యోగా దివస్‌ పురస్కారాలు | Yoga Diwas Media Awards Presented To 30 Media Houses For Promoting Yoga | Sakshi
Sakshi News home page

యోగా దివస్‌ పురస్కారాలు

Jan 8 2020 4:35 AM | Updated on Jan 8 2020 4:35 AM

Yoga Diwas Media Awards Presented To 30 Media Houses For Promoting Yoga - Sakshi

జవదేకర్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంటున్న శైలజా సుమన్‌

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాకు ప్రాచుర్యం కల్పించినందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ‘అంతర్జాతీయ యోగా దివస్‌ మీడియా సమ్మాన్‌’పురస్కారాలను 30 మీడియా సంస్థలకు ప్రకటించింది. ఆ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఈ అవార్డులు అందజేశారు. రేడియో, టీవీ, ప్రింట్‌ మీడియా కేటగిరీల వారీగా మొత్తం 30 అవార్డులు అందజేశారు. రేడియో విభాగంలో ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రానికి ఈ అవార్డు దక్కింది. ఆకాశవాణి హైదరాబాద్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ మల్లాది శైలజా సుమన్‌ ఈ పురస్కారాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.

ప్రింట్‌ మీడియా విభాగంలో విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ‘సంచలన వార్త పత్రిక లీడర్‌’అనే తెలుగు వార్తా పత్రికకు ఈ అవార్డు లభించింది. ఈ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వి.వి.రమణమూర్తి.. మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ‘యోగా దివస్‌’కు సంబంధించిన వార్తా కథనాలు 15 రోజులపాటు ప్రచురించడం వల్ల ఈ ఘనత దక్కిందని రమణమూర్తి తెలిపారు. 40 ఏళ్ల కిందట అనకాపల్లి ఆంధ్రజ్యోతి విలేకరిగా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించానని, తాను స్థాపించిన ‘లీడర్‌’సాయంకాలం దినపత్రిక ఇటీవలే 20 ఏళ్ల ఉత్సవం జరుపుకుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement