యూపీపై గురిపెట్టిన మోదీ! | With Eye On Uttar Pradesh Polls, PM Modi Picks Noida To Launch 'Stand Up India' | Sakshi
Sakshi News home page

యూపీపై గురిపెట్టిన మోదీ!

Published Tue, Apr 5 2016 2:26 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

With Eye On Uttar Pradesh Polls, PM Modi Picks Noida To Launch 'Stand Up India'

నోయిడా: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆ రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న దళితుల ఓట్లను సాధించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పావులు కదుపుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 80 పార్లమెంట్ స్థానాల్లో 71 సీట్లను సాధించిన బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం నోయిడాలో 'స్టాండప్ ఇండియా స్కీమ్'ను మోదీ ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దళిత మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడమే ఆ పథకం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు యూపీ దళిత ప్రజాప్రతినిధులు 17 మంది పాల్గొననున్నారు.

ఈ పథకంలో భాగంగా వ్యవసాయేతర రంగాలకు రూ. 10 లక్షల వరకు రుణంగా అందిచనున్నారు. పెట్టుబడిదారులకు రూపీ డెబిట్ కార్డులను ఇవ్వనున్నారు.  ఇందుకోసం చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సీఐడీబీఐ)కు రూ. 10వేల కోట్లను కేటాయించారు. అదేవిధంగా 5100 'ఈ-రిక్షాలు' అందించడానికి రిజిస్ట్రేషన్ కోసం 'ప్రధానమంత్రి ముద్రా యోజనా స్కీమ్' వెబ్‌సైట్ ను సైతం మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ రామ్ నాయక్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement