యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లికొడుకులు మృతి | Mother Son Flung Into Air As Scooter Collides With Car | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లికొడుకులు మృతి

Published Mon, Jul 22 2024 7:02 PM | Last Updated on Mon, Jul 22 2024 8:47 PM

Mother Son Flung Into Air As Scooter Collides With Car

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రాంగ్‌ రూట్‌లో వేగంగా దూసుకువచ్చిన కారు రోడ్డుపై వెళుతున్న ఓ స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. 

దీంతో స్కూటర్‌పై వెళుతున్న తల్లికొడుకులు రోడ్డుపై చాలా దూరం ఎగిరిపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. 

శనివారం(జులై 20) జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement