లేకుండానే అక్కడకు వెళుతున్నారు.తాజాగా ఓ ప్రయాణికుడు ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలు ఎక్కాడు. అతనికి కేటాయించిన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు. అంతా బానే ఉంది. ఫస్ట్ క్లాస్ టికెట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదనుకున్నాడు సదరు ప్రయాణికుడు. కానీ ఒకానొక సందర్భంలో లేచి క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు. అంతే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ కాస్తా జనరల్ బోగీల కనిపించింది. దాన్ని వీడియోలో బంధించాడు. కనీసం బాత్రూమ్కు వెళ్లే దారి కూడా లేకపోవడంతో 16 గంటల పాటు ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లోనే ‘హౌస్ అరెస్టు’ అయినట్లు ఆ ప్రయాణికుడు తెలిపాడు. దీన్ని ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా 26 మిలియన్ వ్యూస్ వచ్చాయట. View this post on Instagram A post shared by Piyushh Agrawal (@piyushhagrawal) -
పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది
లక్నో: యూపీలోని లక్నోలో ఊహకందని ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆనందంగా పెళ్లి వేడుకలు జరుగుతుండగా హఠాత్తుగా ఒక చిరుత ప్రత్యక్షమయ్యింది. దానిని చూసినవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.లక్నోలోని బుద్ధేశ్వర్ రింగ్ రోడ్డులో గల ఎంఎం లాన్లో బుధవారం రాత్రి ఒక వివాహ వేడుక జరుగుతోంది. అతిథులతో వాతావరణమంతా ఎంతో సందడిగా ఉంది. అయితే ఇంతలో ఊహకందని రీతిలో ఒక చిరుత అతిథుల మధ్యకు ప్రవేశించింది. ఈ ఘటన లక్నోలోని పారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 11.40 నిముషాల సమయంలో ఒక చిరుత పెళ్లి వేడుకల్లోకి చొరబడింది. దానిని చూసి హడలెత్తిపోయిన అతిథులు అ విషయాన్ని పోలీసులకు ఫోన్లో తెలియజేశారు. వెంటనే పోలీసు సిబ్బంది, అటవీశాఖ అధికారులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ ఘటన గురించి డీసీపీ విశ్వజీత్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ స్థానికుడు దీపక్ కుమార్ సోదరి వివాహం జరుగుతుండగా, ఈ ఘటన జరిగిందన్నారు. తమకు సమాచారం అందగానే ఒక పోలీసు బృందంతో పాటు అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నదన్నారు. వెంటనే వారు కల్యాణ వేదికను ఖాళీ చేయించారని, అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అతిథులు విందు ఆరగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదన్నారు. అటవీశాఖ అధికారులు మ్యారేజ్ హాలులోని రెండవ అంతస్తులో ఒక కుర్చీ వెనుక నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ హాలు తలుపులు మూసివేసి, దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కల్యాణ మండపంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఖాళీ చేయించామన్నారు. ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రతిపక్ష నేతల ఆగ్రహం
లక్నో : ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో నమోదైన మరణాలు సంఖ్య పెద్దది కాదని వ్యాఖ్యానించారు. అయితే, ఆ వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కుంభ మేళాలో హేమమాలిని స్నానమాచరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు’ ఈ దుర్ఘటనపై ప్రశ్నలు సంధించారు. ‘ఇది అంత పెద్ద సంఘటన కాదు. అది ఎంత పెద్దదో నాకు తెలియదు (కానీ).. దానిని బాగా పెద్దది చేసి చూపిస్తున్నారు.యూపీ సీఎం యోగి ఆధిత్యాథ్ ఏర్పాట్లు బాగా చేశారు. కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇలాంటి వాటి నిర్వహణ చాలా కష్టం. కాబట్టే తొక్కిసలాట జరిగింది. అలాంటి ఘటనలు జరగడం’ అనివార్యం అని అన్నారు. #WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um— ANI (@ANI) February 4, 2025యూపీ ప్రభుత్వం వాస్తవ మరణాల సంఖ్యను దాచిపెట్టిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై హేమమాలిని మాట్లాడుతూ.. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది చెబుతారు .తప్పుడు విషయాలు చెప్పడమేగా వారి పని’ అని అన్నారు.హేమమాలిని వ్యాఖ్యలపై ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ తీవ్రంగా స్పందించారు. హేమమాలిని సందర్శించినప్పుడు ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాబట్టే, కుంబమేళాలో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన వాస్తవాలేంటో తెలియడం లేదు. పోలీసులు, అధికారులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు పాకులాడుతున్నారు. హేమ మాలిని సామాన్య ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు, భద్రత గురించి పట్టించుకోలేదు. అందుకే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతే ఇదో సమస్య కాదని ఆమె చెప్పడం బాధితుల్ని ఎగతాళి చేయడమే అవుతుందన్నారు. హేమమాలిని వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ స్పందించారు. హేమ మాలిని ప్రయాగ్రాజ్ సందర్శనలో వీఐపీ ట్రీట్మెంట్ పొందినట్లు చెప్పారు. ఆమె అధికార పార్టీ నాయకురాలు, పైగా ప్రముఖ నటి. ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది (కానీ) పదుల సంఖ్యలో మరణించారు. గాయపడ్డారు. వాటి గురించి ఎవరు పట్టించుకుంటారని అన్నారు. -
MahaKumbh Mela 2025 - కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025 ) అనేక విశేషాలతో చర్చల్లో నిలుస్తోంది. రికార్డు స్థాయిలో మహా కుంభమేళాకు భక్తులు హాజరవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా హృదయాలను కదిలించే వీడియోలు అనేకం నెట్టింట విశేషంగా నిలుస్తున్నాయి. అటు భక్తులను, ఇటు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.తాజాగా 65 ఏళ్ల వృద్ధుడు తన 92 ఏళ్ల తల్లిని ప్రతిరోజూ 50 కిలోమీటర్లు నడిచి ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కలియుగ్ శ్రవణ్ కుమార్’ అంటూ ఈ వీడియో సంచలనంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.పురాణ గాథలోలని శ్రవణ కుమారుడి (జన్మనిచ్చిన, అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కూడా కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడు) నుంచి ప్రేరణ పొందాడో ఏమో గానీ, తన తల్లిని బండిమీద కూర్చోబెట్టి, స్వయంతా తాను లాగుతూ పవిత్ర మహాకుంభ మేళాకు తీసుకొని వచ్చాడు. యూపీలోని ముజఫర్ నగర్కు చెందినమాలిక్ (Malik) వయసు 65 ఏళ్లు కావడం విశేషం. ఆయన జబ్బీర్ దేవి వయసు 92 ఏళ్లు. తల్లి కోరిక నెరవేర్చాలన్న ధృఢ సంకల్పంతో బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళాకు తరలివచ్చాడు. ఇలా 13 రోజులు పాటు తల్లిని తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. ముజఫర్ నగర్ నుంచి ప్రయాగరాజ్కు 780 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో కుంభ్ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు. అతని సంకల్పం, సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘‘కలియుగ్ కా శ్రవణ్ కుమార్' అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ యుగానికి గొప్పోడు అని కొందరు. "ప్రతీ తల్లి ఇలాంటి కొడుకును పొందాలని కోరుకుంటుంది"అని మరొకరు వ్యాఖ్యానించారు. ముసలి వయసులో తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వారికి ఈయన కథ ఆదర్శనీయం, ఆచరణీయం అంటున్నారు.Watch: In Bulandshahr, Uttar Pradesh, A man is walking with a cart, taking his 92-year-old mother to the Maha Kumbh in Prayagraj. They started their journey from Muzaffarnagar, fulfilling her wish to bathe at the Kumbh pic.twitter.com/2IstKkqMXY— IANS (@ians_india) January 28, 2025 -
శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం
పీరియడ్స్ లేదా ఋతుచక్రం అనేది మహిళలకు, ముఖ్యంగా చదువుకునే వయసులో ఆడపిల్లలకు ఎంత బాధాకరమో చాలా కొద్దిమందికే తెలుసు. ఆ నాలుగు రోజులు అనుభవించే శారీరక బాధలు కంటే.. సామాజికంగా అనుభించే క్షోభే దుర్భరమైంది. ఉత్తర ప్రదేశ్లో జరిగిన దారుణం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేసింది. 11 ఏళ్ల బాలికపట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన విమర్శలకు దారితీసింది.ఉత్తరప్రదేశ్లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎంతో ఉత్కంఠతో పరీక్ష రాయడానికి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు పీరియడ్స్ స్టార్ట్ అయింది. (చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి సమస్య ఎదురౌతుంది. పరీక్ల ఒత్తిడి వల్ల రావాల్సిన సమయం కంటే ముందే మెన్సస్ సైకిల్ మొదలువుతుంది. ఈ సమయంలో వారు పడే కష్టాలువేదన వర్ణనాతీతం) టైం కంటే ముందే రావడంతో ప్రిపేర్డ్గాలేని బాలిక శానిటరీ ప్యాడ్కోసం ప్రిన్సిపాల్ను అడిగింది. సానుభూతి చూపించి సహాయం చేయడానికి బదులుగా ఆమేదో పెద్ద నేరంచేసినట్టు వ్యవహరించారు. దాదాపు గంటపాటు క్లాస్ రూం వెలుపల నిలబెట్టేశారు. శనివారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.ఒక పక్క పీరియడ్స్..కాళ్లు, నడుము నొప్పితోపాటు రక్త స్రావం పెరుగుతూ ఉంటుంది. ఈ బాధలకంటే. దుస్తులకు ఎక్కడ రక్తపు మరకలు అంటు కుంటాయో అన్న బెంగ, భయం. ఇవన్నీ ఇలా ఉంటే.. గంటసేపు బయటనిలబెట్టడంతో అవమాన భారంతో ఆ బాలిక ఎంత వేదన పడి ఉంటుందో అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో సంఘటనపై అధికారిక విచారణ జరుగుతోంది.జిల్లా మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS), రాష్ట్ర మహిళా కమిషన్ , మహిళా సంక్షేమ శాఖకు అధికారికంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. విచారణ జరుగుతోందని జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవ్కీ నందన్ ధృవీకరించారు. విచారణ అనంతరం, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగాచాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..! -
చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా
చదివింది 10వ తరగతి మాత్రమే. పదహారేళ్లకే పెళ్లి.. ముగ్గురు పిల్లలకు తల్లి. వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ కూడా కాదు.కానీ ఏదో సాధించాలనే కోరిక, తపన ఆమెను ఉన్నత స్థితిలో నిలబెట్టింది. ఆమె మరెవ్వరో కాదు అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన సరస్వతి. 'ప్యాడ్ ఉమెన్' గా పేరు తెచ్చుకుంది. 'లఖ్పతి దీదీ'లలో ఒకరిగా గుర్తింపు పొందారు. చేయూత నిస్తే అట్టడుగు స్థాయి సాధికారత సాధించగలరు అనడానికి నిదర్శనంగా మారింది. తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్ల తయారీ యంత్రాన్ని కనుగొన్న తమిళనాడుకు చెందిన సామాజిక వ్యవస్థాపకుడు అరుణాచలం మురుగనాథంలా అవతరించి నలుగురికి స్ఫూర్తినిస్తోంది.16 ఏళ్ల వయసులోనే ఉత్తరప్రదేశ్లోని దాద్రీలోని బాద్పురా గ్రామంలోకి ఒక పేద కుటుంబంలోకి కోడలిగా వెళ్లింది సరస్వతి భాటి. ఇది చాలా వెనుబడిన గ్రామం. భర్త మోను భాటి ఎలక్ట్రీషియన్. ముగ్గురు పిల్లల పెంపకంలో మునిగిపోతూనే, చుట్టుపక్కల గ్రామాల్లోని చాలా విషయాలను గమనించేది ముఖ్యంగామహిళలు శానిటరీ న్యాప్కిన్లు దొరకడం చాలా కష్టం. అస్సలు ఋతుస్రావం గురించి ప్రజలు బహిరంగంగా మాట్లాడటమే ఉండదు. ఈ పరిస్థితే ఆమెను ఆలోచించజేసింది.చిన్నప్పటినుంచి చదువుకోవడం అంటే సరస్వతికి చాలా ఇష్టం. హర్యానాలోని గ్రామాల్లో మాదిరిగానే, ఆమెపుట్టిన గ్రామంలో కూడా బాలికల విద్యకు పెద్దగా ప్రాముఖ్యతలేదు. ఈ నేపథ్యంలోనే చిన్నవయసులోనే పెళ్లీ, పిల్లలు. సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఏదైనా సాధించాలని ఆశ పడింది. 2019లో స్వయం సహాయక బృందంలో చేరాలనుకుంటే దీనికి భర్త ఒప్పుకోలేదు. ‘నేను సంపాదిస్తున్నాగా..నీకెందుకు ఇవన్నీ’ అన్నాడు. కానీ ఏదైనా చేయాలనుకుంటే.. ధైర్యంగా ముందుకు పోవాలి అన్న అమ్మమ్మ మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. మొత్తానికి 2020లో, ఆమె గ్రామంలోని సూర్యోదయ స్వయం సహాయక సంఘంలో చేరింది. ఈ అడుగే ఆమె జీవితం మలుపు తిప్పింది. .మహిళలు, బ్యాంకింగ్, ఆర్థిక స్థిరత్వం, పెట్టబడులు, వ్యాపార మెళకువలు గురించి తెలుసుకుంది.ఇంతలో లాక్డౌన్ వచ్చింది. దూకాణాలు బంద్. ఎక్కడా కూరగాయలు దొరకలేదు. ఆసమయంలో ఊరగాయలు తయారు చేసి విక్రయిస్తే బావుంటుంది కదా ఆలోచించింది. మరో పదిమంది మహిళలతో కలిసి, వెల్లుల్లి, అల్లం, మామిడి లాంటి పచ్చళ్ల తయారీని మొదలు పెట్టింది. మహిళలతో సమీపంలోని గ్రామాల్లో ప్రచారం చేసుకుంది. తొందర్లనే ఆర్డర్లు రావడం మొదలైనాయి. ఇక్కడితో ఆగిపోలేదు.ఇది ఇలా సాగుతుండగానే 2021లో సరస్వతి గ్రామంలో ఒక సౌందర్య సాధనాల దుకాణాన్ని ప్రారంభించింది. బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లను చాలా తక్కువ మంది మహిళలు కొనుగోలు చేస్తున్నారని గమనించింది. ఇవి ఖరీదైనవి కాబట్టి చాలా మంది మహిళలు ఇంట్లో వస్త్రాన్ని వాడతారని, శుభత్ర పాటించకపోవండం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, వీటి వల్ల ఇబ్బందులకు కూడా తెలుసుకుంది. దీంతో సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన శానిటరీ నాప్కిన్లను తానే ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించింది. ఈ ఆలోచనను వాస్తవంగా మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో, ఈ దుకాణాన్ని మూసివేసి, తన కొత్త వెంచర్ పై దృష్టి పెట్టింది. ఈ ఆలోచనకు భర్త పూర్తి మద్దతు ఇవ్వడం విశేషం.మొదట్లోవాటిని కొనుగోలు చేయడానికి మహిళలు ముందుకు వచ్చేవారు. సవాలక్ష సందేహాల కారణంగా, వీరికి ఆదరణ లభించలేదు. అయితే సరస్వతి స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేది. ఎట్టకేలకు ఆమె ప్రయత్నం ఫలించింది. పైగాఇవి ధర తక్కువ, సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉండటం, రాషెస్ సమస్యకూడా ఉండకపోవడంతో గిరాకీ పెరిగింది. బయటి మార్కెట్లో చిన్న ప్యాకెట్ ధర 45 రూపాయలు ఉండగా.. సరస్వతి ఆధ్వర్యంలో తయారుచేస్తున్న ప్యాకెట్ ధర 28 రూపాయలు మాత్రమే ఉండడం విశేషం. గత రెండేళ్లుగా శానిటరీ న్యాప్కిన్ల అమ్మకం నెలకు రూ. 30 వేలకి చేరుకుంది."ప్రతి ప్యాడ్ మాకు రూ. 2 ఖర్చవుతుంది, ప్యాకేజింగ్ తర్వాత, ధర రూ. 2.5. మేము ఏడు ప్యాడ్ల ప్రతి ప్యాక్ను రూ. 40కి అమ్ముతాము, అయితే జెల్ ఆధారిత ప్యాడ్లు రూ. 60కి అమ్ముతాము. మా ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో సహాయపడిన, మాకు మరిన్ని ఆర్డర్లను తీసుకువచ్చిన NGOలతో కూడా కనెక్ట్ అయ్యాము. రాష్ట్రంలోని ఏడు నగరాలు, పంజాబ్లోని రెండు నగరాల నుండి కూడా ఆర్డర్లు వస్తాయి‘’ అని ఆమె గర్వంగా చెబుతుంది సరస్వతి.ఇక పచ్చళ్ల బిజినెస్ దగ్గరికి వస్తే ప్రతి నెలా, మేము కనీసం 300- 500 కిలోల ఊరగాయల ఆర్డర్లు వస్తాయి. ఇలా ఊరగాయలు ,ప్యాడ్ల అమ్మకం ద్వారా ఆమె వార్షిక టర్నోవర్ ఇప్పుడు రూ. 7 లక్షలు దాటింది. తన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మాలనే లక్ష్యంతో ఉంది. దీనికోసం జీఎస్టీ నెంబరు, ప్యాకేజీని మరింత మెరుగుపర్చుకోని, మరిన్ని నగరాలకు తన ప్యాడ్స్ చేరేలా ముందుకు సాగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆమెలోని ప్రతిభకు పట్టుదలకు గుర్తింపు లభిచింది. "గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైంది. దీంతో లక్నోలో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఆమెను సత్కరించారు. సరస్వతి తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా, తన సమాజంలోని అనేక మందికి స్ఫూర్తినిస్తోందని జిల్లా అభివృద్ధి అధికారి శివ్ ప్రతాప్ రమేష్ ప్రశంసించారు. -
కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో ఆదివారం(జనవరి19) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి సెక్టార్ 19లో భక్తులు, సాధువుల కోసం వేసిన గుడారాల్లో రెండు వంట గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి. దీంతో గుడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు. మొత్తం ముప్పై దాకా గుడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి.అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి గుడారాల్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కుంభమేళాకు ఆదివారం ఒక్కరోజు 17 లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఇప్పటివరకు 7 కోట్లకుపైగా భక్తులు కుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానమాచరించారు. #WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot. More details awaited. pic.twitter.com/dtCCLeVIlN— ANI (@ANI) January 19, 2025యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసించారు. -
ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం? ఆమె ఎవరంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh Engagement) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్(MP Priya Saroj)తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రింకూ- ప్రియాల ఎంగేజ్మెంట్కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెల్లెలితో రింకూ సింగ్బంధువుల కోలాహలంఈ నేపథ్యంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అటు రింకూ గానీ.. ఇటు ప్రియా గానీ నిశ్చితార్థం విషయమై అధికారికంగా స్పందించలేదు. అయితే, రింకూ చెల్లెలు నేహా సింగ్(Neha Singh) తన అన్నతో కలిసి ఉన్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో బంధువుల కోలాహలంతో పాటు.. ఇల్లంతా అలంకరించినట్లుగా కనిపిస్తోంది. దీనిని బట్టి నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లు అంచనాకు వస్తున్నారు.పేద కుటుంబంలో జన్మించిన రింకూకాగా ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లోని పేద కుటుంబంలో రింకూ కుమార్ సింగ్ జన్మించాడు. అతడి తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి రింకూ కూడా తండ్రికి ఆరోగ్యం సహకరించనపుడు సిలిండర్లు వేసేవాడు. ఒకానొక సమయంలో స్వీపర్గానూ రింకూ పనిచేశాడు.కోటీశ్వరుడిగా ఎదిగిన రింకూఅయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా రింకూ మాత్రం క్రికెట్పై ప్రేమను వదులుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలుత ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చి నయా ఫినిషర్గా ఎదిగాడు. ఆర్థికంగానూ స్థిరపడ్డాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ 30 టీ20లు, రెండు వన్డేలు ఆడి 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఎవరీ ప్రియా సరోజ్?ఇక ప్రియా సరోజ్ విషయానికొస్తే.. వారణాసిలో 1998లో జన్మించిన ఆమె.. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం.. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. మచ్లిశహర్ లోక్సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన ప్రత్యర్థి బీపీ సరోజ్పై 35850 ఓట్ల తేడాతో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రియా సరోజ్ నికర ఆస్తుల విలువ రూ. 11.3 లక్షలుగా సమాచారం. ఇక ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రింకూ- ప్రియల నిశ్చితార్థ వార్తలను తూఫానీ సరోజ్ తాజాగా ఖండించారు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 -
ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం పట్ల దృక్పథం మారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్నివిధి లిఖితం అంటారేమో. ఆగ్రాకు చెందిన 13 ఏళ్ల రాఖీ సింగ్ కథ వింటే ఎవరికైనా ఇలానే అనిపించకమానదు.ఆగ్రాకు చెందిన రాఖీ సింగ్ అనే బాలిక కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ప్రపంచానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంది. దైవ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈమె చిన్నప్పటినుంచీ ఐఏఎస్ అధికారి కావాలని కలలు కనేది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ శిబిరాన్ని ఆమె సందర్శించిన తరువాత ఆమె ఆలోచన మారిపోయింది. సాధ్విగా మారాలని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఆమెను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నామనీ, ఆశ్రమానికి తమ కుమార్తెను ఇష్టపూర్వకంగా ఇస్తున్నామని ప్రముఖ మహంత్ (మత నాయకుడు)తో తెలిపారు. ఈ కుంభమేళా తర్వాత మహంత్ కౌశల్ గిరి ఆశ్రమంలో భాగం అవుతుంది రాఖీ.ఎవరీ రాఖీ సింగ్ఆగ్రా జిల్లా దౌకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సందీప్ సింగ్ ధాకార పెద్ద కుమార్తె రాఖీ. అఖారా సంప్రదాయం ప్రకారం ఆమె గౌరి అని పేరు పెట్టారు. జనవరి 19న 'పిండాన్' ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత రాఖీ కుటుంబంలో ఇక భాగంగా ఉండదు. అఖారాలో సభ్యురాలిగా సాధ్విగా ఉంటుంది. ఆగ్రాలో నివసిస్తున్న ఆమె కుటుంబం, ప్రముఖ హిందూ సన్యాసులలో ఒకటైన జునా అఖారాకు చెందిన మహంత్ కౌశల్ గిరి మహారాజ్తో కనెక్ట్ అయినప్పుడు రాఖీ ప్రయాణం ప్రారంభమైంది.గత మూడేళ్లుగా,తమ గ్రామంలో మహంత్ కౌశల్ గిరి భగవత్ కథా సెషన్లు నిర్వహించారు. ఈ సమయంలో రాఖీ, ఆమె కుటుంబంతో సహా, అతని బోధనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సెషన్లలో ఒకదానిలో రాఖీ తన గురు దీక్ష లేదా దీక్షను తీసుకుందట. అంతేకాదు ఆమె ఆధ్యాత్మిక మార్గానికి నాంది పలికింది ఆమె తల్లి రీమా సింగ్ . ఫలితంగా గౌరీ గిరిగా పిలువబడే రాఖీ పవిత్ర పరిత్యాగ ప్రక్రియ తరువాత కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనుంది.కాగా 12 ఏళ్ల తర్వాత మహాకుంభ మేళా జనవరి 13 నుంచి మహా కుంభ మేళా జరగబోతోంది. ఈ మేళాకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహా కుంభ మేళా.. ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు అఖారాల నుంచి అఘోరాలు, స్వాములు, రుషులు వస్తూన్నారు. ముఖ్యంగా కొన్ని అఖారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అటల్ అఖారా, మహానిర్వాణి అఖారా, నిరంజని అఖారా, అశ్వాన్ అఖారా, జునా అఖారా ఇవన్నీ అలాంటివే. ఇవన్నీ మహా కుంభమేళాలో తమ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..
భోపాల్ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్’(jai bhim) సినిమాలో పోలీస్ స్టేషన్లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి.. మధ్యప్రదేశ్కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. రాహుల్ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్ సన్నిహితులు మధ్యప్రదేశ్లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.చేసేది లేక రాహుల్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్ మహోబ్కాంత్ పీఎస్కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.రాహుల్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు. -
సోషల్ మీడియా స్టార్ ‘రాణి కోతి’: యూట్యూబ్ ద్వారా లక్షలు : వైరల్ వీడియో
కుంచం అంత కూతురుంటే మంచం మీదే కూడు అనేది సామెత. అంటే ఇంట్లో చిన్న ఆడకూతురుంటే చాలు..ఆ ఇంట్లోని అన్ని పనుల్లో ఎంతో చేయూత అని. ఈ విషయంలో నేనేం తక్కువ అంటోంది ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలోని ఖాగీపూర్ సద్వా గ్రామానికి చెందిన కోతి. అవును మీరు చదివింది నిజమే. కోతి ఇంట్లో అన్ని పనులు చకా చకా పెట్టేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన కోతి కథేంటో తెలుసుకోవాలని ఉంది కదా.. పదండి మరి!యూపీలోని రాయ్బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ఇంట్లోని కోతిని చూస్తే ఔరా అనాల్సిందే. అందుకే దీనికి ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు.ఇల్లంతా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసేస్తుంది. గిన్నెలు తోముతుంది. బట్టలు ఉతకడం, మాప్ పెట్టడం, మసాలాలు రుబ్బడం, పొలంలో సహాయం చేయడం ఇలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అంతేనా రాణి గారు శ్రద్ధగా గుండ్రంగా చపాతీలు చేసి ఇస్తుంది. ఇది చాలదన్నట్టు గ్రామంలోని ఇతర ఇళ్లల్లో ఆడవానికి కూడా పనిలో సహాయం చేస్తుంది. అందుకే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి విలేజ్ డార్లింగ్లా మారిపోయింది. పుట్టింది కోతిగా అయినా.. మనిషిలానే చేస్తున్న పనులు, అందరికీ సాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ అభిమానంగా మారింది.యూట్యూబ్ ద్వారా లక్షల ఆదాయం రాణి వంటలు చేస్తున్న వీడియోను యజమాని ఆకాష్ పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రాణి పనులను, చేష్టలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకోవడంతో అశోక్ అదృష్టం మారిపోయింది. యూట్యూబ్లో రాణి వీడియోల ద్వారా 5 లక్షల రూపాయలకు పైగా ఆర్జించామని అశోక్ పేర్కొన్నాడు. కోట్లాదిమంది తమ వీడియోను వీక్షించారని తెలిపాడు. ముంబై, కోల్కతా, వారణాసి ఇలా అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆమెను చూడటానికి వస్తారట. అమెరికా, యూకే సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, ఇరాన్, రష్యా, చైనా , అనేక ఇతర దేశాల వాళ్లు ఫోన్లు చేస్తారన్నాడు. ఎంత స్నేహశీలి అయినా, రాణిగారికి సొంత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆమెకు నచ్చితేనే మనుషుల్ని దగ్గరకు రానిస్తుంది. తనకు నచ్చితే వారి ఒడిలో నిద్రపోతుంది కోపం వస్తే మాత్రం చిన్నగా మణికట్టును కొరుకుతుంది. రాణికి ఇష్టమైన ఆహారం, అరటిపండ్లు. వీటితోపాటు బఠానీలు, రొట్టెలు తినడం కూడా ఆమెకు చాలా ఇష్టం. #WATCH | यूपी के रायबरेली जिले में रानी नाम की बंदरिया का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में बंदरिया रोटी बनाने से लेकर बर्तन धोने समेत घर के काम करते दिख रही है। वीडियो देख हर कोई हैरान है।#Raibareli pic.twitter.com/3UWY4izZ6N— Hindustan (@Live_Hindustan) December 30, 2024 -
వన్డేలో 407 చే‘దంచేశారు’
వడోదర: భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో రికార్డు లక్ష్యఛేదన నమోదైంది. పురుషుల అండర్–23 వన్డే టోర్నమెంట్లో సూపర్ ‘డబుల్’ ఫామ్లో ఉత్తరప్రదేశ్ (యూపీ) బ్యాటర్ సమీర్ రిజ్వీ (105 బంతుల్లో 202 నాటౌట్; 10 ఫోర్లు, 18 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస మ్యాచ్ల్లో రెండో అ‘ద్వితీయ’ సెంచరీ సాధించడంతో యూపీ 407 పరుగుల లక్ష్యాన్ని 41.2 ఓవర్లలోనే ఛేదించి దేశవాళీ క్రికెట్ పుటలకెక్కింది.జీఎస్ఎఫ్సీ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట సొంతగడ్డపై విదర్భ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 406 పరుగుల భారీస్కోరు చేసింది. టాపార్డర్ బ్యాటర్ దనిశ్ మాలేవర్ (123 బంతుల్లో 142; 16 ఫోర్లు, 4 సిక్స్లు), మిడిలార్డర్లో కెపె్టన్ ఫయాజ్ (62 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్లు) ‘శత’క్కొట్టారు. మూడో వికెట్కు వీరిద్దరు 197 పరుగులు జోడించారు. తర్వాత జగ్జోత్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు) ధాటిగా అర్ధసెంచరీ సాధించడంతో విదర్భ 400 పైచిలుకు భారీ స్కోరు చేసింది. అయితే ఈ సంతోషం ప్రత్యర్థి లక్ష్యఛేదనకు దిగడంతోనే ఆవిరైంది. ఓపెనర్లు శౌర్య సింగ్ (42 బంతుల్లో 62; 6 ఫోర్లు, 5 సిక్స్లు), స్వస్తిక్ (28 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్లు) 10.4 ఓవర్లలోనే 106 పరుగులు చకచకా జతచేశారు. ఈ మెరుపు శుభారంభం రికార్డు ఛేజింగ్కు బాటవేసింది. వన్డౌన్ బ్యాటర్ షోయబ్ సిద్దిఖీ (73 బంతుల్లో 96 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రిజ్వీ అబేధ్యమైన మూడో వికెట్కు కేవలం 173 బంతుల్లోనే 296 పరుగులు ధనాధన్గా జతచేయడంతో ఉత్తర ప్రదేశ్ జట్టు 41.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసి గెలిచింది. ఈ టోర్నీలో సమీర్ గత మ్యాచ్లో త్రిపురపై కూడా (93 బంతుల్లో 201 నాటౌట్) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతను అవుట్ కాకుండా అజేయంగా నిలవడం విశేషం. -
తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్
సంభాల్: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగీ సర్కారు సంభాల్ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది.పాలరాతి నిర్మాణాలుసంభాల్లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండ తర్వాత పాలనా యంత్రాంగం ఇక్కడ ఒక పురాతన శివాలయాన్ని కనుగొంది. దానిని 1978లో మూసివేశారని తేలింది. తాజాగా చందౌసీలో రెవెన్యూశాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఒక భారీ మెట్ల బావి బయటపడింది. ఈ సందర్భంగా సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా మాట్లాడుతూ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఈ సైట్లో తిరిగి సర్వే నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సైట్ గతంలో చెరువుగా రిజిస్టర్ అయ్యిందన్నారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక సొరంగంతో పాటు మెట్ల బావి బయటపడిందని, ఒక అంతస్తు ఇటుకలతో, రెండవ, మూడవ అంతస్తులు పాలరాతితో నిర్మించినట్లు స్పష్టమయ్యిందన్నారు.అత్యంత జాగ్రత్తగా తవ్వకాలుబిలారి రాజుల పూర్వీకుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మితమయ్యిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న అధికారులు పురాతన నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగకుండా మట్టిని నెమ్మదిగా తొలగిస్తున్నారు. మరోవైపు ఈమెట్ల బావిని 1857లో నిర్మించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు జేసీబీల సాయంతో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలతో తవ్వకాలు చేపడుతున్నారు.మెట్ల బావి అంటే ఏమిటి?మెట్ల బావి అనేది పురాతన భారతదేశంలో నీటిని సంరక్షించడానికి, నిల్వ చేయడానికి నిర్మించిన సాంప్రదాయ నీటి నిర్మాణం. మెట్ల ద్వారా బావిలోకి చేరుకుని నీటిని తోడుకోవచ్చు. భారతీయ వాస్తుశిల్పం, నీటి నిర్వహణ వ్యవస్థకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిని ఆదా చేయడానికి మెట్లబావులను నిర్మించేవారు. ఇది నీటి నిల్వ స్థలం మాత్రమే కాకుండా సామాజిక మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. మెట్ల బావి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. కాలక్రమేణా మెట్లబావుల వాడకం తగ్గింది. అయితే నేడు ఇది చారిత్రక వారసత్వ సంపదగా, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. #WATCH | Uttar Pradesh | Visuals from the Chandausi area of Sambhal where excavation work was carried out yesterday at an age-old Baori by the Sambhal administration pic.twitter.com/ILqA8t3WPW— ANI (@ANI) December 23, 2024తీర్థయాత్రా స్థలంగా సంభాల్సంభాల్కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్ను తీర్థయాత్రా స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించనున్నారు. గెజిటీర్ ప్రకారం సంభాల్లో గతంలో 19 బావులు ఉండేవి. పూర్వకాలంలో చెరువు లేదా సరస్సును పుణ్యక్షేత్రంగా పరిగణించే వారు. సంభాల్లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతుంటారు.పాత ఫైళ్ల వెలికితీతసంభాల్కు నలుమూలల్లో ఉన్న స్మశాన వాటికలు కూడా ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదేవిధంగా సంభాల్లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి యూపీ సర్కారు ముందుకొచ్చింది. ఒకప్పుడు సంభాల్లో హిందూ ఖేడా అనే హిందువుల కాలనీ ఉండేది. ఇప్పుడు దానిపై మరో వర్గంవారి ఆధిపత్యం కొసనాగుతున్నదని స్థానికులు అంటున్నారు. దీప సరాయ్ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని తెలుస్తోంది. ఈ నేధ్యంలో యూపీ సర్కారు ప్రభుత్వ న్యాయవాదుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను సేకరించాలని ప్రభుత్వం వారికి సూచించింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు -
యూపీలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతం
పిలిభిత్: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా రచించిన వ్యూహంలో ఘనవిజయం సాధించారు.ఈ ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు ఖలిస్తానీ కమాండో ఫోర్స్కు చెందినవారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు ఏకే 47, మరో రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు గతంలో గురుదాస్పూర్ పోస్ట్పై గ్రెనేడ్ విసిరారు. పురాన్పూర్ ప్రాంతంలోని హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో సోమవారం ఉదయం 5 గంటలకు ఈ ఎన్కౌంటర్ జరిగింది.హతమైన ఉగ్రవాదులను ప్రతాప్ సింగ్ (23), వీరేంద్ర సింగ్ (23), గుర్విందర్ సింగ్ (20)గా పోలీసులు గుర్తించారు. పంజాబ్లోని గురుదాస్పూర్లో పోలీసు పోస్ట్పై దాడి చేసిన కేసులో ముగ్గురినీ వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా పంజాబ్ పోలీసులు వీరి ఆచూకీని పిలిభిత్లోని పురాన్పూర్లో గుర్తించారు. అనంతరం వారు పిలిభిత్ పోలీసుల సహాయంతో, సోమవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితులను చుట్టుముట్టారు. హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో పోలీసుల ఎన్ కౌంటర్ జరిగింది.బుల్లెట్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు వ్యాపించాయి. ఏం జరిగిందో స్థానికులకు వెంటనే అర్థం కాలేదు. తొలుత ఎన్కౌంటర్లో గాయపడిన నిందితులతో పోలీసులు పురాన్పూర్ సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి వారు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.ఇది కూడా చదవండి: ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి! -
తలుపు తెరవడం లేదని.. రాళ్లతో బోగీ ధ్వంసం
లక్నో : టికెట్లు కొనుగోలు చేద్దామంటే సమయం లేదు. కూర్చుందామంటే సీటు దొరకడం లేదు. దీంతో కోపోద్రికులైన ప్రయాణికులు రిజర్వేషన్ రైలు బోగీని రాళ్లతో ధ్వంసం చేశారు. అద్దాలను పగుల గొట్టి దౌర్జన్యంగా బోగీలోకి ప్రవేశించారు. ఆ ఘటన సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ట్రైన్ నెంబర్ 15101 అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు బీహార్ రాష్ట్రం సారణ్ జిల్లా ఛప్రా అనే ప్రాంతం నుంచి ముంబైకి వెళ్తుంది. ఆట్రైన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మంకాపూర్ రైల్వే స్టేషన్కు వచ్చింది. ఆ సమయంలో టికెట్ కౌంటర్ వద్ద ఉన్న పలువురు ప్రయాణికులు ఆ ట్రైన్ను ఎక్కేందుకు ప్రయత్నించారు. చేతిలో టికెట్ లేదు. ఎక్కేందుకు బోగీ తలుపు తెరుచుకోవడం లేదుదీంతో ట్రైన్లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ముందుగా రిజర్వేషన్ బోగీ మెయిన్ డోర్ అద్దాలు పగుల గొట్టి లోపలికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అదే బోగి కిటికీలను ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద బండరాలతో కిటికీ అద్దాలు,కిటికీ ఇనుప కడ్డీ గ్రిల్స్ను తొలగించారు. అనంతరం, లోపలికి వెళ్లారు. Angry passengers pelted stones at the coach due to non-opening of the gate of 15101 Antyodaya Express at Mankapur railway station, which broke the glass and caused a stampede in the train, the train was going from Chhapra to Mumbai:pic.twitter.com/Y0N5va5ImS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024ఈ ఘటన వీడియోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుండగా.. పలువురు నెటిజన్లు రైల్వే ప్రయాణంలో తమకు ఎదురైన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తున్నారు. మరికొందరు మాత్రం నార్త్ ఇండియాలో ప్రయాణం నరకంతో సమానం. నేను ప్రతి సారి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఈ ప్రాంతం వైపు చట్టానికి లోబడి ప్రయాణించాలంటే మరో 50 ఏళ్లు పడుతుంది. మరికొందరు బీహార్- జార్ఖండ్ మీదుగా ఏ రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలి. ఎందుకంటే అక్కడి ప్రయాణికులు రైలులో గందరగోళం సృష్టిస్తారు. టికెట్లు కొనుగోలు చేయకుండా ట్రైన్ ఎక్కుతారు. అలాంటి వారి వల్ల తోటి ప్రయాణికుల ఇబ్బంది పడుతుంటారు’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివలింగం దగ్గర 'కేజీఎఫ్' హీరోయిన్ (ఫొటోలు)
-
యూపీలో కొత్తగా మహా కుంభమేళా జిల్లా
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రయాగ్రాజ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి ఇకపై కొత్త గుర్తింపు రానుంది. ఈ జిల్లా పేరు మహాకుంభమేళా. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులతో సమావేశమైన అనంతరం దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రయాగ్రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.జనవరిలో రాబోయే కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాను మహాకుంభమేళా జిల్లాగా పిలవనున్నారు. కుంభమేళాను సజావుగా నిర్వహించేందుకు, పరిపాలనా పనులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మహా కుంభమేళా జిల్లాలో ఇండియన్ సివిల్ సెక్యూరిటీ సెక్షన్ 14 (1) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్లను నియమించనున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో 2025, జనవరి 13 నుండి ప్రారంభమై 2025, ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
స్నానం చేస్తుండగా పేలిన గీజర్..నవ వధువు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లో గీజర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు తన అత్తమామల ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ పేలుడులో ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. బరేలీలోని మీర్గంజ్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.బులంద్షహర్లోని కలే క నగ్లా గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 22న పిపల్సనా గ్రామానికి చెందిన దీపక్ యాదవ్తో వివాహం జరిగింది. పెళ్లి తరువాత అత్తారింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం అత్తగారింట్లో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లిన అమ్మాయి ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు పలుమార్లు పిలిచినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి, బాత్రూమ్ తలుపు పగులగొట్టి చూశారు. ఆ సమయంలో ఆమె నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. గీజర్ పేలిపోయింది.వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు -
వందేభారత్పై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీరట్ నుండి మోదీనగర్కు వస్తుండగా ఈ స్టేషన్కు ఐదు కిలోమీటర్ల ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడితో రైలు అద్దాలు పగిలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఈ ప్రాంతంలో టార్గెట్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో అక్టోబర్ 22, 27 తేదీల్లో, నవంబర్ 22, 27 తేదీల్లో ఇదేవిధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ నెలలో సిక్రి కలాన్- సోనా ఎన్క్లేవ్ కాలనీ సమీపంలో, నవంబర్లో హనుమాన్పురి- శ్రీనగర్ కాలనీ సమీపంలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వారు.ఘజియాబాద్ పోలీసులు ఈ నాలుగు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వందేభారత్పై రాళ్లు రువ్వుతున్న ఘటనలు అటు రైల్వే యంత్రాంగాన్ని, ఇటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం -
‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం
న్యూఢిల్లీ: సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు చొరవతో ఆ కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం లభించింది. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు వారాల్లోగా ఆ కానిస్టేబుల్ కుమారునికి ప్రభుత ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.వివరాల్లోకి వెళితే యూపీలోని అలీఘర్ నివాసి వీరేంద్ర పాల్ సింగ్ తండ్రి శిశుపాల్ సింగ్ యూపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఆయన 1995లో అనారోగ్యంతో మరణించాడు. ఆ సమయంలో అతని కుమారుడు వీరేంద్ర పాల్ సింగ్ మైనర్ కావడంతో, అతని తల్లి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.అయితే 13 సంవత్సరాల తరువాత మేజర్ అయిన వీరేంద్ర పాల్ సింగ్ 2008లో కారుణ్య నియామకం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో జాప్యం జరిగిన కారణంగా యూపీ ప్రభుత్వం ఆ దరఖాస్తును తిరస్కరించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరేంద్ర పాల్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై పునర్విచారణ జరపాలని హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాన్ని యూపీ ప్రభుత్వం పునరాలోచన చేసి, తిరస్కరించింది.కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయడంలో జరిగిన జాప్యాన్ని మన్నించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇలా కోర్టులో వాదప్రతివాదనలతో చాలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే 2021లో అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా వీరేంద్రకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై పరిశీలించాలని కోరింది. యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాలు చేసింది. అయితే అది 2022లో దానిని తిరస్కరణకు గురయ్యింది. అతని కారుణ్య నియామకాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.దీనిపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సందీప్ మెహతాలు.. యూపీ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తూ, హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో తమకు లోపం కనిపించలేదని పేర్కొన్నారు. ఎటువంటి తప్పు లేకుండా 2010 సంవత్సరం నుండి ఈ కేసును కొనసాగిస్తున్నారని, తాము ఈ అప్పీల్ను స్వీకరించడానికి ఇష్టపడటం లేదని, దీనిని కొట్టివేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ఉత్తర్వు కాపీ అందిన నాటి నుంచి ఆరు వారాల వ్యవధిలోగా ప్రతివాదికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానిస్టేబుల్ కుమారుని తరపున న్యాయవాది వంశజా శుక్లా వాదనలో పాల్గొన్నారు. కాగా కానిస్టేబుల్ శిశుపాల్ సింగ్ 1992లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అనారోగ్యానికి గురై, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్లో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై కారు అదుపు తప్పి డివైడర్ను దాటి, అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న వైద్య విద్యార్థులు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం లక్నోలో ఓ వివాహ వేడుకకు హాజరైన వైద్య విద్యార్థులు కారులో సైఫాయికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.మృతుల్లో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నార్దేవ్, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. మొరాదాబాద్లోని బుద్ధ విహార్కు చెందిన కరణ్ సింగ్ కుమారుడు జైవీర్ సింగ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు.ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ని తలపిస్తూ..కొత్త పెళ్లికొడుకు సాహసం, వైరల్ వీడియో
కాబోయే భార్యను తలచుకుంటూ ముసి ముసి నవ్వులతో పెళ్లి కొడుకు దేవ్ కుమార్ గుర్రమెక్కి పెళ్లి మంటపానికి బందు మిత్ర సపరివారంగా తరలి వెళ్లాడు. బాజా భజంత్రీల సమక్షంలో అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కొత్తభార్యతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మెడలో మెరిసిపోతున్న కరెన్సీ మాలను చూసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో తెలియదు ఆగంతకుడు. పెళ్లి కొడుకు మెడలోని కరెన్సీ దండలోని 100 రూపాయలనోటను అమాంతం ఎగరేసుకుపోయాడు ఘొక మినీ ట్రక్ డ్రైవర్ కాజేశాడు. ఒక్క క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకుని అత్యత సాహసంగా అతణ్ణి వెంబడించి పట్టుకున్నాడు. బాలీవుడ్ బ్లాక్బస్టర్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్గా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.పియూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం. తన మెడలోని నోట్ల దండను ట్రక్ డ్రైవర్ కొట్టేయడంతో వెంటనే అప్రమత్తమైన వరుడు పెళ్లీ, గిళ్లీ తరువాత చూద్దాం అనుకున్నాడో ఏమో గానీ, నగదు దండను చోరీ చేసిన డ్రైవర్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. హైవేపై ట్రక్ను వెంబడించాడు. అత్యంత సాహసంతో స్టంట్మ్యాన్లాగా ట్రక్పైకి దూకాడు. చాకచక్యంగా క్యాబిన్లోకి ప్రవేశించి అతగాడిని దొరకబుచ్చుకున్నాడు. నాలుగు తగిలించాడు. ఇంతులో అతని వెనకాలే ఫాలో అయిన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కూడా తోడయ్యాడు. దీంతో పొరపాటు జరిగిందని వదిలేయాలంటూ లబోదిబో మన్నాడు. దీంతో దేవ్ కుమార్ హీరోగా అయిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పన్నీ కామెంట్లను షేర్ చేశారు. దెబ్బకి పెళ్లి కూతురు ఫిదా అని ఒకరు, కొత్త పెళ్లి కూతురు స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ నా మనసు దోచేశావ్ అని పాడుకుంటుందేమో అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు పెళ్లి రాత్రిని తప్పించుకోవడానికి వరుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని కొందరు, ఇంత చేసినా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందా అని ఇంకొందరు ఫన్నీగా కమెంట్ చేశారు. <Video of the year! In UP's Meerut, groom Dev Kumar was happily getting home after the wedding when a pick up driver pinched a note from his currency tucked garland. What followed was a near Bollywood, daring chase for justice! Groom Dev Kumar asked for lift from a motorist,… pic.twitter.com/libIH8PRTT— Piyush Rai (@Benarasiyaa) November 25, 2024రవాణా సంస్థ ప్రకటనట్రక్ స్థానిక రవాణా సంస్థకు చెందినది, దీని యజమాని మనీష్ సెహగల్ ఈ సంఘటనపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్ దొంగ కాదని, దొంగతనంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. అతని వాహనానికి వ్యతికేంగా వేగంగా దూసుకురావడం వల్లే పెళ్లి ఇలా చేశాడని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేనప్పటికీ వరుడు , అతని స్నేహితులు డ్రైవర్పై దాడి చేశారని సెహగల్ ఆరోపించారు. దీంతో ఏం జరిగిందో స్పష్టత లేక బుర్ర గోక్కుంటున్నారట స్థానిక పోలీసులు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
సింహాలకు హీటర్లు.. పాములకు కంబళ్లు
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపధ్యంలో గోరఖ్పూర్లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్కులోని జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూపార్కులోని సింహాలు, పులులు వంటి భారీకాయం కలిగిన జంతువులు చలిని తట్టుకోలేవు. అందుకే వాటికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అవి ఉండేచోట హీటర్లను అమర్చారు. ఈ హీటర్లు రాత్రి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఇదేవిధంగా శీతాకాలంలో జంతువులు ఆరోగ్యంగా ఉండేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. పాముల వంటి సరీసృపాలకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు కంబళ్లను వినియోగిస్తున్నారు.జింకలు, ఇతర చిన్న జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక గడ్డిని వాటి ఎన్క్లోజర్లలో ఉంచుతున్నారు. తద్వారా అవి వెచ్చదనంలో ఉండేలా చూస్తున్నారు. జలచరాలకు వేడి నీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూ పశువైద్యాధికారి యోగేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఈ శీతాకాలంలో ప్రతి జాతి జంతువుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇది కూడా చదవండి: ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు -
యూపీలో ఉద్రిక్తత, ముగ్గురు మృతి.. 30మందికి పైగా పోలీసులకు గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరాన్ని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం..అడ్వకేట్ కమీషనర్ నేతృత్వంలోని సర్వే బృందం సర్వే చేసేందుకు ప్రార్థనా మందిరంలోకి అడుగుపెట్టింది. అయితే, ఆ సర్వేను అడ్డుకునేందుకు వెయ్యికి మందికి పైగా స్థానికులు ప్రయత్నించారు. పోలీసుల్ని ప్రార్థనా మందిరంలోకి వెళ్లకుండా వాగ్వాదానికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. అధికారుల వాహనాలకు నిప్పంటించారు. అయితే, స్థానికుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు మరణించారు. 30మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి’ అని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం, పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
By Election Results: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీదే హవా
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం(నవంబర్23) వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు, కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగ్గా వయనాడ్ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ 4లక్షలకుపైగా రికార్డు మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్..48 సీట్లలో యూపీలో కీలకమైన 9 సీట్లున్నాయి. యూపీలో ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా రెండు చోట్ల సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచింది. వెస్ట్బెంగాల్..వెస్ట్బెంగాల్లో ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ మళ్లీ సత్తా చాటింది. ఇక్కడ ఆరింటికి ఆరు స్థానాలను మమతా బెనర్జీ పార్టీ కైవసం చేసుకుంది. బీహార్..బీహార్లో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది.ఇక్కడ తరారీ (బీజేపీ ), రామ్గఢ్ (బీజేపీ), బేలాగంజ్ (జేడీయూ), ఇమామ్గంజ్ (హెచ్ఏఎం(ఎస్))రాజస్థాన్..రాజస్థాన్లో ఉప ఎన్నికలు జరిగిన 7 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 5 గెలుచుకుంది. ఒక సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా భారత్ ఆదివాసీ పార్టీ(బీఏడీవీపీ) ఒక సీటు గెలుచుకుంది. కర్ణాటక..కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి13 వేలకుపైగా ఓట్లతో బొమ్మైపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్పంజాబ్.. పంజాబ్లో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడింటిలో ఆమ్ఆద్మీపార్టీ, ఒక సీటులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. కేరళ..కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నకలు జరగగా ఒక చోట అధికార సీపీఎం మరొకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. 4 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీ 👉కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4లక్షల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో రాహుల్గాంధీ ఇదే స్థానం నుంచి 3,64,422 ఓట్ల ఆధిక్యత సాధించారు. 👉కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతిల్ 18,840 ఓట్ల భారీ తేడాతో బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్పై విజయం సాధించారు.అస్సాం.. అస్సాంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా నాలుగింటిలో రెండింటిని అధికార బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఏజీపీ గెలుచుకున్నాయి. సిక్కిం..సిక్కింలోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగగా రెండు సీట్లలో ఎస్కేఎం గెలుపొందింది. గుజరాత్..గుజరాత్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఒక్క సీటులో బీజేపీ గెలుపొందింది. చత్తీస్గఢ్..ఛత్తీస్గఢ్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా దానిని బీజేపీ గెలుచుకుంది.ఉత్తరాఖండ్..ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఇక్కడ బీజేపీ గెలుపొందింది. మేఘాలయ..మేఘాలయాలోని ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఈ సీటును ఎన్పీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.ఇది కూడా చదవండి: Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం -
UP By-election: క్రిమినల్ కేసులో ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయి.. ఉపఎన్నిక జరిగిన చోట..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫలితాలు సమాజ్వాదీ పార్టీకి కీలకంగా మారాయి. ముఖ్యంగా కాన్పూర్లోని సీసామవు అసెంబ్లీ స్థానంపై సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.సీసామవు అసెంబ్లీకి చెందిన సమాజ్వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన దరిమిలా అతని సభ్యత్వం రద్దయ్యింది. అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాకేష్ సోంకర్ 1996లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. డీలిమిటేషన్ తర్వాత ఈ సీటు ముస్లింల ప్రాబల్యం కలిగినదిగా మారింది. తదనంతరం ఎస్పీ నేత ఇర్ఫాన్ సోలంకి 2012 నుంచి 2022 వరకు ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.కాన్పూర్లోని సీసామవు స్థానం అఖిలేష్ యాదవ్కు బలమైన స్థానాల్లో ఒకటి. అయితే ఇప్పుడు సీసామవు అసెంబ్లీ సీటు అటు బీజేపీ, ఇటు ఎస్పీకి ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. సీసామవు స్థానం నుంచి బీజేపీ తరపున సురేశ్ అవస్థీ బరిలో నిలిచారు. ఈసారి సీసామవు అసెంబ్లీ స్థానంలో ఎస్పీ, కాంగ్రెస్లు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం బీజేపీకి పెద్ద సవాల్గా మారింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇర్ఫాన్ సోలంకీకి 79,163 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 5,616 ఓట్లు రాగా, బీజేపీకి 66,897 ఓట్లు వచ్చాయి. ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట -
వెనక్కి నడవమంటున్నారా?
మహిళల భద్రత కోసమని చెబుతూ ఈమధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. వాటి ప్రకారం... మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదు; మగవాళ్లు జిమ్ముల్లో ఆడవాళ్లకు ట్రెయినర్లుగా ఉండకూడదు. వాళ్ల ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ ఇది ఇంకో రకమైన తాలిబనిజం అవుతుంది. ఎందుకంటే, ఇలాంటివి చివరకు మహిళలకు కీడే చేస్తాయి. వారి వ్యక్తిగత ఎంపికకు భంగం కలిగిస్తాయి. ఇది ఇంతటితోనే ఆగుతుందా? ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేయాలా? అందుకే ఈ ప్రతిపాదనలు హాస్యాస్పదమైనవే కాదు, అర్థంలేనివి కూడా!మన మంచి కోసమేనని చెబుతూ కొందరు తరచూ కొన్ని పిచ్చి సూచనలు చేస్తూంటారు. వీటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈ మధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. అవి ఎంత మూర్ఖమైనవంటే మనం వాటిని గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపట్ల మౌనంగా ఉంటే, అవన్నీ సమ్మతమే అనుకునే ప్రమాదముంది.‘బహిరంగ, వాణిజ్య స్థలాల్లో మహిళల భద్రతను పెంచడం ఎలా?’ అన్న అంశంపై ఈ సూచనలు వచ్చాయి. ఉద్దేశం చాలామంచిది. కానీ ప్రతిపాదించిన సలహాలు మాత్రం నవ్వు పుట్టించేలా ఉన్నాయి. మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదన్నది ఒకానొక సలహా. అలాంటప్పుడు పురుషులు మహిళల వస్త్రాలు కూడా తయారు చేయకూడదా? మహిళలు మాత్రమే సిద్ధం చేయాలా? బహుశా ఇది ఇకపై అమల్లోకి తెస్తారేమో! సెలూన్లలోనూ మహిళలకు క్షౌర క్రియలు చేయడం ఇకపై పురుషులకు నిషిద్ధం. అలాగే జిమ్, యోగా సెషన్లలోనూ మగవాళ్లు మహిళలకు శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేదు.ఇంతటితో అయిపోయిందనుకోకండి. అన్ని పాఠశాలల బస్సు ల్లోనూ మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలన్న సలహా కూడా వచ్చింది. బహుశా పురుషులు ఎవరూ యువతులను, చిన్న పిల్లలను భద్రంగా ఉంచలేరని అనుకున్నారో... వారి నుంచి ముప్పే ఉందను కున్నారో మరి! మహిళల వస్త్రాలమ్మే చోట మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలట. పురుషులను అస్సలు నమ్మకూడదన్న కాన్సెప్టు నడుస్తోందిక్కడ. మహిళలను ప్రమాదంలో పడేయకుండా పురుషులు వారికి సేవలు అందించలేరన్నమాట.ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ సలహాలు, సూచనలపై ఏమంటున్నారంటే... మహిళల భద్రతను పటిష్ఠం చేసేందుకు మాత్రమే కాకుండా, మహిళల ఉపాధి అవకాశా లను మెరుగుపరిచేందుకు కూడా వీటిని ఉద్దేశించినట్లు చెబుతున్నారు. ఈ సలహాలను ‘‘మహిళల భద్రత కోణంలోనూ, అలాగే ఉపాధి కల్పన కోణంలోనూ’’ ఇచ్చినట్టు మొహమాటం లేకుండా ఆమె చెబు తున్నారు. ఇంకోలా చెప్పాలంటే, రకరకాల ఉద్యోగాల్లో పురుషులపై నిషేధం విధిస్తున్నారన్నమాట. తద్వారా మహిళలకు కొత్త రకమైన అవకాశాలు కల్పిస్తున్నారనుకోవాలి. సరే... వీటి ద్వారా మనకర్థమయ్యేది ఏమిటి? అసలు ఏమైనా అర్థముందా వాటిల్లో? అలాటి ప్రతిపాదనలు అవసరమా? న్యాయ మైనవేనా? అనవసరంగా తీసుకొచ్చారా? మరీ నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయా? ఇప్పటివరకూ చెప్పినదాన్ని బట్టి నా ఆలోచన ఏమిటన్నది మీకు అర్థమై ఉంటుంది. కొంచెం వివరంగా చూద్దాం. మొదటగా చెప్పు కోవాల్సింది... ఈ ప్రతిపాదనల వెనుక పురుషులపై ఉన్న అప నమ్మకం గురించి! పురుష టైలర్లు, క్షురకులు, దుకాణాల్లో పనిచేసే వారి సమక్షంలో మహిళల భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్నారు. చిన్నపిల్లల రక్షణ విషయంలోనూ మనం మగ సిబ్బందిని నమ్మడం లేదంటే... వాళ్లకేదో దురుద్దేశాలను ఆపాదిస్తున్నట్లే! పైగా... ఈ ప్రతిపాదనలు కాస్తా మహిళల జీవితాల తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి కూడా! తాము సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పురుషులు బాగా రాణిస్తున్న రంగాల్లో, వారి సేవలను తాను వినియోగించు కోవాలని ఒక మహిళ నిర్ణయించుకుంటే ఈ ప్రతిపాదనల పుణ్యమా అని అది అసాధ్యమవుతుంది. ఇంకోలా చూస్తే ఇది తాలిబనిజంకు ఇంకో దిశలో ఉన్న ప్రతిపా దనలు అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు మహిళలను తిరస్క రిస్తున్నారు. ఇక్కడ పురుషులను మహిళలకు దూరంగా ఉంచు తున్నారు. వారి దుర్మార్గమైన మనసులను విశ్వసించకూడదు; కాబట్టి వారిని మహిళలకు దూరంగా ఉంచాలి.ఇప్పుడు చెప్పండి... ఈ ప్రతిపాదనలు వాస్తవంగా అవసరమా? ఇలాగైతే పురుషుల దుస్తులమ్మే దుకాణాల్లో మహిళలు పని చేయకూడదు మరి! మహిళా జిమ్ శిక్షకులు పురుషులకు ట్రెయినింగ్ ఇవ్వకూడదు. ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేద్దామా?పురుష రోగులకు, వినియోగదారులకు సేవలు అందించడానికి అను మతిద్దామా? మగ శిక్షకులు, దుకాణాల్లోని మగ సేవకులను నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు... స్త్రీలు పేషెంట్లుగా, వినియోగదారులుగా వచ్చినప్పుడు వాళ్లు ఎలా ఎక్కువ నమ్మకస్తులవుతారు?నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైందనే అనుకుంటున్నా. పురుషులు నిర్వహిస్తున్న పనులపై నమ్మకం లేకపోతే... మహిళలపై కూడా అదే అవిశ్వాసం ఉంటుంది కదా! అప్పుడు అదే ప్రశ్న కదా ఉత్పన్నమయ్యేది! పురుషులను అస్సలు నమ్మడం లేదని చెప్పడం ద్వారా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏ రకమైన సందేశం ఇవ్వదలచుకున్నారు?కొంచెం ఆలోచించి చూడండి. మహిళల విషయంలో వివక్ష చూపేవారిని మిసోజినిస్ట్ అంటూ ఉంటారు. ఈ లెక్కన బబితా చౌహాన్ను మిసాండ్రిస్ట్ అనాలి. మహి ళల పట్ల వివక్ష చూపడం ఎంత తప్పో... పురుషులపై చూపడం కూడా అంతే తప్పు. అయితే మిసోజినీ గురించి మనకు కొద్దోగొప్పో పరిచయం ఉంది కానీ మిసాండ్రిస్టుల విషయం నేర్చుకోవాల్సే ఉంది. ఈ పనికిమాలిన విషయానికి మనం బబితా చౌహాన్కు కృతజ్ఞులుగా ఉండాలి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
యూపీ ఆస్పత్రి ఘటన.. దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీ
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం -
Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీలోగల మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం దరిమిలా ఆస్పత్రి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కృపాల్ సింగ్ రాజ్పుత్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ‘అనారోగ్యంతో బాధ పడుతున్న నా మనుమడిని ఆస్పత్రిలో చేర్పించాను. పిల్లాడు ఉంటున్న వార్డులో శుక్రవారం రాత్రి 10 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ గదిలోనికి వెళ్లాను. ఆ వార్డులోని 18 పడకలపై 50 మందికిపైగా పిల్లలున్నారు. ఒక బెడ్పై ఆరుగురు శిశువులు ఉన్నారు. చుట్టూ మంటలు వ్యాపించాయి. అతికష్టం మీద 25 మంది పిల్లలను బయటకు తీసుకు వచ్చాను. నేను చూస్తుండానే 10 మంది శిశువులు కాలి బూడిదయ్యారు. నా కుమారుడు క్షేమంగానే ఉన్నాడు’ అని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న 25 మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడిన కృపాల్ సింగ్ను ఆసుపత్రి సిబ్బంది, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు. కాగా వైద్య కళాశాలలో కేవలం 18 పడకలపై 54 మంది చిన్నారులకు చికిత్స అందించడాన్ని చూస్తుంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని తెలుస్తోంది. అలాగే అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఇంతటి దారుణ పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిజేష్ పాఠక్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ -
Uttar Pradesh: మట్టిలో కూరుకుని నలుగురు మహిళలు దుర్మరణం
కాస్గంజ్: ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్లోని కస్బా మోహన్పురా గ్రామంలోని కొందరు మహిళలు మట్టిని తవ్వేందుకు వెళ్లారు. ఆ సమయంలో మట్టిలో కూరుకుపోయి ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతిచెందారు.ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మహిళలు మట్టిలో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.ఘటనా స్థలంలో కాస్గంజ్ జిల్లా అధికారి మేధా రూపమ్, ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఉన్నారు. వీరు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మట్టిని తవ్వేందుకు వెళ్లిన ప్రత్యక్ష సాక్షి, గాయపడిన మహిళ హేమలత మీడియాతో మాట్లాడుతూ దేవతాన్ పండుగ సందర్భంగా కాటోర్ రాంపూర్లోని మహిళలు తమ ఇంటిలోని పొయ్యిలకు రంగులు వేయడానికి పసుపు మట్టిని తవ్వడానికి వెళ్లారన్నారు.ఈ సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీగా మట్టి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, ఘటనాస్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..! -
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు
లక్నో: అసభ్యకరంగా తాకుతూ దురుద్దేశంతో వ్యవహరించే పురుషుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికంటూ ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ పలు సంచలనాత్మక సిఫారసులను రూపొందించింది. వీటి ప్రకారం పురుషులు..టైలరింగ్ షాపుల్లో మహిళల కొలతల్ని తీసుకోరాదు.సెలూన్లలో మహిళల జుత్తు కత్తిరించరాదు. దుస్తుల దుకాణాలు, జిమ్లు, కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. స్కూల్ బస్సుల్లో భద్రత కోసం మహిళా సిబ్బందిని నియమించాలి..వంటివి ఉన్నాయి. అక్టోబర్ 28వ తేదీన సమావేశమైన కమిషన్ ఈ మేరకు నిబంధనలను ఆమోదించింది. బహిరంగ ప్రదేశాల్లో పురుషుల నుంచి మహిళలను వేరుగా ఉంచేందుకు, మహిళలకు భద్రతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ అన్ని జిల్లాల మేజి్రస్టేట్లకు లేఖలు రాసింది. ‘చాలా చోట్ల జిమ్లలో మగ ట్రెయినర్లు, మహిళల బొటిక్లలో మగ దర్జీలు ఉంటున్నారు. వీరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఇటీవలి కాలంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి’అని యూపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ తెలిపారు. ‘టైలర్లుగా మగవాళ్లుండటంపై మాకెలాంటి సమస్యా లేదు. మహిళల కొలతల్ని పురుషులు తీసుకోడంపైనే మా అభ్యంతరమంతా’అని ఆమె వివరించారు. ‘ఇలాంటి అన్ని చోట్లా శిక్షణ పొందిన మహిళల్ని నియమించుకోవాలి. ఇందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ, ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: సీఎం సమోసాలు ఎవరు తీసుకున్నారు.. సీఐడీ దర్యాప్తు -
యూపీ మదర్సాచట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం(నవంబర్ 5) కొట్టివేసింది. మదర్సా చట్టంలో రాజ్యాంగ ఉల్లంఘన ఏదీ లేదని స్పష్టం చేసింది. 17 లక్షల మంది విద్యార్థులు మరియు 10,వేల మంది మదర్సా ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యా వ్యవస్థలో సర్దుబాటు చేయాలనే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. మదర్సాచట్టాన్ని పూర్తిగా కొట్టివేయనవసరం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. అభ్యంతరాలున్న పలు సెక్షన్లను సమీక్షించవచ్చని తెలిపింది.ఇదీ చదవండి: అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానివి కావు: సుప్రీంకోర్టు -
తాతలు ఉత్తరాలు బట్వాడా చేసేవారని..
బహ్రాయిచ్ : ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి అత్యంత విచిత్రమైన రీతిలో పొట్టపోసుకుంటున్నాడు. జిల్లాకు చెందిన సురేష్ కుమార్ గత 40 ఏళ్లుగా పోస్ట్మ్యాన్ రూపంలో ఇంటింటికీ తిరుగుతున్నాడు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ వింత పంథాను ఎంచుకున్నాడు. తన తాత, ముత్తాతల కాలం నుంచి తమ కుటుంబంలోని వారు ఉత్తరాలు బట్వాడా చేసేవారని సురేష్ కుమార్ మీడియాకు తెలిపారు. పూర్వంరోజుల్లో అతని పూర్వీకులు బ్రిటీష్ వారికి ఉత్తరాలు అందజేసేవారట. ఇప్పుడు సురేష్ పోస్ట్మ్యాన్ గెటప్తో అందరినీ పలుకరిస్తున్నాడు. దీనికి ప్రతిఫలంగా వారు ఏది ఇచ్చినా తీసుకుంటూ, దానితో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.సురేశ్ ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పోస్ట్మ్యాన్ వేషధారణతో తిరుగుతుంటాడు. ఇంటింటికీ వెళ్లి మీ పేరు మీద ఉత్తరం వచ్చిందని వారికి చెబుతుంటాడు. వారు తొలుత అతనిని పోస్ట్మ్యాన్గా భావిస్తారు. తరువాత విషయం తెలుసుకుని, ఆనందంగా తమకు తోచినంత సురేష్కు ముట్టజెపుతుంటారు.స్థానికులు అతనిని పోస్ట్మ్యాన్ అని పిలుస్తుంటారు. సురేష్ కుమార్ పోస్ట్మ్యాన్ యూనిఫాం ధరించి, తలపై టోపీ పెట్టుకుంటాడు. అలాగే కళ్లద్దాలు కూడా పెట్టుకుంటాడు. చేతిలో వైర్లెస్ వాకీ-టాకీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగొందిన ఈ వృత్తిని అనుకరిస్తూ సురేష్ కుమార్ పొట్టపోసుకోవడం విశేషమే మరి.ఇది కూడా చదవండి: ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం -
18 అడుగుల శానిటరీ ప్యాడ్ రూపొందించి..
నోయిడా: మహిళల రుతుక్రమానికి సంబంధించిన అపోహలను తొలగించేందుకు, దీనిపై మరింత అవగాహనం పెంపొందించేందుకు యూపీలోని నోయిడాలో గల ఛాలెంజర్స్ గ్రూప్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.దీనిలో భాగంగా మహిళా సాధికారతకు చిహ్నంగా 81 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు కలిగిన శానిటరీ ప్యాడ్ను రూపొందించారు. ఛాలెంజర్స్ గ్రూప్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1200 మంది బాలికలు పాల్గొన్నారు. ఆరు వేల శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. బహిష్టు సమయంలో పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి నిర్వాహకులు బాలికలకు అవగాహన కల్పించారు.వైద్య నిపుణురాలు శాలిని ఆధ్వర్యంలో పలు అవగాహనా కార్యక్రమాలు, క్విజ్ పోటీ, పోస్టర్ పోటీలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాలెంజర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రిన్స్ శర్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలకు రుతుక్రమంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ది పవర్ ఆఫ్ షీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఛాలెంజర్స్ గ్రూప్ మురికివాడలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ, అక్కడి బాలికలకు రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి తెలియజేస్తుందన్నారు.ఇది కూడా చదవండి: కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం -
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్లో ఈ పోస్ట్ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్పాయింట్ ప్రెజెంటేషన్ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
నేటి నుంచి యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో
లక్నో: ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (యూపీఐటీఎస్) నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకకూ కొనసాగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో నేడు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది తదితరులు హాజరుకానున్నారు.ఈ ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియా ఎక్స్పొజిషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలో 2500కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 70 దేశాల నుంచి దాదాపు 500 మంది విదేశీ కొనుగోలుదారులు ఈ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను సందర్శించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన ఉండనుంది. 'वैश्विक व्यापार का महाकुंभ'Uttar Pradesh International Trade Show के द्वितीय संस्करण का उद्घाटन आज माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी के कर कमलों से सम्पन्न होगा।कार्यक्रम में #UPCM श्री @myogiadityanath जी की भी गरिमामयी उपस्थिति रहेगी।दिनांक: 25 सितंबर 2024समय:… pic.twitter.com/wAk8ZggvqN— Government of UP (@UPGovt) September 25, 2024గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో జరిగిన ప్రీ-ఈవెంట్ బ్రీఫింగ్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రి రాకేష్ సచన్ మాట్లాడుతూ ఈ ఏడాది ట్రేడ్ ఫెయిర్ గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. యూపీ ఆర్థికాభివృద్ధికి యూపీఐటీఎస్ చిహ్నంగా మారిందని సచన్ తెలిపారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నామన్నారు.ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం -
స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!
భార్యా భర్తలమధ్య విభేదాలు వచ్చినపుడు విడిపోవడం సహజం. ఇక ఇద్దరి మధ్యా సంబంధాలు ఒక కొనసాగలేవు అనుకున్నపుడు విడాకులకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వ్యవహారం ఒక్కోసారి పరస్పర అంగీకారంతో ఈజీగా అయిపోతుంది కూడా. అయితే విడాకులకు సంబంధించి కొన్ని విస్తుపోయే కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విడాకుల కేసు పలువురిని ఆలోచనలో పడేసింది. విషయం ఏమిటంటే..ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. తన భర్త రాజేష్ 40 రోజుల్లో ఆరు సార్లు మాత్రమే స్నానం చేశాడనీ, దీంతో అతని శరీరం నుంచే ఆ దుర్వాసనను భరించలేక పోతోంది. పైగా వారానికోసారి పవిత్రంగా భావించే గంగాజలాన్ని చల్లుకుంటాడట. ఇక అతనితో జీవించడం తన వల్ల కాదని కోర్టును ఆశ్రయించింది. పెళ్లయినప్పటి నుంచీ అదీ తాను బలవంతంగా చేయగా కేవలం ఆరు సార్లుమాత్రమే స్నానం చేశాడు. దీంతో రాజేష్ భార్య మహిళ కుటుంబ సభ్యులు భర్త రాజేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది విడాకులు కావాలని కోరింది.అలిగి పుట్టింటికి వెళ్లింది. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తరువాత డైలీ స్నానం చేసేందుకు పరిశుభ్రంగా ఉండేందుకు రాజేష్ ఒప్పుకున్నాడు. కానీ ఆ మహిళ అతడితో ఉండడానికి ఇష్టం పడటం లేదు. దీంతో మరోసారి సెప్టెంబర్ 22న కౌన్సిలింగ్ కు రావాలని వెల్లడించారు అధికారులు.కాగా ఇలాంటి అరుదైన కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి కాదు. భర్త కుర్ కురే ప్యాకెట్ ఇవ్వలేదని విడాకులు కోరిన ఘటన ఇటీవల ఆగ్రాలో వచ్చిన సంగతి తెలిసిందే. -
Uttar Pradesh: తప్పిన రైలు ప్రమాదం.. అనుమానిత వస్తువులు స్వాధీనం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో భివానీకి వెళ్లే కాళింది ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఈ రైలు.. పట్టాలపై ఎవరో ఉంచిన సిలిండర్ను బలంగా ఢీకొంది. ఈ ఘటన వెనుక కుట్ర దాగివుందని రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్ప్రెస్ ప్రయాగ్రాజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ మీదుగా భివానీకి వెళ్తోంది. శివరాజ్పూర్ సమీపంలో సిలిండర్తో పాటు మరికొన్ని వస్తువులను ఈ రైలు ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.విచారణ అనంతరం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలోపలు అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ దొరికిన ప్రదేశంలో ఒక సీసాలో పసుపు రంగు పదార్థం, తెల్లటి పొడి కనిపించింది. రైలును కొద్దిసేపు నిలిపివేసి, ఆ మార్గాన్ని పరిశీలించిన అనంతరం ఆ రైలును ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
యూపీలో మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్-కాన్పూర్ రైల్వే లైన్లో కాస్గంజ్ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ట్రాక్పై ఉంచిన భారీ కర్ర దుంగను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొంది. దానిని రైలు ఇంజిన్ 550 మీటర్ల దూరంవరకూ ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ ముందు భాగంలో దుంగ ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ డివిజన్లో వారం వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. గత శుక్రవారం నాడు పంకిలో బండరాయిని ఢీకొనడంతో సబర్మతి ఎక్స్ప్రెస్ బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా కాస్గంజ్ నుండి ఫరూఖాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (05389) భటాసా స్టేషన్ సమీపంలో ట్రాక్పై ఉంచిన భారీ కర్ర దుంగను ఢీకొంది. నాలుగున్నర అడుగుల పొడవున్న దుంగ బరువు 35 కిలోలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ జహీర్ అహ్మద్, ఆర్పీఎఫ్ ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అంకుష్ కుమార్, ఇంజన్ విభాగానికి చెందిన రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ కర్ర దుంగను తొలగించి 33 నిమిషాల తర్వాత రైలును పంపించారు. ఘటనా స్థలానికి 50 అడుగుల దూరంలో ఒక పొలంలో మృతదేహం పడివుండటాన్ని వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
UP By Election : సంఘ్ చేతికి బీజేపీ ఉప ఎన్నికల బాధ్యతలు
మొన్నటి యూపీ లోక్సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గత పోరు చోటుచేసుకుంది. ఇప్పుడు దీనిని ఆపేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ నేత అరుణ్కుమార్ల సమక్షంలో సమావేశం జరిగింది.ప్రభుత్వం- సంఘ్ మధ్య మెరుగైన సమన్వయంతో పాటు ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ ప్రతినిధుల నియామకం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల సన్నాహాల్లో బీజేపీతో పాటు సంఘ్ కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు.దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు బీజేపీ నష్టపోవాల్సి వస్తుందని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు ప్రభుత్వం, సంఘ్ మధ్య పరస్పర సమన్వయంపై చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలను సంఘ్కు అప్పగించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికార్పూర్-బులంద్షహర్ రోడ్డులో పికప్ వ్యాన్, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. మృతులంతా అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్లోని రాయ్పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారు. గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది పికప్ వ్యాన్లో ఘజియాబాద్ నుంచి అలీగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు బులంద్షహర్ రోడ్డులో ఉన్న ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం వీరంతా పికప్ వ్యాన్లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు వీరు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, జిల్లా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. దానిలోని సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్
లక్నో: సబర్మతి ఎక్స్ప్రెస్ శనివారం(ఆగస్టు17) తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వేస్టేషన్లో రైలు పెద్ద రాయిని గుద్దుకోవడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయని నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారణాసి జంక్షన్ అహ్మదాబాద్ రూట్లో పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్మతి ఎక్స్ప్రెస్ ప్రయాణికులను వేరే రైలులో గమ్యస్థానాలకు తరలించారు. -
ఆకతాయి పనితో కదులుతున్న ట్రైన్ నుంచి దూకిన ప్రయాణికులు
కదులుతున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయనే అకతాయిలు చేసిన పుకార్లు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ బిల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు.మొరాదాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బిల్పూర్ స్టేషన్ సమీపంలోని హౌరా-అమృత్సర్ మెయిల్ జనరల్ కోచ్లో ఈ సంఘటన జరిగింది . గాయపడిన వారిని అన్వారీ (26), అఖ్తరీ (45), కుల్దీప్ (26), రూబీ లాల్ (50), శివ శరణ్ (40), చంద్రపాల్ (35)లుగా గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులను షాజహాన్పూర్ మెడికల్ కాలేజీలో చేర్చినట్లు జీఆర్పీ స్టేషన్ ఇన్ఛార్జ్ రెహాన్ ఖాన్ వెల్లడించారు. రైల్వే స్టేషన్లో గందరగోళంరైలు బరేలీలోని బిల్పూర్ స్టేషన్కు చేరుకోగానే గందరగోళం నెలకొంది. రైలులో మంటలు చెలరేగిపోయాయనే పుకారుతో ప్రయాణికులు ఆందోళనకు గురైరయ్యారు. భయాందోళనతో ట్రైన్ చైన్ లాగారు. చాలా మంది ప్రయాణికులు ఇంకా కదులుతున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.రైల్లో చోటు చేసుకున్న ఘటనపై రెహాన్ ఖాన్ మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు గాల్లో మంటలు వ్యాపించాయనే పుకార్లు పుట్టించినట్లు మా దృష్టికి వచ్చింది. పుకార్లు చేసిన అనంతరం ట్రైన్ చైన్ లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. -
సొంత పార్టీని యోగి ఫూల్ చేశారు: అఖిలేష్ కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యోగి అంటున్నట్లు తానెవరినీ ఫూల్స్ చేయలేదని, లోక్సభ ఎన్నికల్లో యోగి ఆయన సొంత పార్టీ అధిష్టానాన్నే ఫూల్ను చేశారని అఖిలేష్ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సమాజ్వాదీ ఫ్లోర్లీడర్(ఎల్వోపీ)గా మాతా ప్రసాద్ పాండేను నియమించడంపై అఖిలేష్పై యోగి సెటైర్లు వేశారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభం సందర్భంగా ప్రసాద్పాండేకు స్వాగతం చెబుతూనే ఎల్వోపీ పదవి ఇవ్వకుండా మామ శివపాల్యాదవ్ను అఖిలేష్ ఫూల్ను చేశారన్నారు. అఖిలేష్ ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడని చురకలంటించారు.అయినా మామ శివపాల్కు మోసపోవడం అలవాటైపోయిందన్నారు. దీనికి స్పందించిన అఖిలేష్ తానెవరినీ ఫూల్ను చేయలేదని, యోగి ఏకంగా ఆయన పార్టీ హైకమాండ్నే ఫూల్ను చేశారని కౌంటర్ ఇచ్చారు. ఇక శివపాల్ యాదవ్ ఇదే విషయమై స్పందిస్తూ 2027లో యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమాజ్వాదీపార్టీలో అందరం సమానమేనన్నారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లికొడుకులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చిన కారు రోడ్డుపై వెళుతున్న ఓ స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటర్పై వెళుతున్న తల్లికొడుకులు రోడ్డుపై చాలా దూరం ఎగిరిపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం(జులై 20) జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
యూపీ, రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
లక్నో/జైపూర్: యూపీ, రాజస్థాన్లలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు. రాజస్థాన్లోని బికనీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతులంతా హర్యానాకు చెందిన వారని సమాచారం. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జవడంతో అందులో ఇరుక్కున్నవారి మృతదేహాలను బయటికి తీయడం కష్టంగా మారింది. ప్రమాద తీవ్రతకు కారులో నుంచి ఇద్దరు దూరంగా పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఉన్నావోలో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి ఉత్తరప్రదేశ్లోని లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఉన్నావో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక స్కార్పియో వాహనం వేగంగా ట్రక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. స్కార్పియో ఢిల్లీ నుంచి అయోధ్య వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
లక్నో: ఉత్తరప్రదేశ్లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే లక్నో విచ్చేసిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.ఓబీసీల్లో పట్టుండంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌర్యకు, సీఎం ఆదిత్యనాథ్కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు కేబినెట్ మీటింగ్లకు మౌర్య హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.ఈ కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్గా వెళ్లే అవకాశముంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. యూపీలో సీట్లు కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మ్యాజిక్ఫిగర్ను దాటలేక ఎన్డీఏ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
యూపీలో బీజేపీ వెనుకంజ అందుకే.. యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ వెనుకబడడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి నమ్మకమే పార్టీ కొంప ముంచిందన్నారు. లక్నోలో ఆదివారం(జులై 14) జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ మీటింగ్లో యోగి మాట్లాడారు. ‘ఎన్నికల్లో కొన్ని ఓట్లు, సీట్లు కోల్పోయాం.దీంతో గతంలో మన చేతిలో ఓడిపోయిన ప్రతిపక్షం ఎగిరెగిరి పడుతోంది. అంత మాత్రానా బీజేపీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మనమెన్నో మంచి పనులు చేశాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజల కోసం పోరాడాం. అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు పటిష్టం చేశాం. యూపీని మాఫియా రహితంగా చేశాం’అని యోగి అన్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ కేవలం 33 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ సమాజ్వాదీ(ఎస్పీ) 37 సీట్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది. -
యూపీలో వరదలు.. జలదిగ్బంధంలో వందల గ్రామాలు
భారీ వర్షాలకు తోడు నేపాల్ నుంచి వస్తున్న వరదనీరు ఉత్తరప్రదేశ్ను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోని బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బలరాంపూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, బారాబంకి, సీతాపూర్ పరిధిలోని దాదాపు 250 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అలాగే లఖింపూర్ ఖేరీలోని 150 గ్రామాలు, షాజహాన్పూర్లోని 30, బదౌన్లోని 70, బరేలీలోని 70, పిలిభిత్లోని 222 గ్రామాలకు చెందిన ప్రజలు వరద నీటిలోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదల కారణంగా పూర్వాంచల్లోని బల్లియాలో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. వరుసగా రెండవ రోజు ఢిల్లీ-లక్నో హైవేపై గర్రా నది వరద నీరు నిలిచిపోవడంతో ఈ మార్గంలో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మొరాదాబాద్- లక్నో మధ్య 22 రైళ్లను నెమ్మదిగా నడుపుతున్నారు. షాజహాన్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోకి వరద నీరు చేరడంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.షాజహాన్పూర్ నగర శివార్లలోని హౌసింగ్ డెవలప్మెంట్ కాలనీతో సహా ఇతర లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 10 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం 225 మందిని రక్షించింది. ఎస్ఎస్ కళాశాల లైబ్రరీలోని వందల పుస్తకాలు నీట మునిగాయి. ఖేరీ, షాజహాన్పూర్, బరేలీకి చెందిన ఆరుగురు వరద నీటిలో కొట్టుకుపోయారు. గురువారం ఉదయం 11 గంటలకు షాజహాన్పూర్ హైవేపైకి వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
ఉత్తరప్రదేశ్.. రక్తదానంలో నంబర్ వన్
రక్తదానం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు ముందున్నారు. రాష్ట్ర జనాభాలోని 14.61 శాతం మంది ప్రజలు 2023లో రక్తదానం చేసి, తమ సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడంలో యూపీ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో నిలవగా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది.ఆర్టీఐ కార్యకర్త విపుల్ శర్మ దరఖాస్తుకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ-రక్తకోష్ పోర్టల్ డేటాను షేర్ చేసింది. దీనిలోని వివరాల ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో రక్తదానం చేసేవారి సంఖ్య ప్రతి ఏటా 50 శాతానికి పైగా పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ 2021లో 45 లక్షల యూనిట్ల రక్తం సేకరించగా, అది 2022 నాటికి 80 లక్షల యూనిట్లకు పెరిగింది. 2023లో దేశంలోని మూడు వేలకు పైగా బ్లడ్ బ్యాంక్లలో మొదటిసారిగా 1.29 కోట్ల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో అత్యధికంగా 18.11 లక్షల యూనిట్ల రక్తాన్ని ఉత్తరప్రదేశ్లోని 400కు పైగా బ్లడ్ బ్యాంకులు అందించాయి.మహారాష్ట్రలో 15.20 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా, గుజరాత్లో 10.51 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అమెరికన్ రెడ్క్రాస్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ సగటున 4.3 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఒక పురుషునిలో సగటున 5.7 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి రోజూ 400 నుండి రెండు వేల మిల్లీలీటర్ల రక్తాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఒక వ్యక్తి ఒకసారి అర లీటరు రక్తాన్ని దానం చేయవచ్చు. 2018లో దేశంలోని 124 బ్లడ్ బ్యాంకులు ఈ-రక్తకోష్ పోర్టల్లో నమోదయ్యాయి. ఆ ఏడాది వీటిలో మొత్తంగా 35 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 2019లో రక్తదానం 43 లక్షల యూనిట్లకు పెరిగింది. అయితే 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో కేవలం 40 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించారు. -
సాకార్ హరి ఆశ్రమంపై నిరంతర నిఘా
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 121 మంది మృతి చెందారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మెయిన్పురిలోని బిచ్వాన్ పట్టణంలో ఉన్న సాకర్ హరి ఆశ్రమంపై నిరంతర పోలీసు నిఘా కొనసాగుతోంది. హత్రాస్ ఘటన అనంతరం సకార్ హరి ఆశ్రమానికి వచ్చే బాబా అనుచరుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. హత్రాస్ ఘటన జరిగి ఏడు రోజులు గడిచాయి. కేసు దర్యాప్తునకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు, నిందితులను హత్రాస్ పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఆశ్రమంపై కన్నేసి ఉంచాయి. ఇంటెలిజెన్స్ శాఖ సిబ్బంది స్థానికుల కదలికలపై నిఘా పెట్టింది. -
భోలే బాబాకు రక్షణగా 'బ్లాక్ కమాండోస్', మహిళా సైన్యం..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది మరణానికి కారణమైన భోలే బాబా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తనని తాను స్వయంగా దేవుడిగా ప్రకటించుకున్న భోలే బాబాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలోని మెయిన్పురిలో భారీ మొత్తంలో పొందిన విరాళాలతో నిర్మించిన విశాలమైన ఆశ్రమం ఆయన భక్తులలో ఆయనకున్న పట్టు, ఆదరణకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే వివాదాలు ఆయన్ని వెంటాతుండడంతో తన ప్రాణాలు ముప్పు వాటిల్లుతుందనే అనుమానం ఎక్కువగా ఉండేదని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలోని తన ఇంటికి దాదాపు ఎనిమిదేళ్లుగా భోలే బాబా వెళ్లలేదు. అతని చుట్టూ బ్లాక్ కమాండో తరహాలో మహిళలు 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఆశ్రమంలో భోలే బాబాకు ఓ గది ఉంది. అందులో భోలే బాబా ఎంపిక చేసిన ఏడుగురు వ్యక్తులకు మాత్రమే అందులోకి అనుమతించే వారు. ఏడుగురిలో మహిళలు,సేవకులున్నారు.సెక్యూరిటీ ప్రోటోకాల్కు అనుగుణంగా రాత్రి 8 గంటల తర్వాత ఎవరినీ కలవడని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. భోలో బాబాకు రక్షణా ఉండే సిబ్బందికి ఒక కోడ్ వర్డ్, ప్రతి సెక్యూరిటీ స్క్వాడ్కి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంది.నారాయణి సేన, గరుడ్ యోధ, హరి వాహక్ అనే మూడు బృందాలు బాబాను రక్షించడానికి 24 గంటలూ పని చేస్తాయి.నారాయణి సేనలోని సిబ్బంది గులాబీ రంగు దుస్తులు, గరుడ్ యోధ నల్లని దుస్తులను (స్థానికులు వారిని బ్లాక్ కమాండోలు అని పిలుస్తారు.హరి వాహక్ సభ్యులు విలక్షణమైన టోపీలు, గోధుమ రంగు దుస్తులు ధరిస్తారు.బ్లాక్ కమాండోలు బాబా కాన్వాయ్ వెంట ఉంటారు. ఎల్లప్పుడూ 20 మంది పనిచేస్తుంటారు. ప్రతి నారాయణి సేనలో 50 మంది సభ్యులు, హరి వాహక్ సభ్యులు ఒక్కొక్కరు 25 మందితో కూడిన బృందాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
హత్రాస్ తొక్కిసలాట.. తొలిసారి స్పందించిన భోలే బాబా
లక్నో : ఉత్తరప్రదేశ్ హత్రాస్లో భోలే బాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా పరారయ్యాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ హత్రాస్లో 121 మందికి మరణానికి కారణమైన భోలేబాబా ఓ ప్రకటన చేశారు. వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.First responce from Bhole Baba Ashram after stampede incident. Appointed Advocate AP Singh for legal action pic.twitter.com/jXdq1AxW4H— Abhishek Thakur (@Abhisheklive4u) July 3, 2024తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వెళ్లిన చాలా సేపటి తర్వాత తొక్కిస లాట జరిగిందని తెలిపారు.సంత్సంగ్ ముగిసిన తర్వాత కొంతమంది సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం. దీనిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ ఓ నోట్ను విడుదల చేశారు.కాగా, సామాన్యుల మరణానికి కారణమైన భోలే బాబాను అరెస్టు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ స్పందించారు. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అని ఆ నోట్లో పేర్కొన్నారు. -
‘నన్నే తప్పుదోవ పట్టిస్తారా?’..అధికారిని కొట్టినంత పనిచేసిన మేయర్
ఓ నగర మేయర్ మున్సిపల్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ అంటూ సదరు అధికారిపై ఫైల్ను విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్గా మారాయి.కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే సమావేశంలో ఓ అధికారిపై ఫైలు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారి ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైన్ క్లీనింగ్, ఇతర సమస్యలపై అధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్థానిక జోన్-3 జోనల్ ఇంజనీర్ నుల్లా శుభ్రపరిచే సమీక్షకు సంబంధించి ఆమెను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో ప్రమీలా పాండే సదరు అధికారిపై మండిపడినట్లు సమాచారం. ఇంజనీర్ తన మండలంలో మార్చిలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదే విషయంలో మేయర్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మేలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినప్పుడు, జోనల్ ఇంజనీర్ మార్చిలో పని ప్రారంభించినట్లు ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టినంత పనిచేయబోయారు. చేతిలో ఫైల్ని సదరు అధికారిపై విసిరేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..పలువురు నెటిజన్లు మేయర్కు అండగా నిలుస్తోన్నారు. #WATCH | Uttar Pradesh: Kanpur Mayor Pramila Pandey throws a file at an officer during a meeting of officials held on drain cleaning and other issues in the Kanpur Municipal Corporation office. pic.twitter.com/rsrEQHBveg— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2024 -
ఆరుగురు ఇండియా కూటమి యూపీ ఎంపీలు సభ్యత్వం కోల్పోనున్నారా?
లక్నో: ఇటీవల కొత్తగా ఎంపికైన ఇండియా కూటమిలోని ఆరుగురు ఎంపీలు తమ పదవుల్ని కోల్పోనున్నారా? క్రిమినల్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఆరుగురు ఎంపీలకు రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడనుందా? అదే జరిగితే వారు పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. సాధారణ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన ఆరుగురు ఇండియా కూటమి ఎంపీలకు పదవీ గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆరుగురు క్రిమినల్ కేసులు ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. అదే జరిగితే ఈ ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం. ఇక ఆ ఆరుగురిలో ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన అఫ్జల్ అన్సారీ ఇప్పటికే గ్యాంగ్స్టర్ చట్టం కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. అతని నేరారోపణపై అలహాబాద్ హైకోర్టు గత నెలలో స్టే విధించింది. దీంతో ఆయన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్జల్ అన్సారీ కేసును జులైలో కోర్టు విచారించనుంది. కోర్టు శిక్షను సమర్థిస్తే అన్సారీ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.అజంగఢ్ సీటును గెలుచుకున్న ధర్మేంద్ర యాదవ్పై కూడా నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నాయి. అతను దోషిగా తేలితే రెండేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. దీంతో ఆయన సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మాయావతి హయాంలో మంత్రిగా పనిచేసిన బాబు సింగ్ కుష్వాహా నేషనల్ రూరల్ హెల్త్ మెషిన్(ఎన్ఆర్హెచ్ఎం) స్కామ్కు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై నమోదైన 25 కేసుల్లో ఎనిమిదింటిపై అభియోగాలు నమోదయ్యాయి. సుల్తాన్పూర్ స్థానం నుంచి గెలుపొందిన రాంభూల్ నిషాద్పై గ్యాంగ్స్టర్స్ చట్టం కింద ఒక కేసుతో సహా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. చందౌలీ లోక్సభ స్థానం నుంచి మాజీ మంత్రి మహేంద్ర నాథ్ పాండేపై విజయం సాధించిన వీరేంద్ర సింగ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. సహరాన్పూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. నగీనా రిజర్వ్డ్ స్థానంలో గెలిచిన సమాజ్ పార్టీకి చెందిన ఏడో అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్పై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏదైనా ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడితే అతని రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.అనేక మంది రాజకీయ నేతలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి తమ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉండడం గమనార్హం. -
2027 అసెంబ్లీ ఎన్నికలపై అఖిలేష్ దృష్టి
2024 లోకసభ ఎన్నికలు ముగియగానే ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎస్ఫీ ఎంపీలకు పలు సూచనలు చేశారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ నుంచి కొత్తగా ఎంపికైన ఎంపీలతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలు విని, పరిష్కారానికి కృషి చేయాలని, అప్పుడే భవిష్యత్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలతో అఖిలేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీకి పెద్దఎత్తున ప్రజల మద్దతు లభించిందన్నారు. దీంతో సోషలిస్టుల బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రజలు చెప్పే విషయాన్ని వినాలని, వారి సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని పిలుపునిచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లకు గాను ఎస్పీ 37 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ ఆరు సీట్లు దక్కించుకుంది. -
CM Yogi Adityanath Birthday: యోగి ఆదిత్యనాథ్కు ఆ పేరెలా వచ్చిందంటే..
జూన్ 5.. అంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు. నేటితో ఆయనకు 52 ఏళ్లు నిండాయి. దేశంలో ఫైర్ బ్రాండ్ లీడర్గా యోగి ఆదిత్యనాథ్కు పేరుంది. అభిమానులు ఆయనను యోగి బాబా, బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తారు. యోగి ఆదిత్యనాథ్ రెండుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో పాటు ఐదు సార్లు లోక్సభ ఎంపీగా కూడా ఉన్నారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో జన్మించారు. యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్. యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఫారెస్ట్ రేంజర్. సీఎం యోగి గణితంలో బీఎస్సీ పట్టా పొందారు. 1990లో ఏబీవీపీలో చేరారు. 1993లో గోరఖ్నాథ్ పీఠానికి చెందిన మహంత్ అద్వైత్నాథ్తో పరిచయం ఏర్పడింది. 1994లో అజయ్ సింగ్ బిష్త్ సన్యాసం స్వీకరించారు. నాథ్ శాఖకు చెందిన సాధువుగా మారారు. ఆ తర్వాత ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్గా మారింది. 1994లో అద్వైత నాథ్ తన వారసునిగా యోగి ఆదిత్యనాథ్ను ప్రకటించారు.యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా 1998లో గోరఖ్పూర్ నుంచి బీజేపీ టికెట్పై తన 26 ఏళ్ల వయసులో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014లలో గోరఖ్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మహంత్ అద్వైత్నాథ్ 2014లో కన్నుమూశారు. అనంతరం యోగి గోరఖ్నాథ్ పీఠానికి అధ్యక్షులయ్యారు.2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితాలు వెలువడే సమయంలో యోగి ఆదిత్యనాథ్ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బీజేపీ నేతలు ఎన్నికల ఫలితాల విడుదల వరకూ ఆగాలని ఆయనను కోరారు. ఆ సమయంలో మనోజ్ సిన్హా, కేశవ్ మౌర్య సహా పలువురు బీజేపీ నేతలు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్ను ఢిల్లీకి పిలిపించి, యూపీలో అధికారం చేపట్టాలని కోరింది.యోగి సీఎం పదవి చేపట్టగానే ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతలు. దీనికి పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ఆయన పోలీసు అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. యోగి నాయకత్వంలో 2022లో కూడా యూపీలో బీజేపీ విజయం సాధించింది. సీఎం యోగి బుల్డోజర్లతో నేరస్తుల ఇళ్లపై దండెత్తాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. అందుకే ఆయనకు బుల్డోజర్ బాబా అనే పేరు వచ్చిందంటారు. -
ఉత్తరప్రదేశ్: తొలి రౌండ్లో బీజేపీ ఆధిక్యం
యూపీలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ట్రెండ్లో బీజేపీ ముందంజలో ఉంది. 2024 లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగాయి. దేశంలోని 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యూపీలోని మీరట్ ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్కు ముందు గోరఖ్పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. #WATCH उत्तर प्रदेश: गोरखपुर लोकसभा सीट से भाजपा उम्मीदवार रवि किशन ने #LokSabhaElections2024 के मतगणना से पहले पंचमुखी मंदिर में पूजा की। pic.twitter.com/9PHNgUOmcF— ANI_HindiNews (@AHindinews) June 4, 2024 -
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. -
ఏడవ దశకు యూపీ సిద్ధం.. ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఏడవ దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ దశలో దేశంలోని మొత్తం 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసికి కూడా ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.చివరి దశలో అంటే జూన్ ఒకటిన యూపీలోని మహారాజ్గంజ్, గోరఖ్పూర్, ఖుషీనగర్, డియోరియా, బన్స్గావ్, ఘోసి, సలేంపూర్, బల్లియా, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్గంజ్లలో మొత్తం 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఎన్నికలు జరిగే 13 స్థానాల్లో ఐదు యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోరఖ్పూర్ చుట్టూ ఉండగా, నాలుగు ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిని ఆనుకుని ఉన్నాయి. 2019లో ఈ 13 స్థానాలలో 11 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. మిగిలిన రెండు స్థానాలను బీఎస్పీ దక్కించుకుంది.వారణాసివారణాసి లోక్సభ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రధాని మోదీ పోటీకి దిగారు. ఇక్కడ పోటీ ఏకపక్షంగానే కనిపిస్తోంది. 2003లో మినహా 1991 నుంచి ఈ సీటును బీజేపీనే సొంతం చేసుకుంటోంది.గోరఖ్పూర్గోరఖ్పూర్ను బీజేపీ సంప్రదాయ స్థానంగా పరిగణిస్తారు. ఇక్కడి నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ను మరోసారి బరిలోకి దింపింది. 2018 ఉప ఎన్నిక మినహా 1989 నుంచి బీజేపీ ఈ స్థానాన్ని దక్కించుకంటూ వస్తోంది.డియోరియా డియోరియా సీటుకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ సీటు టిక్కెట్టు ఇప్పుడు ఇండియా కూటమిలోని కాంగ్రెస్కు దక్కింది. మాజీ ఎంపీ శ్రీప్రకాష్ మణి త్రిపాఠి కుమారుడు శశాంక్ మణి త్రిపాఠిని బీజేపీ ఇక్కడి నుంచి రంగంలోకి దింపింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేష్ ప్రతాప్సింగ్కు టికెట్ ఇచ్చింది. డియోరియా నుంచి బీఎస్పీ నుంచి సందేశ్ యాదవ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.మీర్జాపూర్ యూపీ అసెంబ్లీలో అప్నా దళ్ (ఎస్) మూడో అతిపెద్ద పార్టీ. ఈ పార్టీ నుంచి అనుప్రియ మరోసారి ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. -
ఫోను వెలుగులో పోలింగ్ పార్టీల అవస్థలు!
దేశంలో దాదాపు నెల రోజుల పాటు వివిధ దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసే పోలింగ్ పార్టీలు పలు అవస్థలను ఎదుర్కొంటున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో పోలింగ్ నిర్వహణ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.ఉత్తరప్రదేశ్లోని సదర్ నియోజక వర్గం పరిధిలోగల పలు పోలింగ్ బూత్లలో పనిచేస్తున్న పోలింగ్ సిబ్బంది మీడియాకు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కొన్ని చోట్ల కరెంటు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఫోన్ల టార్చ్ వెలుతురు సాయంతో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల నీటి కుండల స్టాండ్లు మాత్రమే ఉన్నాయని, నీటి కుండలు మాత్రం లేవని వాపోయారు. పైఅధికారులకు చెప్పినా ఫలితం లేదని వారు వాపోతున్నారు.సదర్ అసెంబ్లీ పోలింగ్ కేంద్రమైన బూత్ 31వ బూత్ ప్రిసైడింగ్ అధికారి మహ్మద్ ఇబ్రహీం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఐదు నిమిషాలకు విద్యుత్ ట్రిప్ అవుతోందని, దీంతో పోలింగ్కు ఏర్పాట్లు సరిగా చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. బూత్ నంబర్ 39 ప్రిసైడింగ్ అధికారి కమత ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ ఉన్నా బల్బులు లేవని అన్నారు. దీంతో కొవ్వొత్తులు లేదా మొబైల్ టార్చ్లతో పోలింగ్కు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. -
బ్రిజ్భూషణ్కు షాక్.. రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్కు మరో ఎదురు దెబ్బ తగలింది. లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బ్రిజ్ భూషణ్ సింగ్పై అభియోగాలు మోపాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని కోర్టు పేర్కొంది. బ్రిజ్ భూషణ్పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 354-ఎ (లైంగిక వేధింపులు), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఫెడరేషన్ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్పై కూడా సెక్షన్ 506 కింద అభియోగాలు మోపాలని పోలీస్ శాఖకు కోర్టు సూచించింది. గత ఏడాది జూన్లోలైంగిక వేధింపుల కేసులో గత ఏడాది జూన్లో బ్రిజ్ భూషణ్,అతని సహచరుడు వినోద్ తోమర్పై ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. ఛార్జిషీట్లో ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యం లేదా నేరపూరిత శక్తి), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడించడం), 109 (ప్రేరేపణ), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు.1,500 పేజీల ఛార్జిషీట్లోపోలీసులు 1,500 పేజీల ఛార్జిషీట్లో బ్రిజ్ భూషణ్పై ఆరోపణలకు మద్దతుగా రెజ్లర్లు, ఒక రిఫరీ, ఒక కోచ్, ఫిజియోథెరపిస్ట్తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చారు.నో టికెట్ఉత్తర్ ప్రదేశ్ కైసర్గంజ్ లోక్సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్భూషణ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ సారి కైసర్గంజ్ స్థానంలో పార్టీ ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్కు అవకాశం కల్పించింది. కాగా, గత నెలలో కరణ్ భూషణ్ సింగ్ ఎంపీగా నామినేషన్ వేసే సమయంలో 10 వేలమంది బ్రిజ్భూషణ్ అనుచరులు.. 700 వాహనాలతో తరలివచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. -
నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
లక్నో: దేశంలో సాధారణ ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల పర్వంలో పలువురు నేతలు ప్రజలకు వినోదం పంచుతుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఒక నేత నామినేషన్ దాఖలుకు గడువు మించిపోతున్నా ప్రచార కార్యక్రమంలో పాల్గొని చివరి నిమిషంలో పరుగందుకున్నారు.దాదాపు 100 మీటర్ల దూరం పరుగులు పెట్టి చివరకు గడువు లోపల నామినేషన్ ఫైల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ డేరియా నియోజకవర్గంలో గురువారం జరిగింది. ఇక్కడి బీజేపీ అభ్యర్థి త్రిపాఠి తన నామినేషన్కు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య హాజరయ్యారు. దీంతో ఆ ప్రోగ్రామ్ బిజీలో ఉండిపోయి తన నామినేషన్నే రిస్కులో పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే చివరి 15 నిమిషాల్లో ఎలాగోలా పరుగెత్తి నామినేషన్ ఫైల్ చేయగలిగారు. 54 ఏళ్ల త్రిపాఠి తన కాలేజీ రోజుల్లో మంచి రన్నర్గా పేరుతెచ్చుకున్నారు. అది ప్రస్తుత ఎన్నికల్లో ఇలా ఆయనకు కలిసి రావడం విశేషం. ‘ఐఐటీలో చదివే రోజుల్లో నేను మంచి రన్నర్ను అది ఇప్పుడు నాకు గడువులోపల నామినేషన్ వేసేందుకు కలిసి వచ్చింది’అని త్రిపాఠి చెప్పారు. -
రూ.80 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి, పూల సాగు..కట్ చేస్తే..!
