రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక | YSR congress party MPS ys avinash reddy, Butta renuka meets sadananda gouda | Sakshi
Sakshi News home page

రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక

Published Tue, Jul 1 2014 10:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక

రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక

కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక మంగళవారం కలిశారు.

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక మంగళవారం కలిశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కడప, కర్నూలు జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని వారు ఈ సందర్బంగా రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా  పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై ఏడో తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎనిమిదో తేదీన రైల్వే బడ్జెట్ను రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు ...సదానంద గౌడను కలిసి జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భేటీ అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట్ల, నంద్యాల, కడప, బెంగళూరు రైల్వే మార్గాలను పునరుద్దరించాలని కోరామన్నారు. హైదరాబాద్-డోన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ను కడప వరకూ పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement