Butta Renuka
-
అక్రమ అరెస్టులపై బుట్టా రేణుక ఫైర్
-
నేడు నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక గురువారం ఉదయం 9.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ నాయకులు కోరారు. రేపు నామినేషన్ వేయనున్న సతీష్ కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న డా.ఆదిమూలపు సతీష్ రేపు(శుక్రవారం)నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు చిల్డ్రన్ పార్క్(ఎస్వీ కాంప్లెక్స్) దగ్గరకు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అక్కడి నుంచి వెళ్లి కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
జగన్ అంటే జనం.. జనం అంటే జగన్.. వై నాట్ 175..
-
సీఎం జగన్ గురించి బుట్టా రేణుక అదిరిపోయే స్పీచ్
-
గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను పట్టించుకోలేదు: బుట్టారేణుక
-
వైఎస్సార్సీపీ గొప్పతనం గురించి బుట్టా రేణుక ప్రసంగం
-
దళితులను గత ప్రభుత్వం మోసం చేసింది: బుట్టా రేణుక
-
ప్రతిపక్షం విమర్శలు అర్థరహితం
-
'అందుకే వికేంద్రీకరణ దిశగా అడుగులు'
సాక్షి, తాడేపల్లి : 'రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం' అనే అంశంపై వైసీపీ చేనేత విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి వైఎస్పార్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాలు నుంచి చేనేత వర్గం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'రైతు అన్నం పెడితే.. నాగరికత నేర్పిన వారు చేనేతలు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేతల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. నాడు దివంగత సీఎం వైఎస్ ఆర్ విద్య, వైద్యం పై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం మగ్గం కార్మికుల కుటుంబానికి రూ. 24 వేలు అందించి సీఎం జగన్ వారికి అండగా నిలిచారు. అర్హతలు సడలించి ఆరోగ్యశ్రీ పథకం కింద 2 వేలుపైగా రోగాలకు ఉచితంగా చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ వెనుకబడిన వర్గాలకు మేలు చేకూరుస్తుంది. వీలైనంత ఎక్కువ మందికి, అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. గత ప్రభుత్వం రూ. 3 లక్షలు 60 వేల కోట్లు అప్పులు చేసి పెట్టింది. ఆర్ధిక పరిస్థితి గాడిన పెట్టె దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో మీడియా కంటే..సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజధాని పేరుతో బినామీ కంపెనీలతో కలిసి చంద్రబాబు అమరావతిని దోచుకున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి పేరుతో ఒక భ్రమ సృష్టించారు. ఆయన కుమారుడు లోకేష్ ను గత ఎన్నికల్లో రాజధాని ప్రాంత ప్రజలు దారుణంగా ఓడించారు. రాజధాని పేరుతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి లక్ష తొమ్మిది వేల కోట్లు కేటాయించాలి. ఇది ఇప్పట్లో సాధ్యం కాదు.. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి. మూడు ప్రాంతాలు అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ నడుం బిగించారు. విశాఖపట్నం అంటే.. ఐఏఎస్ అధికారులు అంతా సమ్మతంగా ఉన్నారు. చేనేతలకు మరింత అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని' పేర్కొన్నారు. (రహస్యాలు లేవు.. ప్రజలకు అన్నీ తెలుసు: సజ్జల) కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. చేనేతలు అంటే చంద్రబాబు నిర్లక్ష్యం ఎక్కువని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత కార్మికులు 13 లక్షలు 50 వేల మంది ఉన్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి చేనేతకు 3శాతం అంటే 428 కోట్లు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలకు కేంద్రం కేటాయించదని గుర్తుచేశారు. అయితే ఏపీలో మాత్రం సీఎం జగన్ ఒక నేతన్న నేస్తం కింద రూ. 180 కోట్లు కేటాయించి చేనేతలు పట్ల ప్రేమాభిమానాలు చాటుకున్నారని అభిప్రాయపడ్డారు. వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో చేనేతలకు 25 మోసపూరిత హామీలు ఇచ్చి టీడీపీ మోసం చేసిందని, అలాగే రూ. వెయ్యికోట్ల రూపాయలు చేనేతలకు ఇస్తామని చెప్పి మాట తప్పారని వెల్లడించారు. చేనేత సహకార సొసైటీలను మరింత బలోపేతం చేయాలని, మగ్గం నేసే ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24వేలు అందచేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు.(విద్యుత్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) బుట్టా రేణుక మాట్లాడుతూ.. వికేంద్రీకరణ వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయం ప్రస్తావించిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేనేత హస్తం కింద 360 డిగ్రీల కోణంలో మ్యానిఫెస్టో రూపకల్పన చేసి నవరత్నాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ది చేయాలంటే లక్షల కోట్లు కావాలని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజధాని ప్రాంత ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు. -
బాబు నమ్మించి మోసం చేశారు: బుట్టా రేణుక
మంగళగిరి: రాష్ట్రంలోని చేనేతలను నమ్మించి మోసగించిన ఘనత చంద్రబాబుదేనని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ధ్వజమెత్తారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం చేనేత మహిళలను మభ్యపెట్టి మోసం చేసి అవమానించిన చంద్రబాబుకు రాష్ట్రంలోని నేతన్నలంతా తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత, చేతివృత్తుల సంఘాల నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బుట్టా రేణుక మాట్లాడుతూ జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించేలా ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎంత చెప్పినా బాబు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారంటే ఎంత నష్టం జరిగినా నిలబెట్టుకుంటారన్నారు. బీసీలకు 41 సీట్లు ఇవ్వడంతో పాటు తనకు ఇచ్చిన కర్నూలు ఎంపీ సీటు తాను పార్టీ మారినా మరో బీసీ పద్మశాలీయులకే ఇచ్చారు కానీ బాబులా మోసం చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలను మోసం చేసిన చంద్రబాబు, లోకేష్లకు బీసీలంతా ఐక్యంగా వైఎస్సార్సీపీకి అండగా నిలిచి మంగళగిరిలో చరిత్ర సృష్టించాలన్నారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పరిశ్రమ అభివృద్ధితో పాటు స్వర్ణకారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు నేత సంఘాల నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలైన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమలను పిలిచి టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేశారు. నేడు సంఘాల నేతలను గంటల తరబడి పడిగాపులు కాయించి అవమానించి చివరకు తన కుమారుడికి టిక్కెట్ ఇచ్చి బీసీలను అగౌరవపరచిన చంద్రబాబుకు బీసీల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ నేత దామర్ల కుబేరస్వామి, కాండ్రు శ్రీనివాసరావు, మాచర్ల సుధాకర్, దామర్ల ఉమామహేశ్వరరావు, ప్రగడ ఆదిసుదర్శనరావు, చింతక్రింది సాంబశివరావు, చింతకింది కనకయ్య, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు..అదే జోరు
సాక్షి, కర్నూలు : రాష్ట్ర తొలి రాజధానిగా గుర్తింపు పొందిన కర్నూలులో ఇప్పటివరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కర్నూలు లోక్సభ స్థానానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆభ్యర్థి హెచ్.సీతారామిరెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి కోట్ల విజయభాస్కర్రెడ్డి ఆరుసార్లు లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కర్నూలు లోక్సభ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మంత్రాలయం అసెంబ్లీ సెగ్మెంట్ కలిసింది. డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ కర్నూలు నుంచి విడిపోయి నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో భాగమైంది. అంతకుముందు రెండుసార్లు కోట్ల జయసూర్య ప్రకాష్రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కోట్ల జయసూర్య ప్రకాష్రెడ్డి, టీడీపీ తరఫున బీటీ నాయుడు, వైఎస్సార్ సీపీ తరఫున బుట్టా రేణుక పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిపై బుట్టా 44,131 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోట్ల జయసూర్య ప్రకాష్రెడ్డి టీడీపీ తరఫున, డాక్టర్ ఎస్.సంజీవకుమార్ వైఎస్సార్ సీపీ తరఫున ప్రస్తుతం బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు స్థానం వైఎస్సార్ సీపీ ఖాతాలోనే ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. బీసీలే అధికం రాయలసీమలో అనంతపురం జిల్లా తరువాత బీసీలు అత్యధికంగా ఉన్నది కర్నూలు జిల్లాలోనే. ముఖ్యంగా, కర్నూలు పార్లమెంటరీ పరిధిలో అధిక శాతం బీసీ కులాలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే ఈ పార్లమెంట్ స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపారు. టీడీపీ బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తోంది. సీట్ల కేటాయింపులో మాత్రం వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. డాక్టర్ శింగరి సంజీవకుమార్ (వైఎస్సార్ సీపీ) సానుకూల అంశాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం. బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఉండటం. ప్రముఖ వైద్యునిగా గుర్తింపు పొందటం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం. ప్రతి అంశంపై సూటిగా, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడగలగటం. పోటీ పరీక్షలకు వెళ్లే వందలాది యువతకు ఉచితంగా కోచింగ్ ఇప్పించి, ఉద్యోగాలు పొందేలా ప్రోత్సాహం అందించటం. పేదలకు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి.. పెళ్లిళ్లకు సహాయం అందించటం. జిల్లాలో వైఎస్సార్ సీపీ క్యాడర్ బాగా కలిసిరావటం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్పై చెక్కు చెదరని ప్రజాభిమానం, వైఎస్ జగన్పై ప్రజలకు నమ్మకం ఉండటం. కోట్ల జయసూర్య ప్రకాష్రెడ్డి (టీడీపీ) సానుకూలాంశాలు : కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటం. మాజీ ఎంపీ కావటం. కేంద్ర మంత్రిగా పనిచేయటం. ఆర్థికంగా స్థితిమంతుడు కావటం. బలహీనతలు : ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లో ఉండి ఇటీవల టీడీపీలో చేరడం.రాజకీయంగా గుర్తింపు పొంది కూడా ప్రజాసమస్యలు పరిష్కరించకపోవడం. కేంద్ర మంత్రిగా పనిచేసినా కరువు నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. సాగునీటి ప్రాజెక్టుల కోసం పట్టించుకోకపోవటం. సొంత నియోజకవర్గమైన కోడుమూరు ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాçశ్వత పరిష్కారం చేయకపోవడం. అనుచరుల అరాచకాలు, హత్యలు చేశారనే అపనిందలు. రాజకీయంగా విరోధం గల వ్యక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం. కుటుంబ సభ్యులు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కోట్ల హర్షవర్దన్రెడ్డి వేర్వేరు పార్టీల్లో ఉండటం. ఇది ‘రాజు’ల కోటనే.. ఆ పాంత్రంలో ముగ్గురు మినహా అంతా ‘రాజు’లే పరిపాలిస్తున్నారు. అందుకే అది ‘రాజు’ల కోటగా భావిస్తారు. అంటే, ఉండి నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులంతా పేరు చివర రాజు అని ఉన్నవారే.. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వి.శివరామరాజు, పాతపాటి సర్రాజు, కె. రామచంద్రరాజు, గోకరాజు రంగరాజు, జి. జగన్నాధరాజు, డి. నారాయణ రాజు అందరి పేర్లలో రాజు ఉండటం గమనార్హం. 1962 లో కె. కుసుమేశ్వరరావు గెలవగా ఆయన మరణాంతం ఆతని భార్య పోటీ చేసి గెలుపొందారు. 1972లో డి. పేరయ్య గెలిచారు. కోర్టు తీర్పుతో ఎన్నికైన దొర సాలూరు నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కోర్టు తీర్పు ద్వారా ఎన్నికైన రాజన్నదొర వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడే విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీలు.. వైఎస్పార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, పి.ఎస్.పి, కె.ఎల్.పి, స్వతంత్ర అభ్యర్థులను పోటీలో గెలిపించి, ప్రజలు కూడా ఎన్నికల్లో వైవిధ్యతను చాటారు. 2004లో సాలూరులో టీడీపీ అభ్యర్థి భంజ్దేవ్ గెలుపొందగా, ఇతను ఎస్టీ కాదని రాజన్నదొర కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేశారు. తత్ఫలితంగా రాజన్నదొరనే గెలిచిన అభ్యర్థిగా కోర్టు ప్రకటించింది. అనంతరం భంజ్దేవ్ గిరిజనుడిగానే నిర్ధారణ కావడంతో ఆయన తిరిగి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. మొత్తం ఓటర్లు : 14,22,542 పురుషులు : 7,12,160 మహిళలు : 7,10,209 ఇతరులు : 173 – కె.రామకృష్ణ, కర్నూలు -
చెక్కులతో చేతులు దులుపుకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘పసుపు కుంకుమ’ పథకం పేరుతో మహిళలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నించారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మహిళలను మభ్యపెట్టేందుకు ఈ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు దళితులకు దక్కాల్సిన 2137.66 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల్ని పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. తీరా లబ్ధిదారులు వెళ్లే సరికి ఖాళీ చెక్కులను ఇచ్చి చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకున్నారు. ఈ పథకంపై సొంత పార్టీ నేతలే తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆర్కే రోజా, వాసిరెడ్డి పద్మా, బుట్టా రేణుకా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
లోకేశ్ ప్రకటించిన ‘ఆ ఇద్దరి’ స్థానాలూ హుళక్కే!
అది 2018 జులై...మంత్రి లోకేశ్ (చినబాబు) కర్నూలు వస్తున్నారని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బుట్టా రేణుక, ఎస్వీ మోహన్రెడ్డి తెగ హడావుడి చేశారు. నారావారి రాజకీయ వారసుడి కరుణా కటాక్షాల కోసం తాపత్రయ పడ్డారు. పెద్ద వేదిక వేసి, జన సమీకరణ చేసి ‘మా రాజువి నీవయ్యా’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దాంతో చినబాబు మురిసిపోయి ‘ముగాంబో ఖుష్ హువా’ అన్నట్లుగా పోజు పెట్టారు. అదే ఊపులో ఇంకాస్త ముందుకెళ్లి ఎక్కడికో వెళ్లిపోయి ‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్రెడ్డి పోటీ చేస్తారని’ ప్రకటించేశారు. ఇంకేముంది...నారా వంశ కిశోరం ప్రకటించిన తొలి అభ్యర్థులం తామే కాబట్టి సంబరపడ్డారు. తరువాత 9 నెలలు గడిచాయి.. ఎన్నికల తరుణం వచ్చింది. చంద్రబాబు నుంచి మాటాముచ్చట లేదు. లోకేశ్ నుంచి ఉలుకుపలుకు లేదు. చినబాబు తమకు టికెట్లు ప్రకటించారని గుర్తుచేసినా పెదబాబు పెదవి విప్పలే. వైఎస్సార్సీపీ తరపున గెలిచినా... మీ ప్రలోభాలకు లొంగి వచ్చామన్నా పట్టించుకోలేదు. తాను జీవితంలో ఎప్పుడూ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని, అసలది తమ డిక్షనరీలోనే లేదన్నట్లు చంద్రబాబు మనసులో ఓ చిన్న నవ్వు నవ్వారు. తన గురించి తెలిసీ నమ్మి రావడం మీ తప్పే అన్నట్లు ఓ చూపు చూశారు. చివరగా బుట్టా, ఎస్వీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. మీ వారసుడు లోకేశ్ ‘తొలిసారి ప్రకటించిన అభ్యర్థులం మేము... మీరు కాదనడానికి లేదు కదా’ అని పరోక్షంగా చెప్పారు. కానీ, అక్కడ ఉన్నది చంద్రబాబు. కమిట్మెంట్లు, సెంటిమెంట్లు ఏమాత్రం లేని ఆయన ‘నా లెక్కలు నాకుంటాయి. మీ తిప్పలు మీరు పడండని’ చెప్పేశారు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసే కోట్ల, టీజీ కుటుంబాలతో డీల్ సెట్ చేసుకున్నారు. కర్నూలు ఎంపీ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి, ఎమ్మెల్యే టికెట్ టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్కు ఇస్తామని సంకేతాలిచ్చారు. విషయం అర్ధమైన బుట్టా రేణుక మూడ్రోజుల క్రితం మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఎస్వీ మోహన్రెడ్డి మాత్రం దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు, లోకేశ్లను ప్రాధేయపడ్డారు. ఈయన భయపడినంతా అయింది. ఎస్వీ మోహన్రెడ్డికి కూడా బాబు ఝలక్ ఇచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీజీ భరత్ను ఎంపిక చేశారు. మోసపోయానని తెలిసిన మోహన్రెడ్డి హతాశుడయ్యారు. ఐదేళ్ల క్రితం తనకు పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేసిన ద్రోహం గుర్తుకొచ్చి ఆయన మనసు కకావికలమైంది. మరంతేమరి... ‘చంద్రబాబు మాట మీద నిలబడరని అందరికీ తెలుసు. చినబాబైనా అలా చేయరని ఆశించాం. ఆయనకూ మాట ఇవ్వడమే తప్ప నిలబెట్టుకోవడం చేత కాదని తెలిసిందని’ ఎస్వీ మోహన్రెడ్డి లబోదిబోమంటున్నారు. మరోవైపు బుట్టా రేణుక, ఎస్వీ మోహన్రెడ్డిలకు టికెట్లు దక్కకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ‘మనవాడు నాలుక మామూలుది కాదు. ఐరన్ టంగ్. ఏదైనా చెబితే అది అయ్యేదే లేదు. అదే మరి లోకేశ్ అంటే!’ అంటూ జోకులు పేలుస్తున్నారు. – వడ్డాది శ్రీనివాస్,సాక్షి , అమరావతి -
తప్పు చేశా, శిక్ష కూడా అనుభవించా: బుట్టా రేణుక
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆమె శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ.. దూరం నుంచి చూస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయని, ఆ భ్రమలో తాను పెద్ద తప్పు చేశానన్నారు. అలాగే తాను కూడా టీడీపీలో అలాంటి అనుభవమే ఎదురైందన్నారు. చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల పార్టీ మారి పొరపాటు చేశానని, దానికి శిక్ష కూడా అనుభవించానని ఆమె అన్నారు. ఇప్పుడు వాస్తవాలను గ్రహించానని, తనకు ఎక్కడ గౌరవం ఉంది? ఎక్కడ మంచి స్థానం ఉందనే విషయం ఇప్పుడు తెలిసిందన్నారు. ఒక మహిళగా, బీసీ నాయకురాలిగా తనకు వైఎస్సార్ సీపీలో మంచి గౌరవం దొరికేదన్నారు. చదవండి...(వైఎస్సార్ సీపీలోకి బుట్టా రేణుక, మాగుంట) టీడీపీ విలువలు లేని పార్టీ టీడీపీలో తనను మానసికంగా వేధించారని, టీడీపీ అధిష్టానం చెప్పే మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల సీట్లను కూడా అగ్ర కులాలకు ఇస్తున్నారని మండిపడ్డారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీ మహిళ అయిన తనను అవమానించారన్నారు. కర్నూలు బీసీ సిట్టింగ్ సీట్లు కూడా అగ్రకులాలకే ఇచ్చారని విమర్శించారు. టీడీపీ విలువలు లేని పార్టీ అని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందని బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీలో ఉన్న పారదర్శకత, స్పష్టత టీడీపీలో లేవని, అవన్నీ మాటలకే పరిమితమన్నారు. తాను రాకీయాలకు కొత్త అయినా, రెండు పార్టీల్లో ఎంతో అనుభవం వచ్చిందన్నారు. ఏదో ఆశించి మాత్రం తాను ఇప్పుడు పార్టీలో చేరలేదని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపుకు తనవంతు కృషి చేస్తానని బుట్టా రేణుక అన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి బుట్టా రేణుక
-
వైఎస్సార్ సీపీలోకి బుట్టా రేణుక, మాగుంట
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కండువాలు కప్పి బుట్టా రేణుక, మాగుంటను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయన కుమారుడు జగన్ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చదవండి....(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు) మరోవైపు బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు లేకుండా వైఎస్సార్ సీపీలో చేరినట్లు చెప్పారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆమె తెలిపారు. పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామని బుట్టా రేణుకా పేర్కొన్నారు. మళ్లీ తనను పార్టీలోకి తీసుకున్నందుకు వైఎస్ జగన్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి, 2014లో మార్కాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాంసుబ్బారెడ్డి కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. ఏలూరు రామచంద్రారెడ్డి ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం వైఎస్ జగన్తోనే సాధ్యం అవుతుందన్నారు. ఆ నమ్మకంతోనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా ఇవాళ పార్టీలో చేరిన విషయం విదితమే. వైఎస్సార్సీపీలో చేరిన వాళ్లు 1.కర్నూలు ఎంపి బుట్టా రేణుక 2. మాగుంట శ్రీనివాసులు రెడ్డి 3. ఆదాల ప్రభాకర్ రెడ్డి 4. మాజీ మంత్రి గూడూరు నియోజక వర్గం బల్లి దుర్గా ప్రసాద్ 5. మాజీ ఎమ్మెల్యే వంగా గీత 6. తాడి శకుంతల విజయవాడ మాజీ మేయర్ 7. భూమా అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి 8. దారా సాంబయ్య సంత నూతల పాడు, ఆయన కుమార్తె కూడా వచ్చారు 9. డాక్టర్ రాంచంద్రారెడ్డి అలాగే కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ జగన్ను కలిశారు. -
గోడ దూకితే.. గోడు మిగిలింది!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. తర్వాత అధికార పార్టీ ప్రలోభాలకు ఆశపడి టీడీపీలోకి వెళ్లిన నేతలకు ప్రస్తుతం ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు రోజుల తరబడి ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో సదరు నేతలు అసహనానికి గురవుతున్నారు. తన టికెట్ విషయంలో మొదట్లో ధైర్యంగా ఉన్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చివరకు దక్కదన్న సంకేతాలతో నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. మరోవైపు కొడుకు టికెట్ కోసం ఎంపీ టీజీ వెంకటేష్ కూడా రెండు రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ సీటు వ్యవహారం నేడు తేల్చే అవకాశముంది. ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యరీత్యా ఎక్కువ సమయం వేచి ఉండలేని స్థితిలోనూ తనకు ఎంపీ టికెట్ లేదా కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరేందుకు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు సర్వే ద్వారా టికెట్లు ఇస్తామని రెడీమేడ్ సమాధానం ఇవ్వడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొదట్లో ఎంపీగానే పోటీ చేస్తానని భీష్మించుకున్న ఆమె.. చివరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఫరవాలేదన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా సమీక్షల సందర్భంగానూ పిలుపు రాకపోవడంతో ఆమె మదనపడిపోతున్నారు. పైగా ఆదోని సీటును మీనాక్షి నాయుడికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అసలు ఊసులోనే లేకుండా పోయారు. నంద్యాల సీటు విషయంలోనూ అదే మడతపేచీ కొనసాగుతోంది. మొత్తంగా పార్టీ మారిన నేతలంతా ప్రస్తుతం తమకు జరుగుతున్న ‘మర్యాద’ను తలచుకుని లోలోపల కుంగిపోతున్నారు. అయ్యో..ఎస్పీవై! నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా మారింది. తనకు ఎంపీ సీటు ఇస్తారన్న ఆశ ఉందని పైకి అంటున్నప్పటికీ..ఖర్చు విషయాన్ని ముందుకు పెట్టి సీటు నిరాకరిస్తున్నారని లోలోపల వాపోతున్నారు. నంద్యాల ఎంపీ టికెట్ కావాలంటే ఖర్చుల కోసం రూ.60 కోట్లు చూపించాలని టీడీపీ పెద్దలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము అంత మొత్తాన్ని చూపించలేమనే ఉద్దేశంతోనే కావాలని ఇలా అడుగుతున్నారని ఎస్పీవై వాపోతున్నారు. సీటు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకోవడంతో ఈ విధంగా చేశారని అంటున్నారు. పార్టీ మారే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ మీ కుటుంబానికే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మదనపడిపోతున్నారు. చివరకు ఇంత వయస్సులో.. ఆరోగ్యం సహకరించనప్పటికీ గంటల తరబడి వేచిచూస్తే సర్వే ద్వారా తేల్చుతామని ప్రకటించడంతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోలేదని తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కనీసం పిలవడం కానీ, సీటు విషయం మాట్లాడటం కానీ చేయలేదని సమాచారం. అలాగే కోడుమూరు ఇన్చార్జ్గా వ్యవహరించిన విష్ణువర్దన్రెడ్డిని కనీసం పలకరించే ప్రయత్నం కూడా పార్టీ నేతలెవ్వరూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన నేతలంతా చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని చూసి తమను తామే తిట్టుకుంటున్నారు. కర్నూలు సీటుపై పీటముడి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మొన్నటివరకు సీటు తనదేనని బల్లగుద్ది మరీ వాదించేవారు. పార్టీ సభ్యత్వం మొదలుకుని.. పార్టీ కమిటీల వరకూ అన్నీ తమకే అప్పగించారని పేర్కొనేవారు. తమను కాదని సీటు వేరేవారికి ఎలా ఇస్తారని గాంభీర్యంగానూ ప్రకటించేవారు. అయితే.. నాలుగు రోజులుగా టీజీ భరత్కు సీటిచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో ఎస్వీ నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. దీంతో రోజూ గంటల తరబడి వేచిచూసి.. వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మోహన్రెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి పదవి నుంచి చంద్రబాబు అకారణంగా తప్పించిన విషయాన్ని ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు రాజకీయ కపట నాటకాన్ని తలచుకుంటూ నేతలు కుంగిపోతున్నారు. -
సీఎం మీటింగ్కి సిట్టింగ్ ఎంపీ డుమ్మా
సాక్షి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలుపొంది, ఆ తరువాత టీడీపీ గూటికి చేరిన బుట్టా రేణుక పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. టికెట్ హామీతో టీడీపీలో చేరిన బుట్టాకు తాజాగా కేంద్ర మాజీమంత్రి కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డి చేరికతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపిణీలో తనకు తగుస్థానం కల్పించడంలేదంటూ గతకొంత కాలంగా ఆమె పార్టీ కార్యాకలపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. (నా పరిస్థితేంటి?!) ఈ నేపథ్యంలో శనివారం కర్నూలు జిల్లాలోని కోడుమూరులో జరిగిన సీఎం చంద్రబాబు సభకు బుట్టా డుమ్మా కొట్టారు. దీంతో బుట్టా రేణుకా పార్టీ మారుతారనే ఊహాగానాలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆమె కర్నూలు లోక్సభ స్థానుంచి తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ సూర్య ప్రకాష్ ఎంట్రీతో రేణుకను పక్కనబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఎంటా అని ఆమె సతమవుతున్నారు. మరోవైపు కర్నూలులో కేయి, కోట్ల వర్గీయుల విభేదాలు భయపడపడుతున్న విషయం తెలిసిందే. -
ఐదేళ్లుగా మా ఊరికి ఏం చేశారు ?
కర్నూలు, సి.బెళగల్: ‘మా ఊరిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఐదేళ్లుగా మీ వెంట తిరుగుతున్నా పట్టించుకోలేదు. సమస్యలు తీర్చనప్పుడు మా ఊరికి ఎందుకొచ్చారం’టూ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను సి.బెళగల్ ఎస్సీ కాలనీ వాసులు నిలదీశారు. ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైను పనులను ప్రారంభించేందుకు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డితో కలిసి బుధవారం ఆమె ఎస్సీ కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు దేవదానం, నాగేష్, మిరపకాయల మారెప్ప తదితరులు కాలనీ సమస్యలపై ఎంపీని ప్రశ్నించారు. ఇంటింటికీ కుళాయి అని చెప్పి.. టీడీపీ కార్యకర్తల ఇళ్లకే ఇస్తున్నారు. కాలనీలో వీధిరోడ్లు బాగుచేయాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కాళ్లు అరిగేలా మీ వెంట తిరిగితే మీరేం చేశారని ఎంపీని నిలదీశారు. అభివృద్ధి పేరుతో మీరు వైఎస్ఆర్సీపీని వీడారని.. మరి మీరు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఎంపీని సూటిగా ప్రశ్నించారు. మీ అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందిస్తే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిధిలోని నిధులను తాగునీటికి కేటాయించానని, ఏవైనా సమస్యలుంటే ఎమ్మెల్యేతో చేయించుకోవాలంటూ స్థానిక ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆగ్రహించిన ఎస్సీ కాలనీవాసులు తమ సమస్యలు తీర్చకుంటే కాలనీకి రావద్దంటూ నినాదాలు చేశారు. దూరంగా ఎంపీపీ: ఎంపీ బుట్టారేణుక పర్యటనకు ఎంపీపీ నాగమనెమ్మ, స్థానిక ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు, కార్యకర్తలు, అభిమానులు దూరంగా ఉన్నారు. పట్టుమని పదిమంది కూడా ఎంపీ వెంట కనిపించలేదు. -
నా పరిస్థితేంటి?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. కర్నూలు పార్లమెంట్ సీటును కోట్లకు కేటాయించే అవకాశముంది. దీంతో తన పరిస్థితి ఏమిటంటూ బుట్టా రేణుక నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. ఇంకా సీట్ల విషయం ఖరారు కాలేదని పేర్కొన్న సీఎం.. వాటి గురించి తర్వాత మాట్లాడదామంటూ ముక్తసరిగా ఫోన్ సంభాషణ ముగించినట్టు సమాచారం. దీంతో ఆమె మరింతగా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. కాగా.. బుట్టా పార్టీ మారేటప్పుడు టీడీపీలోఎంతో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా తిరిగి ఎంపీ సీటు కేటాయిస్తామని చెప్పారని ఆమె వర్గీయులు అంటున్నారు. స్వయంగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటన సందర్భంగా ఎంపీగా బుట్టాను తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ‘జయహో బీసీ’ అని నినదిస్తూనే ఒక బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని అధికార టీడీపీ వైఖరిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎలా వెళతాం! వాస్తవానికి బుట్టా రేణుక రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ఆమెను గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీకి ఉన్న బలంతో ఆమె ఎంపీగా గెలిచారు. తీరా గెలిచిన తర్వాత ఆమె భర్త తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె మాత్రం వైఎస్సార్సీపీలో కొనసాగారు. అయితే, టీడీపీ ఆకర్ష్ పథకంలో భాగంగా రూ.50 కోట్ల నగదుతో పాటు ఆమె పాఠశాలకు అమరావతిలో భూ కేటాయింపునకు హామీ పొందారు. తీరా టీడీపీలో చేరిన తర్వాత ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ సీటు కూడా లేకుండా పోతోంది. అయితే.. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఆశతో వర్గీయులు ఉన్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి మంత్రి లోకేష్ అండదండలున్నాయి. దీంతో ఆయనకే టికెట్ ఇస్తారని అంటున్నారు. ఫలితంగా రెంటింకీ చెడ్డ రేవడిలా బుట్టా పరిస్థితి తయారైంది. ఇదే తరుణంలో బీసీ మహిళకు టీడీపీ అన్యాయం చేసిందన్న అభిప్రాయాన్ని బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ వైఖరిపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పెద్దన్నగా పిలవబడే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి కనీసం కోట్ల చేరికపై సమాచారం కూడా లేకపోవడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మౌనంగా కేఈ వర్గం జిల్లాలో మొదటి నుంచి కోట్ల, కేఈ కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇరువర్గాలకు చెందిన అనేక మంది నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్కు బలైపోయారు. గ్రామాల వారీగా వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు కోట్ల టీడీపీలో చేరనుండడంతో కేఈ వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచి రాజకీయ వైరుధ్యంతో ఉన్న కోట్లతో ఎలా సర్దుకుపోతామంటూ పార్టీ వైఖరిపై ఆగ్రహిస్తున్నారు. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా గుమ్మనంగా స్పందించారు. కోట్ల చేరికపై తనకు సమాచారం లేదన్నారు. అంతేకాకుండా తమ సీటు అడిగితే అప్పుడు స్పందిస్తానని పరోక్షంగా సంకేతాలు పంపారు. మొత్తమ్మీద ప్రస్తుత పరిణామాలను కేఈ వర్గం సునిశితంగా గమనిస్తోంది. కోట్లకు ఏయే సీట్లు ఇవ్వనున్నారనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ పూర్తిస్థాయి స్పందన తెలియజేయాలని భావిస్తున్నారు. -
బుట్టా.. పయనమెట్టా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు రాజకీయం కాస్తా జిల్లాలో నేతల బుర్రలను హీటెక్కిస్తోంది. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొత్తు కుదిరితే కర్నూలు ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డికి టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే మళ్లీ ఎంపీగానే బరిలో ఉండాలని కలలు కంటున్న సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు సీటు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడనుంది. అప్పుడామె పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. సీటు రాకుండా చేసే యత్నాలు కర్నూలు నగర పాలక సంస్థలో జరుగుతున్న పనుల విషయంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డితో బుట్టా రేణుక ఢీ కొంటున్నారు. తనకు కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని బహిరంగంగానే మండిపడిన బుట్టా రేణుక.. కార్పొరేషన్లోఅవినీతి వ్యవహారాలపైనా దృష్టి పెట్టారు. వాటిపై విచారణ జరపాలంటూ ఏకంగా విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. కమిషనర్ను బదిలీ చేయించేందుకు కూడా ఆమె ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుట్టా వ్యవహారశైలిపై ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డితో పాటు పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్రెడ్డి కూడా మండిపడుతున్నారు. వీరు ఏకంగా ఆమెకు సీటు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో పొత్తు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఉంటారని ఎమ్మెల్యే వర్గం ప్రచారం చేస్తోంది. అయితే..అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా లేరు. అయినప్పటికీ బుట్టాకు ఎంపీ సీటు రాదని, ఎమ్మెల్యేగానే బరిలో ఉంటారని ఎస్వీ వర్గం భారీఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ వ్యవహారం కూడా ఇరు వర్గాల మధ్య మరింత అగ్గి రాజేస్తోంది. ఇప్పుడేమంటారో! వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తును టీడీపీలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి లాంటి వారు ఒక అడుగు ముందుకేసి.. కాంగ్రెస్ దరిద్రం తమకెందుకని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే డోన్ అసెంబ్లీ సీటును తాము వదులుకోవాల్సి వస్తుందనే భావనలో కేఈ వర్గం ఉంది. అంతేకాకుండా మొదటి నుంచి ఇరు వర్గాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. ఇప్పుడు కలిసి పనిచేద్దామంటే పైస్థాయిలో అంగీకరించినప్పటికీ కింది స్థాయి కేడర్ మాత్రం మండిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీడీపీతో పొత్తును కాంగ్రెస్ పార్టీలోని నేతలు కూడా అంగీకరించడం లేదు. ఇదిలా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏకంగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలవడంతో పాటు ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని ప్రకటించారు. టీడీపీతో పొత్తు కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మున్ముందు కూడా కొనసాగుతుందని వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. అంటే రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని అర్థమవుతోంది. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ, కోట్ల ఏమంటారో వేచిచూడాల్సిందే! -
కమీషన్ల రగడ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ సాక్షిగా అధికార పార్టీలో కమీషన్ల కొట్లాట మొదలైంది. కార్పొరేషన్ పరిధిలో టెండర్ల వ్యవహారమంతా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాత్రమే చూస్తున్నారని, ఎవ్వరినీ తలదూర్చనీయడం లేదని కొన్నాళ్ల క్రితం అధికార పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక వర్గం లోలోన మండిపడుతోంది. ఈ క్రమంలోనే ప్రొటోకాల్ ఉల్లంఘన అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కార్పొరేషన్లో టెండర్ల వ్యవహారాలను ఎమ్మెల్యే ఏకపక్షంగా నడుపుతున్నారు. ప్రతి పని ఆయన చెప్పిన మనుషులకే దక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అమృత్ పథకం పనులను కూడా ఎమ్మెల్యే వర్గీయులే చేస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం మొదలు డ్రైనేజీ పనుల వరకు.. చివరకు చెత్త సేకరణ కాంట్రాక్ట్ కూడా వారే తీసుకున్నారు. ఎంపీ బుట్టా రేణుకకు కనీసం పనుల సమాచారం కూడా ఇవ్వడం లేదన్నది ఆమె వర్గీయుల వాదన. ఈ నేపథ్యంలోనే ప్రొటోకాల్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. మునిసిపల్ కమిషనర్ హరినాథరెడ్డిపలు ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఎంపీ బుట్టా జిల్లా కలెక్టర్తో పాటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అనేక నిబంధనలను కూడా పేర్కొంటూ మరీ కమిషనర్పై మండిపడుతున్నారు. వాస్తవానికి కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ పనుల్లో ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తే ఇంత రచ్చకు దారితీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవ్వరూ వేలు పెట్టొద్దు! కార్పొరేషన్ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అధికార పార్టీ నేతలే మండిపడుతున్నారు. గతంలో కార్పొరేషన్ టెండర్ల వ్యవహారాలు కేఈ కుమార్ చూసేవారు. అయితే, ఎమ్మెల్యే ఎస్వీ పార్టీ మారిన తర్వాత కేఈ కుటుంబం నుంచి పూర్తిగా తప్పించారు. ఇందుకోసం ఫిర్యాదులు చేసి మరీ కేఈ కుటుంబ పెత్తనం లేకుండా చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెప్పిన వారికి కాకుండా వేరే వారికి కాంట్రాక్టులు దక్కే పక్షంలో ఏకంగా టెండర్లనే రద్దు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ కింద మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్ల వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే ఎటూ తేల్చడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరే కాంట్రాక్టర్కు పనులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ టెండర్ను రద్దు చేయించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం కూడా ఎంపీ బుట్టా వద్దకు వెళ్లినట్టు సమాచారం. తమ వారికి ఒక్క పని కూడా ఇవ్వడం లేదని బుట్టా వర్గీయులు వాపోతున్నారు. అశోక్నగర్ పంపుహౌస్ వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ కోసం స్థల కేటాయింపుతో మునిసిపల్ కమిషనర్, ఎంపీ వర్గీయుల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇచ్చారని, తమకు కనీస సమాచారం లేదని వారు మండిపడుతున్నారు. పైగా కమిషనర్.. ఎమ్మెల్యే చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో కార్యక్రమాల నిర్వహణ విషయంలోనూ ఎంపీగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ఎంపీ బుట్టా ఫిర్యాదు చేశారు. -
టీడీపీ , బీజేపీ కుమ్మక్కుకు నిదర్శనమిదే
-
‘బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయి’
-
‘బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయి’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా హోదా కోసం టీడీపీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేదో ప్రజల సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఆవ్వానించడం నిబంధనలకు విరుద్దమైన చర్య అని మండిపడ్డారు. బుట్టా రేణుకను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంలోనే టీడీపీ-బీజేపీ కుమ్మకైన విషయం వెల్లడైందని పేర్కొన్నారు. -
లోకేశ్ వ్యాఖ్యలతో కర్నూలు టీడీపీలో కలకలం
-
లోకేశ్కు విద్యార్థి సంఘాల సెగ
-
లోకేశ్ వ్యాఖ్యలు.. టీడీపీలో అలజడి
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ‘ప్రత్యేకత’ చాటుకున్నారు. ఈసారి సొంత పార్టీ నాయకులనే గందరగోళంలో పడేశారు. బహిరంగ వేదికలపై నోటికొచ్చినట్టు మాట్లాడి నవ్వులపాలు కావడం ‘చినబాబు’కు ముందునుంచి అలవాటు. తాజాగా కర్నూలులోనూ ఇదే విన్యాసాన్ని పునరావృతం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలోనే దుమారం రేపాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం లోకేశ్ సోమవారం కర్నూలు జిల్లాకు వచ్చారు. వచ్చిరాగానే తన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులను అయోమయంలోకి నెట్టారు. కర్నూలు జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఎంపీగా బుట్టా రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. లోకేశ్ వ్యాఖ్యలకు వేదికపై ఉన్న టీజీ వెంకటేష్ సహా అంతా నిశ్చేష్టులయ్యారు. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం టీజీ వెంకటేష్, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గాల కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. తన కుమారుడు టీజీ భరత్కు ఎలాగైనా ఈ సీటు ఇప్పించాలని టీజీ వెంకటేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉరుములేని పిడుగులా వచ్చి లోకేశ్ ప్రకటన చేయడంతో టీజీ వర్గం అవాక్కైంది. హడావుడిగా ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని టీజీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫిరాయింపుదారులైన ఎస్వీ మోహన్రెడ్డి, బుట్టా రేణుకలకు టిక్కెట్లు ఎలా ఇస్తారని తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతారా అని వాపోతున్నారు. ఎవరి మద్దతు ఇవ్వాలో తెలియక టీడీపీ కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. లోకేశ్కు విద్యార్థి సంఘాల సెగ మెడికల్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద నారా లోకేశ్ కాన్వాయ్ను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం కోసం మంత్రి వద్దకు వస్తే పోలీసులు దురుసుగా వ్యవహరించారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
బుట్టా రేణుకకు చేదు అనుభవం!
సాక్షి, కర్నూలు : గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఓ వైపు పార్టీ మారడంతో ప్రజా మద్దతు కోల్పోయిన బుట్టా రేణుకకు టీడీపీ నేతల నుంచీ అలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. టీడీపీలో చేరిన ఆమెకు పార్టీ నేతలు సహకారం అందడం లేదన్నట్లు కనిపిస్తోంది. ఎంపీ నిధుల కింద మంజూరైన మినీ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి బుట్టా రేణుక ఎమ్మిగనూరుకు వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ఒక్క టీడీపీ నేత కూడా హాజరు కాకపోవడంతో షాకవ్వడం ఆమె వంతు అయింది. దీంతో కేవలం బుట్టా రేణుక ఒక్కరే కార్యక్రమంలో పాల్గొని.. త్వరత్వరగా తన పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. -
ఎమ్మిగనూరులో ఎమైంది?
-
వీరిద్దరూ ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఎంపీలు తమ ఆందోళనలతో ఉభయ సభలను హోరెత్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇద్దరు మహిళా ఎంపీలు మాత్రం ఎక్కడా కనబడటం లేదు. వారిద్దరూ బుట్టా రేణుక, కొత్తపల్లి గీత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వీరిద్దరూ వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత అధికార టీడీపీలోకి ఫిరాయించారు. తాజాగా పార్లమెంట్లో ఏపీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేస్తున్నా వీరు మాత్రం తమ సీట్లను వదిలిరావడం లేదు. పార్లమెంట్ వెలుపల, బయటా సాగించిన నిరసన కార్యక్రమాల్లోనూ కనబడలేదు. కారణం అదేనా? టీడీపీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టకపోవడానికి అనర్హత భయమే అన్న వాదన విన్పిస్తోంది. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే రాష్ట్రపతికి, లోక్సభ స్పీకర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలతో కలిసి కనబడితే పదవికి ముప్పురావచ్చన్న భయంతో మహిళా ఎంపీలిద్దరూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వినికిడి. కేంద్ర బడ్జెట్పై పార్లమెంట్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో నిర్వహించిన టీడీపీ ఎంపీల సమావేశానికి హాజరైన రేణుక.. లోక్సభలో నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండటం గమనార్హం. బాబు డ్రామా ! ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇంతకుముందు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఇలాంటి డ్రామానే నడిపారని గుర్తు చేసింది. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పేర్లను వైఎస్సార్సీపీలో కొనసాగతున్నట్టుగా చూపించి అసెంబ్లీ సమావేశాల ఉత్తర్వులను విడుదల చేశారని వివరించారు. అసెంబ్లీలో తాము లేకున్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సభను నడిపిన విషయాన్ని వెల్లడించింది. సుజనా, అశోక్ వెనుకంజ కేంద్రానికి వ్యతిరేకంగా సాగిస్తున్న నిరసనల్లో కేంద్ర మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తాము నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే తమ పదవులకు ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుందన్న భయంతోనే వీరిద్దరూ వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీకి న్యాయం చేయలేమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసినా పదవులు పట్టుకుని ఎందుకు వేళాడుతున్నారని వీరిని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రానికి న్యాయం చేయలేనప్పుడు కేంద్ర పదవులు ఎందుకని నిలదీస్తున్నాయి. -
ఆ నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్కు విన్నవించింది. రాజ్యసభ చైర్మన్ ఇటీవల అనర్హత పిటిషన్లపై 90 రోజుల్లోపే పరిష్కరించిన రీతిలో తమ పిటిషన్లను పరిష్కరించాలని విన్నవించింది. ఈ మేరకు పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఇక్కడ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఒక లేఖ ఇచ్చారు. ‘స్పీకర్ కార్యాలయంపై మాకు అపారమైన గౌరవం ఉంది. అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలన్న మా విన్నపాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో నంద్యాల నుంచి మా పార్టీ టికెట్పై గెలుపొందిన ఎస్పీవై రెడ్డి గెలిచిన వారం రోజులకే ఆంధ్రప్రదేశ్లోని అధికారపార్టీ అయిన టీడీపీలో చేరారు. ఆయన పార్టీ మారినందున రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి ఆయనపై అనర్హత వేటు వేయాలని మేం పిటిషన్ దాఖలు చేశాం. మా పార్టీ టికెట్పై అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయింపునకు పాల్పడినందున ఆమె సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని 14 డిసెంబరు 2016న పిటిషన్ దాఖలు చేశాం. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి మా పార్టీ టికెట్పై గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరడంతో డిసెంబరు 14, 2016న అనర్హత పిటిషన్ దాఖలు చేశాం. అక్టోబరు 17, 2017న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మా పార్టీ నుంచి టీడీపీలో చేరడంతో అనర్హత పిటిషన్ దాఖలు చేశాం. కానీ వారిపై ఎలాంటి చర్యలూ లేవు’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు అధికార టీడీపీ వైఎస్సార్సీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని బహిరంగంగా తమ పార్టీలో చేర్చుకుందని, ఇందులో నలుగురిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఫిరాయింపులకు పరాకాష్టని తెలిపారు. -
పాదయాత్రపై దృష్టి మరల్చడానికే ఫిరాయింపులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం చంద్రబాబు మరోసారి ఫిరాయింపులకు తెర లేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగానే కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను మభ్యపెట్టి, విలువలను మరచి టీడీపీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన కర్నూలులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ ప్రజలకు అర్థమైపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపుదారుల అడ్రెస్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. కన్నతల్లి లాంటి పార్టీ, సీటు ఇచ్చిన అధినేతను మోసం చేసిన ప్రజాప్రతినిధులు ప్రజల వజ్రాయుధం ఓటుకు బలికాక తప్పదని హెచ్చరించారు. 2014 ఆగస్టు 15న కర్నూలులో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబు ఈ జిల్లాకు 35 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అందులో ఒక్కదాన్నీ అమలు చేసిన పాపానపోలేదన్నారు. అయితే.. జిల్లాలో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, ఎమ్మిగనూరులో టెక్స్టైల్స్ పార్కు, ఉర్దూ యూనివర్సిటీ, కళాశాలలు, కర్నూలు స్మార్ట్సిటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టలేదన్నారు. గతంలోనే 90 శాతం పూర్తయిన ముచ్చుమర్రి ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ పనులను మూడున్నరేళ్లయినా పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. నంద్యాలలో డబ్బు, అధికార దుర్వినియోగంతో గెలుపొంది వాపును బలంగా భావిస్తున్న టీడీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మా నాయకుడి మనోధైర్యం సడలదు... చంద్రబాబు ఎంతమందిని కొనుగోలు చేసినా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మనోధైర్యం సడలదని గౌరు వెంకటరెడ్డి అన్నారు. చంద్రబాబు కంటే వయసులో చిన్నవారైనా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని ప్రశంసించారు. ఒక్క నాయకుడు వెళ్లిపోతే వెయ్యి మందిని తయారు చేసుకోగల శక్తి తమ పార్టీకి ఉందన్నారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే తమ పార్టీ నుంచి చేర్చుకున్న ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. స్వలాభం కోసమే బుట్టా ఫిరాయింపు అభివృద్ధి కోసమే టీడీపీతో కలసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య విమర్శించారు. స్వలాభం కోసమే ఆమె పార్టీ ఫిరాయించారన్నారు. మూడున్నరేళ్లలో అభివృద్ధి గురించి ఆలోచించని ఆమె..నాలుగైదు నెలల్లో ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఆమె కుటుంబ సభ్యుల వ్యాపారాన్ని పెంచుకోవడానికే టీడీపీలోకి వెళ్లారన్నారు. కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన ఆమెకు ప్రజాకోర్టులో చెంపదెబ్బ తప్పదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫిరాయింపు ప్రజాప్రతినిధులను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, రమణ, ఫిరోజ్ఖాన్, పర్ల శ్రీధర్రెడ్డి, యశ్వంత్, కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బుట్టా చేరిక.. కేఈ అలక
సాక్షి ప్రతినిధి, కర్నూలు :కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరిక ఆ పార్టీలోని నేతలకే మింగుడుపడటం లేదు. ఆమె చేరికపై ప్రధానంగా కేఈ కుటుంబం అసహనంతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అమరావతిలో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరుకాలేదన్న ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. మరోవైపు బుట్టా చేరిక కార్యక్రమానికి హాజరు కావాలంటూ తనకు చివరి నిమిషంలో సమాచారం ఇవ్వడంపై కేఈ ప్రభాకర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటుపై ఆయన కన్నేశారు. గత ఎన్నికల్లోనే సీటు ఆశించి భంగపడిన ఆయన.. వచ్చే సారీ ఇదే పరిణామం పునరావృతం కానుండటంపై కినుక వహిస్తున్నారు. ఎంపీ బుట్టా పార్టీలో చేరడం, తమను కనీసం సంప్రదించకపోవడం వంటి పరిణామాలతో కేఈ కుటుంబం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని, కష్టకాలంలో వెన్నంటి ఉన్న తమను విస్మరించడం వారికి ఆగ్రహాన్ని తెప్పించినట్టు ఆ పార్టీ నేతలే అంటున్నారు. కాగా.. కోడుమూరు నియోజకవర్గంలో కొత్తకోట ప్రకాష్రెడ్డి చేరికపై కూడా ఎదురూరు విష్ణువర్దన్రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న కొత్తకోట–విష్ణు వర్గాల మధ్య ఈ పరిణామాలు మరింత దుమారం రేపుతున్నాయి. రాజకీయంగా తెరమరుగే! కేఈ ప్రభాకర్ గత ఎన్నికల్లో పోటీకి దిగలేదు. కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. ఈ సీటు బీటీ నాయుడుకు ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. తీరా ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడంతో కేఈ ప్రభాకర్... పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఆయనకు ఏపీఐడీసీ చైర్మన్ పదవి లభించింది. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోతే తనకు రాజకీయ భవితవ్యం ఉండదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి తప్పకుండా పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలు ఎంపీ సీటును ఆశించారు. అయితే, తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఎంపీ బుట్టా రేణుక పార్టీలో చేరికపై మంగళవారం ఉదయం ఫోన్ చేసి ఆహ్వానించడంతో ఆయన మరింత మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారపార్టీలో కొత్త కుంపట్లకు తెరలేసిందనే ప్రచారం జరుగుతోంది. చేరింది టీడీపీ కార్యకర్తలే... ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కండువాలు కప్పిన కార్యకర్తల్లో పలువురు ఇప్పటికే టీడీపీలో ఉండటం గమనార్హం. ఈ విధంగా సొంత పార్టీ కార్యకర్తలైన వేముగోడు మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామి, ఆయన కుమారుడు సాయినాథ్తో పాటు పిల్లిగుండ్ల జయరామ్లను తిరిగి ఎంపీ సమక్షంలో టీడీపీలోకి చేర్చుకుంటున్నట్లు ఫొటోలకు ఫోజులివ్వడం చర్చనీయాంశమైంది. ఈ విధంగా టీడీపీ కార్యకర్తలకే పచ్చ కండువాలు వేయడం పట్ల పలువురు నవ్విపోతున్నారు. ఫోన్ల బెడద ఇక పార్టీ మారిన ఎంపీ బుట్టా రేణుకకు కొత్త కష్టం వచ్చిపడింది. పార్టీ మారడంపై కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని పలువురు ఫోన్లు చేసి మరీ మండిపడుతున్నట్టు సమాచారం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మారడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తాము ఓటు వేసి గెలిపిస్తే..కనీసం చెప్పకుండానే పార్టీ ఎలా మారతారని నిలదీసినట్టు సమాచారం. ఈ ఫోన్ల బెడద తట్టుకోలేక, సమాధానం చెప్పలేక ఎంపీ కార్యాలయ సిబ్బంది కాస్తా ఇబ్బందికి గురైనట్టు తెలుస్తోంది. -
‘బుట్టలో పడకముందు.. బుట్టలో పడ్డాక’
సాక్షి, అమరావతి : ‘‘ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీలోనే ఉండాలన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఇలాంటి మంచి మెసేజ్ని ప్రజలకు ఇవ్వాలి. లేకపోతే రాజకీయాలపైన, నాయకులపైన జనంలో చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే భవిష్యత్ తరాలకు మనం మంచి మార్గాన్ని చూపాలి..’’ అని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కొన్ని నెలల కిందట ఘంటాపథంగా చెప్పారు. ఏ పార్టీ నుంచైతే తాను గెలిచానో, ఆ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని కుండబద్దలు కొట్టారు. సీన్ కట్చేసే... మంగళవారం అమరావతిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ వల్లే దక్కిన ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె పార్టీ ఫిరాయించారు. తానెప్పుడూ అభివృద్ధినే ఆశిస్తానని, గడిచిన మూడేళ్లు కూడా దానినే కోరుకున్నానని, సారు(చంద్రబాబు) ఆహ్వానించడంతో టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు. బుట్టా రేణుక.. ‘‘బుట్టలో పడకముందు.. బుట్టలో పడ్డాక’’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుట్టా రేణుకా పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి ఆశపడే పార్టీ మారారా?’’ అని ప్రశ్నించారు. నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలోకి తొక్కారు. తన అవినీతి, చేతగాని తనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ కొనుగోళ్లు మళ్లీ మొదలుపెట్టారని విమర్శించారు. బుట్టలో పడక ముందు.. బుట్టలో పడ్డాక వీడియో వీక్షించండి -
ఫిరాయింపు రాజకీయాలపై అప్పుడలా...ఇప్పుడిలా ?