సౌకర్యవంతమైన జీవితం, ఇంగ్లాండ్లో దిగ్గజ టెక్ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం. యూరప్ టూర్లు, వీకెండ్ పార్టీలు.. అయినా మనసులో ఏదో వెలితి. ఏం సాధించాం అన్న ప్రశ్న నిరంతరం మదిలో తొలిచేస్తూ ఉండేది. కట్ చేస్తే, తాత ముత్తాతల వ్యవసాయ భూమిలో పూల వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అంతకు మించిన ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాడు. ఎవరా అదృష్టవంతుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.ఉత్తర ప్రదేశ్లో అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ కష్టపడి చదివాడు. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యూకేలో అధిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. రూ. 80 లక్షల ప్యాకేజీతో జీవనం సాఫీగా సాగుతోంది. కానీ తన వ్యవసాయ మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆశ ఒక వైపు, తోటి వారికి అవకాశాలను సృష్టించాలనే కోరిక మరోవైపు అభినవ్ సింగ్ను స్థిమితంగా కూర్చోనీయలేదు. రైతుల జీవన స్థితిగతులను మార్చడం. వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అనేది నిరూపించాలనేది లక్ష్యం. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.అభినవ్ 2014లో ఇండియాకు తిరిగి వచ్చాడు. గుర్గావ్లో కొన్నాళ్లు పనిచేశాడు. 2016లో 31 ఏళ్ల వయసులో అభినవ్ తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాలో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ పట్టుదలతో నిలిచి గెలిచాడు. స్వగ్రామంలో పూర్వీకుల భూమిలో గెర్బెరా వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించాడు, కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఉత్తరప్రదేశ్లో పెళ్లిళ్ల సీజన్లో అలంకరణకు కావాల్సిన రంగురంగుల పూలకు ఎక్కువ డిమాండ్ ఉందనీ, కానీ సప్లయ్ సరిగ్గా లేదని గుర్తించాడు. అంతే జెర్బెరా పువ్వుల సాగు వైపు మొగ్గు చూపాడు. 4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం రూ.58లక్షల పెట్టుబడిలో రూ.48 లక్షలు బ్యాంకు లోన్ కాగా, మిగతాది పొదుపు చేసుకున్నడబ్బు. ఫిబ్రవరి 2021లో తొలి పంటసాయం విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది.ప్రారంభించిన కేవలం ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు. అంతేకాదు పూలసాగు, ప్యాకేజింగ్, రవాణా , విక్రయాలు ఇలా పలు మార్గాల్లో 100 మంది వ్యక్తులకు జీవనోపాధిని అందించాడు. జెర్బెరా మొక్కలను స్థానికంగా ఇతర రైతులకు అందిస్తూ, స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించాడు. తోటి రైతులకు స్ఫూర్తినిగా నిలిచాడు. “ఉద్యోగంతో సంపాదించే దానికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఇతరులకు జీవనోపాధిని కల్పించడం, సొంత వూరిలో ఇష్టమైంది, ప్రత్యేకమైనది చేయడం. కుటుంబంతో కలిసి ఉండడం ఇన్ని ఆనందాల్ని ఎంత విలాసవంతమైన జీవితం మాత్రం అందిస్తుంది చెప్పండి’’ -అభినవ్. -
స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి నానారావ్ పార్కులో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఎన్నాళ్లయినా అందుబాటులోకి రాకపోవడంపై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కాన్పూర్ పట్టణంలోని నానారావ్ పార్క్ ఎంతో పురాతనమైనది. యోగి ప్రభుత్వం పార్కు నిర్వహణ, సుందరీకరణకు సంబంధించి పలు వాగ్దానాలు చేసింది. వీటిలో స్విమ్మింగ్ పూల్ను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒకటి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తికాలేదు. దీనిపై ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఆయన ఒక చిన్న బాత్ టబ్తో ఈ పార్కుకు చేరుకుని, దానిని నీటితో నింపారు. ఆ తర్వాత ఆ టబ్లో ఆయన కూర్చున్నారు. దానిలోనే ఎంజాయ్ చేస్తూ, స్వీట్లు కూడా తిన్నారు. పైగా పక్కనే ఒక బ్యానర్ తగిలించి, దానిపై ‘రూ.11 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు’ అని రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్విమ్మింగ్ పూల్పై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, నగర ప్రజలు వేసవిలో ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోతున్నారని వాపోయారు. ఈ కొలను 2023లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదన్నారు. దీని నిర్మాణంలో ఆర్థిక సమస్య లుంటే తమకు తెలియజేయాలని, అప్పుడు ప్రజల నుండి విరాళాలు సేకరించి అందజేస్తామన్నారు. -
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
ఉదయం ఎనిమిది గంటలకే వేడి గాలులు వణుకు పుటిస్తున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావాలంటేనే పెద్ద వాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితి. ఇక పిల్లల్ని బడికి పంపించాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కనౌజ్లోని ఒక స్కూలు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. దీంతో స్విమ్మింగ్ పూల్ పిల్లలు సంబరపడిపోతున్న వీడియో వైరల్ గా మారింది.Vaibhav Kumar, Principal says, " As the weather department informed about the heat wave, we were asking students to drink water and cool drinks...we also told them that people in cities bathe in swimming pools. Students asked us what swimming pools look like and when will they… pic.twitter.com/oyFqbpTI5V— ANI (@ANI) May 1, 2024 రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య పిల్లల్ని బడికి రప్పించేందుకు, వారి సౌకర్యార్థం ఒక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎండలు, వడగాల్పుల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రిన్సిపాల్ వైభవ్ కుమార్.క్లాస్ రూంలో, స్మిమ్మింగ ప్రస్తుతం గోధమ పంటపనులు నడుస్తున్నాయి కనుక చాలా కుటుంబాలు విద్యార్థులను పాఠశాలకు పంపడం లేదు. వారిని తిరిగి పిలవడానికి వెళ్ళాము, కానీ సరైన స్పందన లభించలేదు అందుకే ఈ వినూత్న ఆలోచనతో చేశాం. దీంతో హాజరు శాతం పెరిగింది. .. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.#WATCH | Uttar Pradesh: A govt school in Kannauj makes a swimming pool inside the classroom, amid rising temperature. pic.twitter.com/rsXkjDFa7a— ANI (@ANI) May 1, 2024 ఎండలనుంచి ఉపశమనం పొందేలా నీళ్లు, చల్లని పానీయాలకు తాగమని విద్యార్థులకు చెప్పాం. అయితే నగరాల్లో మాదిరిగా తమకు స్విమ్మింగ్ పూల్ కావాలని పిల్లలు అడిగారు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తసీఉకొని క్లాస్రూమ్ లోపల ఈత కొలను ఏర్పాటు చేశమన్నారు అసిస్టెంట్ టీచర్ ఓం తివారీ. -
రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ, అమోథీ లోక్సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠతకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటి (సీఈసీ) తెరదించింది.24 గంటల్లోగా ఆ రెండో స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ స్పష్టం చేశారు.అయితే నామినేషన్ల తుది గడువు మే 3 వరకు ఉండగా..మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయా లోక్సభ స్థానాల అభ్యర్ధులు ఖరారు చేయకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు -
ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు
ఉత్తరప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రాచీ నిగమ్ ట్రోలర్స్కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఎవరేమన్నా, తన విజయమేతనకు ముఖ్యమంటూ తేల్చి చెప్పింది."ట్రోలర్లు వారి ఆలోచనలతో వారుంటారు. నా విజయమే నా ప్రస్తుత గుర్తింపు. దీంతో నే సంతోషంగా ఉన్నాను" అని అంటూ బుధవారం తొలిసారి స్పందించింది. అలాగే తన రూపాన్ని చూసి, తన కుటుంబంగానీ, తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులుగానీ, తోటి మిత్రులు గానీ ఎన్నడూ చిన్నచూపు చూడలేదని, దీంతో తన దృష్టి అంతా తన చదువుపైనే కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చింది. అసలు తన రూపం గురించి తానెప్పుడూ బాధపడలేదనీ ఇంజనీర్ కావడమే లక్ష్యమని తెలిపింది. అంతిమంగా తన విజయం తప్ప తాను ఎలా ఉన్నాను అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేసింది.విశ్వనాథన్ మద్దతుమరోవైపు భారత చెస్ గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రాచీకి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను విద్యాపరమైన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. హార్మోన్ల ప్రభావం, చికిత్స ఉందిప్రాచీ నిగమ్కి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే ధీమాన్ తమ ఇన్స్టిట్యూట్ ఉచితంగా చికిత్స చేయనున్నట్లు వెల్లడించడం విశేషం. హార్మోన్ల ప్రభావంతో వచ్చే మహిళల్లో కనిపించే అవాంఛిత రోమాల పెరుగుదలను ఎండోక్రినాలజీ ద్వారా నియంత్రించవచ్చనీ, టీనేజ్ పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య నెలరోజుల్లో నయమవుతుందని ధీమాన్ అన్నారు.ఇటీవల విడుదలైన 10వ తరగతి 98.5 శాతం మార్కులతో యూపీలో టాప్లో నిలిచింది. ఈ సందర్భంగా ప్రాచీ నిగమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే 600లకు గాను 591 మార్కులు సాధించిన ఆమె ప్రతిభను చూడాల్సిన నెటిజన్లు కొంతమంది ఆమె ముఖంపై ఉన్న రోమాలను మాత్రమే చూశారు. అనుచిత వ్యాఖ్యలతో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
బీజేపీ ఎంపీ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్వీర్ డైలర్ బుధవారం(ఏప్రిల్24)గుండె పోటుతో మరణించారు. డైలర్కు ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు.2017లో ఎమ్మెల్యేగా గెలిచిన డైలర్ తర్వాత 2019లో ఎంపీగా గెలిచి పార్లమెంట్కు వెళ్లారు. డైలర్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. -
ఎన్నికల ప్రచారంలో డింపుల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా : అటు కేంద్రం బీజేపీని ఓడిస్తే.. ఇటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టొచ్చంటూ ఉత్తర్ప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ, మెయిన్పురి ఎంపీ అభ్యర్ధి డింపుల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెయిన్పురిలో డింపుల్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే ఈ లోక్సభ ఎన్నికలు. సమాజంలోని ప్రతి వర్గం నిర్లక్ష్యానికి గురవుతోంది. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అబద్ధాలు, దోపిడి ప్రభుత్వమని రాష్ట్రం, దేశం మొత్తం తెలిసిపోయిందని అన్నారు. అందుకే ఈ సారి లోక్సభ ఎన్నికల్ని చాలా తెలివిగా ఎదుర్కోవాలని ఓటర్లకు పిలునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న ప్రభుత్వాన్ని ఓడించారు. అందుకు ఈ ఎన్నికలే మనకు ఆయుధం. ఈ (బీజేపీ) ప్రభుత్వాన్ని కేంద్రం నుండి తొలగిస్తే, అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తొలగించే పని కూడా జరగవచ్చు అని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణీయే డింపుల్ యాదవ్ -
ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు
ప్రముఖ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మథురలో ఎన్నికల ప్రచారంలో రైతులను కలిసిన హేమమాలిని గోధుమ పొలంలో గడ్డికోసి సందడి చేశారు. పొలాల్లో పని చేసే మహిళలతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ పదేళ్లుగా తాను క్రమం తప్పకుండా కలుస్తున్న రైతులతో మరోసారి మమేకమయ్యేందుకు వారిని కలిసానని, వారి మధ్యలో ఉండటం వారికి కూడా సంతోషాన్నిచ్చిందని, రైతు మహిళలతో కలిసి ఫోటోలకు పోజులివ్వాలని పట్టుబట్టారంటూ ఆమె రాసుకొచ్చింది. మథుర లోక్సభ స్థానం నుంచి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలిని బరిలోకి దిగింది. 1991 నుండి 1999 వరకు, మధుర నాలుగు సార్లు బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే 2004లో మధుర కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 2009లో ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి మధుర నుంచి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత 2014లో హేమమాలినిని బీజేపీ రంగంలోకి దించింది. 2019 ఎన్నికల్లో, హేమ భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k — Hema Malini (@dreamgirlhema) April 11, 2024 తిరిగి ఇదే స్థానం బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 80 మంది పార్లమెంటు స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19, 26 మే 7, మే 13, మే 20, మే 23 , జూన్ 1 ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. -
UP: మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ముజఫర్నగర్లో బుధవారం(ఏప్రిల్ 10) జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఎవరి పేరు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేదో వాళ్ల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి’అని యోగి అన్నారు. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
ప్రతీ రెండు నెలలకు అయోధ్య భద్రతా సిబ్బంది మార్పు!
అయోధ్యలోని రామాలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ సిబ్బందిని ప్రతి రెండు నెలలకోసారి మార్చనున్నారు. రామ మందిర భద్రత బాధ్యతను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్ఎస్ఎఫ్)నిర్వహిస్తోంది. ఈ దళం ఏర్పాటైనప్పటి నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదు. దీంతో పీఏసీ సిబ్బంది సాయాన్ని తీసుకుంటున్నారు. పీఏసీ సిబ్బందిని ఒకేచోట నియమిస్తే వారిలో పని సామర్థ్యం దెబ్బతింటుందని, వారిలో నైతికత పడిపోతుందని భావించిన ఉన్నతాధికారులు పీఏసీ ఫోర్స్ను ప్రతీ రెండు నెలలకు మార్చాలని నిర్ణయించారు. అయోధ్యలోని రామ మందిర భద్రత కోసం ఎనిమిది కంపెనీల పీఏసీని యూపీ ఎస్ఎస్ఎఫ్కు అప్పగించారు. అయోధ్యలో మోహరించిన ఈ ఎనిమిది కంపెనీలను ప్రతి రెండు నెలలకు మార్చడానికి డీజీపీ ఆమోదం తెలిపారు. ఈ సిబ్బందికి సెక్యూరిటీ బ్రాంచ్ రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. -
లోక్సభ ఎన్నికలకు అఖిలేష్ దూరం?
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్త వినిపిస్తోంది. దీంతో ఇంతకాలం ఆయన ఆయన కన్నౌజ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఆయన ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అయితే కన్నౌజ్ సీటు నుంచి ఎవరిని నిలపాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కన్నౌజ్లోని బూత్ ఇన్ఛార్జ్లతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కన్నౌజ్ అభ్యర్థిపై చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. కన్నౌజ్ సీటు నుంచి అతని బంధువు తేజ్ ప్రతాప్కు టిక్కెట్ కేటాయించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నౌజ్లో ఎన్నికల ఇన్ఛార్జ్తో జరిగే సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమె బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ములాయం సింగ్ మరణానంతరం మెయిన్పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలిచి ఎంపీ అయ్యారు. కాగా రాంపూర్ లోక్సభ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ను అఖిలేష్ యాదవ్ పోటీకి దించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆజం ఖాన్ అందుకు సిద్ధంగా లేరని సమాచారం. కన్నౌజ్లో సమాజ్వాదీ నేతలు అఖిలేష్ యాదవ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ సోదరుడు రాజ్వీర్ సింగ్ యాదవ్ కుమారుడు. 2014లో మెయిన్పురి స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అతనికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. తేజ్ ప్రతాప్కు ఆర్జేడీ నేత లాలూ యాదవ్తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లాలూకు తేజ్ ప్రతాప్ అల్లుడు. లాలూ యాదవ్ కుమార్తె రాజలక్ష్మి యాదవ్ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. -
ఎన్నికల బరిలో ఆటో డ్రైవర్
దేశంలో త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలు పలు చోట్ల ఆసక్తికరంగా మారాయి. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. ఇంతలోనే ఈ స్థానం నుంచి ఒక ఆటో డ్రైవర్ ఎన్నికల రంగంలోకి దూకి, తాను బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్లకు పోటీ ఇస్తానని చెబుతున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన జ్ఞానదీప్ అనే ఆటో డ్రైవర్ గౌతమ్ బుద్ధ నగర్ లోక్సభ ఎన్నికల్లో తన పోటీకి సంబంధించి నామినేషన్ పత్రాలను జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో దాఖలు చేశాడు. ఈయన ఆటో నడుపుతూ చాలాకాలంగా గ్రేటర్ నోయిడాలో తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు. జ్ఞాన్దీప్ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్బుద్ధనగర్లో ఇప్పటి వరకు ఏ నేత కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని, అందుకే తాను రంగంలోకి దిగుతున్నానని తెలిపాడు. తాను మార్పును కోరుకుంటున్నానని, అందుకోసం పాటుపడతానని పేర్కొన్నాడు. స్థానికంగా రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. తాను రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్లకు పోటీగా నిలుస్తానని తెలిపాడు. తాను ఎంపీగా ఎన్నికైతే స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ట్రాన్స్జెండర్లకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు వారికి ఉపాధి కల్పించేందుకు చేయూతనిస్తానని అన్నాడు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా, వారు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా చూస్తానని పేర్కొన్నాడు.. लोकसभा चुनाव 2024 गौतमबुद्ध नगर में खड़ा हुआ गजब उम्मीवार, भाजपा-सपा को टक्कर देने आया एमपी का ड्राइवर, देखिए दिलचस्प वीडियो @ECISVEEP #LokSabhaElection2024 #Noida (@mayank_tawer ) pic.twitter.com/1HIsaBPEWo — Tricity Today (@tricitytoday) April 1, 2024 -
Mukthar Ansari : ‘‘అన్సారీ మరణంతో మాకు న్యాయం జరిగింది’’
లక్నో: గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ మృతితో తమకు న్యాయం జరిగిందని 2005లో అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. కృష్ణానందరాయ్ కుమారుడు పియూష్ రాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్సారీ మృతితో తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పారు. ‘బాబా గోరక్నాథ్ దయతోనే మాకు న్యాయం జరిగింది. రంజాన్ నెలలోనే అన్సారీకి దేవుడు తగిన శిక్ష విధించాడు. పంజాబ్లోని జైళ్లలో ఉండి కూడా అన్సారీ అక్కడి నుంచి నేరాలకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్కు వచ్చిన తర్వాత అతడికి తగిన శాస్తి జరిగింది. ప్రతిపక్షాలకు కేవలం రాజకీయాలు కావాలి. ఒక క్రిమినల్కు ఆయా పార్టీల నేతలు మద్దతు పలకడం దారుణం’అని పియూష్ రాయ్ వ్యాఖ్యానించారు. అన్సారీ నేరాల వల్ల గాయపడ్డ కుటుంబాలకు ఇప్పుడు న్యాయం జరిగిందని, తాము సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ భార్య అల్కా రాయ్ అన్నారు. ఇదీ చదవండి.. అన్సారీపై విష ప్రయోగం -
ఇలా టిక్కెట్ ఇచ్చి... అలా రద్దు చేసి..
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ స్థానం టిక్కెట్ కేటాయింపులో గందరగోళం నెలకొంది. సమాజ్వాదీ పార్టీ మహిళానేత రుచి వీరకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించాలనుకున్న పార్టీ ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది జరిగిన కొద్దిసేపటికే మొరాబాద్ నుంచి ఎస్టీ హసన్ పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. తొలుత పార్టీ ఎస్టీ హసన్కు టిక్కెట్ కేటాయించింది. తరువాత ఏవో సమీకరణలతో హసన్కు టిక్కెట్ను రద్దు చేసి, మహిళా నేత రుచి వీరకు కేటాయించాలనుకుంది. అయితే ఈ నిర్ణయంపై హసన్ అనుచరులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మొరాబాద్ స్థానాన్ని ఎస్టీ హసన్కు కేటాయించింది. మహిళా నేత రుచి వీరను మొరాదాబాద్ నుంచి పోటీ చేయించాలని పార్టీ నేత ఆజం ఖాన్ కోరుకున్నారు. అయితే రుచి బిజ్నోర్ నివాసి. మొరాదాబాద్తో ఎలాంటి సంబంధం లేదు. దీంతో పార్టీ ఆమెకు టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు రాంపూర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ హసన్ను పార్టీ కోరింది. అయితే ఇందుకు అతను తిరస్కరించారు. దీంతో పార్టీ ఆయనకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించింది. కాగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో ఎస్పీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్కు 17 సీట్లు మిగిలాయి. -
ఆజంఖాన్ కంచుకోటను అఖిలేష్ కాపాడతారా?
ఉత్తరప్రదేశ్లోని పలు లోక్సభ స్థానాలకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే పార్టీ నేత ఆజం ఖాన్కు కంచుకోటగా ఉన్న రాంపూర్పై పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈసారి ఆజం స్థానంలో ఎవరిని రంగంలోకి దింపాలనే ప్రశ్న ఎస్పీని కలవరపెడుతోంది. ఈ సీటు నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని సమాచారం. అఖిలేష్ రామ్పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని అజం ఖాన్ స్వయంగా కోరారట. అయితే ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఇందుకు సిద్ధంగా లేరట. మరోవైపు అఖిలేష్ కుటుంబం నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ను రాంపూర్ నుండి పోటీ చేయించాలని పార్టీ భావిస్తోందని సమాచారం.. అధికారికంగా అఖిలేష్ ఇంకా ప్రకటించనప్పటికీ తేజ్ ప్రతాప్ యాదవ్కు టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్తో చేతులు కలిపారు. దీంతో యూపీలో సమాజ్వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్కు 17 సీట్లు మిగిలాయి. ఇటీవల యూపీలోని కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారణాసి నుంచి అజయ్ సింగ్కు, రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్కు అవకాశం కల్పించారు. -
ఎన్నికల్లో ‘శ్రీరాముడు’.. మీరఠ్లో జన్మించి..
టీవీ సీరియల్ ‘రామాయణం’లో శ్రీరాముని పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోగి దిగాడు. అరుణ్ గోవిల్కి స్టార్డమ్తో పాటు మీరఠ్తో అనుబంధం కూడా ఉంది. అరుణ్ గోవిల్ మీరఠ్ కాంట్లో 1958 జనవరి 12న జన్మించారు. అతని తండ్రి చంద్రప్రకాష్ గోవిల్ మీరట్ మునిసిపాలిటీలో హైడ్రాలిక్ ఇంజనీర్గా పనిచేశారు. అరుణ్ ప్రారంభ విద్యాభ్యాసం సరస్వతి శిశు మందిర్లో సాగింది. తరువాత ఆయన ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుకున్నారు. అనంతరం చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. అరుణ్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని అతని తండ్రి భావించారు. అయితే అరుణ్ నటనారంగంలోకి ప్రవేశించారు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులలో అరుణ్ నాల్గవవాడు. గోవిల్ నటి శ్రీలేఖను వివాహం చేసుకున్నారు. వీరికి సోనిక, అమల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 17 ఏళ్ల వయసులోనే అరుణ్ గోవిల్ ముంబైకి వెళ్లి నటునిగా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1977లో హిందీ సినిమా 'పహేలీ' సినిమాలో అరుణ్కు అవకాశం దక్కింది. అయితే అరుణ్ గోవిల్కు ‘రామాయణం’ సీరియల్ ఎంతో పేరును తీసుకువచ్చింది. అరుణ్ పోషించిన రాముని పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆయనను సాక్షాత్తూ రామునిగా చూసినవారు కూడా ఉన్నారట. రామాయణం తర్వాత అరుణ్ గోవిల్ టీవీ ఇండస్ట్రీలో యాక్టివ్గా మారారు. పలు పౌరాణిక సీరియల్స్లో నటించారు. ఇప్పుడు మీరఠ్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన అరుణ్ గోవిల్ భవితవ్యాన్ని కాలమే తేల్చి చెప్పనుంది. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీకి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స!
ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతనికి చికిత్స అందించేందుకు జైలు నుంచి బందా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో పోలీసులు మెడికల్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం ముఖ్తార్ అన్సారీ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. ముక్తార్ అన్సారీ తనపై విషం ప్రయోగించేందుకు కుట్ర జరుగుతున్నదంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ ఉదంతంలో స్పందించిన కోర్టు అన్సారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బందా జైలులోని జైలర్, ఇద్దరు డిప్యూటీ జైలర్లను సస్పెండ్ చేసింది. ఒక కేసులో ముఖ్తార్ అన్సారీ గత గురువారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అదే సమయంలో అన్సారీ తనకు ప్రాణహాని ఉందంటూ న్యాయవాది ద్వారా న్యాయమూర్తికి లేఖ పంపారు. మార్చి 19న తనకు ఇచ్చిన ఆహారంలో విషపూరితమైన పదార్థాలు కలిశాయని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో రాశాడు. ఆ ఆహారం తిన్న తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని, తనకు చేతులు, కాళ్ల నరాల్లో విపరీతమైన నొప్పి వచ్చిందని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆరోజు తాను చనిపోతానేమోనని భయపడ్డానని లేఖలో పేర్కొన్నాడు. ఘాజీపూర్ నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) అవ్నీష్ గౌతమ్ ముఖ్తార్ అన్సారీకి ఈ శిక్ష విధించారు. 2023లో జరిగిన ఒక హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ముక్తార్కు ఇప్పటివరకు ఏడు కేసుల్లో శిక్ష పడింది. ఎనిమిదో కేసులో దోషిగా తేలాడు. -
బీజేపీ: వరుణ్ గాంధీకి టికెట్ దక్కేనా?
లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సమావేశమైంది. బీహార్, రాజస్థాన్తో పాటు యూపీలోని మిగిలిన 24 స్థానాలతో సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల విషయమై చర్చించారు. అలాగే వరుణ్ గాంధీకి పిలిభిత్ స్థానం కేటాయించాలా వద్దా? అనేదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, అయితే వీటిని దశలవారీగా విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం యూపీలో మొదటి దశలో మిగిలిన మూడు స్థానాలైన పిలిభిత్, మొరాదాబాద్, సహరన్పూర్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేయవచ్చని తెలుస్తోంది. యూపీలో మొదటి దశలో మొత్తం ఎనిమిది లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. పిలిభిత్, సహరన్పూర్, మొరాదాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పిలిభిత్ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడంపై సీఈసీ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ గాంధీ ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ కేటాయించకుండా, కొత్తవారిని రంగంలోకి దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో సొంత పార్టీపై చేసిన విమర్శలే ఇందుకు కారణమని చెబుతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు పాల్గొన్నారు. యూపీకి సంబంధించిన మిగిలిన 24 సీట్ల జాబితాను ఒకేసారి విడుదల చేయకుండా దశలవారీగా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. -
Up: నగదు కోసం ఆశ.. సొంత సోదరుడితోనే పెళ్లి !
లక్నో: ఇప్పటికే పెళ్లైన ఒక సోదరి ఈసారి ఏకంగా తన సొంత సోదరుడినే వివాహం చేసుకుంది. అయితే ఇది సీరియస్గా కాదు. ఓ స్కీమ్ కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమిచ్చే నగదు కోసం ఆశపడి వారిద్దరు ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని మహారాజ్గంజ్జిల్లాలోని లక్ష్మిపూర్ బ్లాక్లో ఈ వింత ఘటన జరిగింది. మొత్తం 38 జంటలు సామూహిక వివాహాల్లో పాల్గొంటే అందులో అన్నా చెల్లెలు పాల్గొని పెళ్లి తంతు కానిచ్చేశారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. పెళ్లి సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన కానుకలను తీసుకున్నారు. నగదు వస్తుందని మధ్యవర్తులు చెప్పడం వల్లే వారు ఈ పెళ్లికి సిద్ధపడినట్లు తెలిసింది. అయితే ఈ బోగస్ పెళ్లి విషయాన్ని అధికారులు కనిపెట్టారు. అన్నాచెల్లెళ్లకు ఇచ్చిన బహుమతులు తిరిగి తీసుకుంటున్నామని, వారికి రావాల్సిన నగదు బహుమతిని కూడా ఆపివేస్తున్నామని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, యూపీలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ్ యోజన కింద పెళ్లికూతురు బ్యాంకు ఖాతాలో రూ.35వేలు ప్రభుత్వం వేస్తుంది. వీటికి తోడు పెళ్లి కోసం మరో 16 వేల ఖర్చుపెడుతుంది. ఈ మొత్తం నుంచి కొత్త జంటకు కానుకలు ఇస్తారు. ఆర్థికంగా వెనుకబడిన పేదల కోసం ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. ఇదీ చదవండి.. 10 పాయింట్లలో బీహార్ గొప్పతనం -
స్పోర్ట్స్ న్యూస్: ‘పారిస్’ మార్క్ను దాటిన రాంబాబు..
న్యూఢిల్లీ: భారత రేస్ వాకర్ రాంబాబు పారిస్ 20 కిలో మీటర్ల రేసులో పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్ను అందుకున్నాడు. స్లొవేకియాలో జరుగుతున్న టూర్ గోల్డ్ లెవల్ ఈవెంట్లో రాంబాబు మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్ను 1 గంటా 20 నిమిషాల్లో రాంబాబు పూర్తి చేశాడు. పెరూ, ఈక్వెడార్ అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పారిస్ క్వాలిఫయింగ్ టైమింగ్ 1 గంటా 20 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. అయితే ఈ ప్రదర్శనతో ఉత్తరప్రదేశ్కు చెందిన రాంబాబు నేరుగా ఒలింపిక్స్లో ఆడే అవకాశం లేదు. అతనికంటే ముందే ఆరుగురు భారత రేస్ వాకర్లు అర్హత టైమింగ్ను సాధించారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం దేశంనుంచి గరిష్టంగా ముగ్గురికే పాల్గొనే అవకాశం ఉంది. ఇవి చదవండి: నేడు జరిగే WPL లో.. కొత్త విజేత ఎవరో!? -
కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లిన అఖిలేష్!
ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో ఆరుగురు అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) విడుదల చేసింది. దీనికి ముందు మూడు దశల్లో 31 మంది అభ్యర్థులను ఎస్పీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాలకు గానూ 37 స్థానాలకు ఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే శుక్రవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో నగీనా సీటు చర్చనీయాంశంగా మారింది. నగీనా లోక్సభ స్థానం నుంచి మనోజ్ కుమార్ పోటీ చేస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. మనోజ్ కుమార్ ఇండియా అలయన్స్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది. యూపీలో మరికొన్ని చిన్న పార్టీలను ఇండియా కూటమిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చంద్రశేఖర్ ఆజాద్కు కంచుకోటగా ఉన్న నగీనా స్థానంలో ఏ అభ్యర్థినీ నిలబెట్టవద్దని కాంగ్రెస్ అఖిలేష్కు సూచించింది. అయితే తాజాగా అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మనోజ్ కుమార్ను నగీనా అభ్యర్థిగా చేయడం ద్వారా, చంద్రశేఖర్ ఆజాద్ ఇకపై ఇండియా కూటమిలో చేరలేని పరిస్థితి ఏర్పడింది. యూపీలోని ఖతౌలీ, రాంపూర్, మెయిన్పూర్ ఉపఎన్నికల సమయంలో చంద్రశేఖర్ బహిరంగంగానే ఎస్పీ కూటమితో బరిలోకి దిగారు. చంద్రశేఖర్ పలు సందర్భాలలో అఖిలేష్ యాదవ్ పక్కన కనిపించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఇండియా కూటమిలో ఉంటారని, నగీనా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రకటించారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ నేడు (శనివారం) నగీనాలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు. -
యూపీ లోక్సభ బరిలో బీజేపీ అభ్యర్థులెవరు? ఎందుకింత జాప్యం?
రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండవ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ప్రస్తావన లేదు. దీంతో పార్టీ తన మూడో జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తాజాగా 72 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అయితే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఉత్తరప్రదేశ్ సీట్లకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంకా ఉత్తరప్రదేశ్ జాబితాను విడుదల చేయలేదని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికలో కొంత గందరగోళం నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఒక స్థానం, పూర్వాంచల్, అవధ్లలో అభ్యర్థుల ఎంపిక బీజేపీకి సమస్యగా మారిందని అంటున్నారు. అయితే పార్టీ సీనియర్ నేతలు యూపీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి సమస్యలేదని ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ సీట్లపై పార్టీ నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 2న విడుదల చేసింది. ఇందులో 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి, హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేర్లు ఉన్నాయి. కాగా బీజేపీ రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ సహా ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు ఉన్నాయి. -
‘ఎంపీ రవి కిషన్ భూమిని కబ్జా చేశారు’ : సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ నవ్వులు పూయించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యూపీ పార్లమెంట్ స్థానం గోరఖ్పూర్లోని రామ్ఘర్ తాల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం యోగి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి తన ప్రసంగంతో సభికులతో పాటు ప్రజల్ని నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు సభపై ప్రముఖ నటుడు, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ ఉన్నారు. రవికిషన్ను ఉద్దేశిస్తూ సీఎం మాట్లాడారు. బంగ్లా కబ్జా చేశారంటూ.. భళ్లున నవ్విన ‘ఇంతకుముందు ఓ వీఐపీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భోజ్పురి స్టార్ రవికిషన్ ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ బంగ్లాను కబ్జా చేశార'ని భళ్లున నవ్వారు. వెంటనే లేదు.. లేదు.. రవికిషన్ ఆ ఇంటి లాక్కోలేదు. డబ్బుతో కొన్నారు’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ ఏడేళ్ల క్రితం రామ్గఢ్ తాల్ దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఇప్పుడు అక్కడ సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. సెల్ఫీలు దిగుతున్నారు. రవికిషన్ (ఎంపీ సీటును) మళ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు నగరం మొత్తం కెమెరా నిఘాలో ఉంది. రవికిషన్ సినిమా షూటింగ్ కోసం హడావుడిగా వెళ్లి సిగ్నల్ బ్రేక్ చేస్తే వెంటనే అతని మొబైల్కి చలాన్ వెళ్తుందని, అంతలా అభివృద్ది జరిగిందని స్పష్టం చేశారు. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 గోరఖ్పూర్ సీటు గెలుస్తా.. చరిత్ర సృష్టిస్తా ఈ నెల ప్రారంభంలో బీజేపీ రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కమలం ప్రకటించిన జాబితాలో గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ రెండోసారి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
యూపీ ఉద్యోగులకు యోగీ సర్కారు హోలీ కానుక!
ఈ నెల 25న దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు యూపీ సర్కారు శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ డీఏ పెంపుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించనుంది. యూపీలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపునకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ కరువు భత్యం పెంపునకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ జీతం కూడా పెరగనుంది. ఈ డియర్నెస్ అలవెన్స్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.314 కోట్ల అదనపు భారం పడనుంది. -
‘ప్రియాంకా గాంధీ జీ.. రాయ్బరేలీ మిమ్మల్ని పిలుస్తోంది!’
1950ల నుంచి కాంగ్రెస్ కంచుకోట ఉత్తర్ప్రదేశ్ రాయ్బరేలీ లోక్సభ స్థానం. అయితే అదే స్థానం నుంచి వరుసగా 5 సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన సోనియా గాంధీ అనారోగ్య కారణంగా పోటీ నుంచి తప్పుకుంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇంతకీ రాయ్బరేలీలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపాలని భావిస్తోంది? లేదంటే సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుదారులు రాయ్బరేలీలో పోస్టర్లు వేసి, పార్టీ నాయకత్వం ఆమెను లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుదారులు నియోజకవర్గంలో పోస్టర్లను విడుదల చేశారు. ‘ప్రియాంక గాంధీ జీ రాయ్బరేలీ పిలుస్తోంది. దయచేసి రండి కాంగ్రెస్ను ముందుకు నడిపించండి’ అంటూ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ల ఫోటోలతో ఉన్న పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. కాంగ్రెస్కు కంచుకోట ఇక కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీకి గతంలో మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన స్థానంలో రెండు దశబద్ధాలుగా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలిగా వెళ్లనున్నారు. ఆమె స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. దేశం మొత్తం రాయ్ బరేలీ వైపే చూపు 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనంతో అమేథీలో రాహుల్ ఓటమి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు తీవ్ర ప్రతికూలతలు ఎదురైనా రాయ్బరేలీలో మాత్రం కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది. అందువల్ల, ఈ సీటుకు బీజేపీ అభ్యర్ధి ఎంపిక, సోనియా గాంధీ ఆ స్థానాన్ని ఖాళీ చేస్తే కాంగ్రెస్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందా అనే అంశంపై దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. కమలం వికససించాలని 2019 ఎన్నికల్లో సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్ను బరిలోకి దింపింది. సోనియా గాంధీ చేతిలో 1.60 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సింగ్, ఈసారి ఎవరిని ఎంచుకుంటే వారికే తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. రాయబరేలీలో అధిష్టానం ఎవరిని ఎన్నుకుంటే వారి గెలుపుకోసం శ్రమిస్తాం. కమలం వికసించాలనేది నా సంకల్పం’ అని దినేష్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమోథీ బరిలో రాహుల్ ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకమైన అమేథీలో బీజేపీ తన అభ్యర్థిగా కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని నిలబెట్టుకుంది. ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమె 2019లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఓడించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథిలో ఓటమి పాలైనా.. కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రికార్డు స్థాయి ఆధిక్యంతో గెలుపొందారు. అమేథీకి గతంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. వచ్చే ఎన్నికల్లో అమేథీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. -
కిడ్నాప్ కేసు.. పోలీసుల అదుపులో మాజీ ఎంపీ
సాక్షి, లక్నో: ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ మేనేజర్ అభినవ్ సింఘాల్ను కిడ్నాప్ చేసి, దోపిడీ, దుర్వినియోగం, బెదిరింపులకు పాల్పడిన కేసులో మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్, అతని అనుచరుడు సంతోష్ విక్రమ్లను స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి శరద్ కుమార్ త్రిపాఠి ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ధనంజయ్ సింగ్, అతని సహచరుడిని జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. జౌన్పూర్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది (క్రిమినల్) సతీష్ పాండే మాట్లాడుతూ, ముజఫర్నగర్ నివాసి అభినవ్ సింఘాల్ ధనంజయ్ సింగ్, అతని సహచరుడు విక్రమ్పై 2020 మే 10న లైన్బజార్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. గన్తో బెదిరిస్తూ విక్రమ్, సహచరులతో కలిసి సింఘాల్ను కిడ్నాప్ చేసి, తన నివాసానికి తీసుకెళ్లారని,అక్కడ ధనంజయ్ సింగ్ గన్తో బెదిరిస్తూ దుర్భాషలాడారని వెల్లడించారు. అంతేకాదు నాణ్యత లేని మెటీరియల్ను సరఫరా చేయాలని ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ అరెస్ట్ అయ్యారని, తర్వాత అలహాబాద్ హైకోర్టు నుంచి బెయిల్ పొందారని పాండే అన్నారు. Bahubali Leader Dhananjay Singh was detained by the UP police in an old case. Few days ago he announced that he will contest Loksabha Elections as an independent candidate From Jaunpur #DhananjaySingh#LokSabhaElection2024 pic.twitter.com/fYoIAZMOtQ — Desh Ka Verdict (@DeshKaVerdict) March 5, 2024 పూర్వాంచల్ బాహుబలి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సభ్యుడిగా 2009 నుండి 2014 వరకు 15వ లోక్సభలో పార్లమెంటు సభ్యునిగా ధనంజయ్ సింగ్కు ‘పూర్వాంచల్ బాహుబలి’గా పేరుంది. అయితే 2011లో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో ఉన్న ధనంజయ్ సింగ్ ఇటీవల ఎక్స్.కామ్లో తాను వచ్చే లోక్సభ ఎన్నికలలో జౌన్పూర్ స్థానం నుండి పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. 2002లో తొలిసారిగా రారీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. -
‘400 లోక్సభ స్థానాల్లో గెలుపు మాదే’.. బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
లక్నో : ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్న లోక్సభ స్థానం గోరఖ్పూర్ చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వారిలో ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఒకరు. 2019 నుంచి ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పూర్ ఎంపీగా రవికిషన్ కొనసాగుతున్నారు. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చింది. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 బీజేపీకి 400 సీట్లు పక్కా ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కంచుకోట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గోరఖ్పూర్ కంచుకోట. గోరఖ్పూర్ లోక్ సభ స్థానం నుంచి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 1998లో ప్రారంభమై 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు కొనసాగింది. ఇక్కడి నుంచి నటుడు రవి కిషన్ రెండో సారి బరిలోకి దిగనున్నారు. కాగా తొలిసారి ఇదే స్థానం నుంచి ఎంపీగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగిన రవికిషన్ సమాజ్వాద్ పార్టీ అభ్యర్థి రాంభూల్ నిషాద్పై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. -
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్పూర్(యూపీ): గత లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్చేయాలని అక్కడి రామ్పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
అఖిలేష్పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సమాజ్వాదీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య తన కొత్త పార్టీని ఫిబ్రవరి 22న ప్రకటిస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మౌర్య నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, అధినేత అఖిలేష్ యాదవ్కు లేఖ రాశారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అఖిలేష్ యాదవ్కు రాసిన లేఖలో మౌర్య.. తాను సమాజ్వాదీ పార్టీలో చేరినప్పటి నుండి, పార్టీకి మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే పార్టీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, గుర్తులు మారిన తర్వాత కూడా పార్టీ మద్దతును పెంచుకోవడంలో విజయం సాధించానన్నారు. ఫలితంగా ఎస్పీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని, ఒకప్పుడు పార్టీలో 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వారి సంఖ్య 110కి చేరిందని పేర్కొన్నారు. తన కృషితో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన తర్వాత కూడా తనను శాసనమండలికి పంపారని, ఆ వెంటనే తనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారని మౌర్య తెలిపారు. ఇంతటి గౌరవం అందించినందుకు ధన్యవాదాలని మౌర్య పేర్కొన్నారు. -
భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేష్ దూరం?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారధ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న భారత్జోడో న్యాయ యాత్రలో సమాజ్వాదీ పార్టీ(ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొనడం లేదని సమాచారం. లోక్సభ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో ఒప్పందం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రాయ్బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్నిఅఖిలేష్ అంగీకరించి, అమేథీ లేదా రాయ్ బరేలీలో జరిగే న్యాయ యాత్రలో పాల్గొంటానని స్వయంగా ప్రకటించారు. రాహుల్ యాత్ర సోమవారం అమేథీలో, మంగళవారం రాయ్బరేలీలో ఉండనుంది. సోమవారం అఖిలేష్ అమేథీకి వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్బరేలీలో జరిగే న్యాయ యాత్రలో ఆయన పాల్గొనవచ్చని, అయితే దీనిపై స్పష్టత లేనందున ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగర్ సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తన ఇంట్లోనే శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు. అయితే రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు మల్లిక తల్లి సుమిత్రా సింగ్ తెలిపారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె తల్లి సుమిత్రా మాట్లాడుతూ.. 'ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. నేను నా గదిలో పడుకున్నా. చాలాసేపు తన గదిలో లైట్ వెలుగుతుండడంతో అనుమానం వచ్చి తలుపు తీసేందుకు యత్నించాను. ఎంతకు డోర్ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా.. నా కూతురు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే నా భర్త, స్థానికులు కలిసి మల్లికను ఆసుపత్రికి తరలించాం. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు'అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్యహత్య? లేదా ఎవరీ పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. సింగర్గా కెరీర్ ప్రారంభించిన మల్లికా రాజ్పుత్.. నటిగా రాణిస్తున్నారు. బాలీవుడ్లోనూ మల్లిక సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. 35 ఏళ్లకే మల్లికా చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
Manjari Chaturvedi: సూఫీ కథక్ 25
ఈ అందెల రవళి ‘ఆహా’ ‘ఓహో’లకు పరిమితమైనది కాదు. అద్భుతమైన రెండుకళారూపాల సంగమం. చరిత్రలోని కళను వర్తమానంలో వెలిగించే అఖండ దీపం. విస్మరణకు గురైన కళాకారులకు ఇచ్చే అరుదైన నీరాజనం... పాతికేళ్ల క్రితం సూఫీ కథక్ కళతో ప్రస్థానం ప్రారంభించింది మంజరి చతుర్వేది. ‘సూఫీ, పంజాబీ జానపద సంగీత ప్రదర్శనలు ఇవ్వడం, నలుపు రంగు దుస్తులు ధరించడం, ఖవ్వాలితో కథక్ చేయడం లాంటివి చూసి శాస్త్రీయ కళను వక్రీకరిస్తుంది అని కొందరు నాపై విమర్శ చేశారు. అయితే అవేమీ నా ప్రయాణాన్ని ఆపలేదు’ అంటుంది లక్నోకు చెందిన మంజరి. చిత్ర నిర్మాత ముజఫర్ అలీ, గురువు ప్రోతిమా బేడితో కలిసి ఈ నృత్యరూపంపై పనిచేసింది. మొదట్లో స్పందన ఎలా ఉన్నప్పటికీ సంగీత ప్రియులు సూఫీ కథక్ను ప్రశంసిస్తున్నారు. ‘ఇది నా గురువుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను’ అంటుంది మంజరి. పండిట్ అర్జున్ మిశ్రా వద్ద కథక్, కళానిధి నారాయణ్ వద్ద అభినయ్, ఫాహిమ్– ఉద్–దిన్ దాగర్ వద్ద సూఫీ సంగీతం నేర్చుకుంది. సూఫీ సాధువులు, ఆధ్యాత్మికవేత్తలందరినీ తన గురువుగా భావిస్తుంది. ‘సూఫీ కథక్’ తొలి ప్రదర్శన దిల్లీలో ఇచ్చింది. ఇప్పటి వరకు 26 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. కైలాష్ ఖేర్, ఉస్తాద్ శౌకత్ అలీ ఖాన్, సబ్రీ బ్రదర్స్లాంటి ఎంతోమంది కళాకారులతో కలిసి పనిచేసింది. ఇరాన్, టర్కీ, మొరాకోకు చెందిన కళకారులతో గొంతు కలిపింది. సూఫీ తత్వంలోని సంగీత, నృత్యరూపాలను లోతుగా అధ్యయనం చేసింది. ‘రాజనర్తకీమణుల నృత్యాలలో అద్భుత ప్రతిభ దాగి ఉన్నప్పటికీ ప్రశంసించడానికి మాత్రం మనకు మనసు రాదు’ అంటున్న మంజరి విస్మరణకు గురైన కళాకారుల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. రకరకాల ప్రాజెక్ట్లు చేపట్టింది. వాటిలోని ఖ్వాజా ప్రాజెక్ట్ మన దేశంలో సూఫీ ప్రతిధ్వనులను వినిపిస్తుంది. సూఫీ కవులను తెర పైకి తెస్తుంది. గొప్ప కవుల జీవితాన్ని, సాహిత్యాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. 18వ శతాబ్దానికి చెందిన సూఫీ ఆధ్యాత్మికవేత్త, పంజాబ్కు చెందిన కవి బాబా బుల్లెహ్ షా. ఆయన ఆధ్యాత్మిక కవిత్వాన్ని తన నృత్యప్రదర్శనల ద్వారా ఈ తరానికి చేరువ చేస్తుంది మంజరి. ‘స్వీయ అన్వేషణ, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసమే షా తన జీవితాన్ని అంకితం చేశాడు. కళాత్మక రూపాలు అణచి వేయబడుతున్న కాలంలో ఆయన మౌనంగా కూర్చోలేదు. నియమాలను ధిక్కరించి పంజాబ్ వీధుల్లో తిరుగుతూ పాటలు పాడేవాడు. నృత్యాలు చేసేవాడు. ధిక్కార స్వరాన్ని వినిపించేవాడు’ అంటుంది మంజరి. మంజరి చతుర్వేదికి ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు. శిక్షణలో భాగంగా ‘నాద్ ధ్యాన్’ చేయిస్తుంది. ‘ప్రదర్శన ఇవ్వడానికి పండిట్ జస్రాజ్ నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు నేను సరిౖయెన దారిలోనే ప్రయాణిస్తున్నాను అనే ధైర్యాన్ని ఇస్తాయి’ అంటుంది మంజరి చతుర్వేది. -
Gyanvapi: మిగిలిన సెల్లార్లలో కూడా ఏఎస్ఐ సర్వే చేపట్టాలి
లక్నో: జ్ఞానవాపి కాంప్లెక్స్లో మిగిలిన సెల్లార్లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కాంప్లెక్స్ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రవేశానికి అనుమతి లేని మిగిలిన సెల్లార్లలో సర్వే చేపట్టవలసిందిగా పిటిషనర్ ఏఎస్ఐని అభ్యర్థించారు. వీటితోపాటు జ్ఞానవాపి ఆవరణలో ఇటీవలి సర్వే సమయంలో దర్యాప్తు చేయని సెల్లార్ల సర్వేలను నిర్వహించాలని ఏఎస్ఐని కోరారు. ఏ సర్వే నిర్వహించినా నిర్మాణానికి నష్టం జరగకుండా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని ఇటుకలు, రాళ్లతో ఉన్న అడ్డంకుల కారణంగా ఏఎస్ఐ సర్వే కొన్నిసెల్లార్లలో పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నిర్మాణానికి హాని కలిగించకుండా ఈ అడ్డంకులను సురక్షితంగా తొలగించడానికి అవసరమైన నైపుణ్యాలను ఏఎస్ఐ నిపుణులు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపుపై ఏఎస్ఐ నివేదిక పొందాలని అభ్యర్థించారు. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేను పూర్తి చేసి నివేదికను కూడా బహిర్గతం చేసింది. మసీదు ప్రాంగణంలో భారీ హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్ఐ స్పష్టం చేసింది. హిందూ దేవాలయ చిహ్నాలు శంఖం, చక్రం సహా పలు ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ సర్వే తర్వాత జ్ఞానవాపి కాంప్లెక్స్ సెల్లార్లో పూజలు చేసుకోవడానికి హిందూ పక్షంవారికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: Varanasi: మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ -
జ్ఞానవాపి, రామ జన్మభూమి వివాదాల వెనక ములాయం సింగ్ పాత్ర ఏంటి?
లక్నో: అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒక కామన్ పేరు వినిపిస్తోంది. ఆయనే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్. ఈ వివాదాల వెనక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటంటే..? కరసేవకులపై కాల్పులు.. 1990 అక్టోబర్లో ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కరసేవ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కరసేవకులపై ములాయం ప్రభుత్వం 28,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. అయినప్పటికీ బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రీ మసీదు ప్రదేశానికి చేరుకున్నారు. మసీదుపై కాశాయ జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి. బాబ్రి మసీదు కూల్చివేత.. అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత 1991లో యూపీలో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. మరుసటి ఏడాది 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటన జరిగింది. ఈ పరిణామాల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న పీవీ నరసింహరావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ములాయం మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈ పాలనా కాలంలోనే జ్ఞానవాపి సెల్లార్లో హిందువుల పూజలను ములాయం ప్రభుత్వం నిలిపివేసింది. జ్ఞానవాపిలో పూజలు నిలిపివేత.. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ (వ్యాస్జీ కా తెహ్ఖానా)లో 1993 వరకు పూజాలు జరిగాయి. సెల్లార్లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేశారు. వారి కుటుంబ పేరుమీదుగానే ఆ సెల్లార్కు వ్యాస్జీ కా తెహ్ఖానా అని పేరు వచ్చింది. అయితే.. 1993 డిసెంబర్లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందని శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. మసీదు ప్రాంతంలో దేవాలయం.. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు ఏఎస్ఐ సర్వే తెలిపిందని హిందూ తరుపు న్యాయవాది విష్ణశంకర్ జైన్ వెల్లడించారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం.. కాలక్రమంలో అనేక యుద్ధాలు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దక్షిణాసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన పండితుడు యుగేశ్వర్ కౌశల్ ప్రకారం.. మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తర్వాత సుమారు 1170-89 ADలో ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైన ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించాడని విశ్వసిస్తారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం -
జ్ఞానవాపి: 30 ఏళ్ల తర్వాత పూజలు
యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో సుమారు 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పూజలు జరగడం గమనార్హం. వ్యాస్ కా తెహఖానా(వ్యాసుని నేలమాళిగ) సెల్లార్లో ఉదయం 3గం.కే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది. వారం లోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ప్రకటించినప్పటికీ.. సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది. కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ మసీదులో వేకువ ఝామున 3 గంటలకే పూజలు ప్రారంభం అయ్యాయి. విశ్వనాథుడి ఆలయ పూజారి మంగళహారుతులు ఇచ్చారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీద్ సమీపంలో మందిర్(ఆలయం) అనే బోర్డును అంటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Varanasi: After the District Court granting permission for conducting 'Pooja' in the 'Vyas Ka Tehkhana' in Gyanvapi mosque, Chairman of Kashi Vishwanath Trust Nagendra Pandey says, "Court has ordered the opening and subsequent worship at the 'tehkhana' which was closed… pic.twitter.com/KhN0cMTjPC — ANI (@ANI) February 1, 2024 బాబ్రీ విధ్వంసం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి ప్రాంతాన్ని సీజ్ చేయించారు. హిందువులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఒక్కరికీ ఇక్కడ పూజలు చేసే హక్కు ఉంది అని హిందు పక్షం తరఫున కోర్టులో వాదనలు వినిపించిన విష్ణు శంకర్ జైన్ చెబుతున్నారు. ఇక ఈ తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కోర్టు ఈ ఉత్తర్వును స్వాగతించారు. దీనిపై ‘ఎక్స్’లో స్పందిస్తూ 'శివ భక్తులకు న్యాయం జరిగింది. విశ్వనాథుని ఆలయ సముదాయంలోగల వ్యాసుని నేలమాళిగలో పూజలు చేసుకునే హక్కును మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని’ అన్నారు. #WATCH | Gyanvapi case | After the court grants permission for puja in the 'Vyas Ka Tekhana', advocate Sohan Lal Arya says, "We are feeling very proud today. The court's decision yesterday was unprecedented...The arrangements have been made but it (Vyas Ka Tekhana) has not been… pic.twitter.com/21R8jzcxQe — ANI (@ANI) February 1, 2024 జ్ఞానవాపి మసీదులోని ‘వ్యాస్ కా తహఖానా’లో పూజలు చేయడానికి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఏ పక్షానికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. "Arrangements have been made but...": Advocate Sohan Lal Arya over Varanasi Court's order on Gyanvapi Mosque Read @ANI Story |https://t.co/uTQ5eTNesb#GyanvapiMosque #VaranasiCourt #GyanvapiMosque pic.twitter.com/uVIFbRSRNO — ANI Digital (@ani_digital) February 1, 2024 -
‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం
ఉత్తరప్రదేశ్ను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్న యోగి ప్రభుత్వం.. తాజాగా ‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం కల్పించే దిశగానూ ప్రణాళిక సిద్దం చేసింది. యూపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 28 దేశాల్లోని 50 నగరాల్లో యూపీలోని పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించనున్నారు. ఇందుకోసం ఆయా నగరాల్లో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, ట్రావెల్ ఫెయిర్లు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. జపాన్, ఇజ్రాయెల్, చైనా, అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయెల్, రష్యా , యుఎఈలలో బ్రాండ్ యూపీకి ప్రచారం కల్పించనున్నారు. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభించిన దరిమిలా ప్రతి సంవత్సరం కనీసం ఐదు కోట్ల మంది పర్యాటకులు నగరానికి వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఈ సంఖ్య స్వర్ణ దేవాలయం, తిరుపతి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. అయోధ్యలో ప్రారంభమైన విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్, మెరుగైన రహదారులు మొదలైనవన్నీ పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. -
‘ఆక్సిజన్ మ్యాన్’ ఎవరు? ఎందుకాపేరు వచ్చింది?
నిస్వార్థంగా సేవ చేయడానికి సిద్ధమయ్యే యువత చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే దీనికి భిన్నంగా ప్రకృతిని అమితంగా ప్రేమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న సునీల్ యాదవ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఒకవైపు జాతీయ స్థాయి కబడ్డీలో రాణిస్తూ, మరోవైపు పర్యావరణ పరిరక్షణలోనూ తన భాగస్వామ్యం ఉందంటున్న సునీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సునీల్ తన 25 ఏళ్ల వయసుకే పదివేలకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించాడు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన సునీల్ యాదవ్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. 2018-2019లో ఉత్తరప్రదేశ్ నుండి కబడ్డీ జూనియర్ జట్టులో ఆడి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత 2020లో రెండోసారి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆడాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఐదుసార్లు రాష్ట్ర స్థాయిలో ఆడాడు. ఒకవైపు క్రీడారంగంలో ఎదుగుతూనే మరోవైపు ప్రకృతిని కాపాడేందుకు కృషి సాగించాడు. లాక్డౌన్ సమయంలో జనమంతా ఇంట్లో ఉన్నప్పుడు సునీల్ ఉదయాన్నే నిద్రలేచి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేవాడు. తరువాత వాటిని సంరక్షించేవాడు. ఈ నేపధ్యంలోనే సునీల్ వినూత్న ప్రచారాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరినైనా అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు ఇచ్చేందుకు బదులుగా ఔషధ మొక్కలు బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన అందరిలో కల్పించాడు. తద్వార పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని భావించాడు. ఈ నేపధ్యంలో సునీల్ యాదవ్ ‘ఆక్సిజన్ మ్యాన్’గా గుర్తింపు పొందాడు. సునీల్ ఇప్పటివరకూ దేశంలోని మూడు రాష్ట్రాలలో సైకిల్ యాత్ర చేపట్టి, జనం మరింతగా మొక్కలు నాటేలా చైతన్యపరిచారు. సునీల్ చేపడుతున్న ప్రచారం నిరంతరం కొనసాగుతోంది. సునీల్ సుమారు 20 నుంచి 30 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాడు. -
నార్వేను అధిగమించనున్న ఉత్తరప్రదేశ్ - ఎలా అంటే?
సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరే రోజు, యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే రోజు రానే వచ్చింది. ఈ రోజు బాలరాముని దర్శనం కేవలం ప్రముఖులకు మాత్రమే.. రేపటి నుంచి సామాన్య భక్తులు దర్శనం చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు సమాచారం. దీంతో ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా వేలకోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నివేదికలు చెబుతున్నాయి. రామ మందిర నిర్మాణంతో అయోధ్య భారతదేశంలో సందర్శించదగ్గ పర్యాటక ప్రదేశం కానుంది. గతంలో కంటే ఎక్కువ మంది పర్యాటకులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను భారీగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 2024-25 ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ రూ.20000 నుంచి రూ.25000 కోట్లు పెరుగుతుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర పర్యాటకరంగం ఆదాయం రెట్టింపు అవుతుందని, ఇప్పటికే అయోధ్యలో హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాలు భారీగా సాగుతున్నాయి. ఇదీ చదవండి: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్ 2022లో ఉత్తరప్రదేశ్ సందర్శించిన పర్యాటకులు 32 కోట్లు, ఇందులో 2.21 కోట్లమంది జనాభా అయోధ్యకు వచ్చారు. పర్యాటకులు ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2 లక్షల కోట్లు అని తెలుస్తోంది. పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉన్న ఉత్తరప్రదేశ్, అయోధ్య రామ మందిర నిర్మాణంతో మరింత ఆదాయం పొందనుంది. 2027 నాటికి ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లు దాటుతుందని, దేశ జీడీపీలో ఇది 10శాతం అని చెబుతున్నారు. 2027-28 నాటికి జీడీపీ వెయిటేజ్లో ఉత్తరప్రదేశ్ 2వ స్థానం పొందుతుందని సమాచారం. నార్వే జీడీపీని అప్పటికి ఉత్తరప్రదేశ్ అధిగమించే అవకాశాలు చాలానే ఉన్నాయి. -
Ayodhya: గర్భగుడిలో బాలరాముని మొదటి చిత్రం
లక్నో: అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. విగ్రహం కళ్లపై గుడ్డతో కప్పబడి ఉంది. గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే శుద్ధి కార్యక్రమాల కోసం రాముని పాదుకలను ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నిర్విఘ్నంగా క్రతువులు ప్రత్యేక క్రతువులు నిరి్వఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో మూడో రోజు గురువారం ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేశ్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. జలదివస్లో భాగంగా రామ్లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. రాముడి విగ్రహాన్ని చెక్కిన మైసూరులో ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ కుటుంబం స్వీట్లతో చేసిన రామమందిర ప్రతిరూపాన్ని తీసుకువచ్చింది. ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్లల్లా -
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్పూర్లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
లక్నో: కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ ఆదేశాలను జారీ చేసింది. మసీదు సర్వే చేసేందుకు కమిషనర్ను నియమించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సర్వే కోసం కమిషనర్ను నియమించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ‘త్రిసభ్య కమిషన్ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బ తినకుండా చూడాలి. శాస్త్రీయ సర్వేను ఇరు పక్షాల తరఫు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చు. పూర్తి పారదర్శకమైన నివేదికను కోర్టును కమిషన్ అందించాలి.' అని హైకోర్టు తీర్పు వెలువరించింది. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ఈ నివేదికపై అభ్యంతరాలుంటే ఈద్గా తరఫు లాయర్లు తమ అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును ఆశ్రయించవచ్చు అని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తన ఉత్వర్వులో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వును షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్మాన్కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నౌకలపై దాడులు.. ఇంధన సరఫరాపై ప్రభావం: జై శంకర్ -
రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే'
లక్నో: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమంలో రాముని విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవిత్రతను కాపాడే ప్రయత్నంలో ఛత్తీస్గఢ్, అసోం, ఉత్తరప్రదేశ్లో జనవరి 22న "డ్రై డే"గా ప్రకటించాయి. "డ్రై డే" అంటే మద్య పానీయాల అమ్మకాలు అనుమతించబడని రోజు. మద్యం దుకాణాలు మినహా, పబ్బులు, రెస్టారెంట్లు కూడా మద్య పానీయాలను విక్రయించబోరు. జనవరి 22ను జాతీయ పండుగలా జరుపుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు జనవరి 22న ఇప్పటికే సెలవు ప్రకటించారు. న్యూయార్క్లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నుండి రామమందిరం ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని వేలాది దేవాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండనున్నట్లు చెప్పడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. రామాలయాన్ని బీజేపీ ఎన్నికల లబ్ది కోసం చేపడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని విమర్శిస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండటంపై బీజేపీ మండిపడింది. రాముని అస్తిత్వాన్నే నిరాకరిస్తున్నామని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నుంచి ఇంకేం ఆశించగలమని దుయ్యబట్టింది. ఇదీ చదవండి: Ram Mandir: రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం -
బెంగాల్ లెస్బియన్స్.. యూపీలో ఒక్కటయ్యారు!
లక్నో: పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ లెస్బియన్ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని ఓ ఆలయంలో సంప్రదాయ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. బెంగాల్లో దక్షిణ పరగణా జిల్లాకు చెందిన జయశ్రీ రాహుల్ (28), రాఖీ దాస్ (23) డియోరియాలోని ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నారు. అక్కడ వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ మొదట తమ వివాహానికి నోటరీ చేయబడిన అఫిడవిట్ను పొందారు. ఆపై సోమవారం డియోరియాలోని భవానీ ఆలయంలో జరిగిన వేడుకలో మూడు ముళ్లు వేసుకున్నారని స్థానికులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం దీర్ఘేశ్వరనాథ్ ఆలయంలో ఈ జంట పెళ్లి చేసుకోవడానికి అనుమతి నిరాకరించబడింది. అంతటితో ఆగని ఆ ప్రేమికులు తమ శ్రేయోభిలాషులతో కలిసి ప్రత్యామ్నాయ మార్గంగా పెళ్లికి నోటరీ అఫిడవిట్ను పొందారు. ఆ తర్వాత మఝౌలీరాజ్లోని భవాని ఆలయానికి వెళ్లి ఆలయ పూజారి సమక్షంలో దండలు మార్చుకున్నారు. వివాహానంతరం ఈ జంట తమ ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో? సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో? వివరించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
‘కరసేవకులపై కాల్పులు సబబే’.. ఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేత, మాజీ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన యూపీలోని కాస్గంజ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు అరాచకవాదులను కాల్చిచంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు జారీ చేసిందని’ వ్యాఖ్యానించారు. అయోధ్యలో మసీదు కూల్చివేత సంఘటన జరిగినప్పుడు న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థలను పట్టించుకోకుండా అరాచకవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు . అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు, శాంతిని కాపాడేందుకు కాల్పులు జరిపిందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Kasganj (UP): On Ram temple, Samajwadi Party leader Swami Prasad Maurya says, "...To safeguard the constitution and the law and to protect peace, the then government gave shoot at sight orders. The government merely did its duty..." pic.twitter.com/tpYf8wdMnJ — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2024 -
‘రామాలయం’ చీరలకు భలే డిమాండ్!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈ నెలలో జరగనున్న శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటువంటి తరుణంలో రామాలయం థీమ్తో రూపొందుతున్న బనారసీ చీరలకు భలే డిమాండ్ ఏర్పడింది. హిందూ మహిళలు, ముఖ్యంగా రామభక్తులైన మహిళలు రామాలయం థీమ్తో కూడిన చీరలను కట్టుకోవాలని ముచ్చట పడుతున్నారు. దీంతో యూపీలోని నేత కార్మికులు చీరల పల్లూలపై రామాలయం రామ మందిర నమూనా, రాముడి జీవితానికి సంబంధించిన పలు ఘట్టాలతో కూడిన డిజైన్లను తీర్చిదిద్దుతున్నారు. వారణాసిలోని ముబారక్పూర్ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసూర్ రెహమాన్ మాట్లాడుతూ, అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంపై వారణాసిలోని చేనేత సంఘంలో ఎనలేని ఉత్సాహం నెలకొన్నదని అన్నారు. చారిత్రక విశేషాలతో రూపొందించిన చీరలకు ఎప్పటి నుంచో విపరీతమైన డిమాండ్ ఉందని, ఇప్పుడు రామ మందిరం థీమ్తో కూడిన చీరలకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. రామాలయం థీమ్తో రూపొందించిన చీరలు కట్టుకుని, తమ ప్రాంతాల్లో ఈ నెల 22న జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటామని పలువురు మహిళలు చెబుతున్నారు. -
రామ మందిర ప్రతిష్టాపన వేళ.. సిజేరియన్లకు తల్లుల అభ్యర్థనలు
కాన్పూర్: అయోధ్యలోని రామ మందిరం పవిత్రోత్సవం సందర్భంగా జనవరి 22న సిజేరియన్ ప్రసవాలు చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను అభ్యర్థిస్తున్నారు. అదే రోజు శిశువులకు జన్మనిచ్చేలా సిజేరియన్ చేయాలని 14 వ్రాతపూర్వక అభ్యర్థనలు అందాయని గణేష్ శంకర్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగానికి ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న సీమా ద్వివేది తెలిపారు. తమ ఆస్పత్రిలో జనవరి 22న 35 సిజేరియన్ ఆపరేషన్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ డెలివరీ తేదీలు కొన్ని రోజుల ముందు లేదా జనవరి 22 తర్వాత అయినప్పటికీ గర్భిణులు శుభ దినంగా పరిగణించి వైద్యులకు అభ్యర్థనలు చేశారని సీమా తెలిపారు. పూజారులు ఇచ్చిన ముహూర్తంలో డెలివరీ చేయాలని తల్లులు, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో తాను నిర్ణీత సమయంలో ఆపరేషన్ చేసిన వివిధ అనుభవాలను ఆమె వివరించారు. అలా చేయడం ద్వారా తల్లి, బిడ్డకు తలెత్తే సమస్యలను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రాముడు వీరత్వానికి, చిత్తశుద్ధికి, విధేయతకు ప్రతీక అని ప్రజలు నమ్ముతారు. అందుకే ఆలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ రోజున జన్మించిన శిశువులు కూడా అదే లక్షణాలను కలిగి ఉంటారని వారు నమ్ముతున్నట్లు సీమా ద్వివేది తెలిపారు. ఇదీ చదవండి: అయోధ్య రామునిపై పాట.. సింగర్ని అభినందించిన ప్రధాని మోదీ -
రాణించిన రింకూ.. టెస్ట్లకు సైతం 'సై' అనేలా..!
విధ్వంసకర బ్యాటింగ్తో పరిమిత ఓవర్ల ఆటగాడిగా ముద్ర వేసుకున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్.. టెస్ట్ క్రికెట్కు సైతం సై అనేలా కనిపిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా కేరళతో ఇవాళ (జనవరి 5) మొదలైన మ్యాచ్లో రింకూ (ఉత్తర్ప్రదేశ్) ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో 103 బంతులు ఎదుర్కొన్న రింకూ 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన ఇన్నింగ్స్ను అద్భుతంగా మలచుకోవడమే కాకుండా జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన దశలో దృవ్ జురెల్తో (54 నాటౌట్) జతకట్టిన రింకూ 100 పరుగుల అజేయమైన భాగస్వామ్యాన్ని జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్ప్రదేశ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. రింకూ సింగ్, దృవ్ జురెల్తో పాటు ప్రియం గార్గ్ (44), కెప్టెన్ ఆర్యన్ జుయల్ (28), సమీర్ రిజ్వి (26) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఓపెనర్ సమర్థ్ సింగ్ (10), ఆక్ష్దీప్ నాథ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి, నిధీష్, వైశాక్ చంద్రన్, జలజ్ సక్సేనా, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు. -
యోగి ఆదిత్యనాథ్కు బాంబు బెదిరింపులు .. ఇద్దరి అరెస్టు
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అయోధ్య రామాలయంలపై బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్, అయోధ్యలోని రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితులను తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) బృందం గుర్తించింది. నిందితులు లక్నోలో విభూతి ఖండ్ ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరించారని పోలీసులు గుర్తించారు. బెదిరింపు పోస్టుల్లో నిందితులకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు ఉన్నట్లు తేలింది. ఈమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్ సింగ్ ఈమెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది. నిందితులు ఇద్దరూ గోండా నివాసితులు. పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసును ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది. నిందితులే ఈ చర్యకు పాల్పడ్డారా? లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్ నేతలు అలర్ట్! -
చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్లైన్ గేమ్ ఆడి..
ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాకు చెందిన ఒక బీఎస్సీ విద్యార్థి ఆన్లైన్ గేమ్ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్లైన్ గేమ్లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్లైన్ గేమ్లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న తర్వాత అతనిని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఇటావా జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. బీఎస్సీ విద్యార్థి కిడ్నాప్పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో.. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిటీ ఎస్పీ, సిటీ సీఓ దర్యాప్తు చేపట్టి ఆ విద్యార్థి ఆచూకీ తెలసుకున్నారు. ఆ కుర్రాడు తాను కిడ్రాప్ అయినట్లు నాటకం ఆడాడని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది. ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు రూ.5 లక్షలు జమ చేశారు. ఆన్లైన్ గేమ్ ఆడిన ఆ కుర్రాడు తన దగ్గరున్న సొమ్మునంతా పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ కుర్రాడిని తీవ్రంగా మందలించారు. దీంతో ఆ కుర్రాడు తన సోదరుడు, ఒక బంధువు సహకారంతో కిడ్నాప్ డ్రామా ఆడాడు. జనవరి ఒకటిన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటావా పరిధిలోని ఘూగల్పూర్లో ఉంటున్న ఆ కుర్రాడి బంధువు శివం యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బంధువు సంజీవ్కుమార్ యాదవ్ కుమారుడు అంకిత్ యాదవ్ను గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేశారని అతను తన మొబైల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘూఘల్పూర్కు చేరుకున్నారు. ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ మార్గదర్శకత్వంలో అంకిత్ యాదవ్ను వెదికేందుకు పోలీసుల బృందం ఏర్పాయ్యింది. వీరికి ఈ ఘటన అనుమానాస్పదంగా కనిపించడంతో శివమ్ యాదవ్, అతని కుటుంబ సభ్యులను పోలీసు బృందం విచారించింది. ఈ నేపధ్యంలో అంకిత్ యాదవ్ను వెదికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సీఎం!
ఈరోజు నూతన సంవత్సరంలో తొలి రోజు.. అందుకే ఈరోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. చాలామంది కొత్త సంవత్సరం మొదటి రోజున ఆలయాలు సందర్శించి, దేవునికి పూజలు చేస్తుంటారు. ఫలితంగా ఈరోజు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. కాగా పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, గవర్నర్లు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'havan' and 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur (Video source: CMO) pic.twitter.com/0juG1CX7Vd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2024 యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (సోమవారం) ఉదయం గోరఖ్పూర్ చేరుకుని, గోరఖ్నాథ్ ఆలయంలో యాగం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ షాంఘ్వీ 2024 సంవత్సరం తొలి రోజు మోధేరా సూర్య దేవాలయంలో సూర్యనమస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ‘ఈ రోజు అత్యధిక సూర్య నమస్కారాలు చేస్తూ గిన్నిస్ రికార్డ్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సూర్య నమస్కార కార్యక్రమంలో నాలుగువేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారన్నారు. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు #WATCH | Mehsana: Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi participate in the Suryanamaskar Program at Modhera Sun Temple, on the first morning of the year 2024. pic.twitter.com/t3z3iBBIuk — ANI (@ANI) January 1, 2024 -
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు!
కొంతమందికి 2023వ సంవత్సరం ఆనందంగా గడిస్తే, మరికొందరికి వారి జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. 2023వ సంవత్సరంలో దేశంలో చోటుచేసుకున్న 10 అత్యంత దారుణాల గురించి ఇప్పుడు చూద్దాం. 1. ఉమేష్ పాల్ హత్య దేశంలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసుల్లో ఉమేష్ పాల్ హత్య ఒకటి. యూపీలోని ప్రయాగ్రాజ్ పరిధిలోని ధుమన్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ తుపాకీ తూటాలకు హతమయ్యాడు. ఇది యూపీలో గ్యాంగ్ వార్ను మరోమారు గుర్తుచేసింది. ఉమేష్ పాల్పై బుల్లెట్లు, బాంబులతో దాడి చేసినట్లు సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 2. అతిక్, అష్రాఫ్ హత్యలు పూర్వాంచల్ మాఫియా లీడర్లుగా పేరొందిన అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్లు ప్రయాగ్రాజ్ మెడికల్ కాలేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. పోలీసుల సంరక్షణలో ఉన్న అతిక్, అష్రఫ్ అహ్మద్లపై దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపి హత్యచేశారు. పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్తో ఒక జర్నలిస్టు మాట్లాడుతుండగా నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టబడ్డారు. 3. నిక్కీ యాదవ్ దారుణ హత్య ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్య.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 10న నిక్కీ యాదవ్ను ఆమె ప్రియుడు సాహిల్ గొంతుకోసి హత్య చేశాడు. సాహిల్ ఫిబ్రవరి 10న ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న నిక్కీ అతనితో గొడవ పడింది. సాహిల్ కోపంతో నిక్కీని గొంతుకోసి హత్య చేశాడు. తరువాత నిక్కీ మృతదేహాన్ని తన దాబాలోని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. అనంతరం రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 4. రాజ్పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుని హత్య రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. సుఖ్దేవ్ సింగ్ను అంతమొందించే ప్లాన్తో వచ్చిన ఇద్దరు ముష్కరులు అతని ఇంటిలో కాసేపు కూర్చుని మాట్లాడారు. తరువాత వారిద్దరూ తమ తుపాకీలను తీసి సుఖ్దేవ్ సింగ్పై కాల్పులు జరిపారు. దీంతో సుఖ్దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతలో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. అయితే నిందితులను చండీగఢ్లోని సెక్టార్ -22లో ఉన్న హోటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. 5. మైనర్ బాలిక దారుణ హత్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక దారుణ హత్య దేశాన్ని కుదిపేసింది. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది. దానిలో నిందితుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేస్తున్నా అక్కడున్న ఎవరూ పట్టించుకోకపోవడం కనిపిస్తుంది. నిందితుడు సాహిల్ ఈ 16 ఏళ్ల మైనర్పై 20 సార్లు కత్తులతో దాడి చేశాడు. తరువాత ఆ బాలికను రాయితో మోది హత్య చేశాడు. 6. డియోరియా ఊచకోత యూపీలోని డియోరియా జిల్లా రుద్రాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా మొత్తం ఆరుగురి హత్య దేశాన్ని కుదిపేసింది. భూ వివాదాల కారణంగానే ఈ హత్య జరిగింది. ఇందులో ఒక పార్టీకి చెందిన సత్య ప్రకాష్ దూబే, ఆయన భార్య కిరణ్, కుమార్తె సలోని, నందిని, కుమారుడు గాంధీ హత్యకు గురయ్యారు. జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్ కూడా హత్యకు గురయ్యారు. 7. కానిస్టేబుల్ కాల్పులు జైపూర్-ముంబై ఎక్స్ప్రెస్ రైలులో ఆర్పిఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన ఈ సంవత్సరం కలకలం రేపింది. జూలై 31 ఉదయం, జైపూర్-ముంబై రైలులో ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన వాపి, బోరివాలి మీరా రోడ్ స్టేషన్ల మధ్య జరిగింది. 8. లక్నో కోర్టులో బుల్లెట్ల శబ్దం యూపీలోని లక్నోలోని కోర్టులో గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవాను కాల్చి చంపారు. జూన్ 7న విచారణ కోసం గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవాను లక్నో కోర్టుకు తీసుకువచ్చారు. ఇంతలో లాయర్ల వేషంలో వచ్చిన దుండగులు కోర్టు ఆవరణలోనే సంజీవ్ జీవాపై కాల్పులు జరిపారు. సంజీవ్ జీవా అక్కడికక్కడే మృతిచెందాడు. సంజీవ్ జీవా ముజఫర్నగర్ నివాసి. లక్నో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 9. రూ.350 కోసం దారుణ హత్య కేవలం రూ.350 కోసం 16 ఏళ్ల యువకుడు మరో టీనేజర్ను అత్యంత దారుణంగా అంతమొందించాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడపై నిందితుడు 60 సార్లు కత్తితో పొడిచాడు. ప్రాణాలు కోల్పోయిన టీనేజర్ను చూసి ఆ యువకుడు డ్యాన్స్ చేయటం సీసీటీవీ వీడియోలో కనపడింది. ఈ దారుణ హత్యకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10. పట్టపగలు దుకాణదారుని హత్య పంజాబ్లోని భటిండాలో పట్టపగలు ఓ దుకాణదారుని కాల్చి చంపిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది. ఈ హత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుకాణదారుడు హర్జిందర్ సింగ్ అలియాస్ మేలా తన దుకాణం ముందు కుర్చీలో కూర్చున్నట్లు ఈ సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తుంది. ఇంతలో బైక్పై వెళ్తున్న ఇద్దరు దుండగులు వచ్చి పిస్టల్స్తో హర్జిందర్పై కాల్పులు జరిపారు. దుండగులిద్దరూ ముఖాలకు మాస్క్లు కప్పుకున్నారు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం దుండగులిద్దరూ బైక్పై పారిపోయారు. బాధితుడు హర్జిందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది కూడా చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది? -
లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టానంతో సమావేశమయ్యారు. అనంతరం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయడం గురించి ఆయన మాట్లాడుతూ..‘అది వారి ఇల్లు. అక్కడి నుంచే వారు పోటీ చేస్తారు. అలహాబాద్, ప్రయాగ్రాజ్, రాయ్ బరేలీ, అమేథీలలోని వారి పూర్వీకులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్లుగా అక్కడి ప్రజలతో వారికి దృఢమైన అనుబంధం ఉంది. ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. పార్టీ అధిష్టానం ఉత్తరప్రదేశ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఖర్గే , రాహుల్, ప్రియాంక తదితర జాతీయ నాయకులు యూపీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము కోరామన్నారు. యూపీలో పొత్తుల గురించి అజయ్ రాయ్ మాట్లాడుతూ దీనిపై నిర్ణయాన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలేశామని అన్నారు. తాము ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు कांग्रेस मुख्यालय, दिल्ली में राष्ट्रीय अध्यक्ष श्री @kharge जी, जननायक श्री @RahulGandhi जी, कांग्रेस महासचिव/प्रभारी, UP श्रीमती @priyankagandhi जी व राष्ट्रीय महासचिव संगठन @kcvenugopalmp जी ने प्रदेश अध्यक्ष श्री @kashikirai जी, CLP लीडर श्रीमती @aradhanam7000 जी व प्रदेश के… pic.twitter.com/Yp4vbrcIxZ — UP Congress (@INCUttarPradesh) December 18, 2023 -
‘రాత్రుళ్లు ఎవరూ బయట నిద్రించకుండా చూడండి’
చలిగా ఉన్న రాత్రివేళల్లో ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో నిద్రించకుండా చూడాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లయితే వారిని నైట్ షెల్టర్లకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు. మకర సంక్రాంతి రోజున గోరఖ్నాథ్ ఆలయంలో నిర్వహించే ఖిచ్డీ జాతరకు వచ్చే భక్తులకు కూడా నైట్ షెల్టర్లలో వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోరఖ్నాథ్ ఆలయంలో జనతా దర్శన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అనంతరం పౌర సదుపాయాలు, ఖిచ్డీ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాత్రిపూట గస్తీ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లు కనిపిస్తే, వారిని గౌరవప్రదంగా సమీపంలోని నైట్ షెల్టర్కు తీసుకెళ్లాలని అన్నారు. అనాథలైన వారు చలిలో రోడ్డుపై వణుకుతున్నట్లు కనిపించకుండా చూడాలన్నారు. ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతూ ఆరుబయట పడుకుంటే వారిని మానసిక వికలాంగుల ఆశ్రయాలకు తరలించి వైద్యం చేయించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నైట్ షెల్టర్లలో తగిన సంఖ్యలో పడకలు, దుప్పట్లు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనవారికి ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31 నాటికి ఖిచ్డీ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. జనవరి ఒకటి నుంచి భక్తులు రాక మొదలవుతుందన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ మంగ్లేష్ శ్రీవాస్తవ, జోన్ ఏడీజీ అఖిల్ కుమార్, డివిజనల్ కమిషనర్ అనిల్ ధింగ్రా తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చూడండి: దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి! -
షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 'షాహీ ఈద్గా మసీదును అడ్వకేట్ కమిషనర్తో సర్వే చేయించాలనే మా అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి అడ్వకేట్ జనరల్ అవసరం. ఇది చరిత్రాత్మక తీర్పు.' అని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్మాన్కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
పోస్టుమార్టంలో కళ్లు మాయం..కలెక్టర్ సంచలన నిర్ణయం
ముజరియా(యూపీ): హత్యకు గురైన ఓ యువతి శరీరం నుంచి కళ్లు దొంగిలించారని యువతి బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టంలోనే ఇది జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజారియా జిల్లా రసూలా గ్రామంలో జరిగింది. ‘వరకట్న కోసం పూజ(20)ను చంపారని ఆమె భర్తపై డౌరీ కేసు నమోదైంది. ఈ కేసులో పూజ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించినపుడు అసలు విషయం బయటపడింది. పూజ కళ్లు దొంగిలించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మానవ అవయవాల అక్రమ రవాణా జరిగిందని పూజ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ పోస్టుమార్టం కోసం పంపించాం. కళ్లు దొంగిలించడం నిజమే అయితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని కలెక్టర్ మనోజ్కుమార్ తెలిపారు. ఇదీచదవండి.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు -
ఘనంగా ముగిసిన యువ సంగమం
హైదరాబాద్: వివిధ రాష్ట్రాలలోని సంస్కృతి, సంప్రదాయాలను యవతకు తెలియబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్), బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ)లు.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్టీసీటీసీ) సహకారంతో యువసంగమం కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విభిన్న నేపథ్యాల యువతకు ఆతిథ్యం అందించారు. ఈ యువసంగమం ఫేజ్-3లో తెలంగాణకు చెందిన స్థానిక వంటకాలు, జీవనశైలి, హస్తకళలు, సంస్కృతి, సాంకేతికత, ఆవిష్కరణలు తెలంగాణలోని ఇతర అంశాలపై ఉత్తరప్రదేశ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాల యువత మధ్య బంధాలను బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. దేశంలోని యువతలో ఐక్యత, అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. యువ సంగమం ఫేజ్-3లో ఉత్తరప్రదేశ్, తెలంగాణల మధ్య ఒక వారం రోజుల పాటు సాంస్కృతిక మార్పిడి సాగింది. ముగింపు ఉత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ప్రత్యేక ఆన్లైన్ ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. యువ సంగమం ప్రధాన లక్ష్యం.. పర్యాటకం, సంప్రదాయాలు, అభివృద్ధి, పరస్పర అనుసంధానం, టెక్నాలజీలపై యువతకు అవగాహన కల్పించడం. తెలంగాణ వారసత్వంలోని విభిన్న కోణాలను ప్రదర్శిస్తూ, రోజు వారీగా ప్రణాళికాబద్ధంగా ఈ సాంస్కృతిక ప్రయాణం సాగింది. ముందుగా వారణాసి నుంచి వచ్చిన ప్రతినిధులకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. తరువాత అంతర్జాతీయ అతిథి గృహంలో వారికి వసతి కల్పించారు. అనంతరం సమగ్ర క్యాంపస్ పర్యటన, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్లను సందర్శించారు. తెలంగాణ పర్యాటకానికి ఆనవాళ్లయి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం మొదలైనవాటిని ప్రతినిధులు సందర్శించారు. అలాగే ఐఐటీహెచ్ క్యాంపస్లో ఎఐసిటిఇ ఛైర్మన్ ప్రొఫెసర్ టిజి సీతారాము, ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తిల సహకారంతో గోల్కొండ కోట చారిత్రక వైభవాన్ని పరిశీలించారు. తరువాత బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులకు, యువతకు వివిధ అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. ప్రొఫెసర్ బి ఎస్ మూర్తి మాట్లాడుతూ యువ సంగమం పేరుతో తమకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు విద్యా మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాల వలన యువత వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోగలుగుతుందన్నారు. -
నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు..
అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాశీ విద్వత్ పరిషత్ తాజాగా రామమందిర్ ట్రస్ట్కు శ్రీరాముని సింహాసనం నవరత్న ఖచిత శోభాయమానంగా ఉండాలని ప్రతిపాదించింది. దీంతో రామాలయంలోని గర్భగుడిలో నవరత్నాలతో చేసిన సుమేరు పర్వతంపై శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠితం కానుంది. ఈ సుమేరు పర్వతం వజ్రం, పచ్చ, కెంపు వంటి విలువైన రత్నాలతో రూపొందనుంది. శ్రీరాముని పట్టాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో వైదిక పద్ధతిలో ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువయ్యే శ్రీరామునికి తొలి హారతిని ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు. కాశీలో కొలువైన విశ్వనాథునితో సహా అక్కడి దేవతామూర్తులందరూ ఈ వేడుకలలో పాల్గొననున్నారు. కాశీలోని సమస్త దేవతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కాశీ విద్వత్ పరిషత్ సన్నాహాలు చేస్తోంది. కాగా సంవద్ శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు రామజన్మభూమి కాంప్లెక్స్లోని ఆలయంతోపాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 20 నుంచి 22 వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకోలేరని ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రాణ ప్రతిష్ఠ, వీఐపీల రాక దృష్ట్యా మూడు రోజుల పాటు సాధారణ దర్శనాలను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం! -
భారత్లో బంగ్లా మహిళ రహస్య నివాసం.. 30 ఏళ్లకు బయటపడిన బాగోతం!
యూపీలోని బరేలీలో గత 30 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళ అక్రమంగా భారత్కు వచ్చి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇక్కడే నివసిస్తోంది. తాజాగా ఆమె పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసిన నేపధ్యంలో ఆమె బాగోతం బయటపడింది. ఈ ఉదంతం పోలీసు శాఖలో కలకలం రేపింది. అక్రమంగా భారత్లో ఉంటున్న ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్లోని జోధోపూర్కు చెందిన ఈ మహిళ పేరు అనితా దాస్. ఆమె దేవ్రానియాలోని ఉదయపూర్ గ్రామానికి చెందిన మంగళ్ సేన్ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతని భార్యగా ఇక్కడే ఉంటోంది. ఆ మహిళ వయస్సు 55 సంవత్సరాలు. అనిత ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా పోలీసులకు ఆమె గురించి తెలియకపోవడం విశేషం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తన తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడంతో అనిత వారిని చూడటానికి బంగ్లాదేశ్ వెళ్లాలని అనుకుంది. ఈ నేపధ్యంలోనే ఆమె బంగ్లాదేశ్ వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తులో ఆమె తన స్థానిక చిరునామాతో పాటు బంగ్లాదేశ్ చిరునామాను కూడా రాసింది. అలాగే పాస్పోర్ట్లో పుట్టిన స్థలం కాలమ్ ఉన్న చోట ఆమె బంగ్లాదేశ్ అని రాయడంతో ఆమె బాగోతం బయటపడింది. పాస్పోర్ట్ దరఖాస్తు పరిశీలినలో ఆమె బంగ్లాదేశీ అనేది స్పష్టమైంది. వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. అక్రమంగా భారత్లో ఉంటున్న మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అనిత బంగ్లాదేశ్కు చెందినదనే సంగతి తమకు కూడా తెలియదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అనిత ఈ గ్రామంలో 30 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమెకు ఐదుగురు సంతానం. ఇంతకాలం ఆమె స్థానికురాలేనిని గ్రామస్తులంతా భావించారు. ఇది కూడా చదవండి: గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు.. -
కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు!
సాధారణంగా రైతులు చేతికొచ్చిన పంటను వీలైనంత త్వరగా కోసి, కొత్త పంటకు నేలను సిద్ధం చేస్తారు. అయితే దీనికి విరుద్దంగా ఆ ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి పంటలను కోసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. అది ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లా.. అక్కడి రైతులు చేతికందిన చెరకును కోయాలంటే గజగజా వణికిపోతున్నారు. దీని వెనుక కారణం తెలిస్తే ఎవరైనా కూడా భయపడాల్సిందే. యూపీలోని పిలిభిత్ జిల్లా రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులకు కీలకమైన ప్రాంతంగా గుర్తింపుపొందింది. జిల్లాలోని రైతులు ప్రధానంగా వరి, చెరకు పండిస్తుంటారు. అయితే జిల్లాలో ప్రతి ఏటా పంట కోతకు వచ్చినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వెనుక ప్రకృతి వైపరీత్యమేదో కారణమనుకుంటే పప్పులో కాలేసినట్లే. దీనికి వన్యప్రాణులు ప్రధాన కారణమని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిలిభిత్ జిల్లాలోని టైగర్ రిజర్వ్కు ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాలకు పులులు వస్తుంటాయి. ఇవి చెరకు, వరి పొలాలలో దాక్కుంటాయి. అటువంటి పరిస్థితిలో పంటల కోత సమయంలో కూలీలు వన్యప్రాణుల బారిన పడుతున్నారు. తాజాగా మాథొటాండా పరిధిలోని పిపరియా సంతోష్ గ్రామ రైతులు.. మిల్లు నుంచి స్లిప్ తీసుకున్నా చెరుకు పంటను కోసేందుకు వెనుకాడుతున్నారు. పలువురు రైతులు రెట్టింపు వేతనాలు ఇస్తామంటున్నా కూలీలు ఈ పొలాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. అక్టోబర్ 19 నుండి ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పంట కోస్తున్న సమయంలో కూలీలపై పులులు దాడి చేస్తున్నాయి. ఇటువంటి భయానక పరిస్థితుల్లో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి పంటలు అలానే ఉండిపోతున్నాయి. కాగా పిలిభిత్ సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. వారి అనుమతి లభించాక రెస్క్యూ ఆపరేషన్ చేపడతామన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు! -
బాలున్ని చితకబాది.. ఒంటిపై మూత్రం పోసి..
లక్నో: ఉత్తరప్రదేశ్, మీరట్లో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ బాలునిపై దాడి చేసి మూత్రం పోశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ రోజు రాత్రి బాధితుడు ఇంటికి కూడా వెళ్లలేదు. మరునాడు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత బాధితుడు పోలీసులకు అసలు విషయాన్ని బయటపెట్టాడు. కొందరు దుండగులు తనను బందించి శరీరంపై మూత్రం పోశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు పాల్పడినవారిలో బాలుని స్నేహితులు ఉన్నారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇదీ చదవండి: Lightning Strikes In Gujarat: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత -
యూపీలో నేడు 'నో నాన్ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్లో నవంబర్ 25ని "నో నాన్ వెజ్ డే"గా ప్రభుత్వం ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మాంసం దుకాణాలు, కబేళాలు మూసివేయాలని అధికారిక ప్రకటన తెలిపింది. సాధు తన్వార్దాస్ లీలారామ్ వాస్వానీ ఒక భారతీయ విద్యావేత్త. మీరా మూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ను ప్రారంభించారు. సింధ్లో సెయింట్ మీరా స్కూల్ను స్థాపించారు. ఆయన బోధనలకు పూణేలో దర్శన్ మ్యూజియాన్ని అంకితం చేశారు. సాధువు టిఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా నవంబర్ 25 అంతర్జాతీయ నాన్వెజ్ డేగా కూడా కొనసాగుతోంది. హలాల్ సర్టిఫికేషన్తో ఉన్న ఆహార ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత యూపీ ప్రభుత్వం తాజాగా నాన్ వెజ్ డేని ప్రకటించింది. హలాల్ సర్టిఫికేషన్ అంశంలో ఎగుమతి కోసం తయారు చేసిన ఉత్పత్తులను మినహాయించింది. ఇదీ చదవండి: మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్ -
డబ్బు కోసం వ్యాపారిని బెదిరించిన సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డ్
గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను బెదిరించిన నిందితుడు షేరు అలియాస్ షేరా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యాపారి నుంచి 10 లక్షలు డిమాండ్ చేశాడు. కరేలి పోలీసులు అతనిపై హత్యాయత్నం, బెదిరింపులతో సహా తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్, కండలవీరుడు అతిక్ అహ్మద్లకు తాను సన్నిహితుడినని నిందితుడు గతంలో పేర్కొన్నాడు.సల్మాన్ ఖాన్ను బెదిరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. కస్టడీ నుంచి విడుదలైన తర్వాత, అతను మళ్లీ ప్రయాగ్రాజ్లోని ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు డిమాండ్ చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. రెండేళ్ల నుంచి బెదిరింపులు ప్రయాగ్రాజ్ నివాసి, వ్యాపారి జిషాన్ జకీర్ తనకు రెండేళ్లుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కరేలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నగర డీసీపీ దీపక్ భుకర్ తెలిపారు. షేరా ఒక నేరస్థుడిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నవంబర్ 10న తన ముగ్గురు సహచరులతో వచ్చి కాల్చి చంపే ప్రయత్నం చేశాడు. దీని నుంచి తృటిలో తప్పించుకున్నాను. తర్వాత షేరా తన సహచరులతో కలిసి నన్ను కొట్టి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సల్మాన్ ఖాన్కు బెదిరింపు పోలీసుల కథనం ప్రకారం, కొన్నేళ్ల క్రితం నటుడు సల్మాన్ ఖాన్ వద్ద షేరా సెక్యూరిటీ సిబ్బందిలో ఉండేవాడు. అతడి ప్రవర్తన సరిగా లేనందున అతన్ని ఉద్యోగం నుంచి సల్మాన్ తొలగించారు. 2018లో తనకు సినిమాలో అవకాశం ఇవ్వాలని నటుడిని డిమాండ్ చేశాడు. అందుకు సల్మాన్ నిరాకరించడంతో ఆయన మొబైల్కు ఫోన్ చేసి బెదిరించాడు. ఆ సమయంలో షేరా ముంబైలో ఉండేవాడు. సల్మాన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు అతడిని జైలుకు పంపారు. షేరా జైలు నుంచి బయటకు వచ్చి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నివశించాడు. రెండేళ్ల క్రితం జిషాన్ జకీర్ అనే వ్యాపారికి షేరా ఫోన్ చేసి బెదిరించాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే ఇంట్లో బాంబు పెట్టి పేలుస్తానని బెదిరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నిందితుడు షేరాపై ప్రయాగ్రాజ్లోని వివిధ స్టేషన్లలో మొత్తం 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు వల పన్నారు. -
న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. సరాయ్ భూపత్ స్టేషన్ నుంచి దాటిపోతున్న క్రమంలో స్లీపర్ కోచ్ నుంచి పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన స్టేషన్ మాస్టర్.. ట్రైన్ డ్రైవర్, గార్డ్కు విషయాన్ని చేరవేశాడు. #WATCH | Fire broke out in the S1 coach of train 02570 Darbhanga Clone Special when it was passing through Sarai Bhopat Railway station in Uttar Pradesh. According to CPRO, North Central Railways, there are no injuries or casualties (Earlier Video; Source: Passenger) pic.twitter.com/mTFHcTlhak — ANI (@ANI) November 15, 2023 దీంతో రైలును అక్కడే నిలిపివేయగా ప్రయాణికులందరూ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. రైలుకు పూర్తి స్థాయిలో మంటలు అంటుకున్నాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్ -
ప్రేమను పెంచే ఆహారపాత్ర.. కొత్త జంటలకు ప్రత్యేకమట!
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్.. బ్రాస్ సిటీ(ఇత్తడి నగరం)గా పేరుగాంచింది. ఇక్కడి ఇత్తడి ఉత్పత్తులు మన దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతాయి. ఈ బ్రాస్ సిటీలో కొత్తగా పెళ్లయిన జంటల కోసం ఫుడ్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కొత్త దంపతులు ఈ ప్లేట్లో ఆహారం తింటే వారి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్లేట్లకు స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. ఇత్తడి వస్తువుల వ్యాపారి సల్మాన్ మాట్లాడుతూ తాము కొత్త జంటల కోసం ఫుడ్ ప్లేట్లు సిద్ధంగా ఉంచామన్నారు. చాలామంది కంచు పాత్రలలో తినడానికి ఇష్టపడతారని, అయితే కాంస్య లోహం ఖరీదు ఎక్కువగా ఉండడంతో ఇత్తడితో ఈ ఫుడ్ ప్లేట్ సిద్ధం చేశామన్నారు. ఈ ప్లేట్లను తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని తెలిపారు. ఈ పాత్రలు ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఈ ఫుడ్ ప్లేట్ సెట్లో మూడు గిన్నెలు, ఒక పుడ్డింగ్ ప్లేట్, ఒక స్పూన్, ఒక గ్లాస్, మరో ప్లేట్ ఉంటాయన్నారు. పెళ్లిళ్ల సీజన్లో వీటి కొనుగోళ్లు అధికంగా ఉంటాయన్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. 25న ఓటింగ్ రద్దు! -
దీపావళి విషాదం: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి!
దీపావళి రోజున ఉత్తరప్రదేశ్(యూపీ)లోని కాన్పూర్ దేహత్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో బాంబు పేలడంతో రసూలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్ నుంచి కాన్పూర్ నగర్ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్కు తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
లక్నో: ఉత్తర్ప్రదేశ్ మథురలోని బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దీపావళి పండగ వేళ ముందస్తు అనుమతితోనే గోపాల్బాగ్ ప్రాంతంలో బాణాసంచా దుకాణాలు వెలిశాయి. పండగ కావడంతో మార్కెట్ జనంతో కిటకిటలాడుతోంది. మొదట ఓ షాప్లో మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న ఏడు దుకాణాలకు ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరగడంతో జనం పరుగులు పెట్టారు. ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ షాక్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంటల్లో పలు వాహనాలు కూడా కాలిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా బాణాసంచా అమ్మకాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీ వాసులకు అలర్ట్! -
అయోధ్యలో కేబినెట్ భేటీ.. ఇదే తొలిసారి
లక్నో: ఉత్తరప్రదేశ్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని లక్నోలో కాకుండా అయోధ్యలో తొలిసారి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో అయోధ్య అభివృద్ధికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమావేశానికి ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్ మంత్రులతో కలిసి హనుమాన్ గర్హి రామాలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం సరయూ నది ఒడ్డున ఉన్న రామకథా మండపంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది. 2019 జనవరిలో లక్నోలో కాకుండా ప్రయాగ్రాజ్లో మొదటిసారి కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాత అయోధ్యలో ఇదే ప్రథమం. నవంబర్ 9న అయోధ్యలో కేబినెట్ భేటీ నిర్వహించడానికి ఓ ప్రత్యేకత ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 1989లో నవంబర్ 9న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ శంకుస్థాపన చేసింది. 2019 నవంబర్ 9నే బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇదీ చదవండి: ఎన్నడూ స్కూల్కు వెళ్లనేలేదు.. తేజస్వీ యాదవ్పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని..
ఉత్తరప్రదేశ్లో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది మరోమారు వెల్లడయ్యింది. నవీన్ బస్తీ వెస్ట్లో నివాసం ఉంటున్న ప్రబల్ ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20) పొరపాటున వేడి నీటితో నిండిన బకెట్లోని వాటర్ హీటర్ను ముట్టుకుని విద్యుదాఘానికి గురై, అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు అంజలి చనిపోయిందని నిర్ధారించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు సాహసం చేశాడు. ఆ మృతదేహాన్ని బైక్పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకుని, వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్ను ఇంటివైపు నడిపాడు. ఇందుకు 15 నిముషాల సమయం పట్టింది. దీనిని గమనించి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ ఉదంతం గురించి సీహెచ్సీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని తమను అడిగితే, ఏర్పాటు చేసేవారమని తెలిపారు. కాగా జిల్లాలో రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఔరయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్! -
దళిత మహిళపై దారుణం: అత్యాచారం, ఆపై ముక్క ముక్కలుగా చేసి..!
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి, ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. బందా లోని గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటౌరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందంటూ ప్రతిపక్షం మండి పడింది. పోలీసు అధికారి సమాచారం ప్రకారం రాజ్కుమార్ శుక్లాకు చెందిన పిండి మిల్లును శుభ్రం చేసేందుకు బాధిత మహిళ వెళ్లింది. అయితే ఆమె ఎంతకీ తిరిగి రావడంతో ఆమె కుమార్తె అక్కడికి చేరుకుంది. అయితే అక్కడున్న గది లోపనుంచి గడియ వేసి ఉండటం, తల్లి అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించింది. దీంతో స్థానికుల సాయంతో కాసేపటి తలుపులు తెరిచి చూడగా ముక్క ముక్కలుగా పడి ఉన్న తలి మృతదేహాన్నిచూసి తీవ్ర భయాందోళకు లోనైంది. దీంతో ఈఘటనపై పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితులుగా రాజ్కుమార్ శుక్లా, అతని సోదరుడు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంతన హృదయాన్ని కలచి వేసిందని, బీజేపీ ప్రభుత్వంపై మహిళలు పూర్తిగా విశ్వాసం కోల్పో యారంటూ ట్వీట్ చేశారు. యూపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్ధాలకు ఈ ఘటన చెంప పెట్టు లాంటిదంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఐఐటి-బిహెచ్యు విద్యార్థినిపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, వీడియో తీసిన ఘటనను యాదవ్ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. बांदा में एक दलित के साथ बलात्कार व जघन्य हत्या की जो ख़बर आई है, वो दिल दहला देने वाली है। उप्र की महिलाएं डरी हुई हैं और अंदर-ही-अंदर आक्रोशित भी। साथ ही आईआईटी बीएचयू की महिला छात्रा के साथ अभद्रता के बाद निर्वस्त्र कर वीडियो बनाने की घटना उप्र की क़ानून-व्यवस्था के मुँह पर… pic.twitter.com/g96iu9MFIK — Akhilesh Yadav (@yadavakhilesh) November 2, 2023 -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!
అలీగఢ్: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే తమ కుమార్తెను పోషించేందుకు కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రుల ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటుచేసుకుంది. అలీగఢ్లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు విసిగిపోయిన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడిని విక్రయించడానికి నగరంలోని గాంధీపార్క్ బస్టాండ్ కూడలిలో భార్య, కొడుకు, కూతురితో సహా కూర్చున్నాడు. తన మెడలో ఒక ప్లకార్డును వేలాడదీసుకున్నాడు. ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు’ అని రాసి ఉంది. తన కుమారుని ధర రూ.6 నుంచి 8 లక్షలు ఉందని ఆ తండ్రి చెబుతున్నాడు. మహుఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్పూర్ కయామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తండ్రి కొన్ని నెలల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొద్ది రోజులకే వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితుడు తెలిపాడు. ‘నా చేతిలో డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితిలో రుణం చెల్లించాలంటూ రౌడీలు నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రౌడీలు నా ఈ-రిక్షాను లాక్కున్నారు. దీంతో కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా నా కుమారుడిని రూ.6 నుంచి 8 లక్షలకు కొనుక్కోవాలని, అప్పడే తాను తన కూతురిని సక్రమంగా పోషించుకోగలనని’ ఆ తండ్రి కనిపించిన అందరికీ చెబుతూ కంటనీరు పెట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్కు తరలించారు. తన బంధువు వద్ద తాను అప్పు తీసుకున్నానని, తిరిగి చెల్లించలేకపోయానని బాధిత తండ్రి తెలిపాడు. అనంతరం పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో బాధితుడు డబ్బులు త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్కు నష్టం ఏమిటి? -
భారత్లో ఇరాన్ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్పీ నేత!
సైకిల్ యాత్రపై భారత్కు వచ్చిన ఇరాన్ దంపతులను తిరిగి వారి దేశానికి తిరిగి పంపేందుకు యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆర్థిక సాయం అందించారు. ఈ ఇరాన్ దంపతులు ప్రపంచ శాంతి సందేశాన్ని ఇస్తూ, సైకిల్పై భారతదేశానికి వచ్చారు. సోషల్ మీడియా ప్లాట్పారం ఎక్స్లో అఖిలేష్ యాదవ్ ఈ వివరాలను తెలియజేస్తూ మానవత్వం కంటే గొప్ప మతం లేదని, సహాయానికి మించిన ఆరాధన లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి వచ్చి, మన దేశంలో చిక్కుకుపోయిన ఈ అతిథుల కోసం ఏదో ఒకటి చేయడమనేది తన అదృష్టం అని అఖిలేష్ అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా.. ఈ జంట తిరుగు ప్రయాణపు టికెట్ రద్దయింది. వారి దగ్గర డబ్బలు కూడా లేవు. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు అఖిలేష్ యాదవ్కు తెలియజేశారు. దీంతో ఈ జంటకు అఖిలేష్ సాయం అందించారు. ఈ జంటను వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత! इंसानियत से बड़ा धर्म और मदद से बड़ी इबादत कोई और नहीं, कुछ और नहीं। जंग के हालातों की वजह से, ईरान से आकर हमारे देश में फँसे इन मेहमानों की देश वापसी में हम कुछ कर पा रहे हैं, ये हमारी ख़ुशक़िस्मती है। देश की छवि दुनिया में सिर्फ़ कहने से नहीं, कुछ अच्छा करने से बनती है। pic.twitter.com/RtvlRmhaci — Akhilesh Yadav (@yadavakhilesh) October 27, 2023 -
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత!
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ (90) కన్నుమూశారు. ఆయన 1950లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గల గీతా ప్రెస్ ట్రస్ట్లో చేరారు. నగరంలోని సివిల్ లైన్స్లో గల హరిఓమ్నగర్ నివాసంలో ఉంటున్న బైజ్నాథ్ అగర్వాల్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. బైజ్నాథ్ అగర్వాల్ మృతిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలోలో ఇలా రాశారు.. ‘గోరఖ్పూర్లోని గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ మరణం విచారకరం. గత 40 సంవత్సరాలుగా గీతా ప్రెస్కు ధర్మకర్తగా బైజ్నాథ్ వ్యవహరించారు. ఆయన జీవితం ప్రజా సంక్షేమానికే అంకితమయ్యింది. శ్రీరాముడు తన పాదాల చెంత ఆయన ఆత్మకు చోటు కల్పించాలని వేడుకుంటున్నానని’ అన్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? गीता प्रेस, गोरखपुर के ट्रस्टी श्री बैजनाथ अग्रवाल जी का निधन अत्यंत दुःखद है। विगत 40 वर्षों से गीता प्रेस के ट्रस्टी के रूप में बैजनाथ जी का जीवन सामाजिक जागरूकता और मानव कल्याण के लिए समर्पित रहा है। उनके निधन से समाज को अपूरणीय क्षति हुई है। प्रभु श्री राम दिवंगत पुण्यात्मा… — Yogi Adityanath (@myogiadityanath) October 28, 2023 -
సమాజ్ వాదీ నేత ఆజాం ఖాన్కు ఏడేళ్ల జైలు శిక్ష
లక్నో: సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజాంలకు యూపీలోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. 2019 నాటి నకిలీ జనన ధృవీకరణ పత్రాల కేసులో ఈ ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు విధిస్తూ శిక్షను ఖరారు చేశారు. నకిలీ ధ్రువపత్రాలపై బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్లోని గంజ్ పోలీస్ స్టేషన్లో జనవరి 3, 2019న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి కుమారుడు అబ్దుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి కాగా మరొకటి రాంపూర్ నుంచి పొందినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు. "కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుండే దోషులను జైలుకు తరలించారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు. ఛార్టిషీటు ప్రకారం అబ్దుల్లా ఆజాం జనవరి 1,1993న జన్మించినట్లు రాంపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక ధ్రువపత్రాన్ని పొందగా.. మరొకటి సెప్టెంబర్ 30, 1990న జన్మించినట్లు లక్నో నుంచి పొందారు. నాలుగేళ్లపాటు విచారణ తర్వాత న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ -
4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ ఎందుకయ్యింది?
దేశంలోని ప్రతి రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నప్పటికీ, భౌగోళిక ప్రత్యేకతల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్లోని ఆ జిల్లా పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. యూపీలోని సోన్భద్ర జిల్లా అనేక ప్రత్యేకతలను కలిగివుంది. విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్లోని రెండవ అతిపెద్ద జిల్లా సోన్భద్ర. నిజానికి సోన్భద్ర భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది నాలుగు రాష్ట్రాల సరిహద్దులను తాకుతుంది. ఈ ప్రత్యేకత కారణంగా పోటీ పరీక్షలలో సోన్భద్ర జిల్లాకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు. సోన్భద్ర యూపీలో ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లను తాకుతాయి. సోన్భద్ర మైనింగ్ గనుల పరంగానే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కైమూర్ కొండలలో ఖనిజాలు పెద్ద మొత్తంలో లభిస్తాయి. సోన్భద్ర ప్రాంతంలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా లభ్యమవుతుంది. 1989కి ముందు సోన్భద్ర యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. అయితే 1998లో దీనిని వేరు చేసి సోన్భద్ర అనే పేరు పెట్టారు. ఇక్కడ ప్రవహించే నది కారణంగా ఈ ప్రాంతానికి సోన్భద్ర అనే పేరు వచ్చింది. ఇక్కడ సోన్ నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాలో కన్హర్, పంగన్లతో పాటు రిహాండ్ నది కూడా ప్రవహిస్తుంది. సోన్భద్ర జిల్లా వింధ్య , కైమూర్ కొండల మధ్య ఉంది. ఇక్కడి అందమైన దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలోని ప్రకృతి అందాలను చూసి, ఈ ప్రాంతానికి ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అనే పేరు పెట్టారు. సోన్భద్రలో అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పలు పవర్ ప్లాంట్లు ఉన్నకారణంగా ఈ ప్రాంతాన్ని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా చదవండి: ఆ బాబాలు ఏం చదువుకున్నారు? -
'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..'
లక్నో: సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మరోసారి స్పందించారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని.. మిగిలినవన్నీ విభాగాలు, పూజా విధానాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. 'శ్రీమధ్ భగవత్ కథా జ్ఞాన్' కార్యక్రమంలో యోగీ ఆదిత్యానాథ్ ఈ మేరకు మాట్లాడారు. 'సనాతన ధర్మం మాత్రమే మతం. మిగిలినవన్నీ వివిధ రకాల పూజా విధానాలు మాత్రమే. సనాతన ధర్మం అంటే మానవత్మమనే మతం. ప్రస్తుతం దానిపై దాడి జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో మానవత్వమే ఆపదలో ఉన్నట్లు.' అని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. 'శ్రీమధ్ భగవత్ కథా జ్ఞాన్' కార్యక్రమాలు ఏడు రోజులపాటు గోరఖ్నాథ్ దేవాలయం వద్ద నిర్వహించారు. చివరి రోజు వేడుకలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు మాట్లాడారు. మహంత్ దిగ్విజయ్ నాథ్ 54వ వర్థంతి, మహంత్ అవైద్యనాథ్ 9వ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. విశాల దృక్పథం ఉన్నవారు మాత్రమే శ్రమధ్ భగవత్ కథా సారాన్ని అర్థం చేసుకోగలరని అన్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. బుల్డోజర్కు పని -
త్రాచును మించిన జడ.. పడగ కూడా..!
లక్నో: కురులంటే ఆడవారికి ఎంతో ఇష్టం. అవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఎంతో ప్రత్యేకంగా వాటిని కాపాడుకుంటుంటారు. నిండైన జడ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒకవైపు.. మరోవైపు కురులకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధాన్యత ఉంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్లో ఓ మహిళ కురులు త్రాచుపాము అంతటి పరిమాణంలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బృందావన్ ధామ్ ఆధ్యాత్మికంగా హిందువులకు ఎంతో ప్రధాన్యత కలిగిన ప్రదేశం. కృష్ణుని జన్మస్థానంగా పేర్కొంటారు. ఇక్కడ ఓ మహిళ జుట్టు చాలా పెద్ద పరిమాణంలో పెరిగింది. దాదాపుగా త్రాచుపాము లాగే కనిపిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆ మహిళ తన జుట్టును ఏ మాత్రం పట్టించుకోకున్నా.. ఇంతటి పరిమాణంలో పెరిగింది. జడలు కట్టి ఉన్న ఈ మహిళ పాదాలకు భక్తులు నమస్కారం చేస్తుంటారు. తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Meri Yamuna Ji (@meriyamunaji) సోషల్ మీడియోలో ఈ మహిళ తెగ వైరల్ అవుతోంది. ఆమె జుట్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు జుట్టుకు ఎలాంటి పోషణ చేయకున్నా.. ఇంతటి స్థాయిలో పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము ఆకారంలో జడ ఏర్పడటంతో ప్రణామాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా వింత కదా..! ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్