-
చంద్రబాబు మారారు అనుకున్నాం, కానీ..
సాక్షి, విజయవాడ : ఎంపీ బుట్టా రేణుక ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారో కర్నూలు ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని బుట్టా రేణుకకు ఎంపీ టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ సీపీనే అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని టీఆర్ఎస్ను ఉద్దేశించి అన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కర్నూలులో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారని పార్టీ మారారా? లేక బలహీన వర్గాలకు చంద్రబాబు మేలు చేశారనా?. మీకు రూ.70 కోట్ల ప్యాకేజీ అందిందని ప్రజలంతా అనుకుంటున్నారు ...అందుకు మారారా? చంద్రబాబుకు రాజ్యాంగమన్నా, చట్టాలన్నా కనీస గౌరవం లేదు. ఎమ్మెల్యే, ఎంపీల కొనుగోలుపై చంద్రబాబు నోరు విప్పాలి. చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి మళ్లీ శ్రీకారం చుట్టారు. అందరు తిడుతుంటే చంద్రబాబు మారారు అనుకున్నాం, కానీ మారలేదు. జగనన్న చలవ వల్లే నేను ఎంపీగా గెలిచానన్న బుట్టా రేణుక ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని టీడీపీలో చేరారు.’ అని జోగి రమేష్ ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారంపై జోగి రమేష్ వ్యాఖ్యలు -
బుట్టా రేణుక ఏమీ ఆశించి టీడీపీలోకి వెళ్లారు?
-
రేణుక ఏమీ ఆశించి టీడీపీలోకి వెళ్లారు?
సాక్షి, విజయవాడ : తమ పార్టీ గుర్తుపై గెలిచిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏమి ఆశించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా అనుభవం లేకపోయినా ఎంపీ టికెట్ ఇచ్చి బుట్టా రేణుకను గెలిపించారన్నారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బుట్టా రేణుకా పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో టీడీపీ సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి ఆశపడే పార్టీ మారారా?. నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలోకి తొక్కారు. తన అవినీతి, చేతగాని తనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ కొనుగోళ్లు మళ్లీ మొదలుపెట్టారు. ఎందుకంటే నవంబర్ 2 నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఆ పాదయాత్రలో టీడీపీ సర్కార్ చేస్తున్న అవినీతి, మోసాలు, అక్రమాలు, ప్రజలు ఏవిధంగా అన్యాయానికి గురవుతున్నారో ఇవన్నీ బట్టబయలు అవుతాయనే భయంతో ఈ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టారు. పశువులను కొంటున్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొంటున్నారు. సిగ్గులేకుండా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. వైఎస్ జగన్ మాత్రం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారు. రాజీనామా చేశాకే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని వైఎస్ఆర్ సీపీలోకి చేర్చుకున్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యాలను పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క మంచి పని చేయలేదు. బలహీన వర్గాలకు చాలా హామీలిచ్చి మోసం చేశారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. పీడీబ్ల్యూడీ గ్రౌండ్లో చర్చిద్దాం. తేదీ, సమయం మీరే నిర్ణయించండి.’ అని సవాల్ విసిరారు. బుట్టా రేణు పార్టీ ఫిరాయింపుపై ట్విస్ట్! ఎంపీ బుట్టా రేణుక ఫార్టీ ఫిరాయింపుపై ట్విస్ట్ నెలకొంది. మంగళవారం ఉదయం తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆమె.. టీడీపీలో చేరికపై అధికారికంగా స్పష్టమైన ప్రకటన ఏమీ చేయలేదు. అనర్హత వేటుకు భయపడే ఆమె ఈ ప్రకటన చేయనట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు అమావాస్య కారణంగా బుట్టా రేణుక అధికారికంగా టీడీపీలో చేరలేదనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా, చంద్రబాబును కలిసిన అనంతరం బుట్టా రేణుక మాట్లాడుతూ అభివృద్ధి కోసమే తాను టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత మూడేళ్లుగా అభివృద్ధి పనుల కోసం చాలాసార్లు తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. అప్పుడు కూడా అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి మద్దతు తెలిపానన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుతోపాటు ఎన్నికలకు అయ్యే మొత్తం వ్యయాన్ని కూడా భరిస్తామని బుట్టా రేణుకకు హామీ ఇవ్వడంతో ఆమె పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారు. అలాగే తక్షణ ప్రయోజనంగా రూ.70 కోట్ల భారీ ప్యాకేజీతోపాటు పలు కాంట్రాక్టులు కూడా కట్టబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత కర్నూలు జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి బుట్టా రేణుక అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అదే రాజకీయ దిగజారుడుతనం...! తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోన్న విషయం విదితమే. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. సంతలో కొనుగోలు చేసినట్టు ఒక్కొక్కరికి ఒక్కో రేటు కట్టి మరీ కొనుగోలు చేసింది. అంతేకాకుండా రాజకీయ విలువలను తోసిరాజని రాజీనామా చేయని నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు ప్యాకేజీని కూడా ఇచ్చింది. ఈ విధంగా పార్టీ మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు పొందినవారు ఇప్పటికీ రాజీనామా చేయకపోవడం గమనార్హం. ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. ఇప్పటివరకు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. తాజాగా బుట్టా రేణుకను కూడా ప్రలోభాలకు గురి చేసి, పార్టీలో చేరేలా టీడీపీ పావులు కదిపింది. -
ఆమెను ఎంపీని చేస్తే ఇదేనా కృతజ్ఞత?
సాక్షి, కర్నూలు : సాధారణ మహిళగా ఉన్న బుట్టా రేణుకకు వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే కనీస కృతజ్ఞత కూడా లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య విమర్శించారు. ప్రాణం ఉన్నంతవరకూ జగన్ వెంటే నడుస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలతో బుట్టా రేణుక మనస్తాపం చెందినట్లు వెలువడ్డ వార్తలపై స్పందిస్తూ... గెలిచిన మూడో రోజే ఆమె భర్త పచ్చ కండువా కప్పుకున్నప్పుడు తామెంత మనస్తాపం చెంది ఉంటామో గుర్తించాలన్నారు. రహస్యంగా వెళ్లి సీఎం చంద్రబాబును కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీలో ప్రజాదరణ కలిగిన నేతలకు కొదవ లేదు ఫిరాయింపుదారులకు టీడీపీలో ఎలాంటి గౌరవం దక్కుతోందో తెలుసుకోవాలని బుట్టా రేణుకకు బీవై రామయ్య సూచించారు. అక్కడ కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా వారికి మర్యాద ఇవ్వడంలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఫిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కర్నూలులోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఆయన నిన్న (ఆదివారం) విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీలో ప్రజాదరణ కలిగిన నాయకులకు కొదవలేదన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి ఏమాత్రం జరగ లేదన్నారు. విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను మభ్యపెట్టి సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టనున్న పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, నాయకులు పర్ల శ్రీధర్రెడ్డి, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
బేరం కుదిరింది
-
బేరం కుదిరింది
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రలోభాలకు తెరలేపింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలుస్తోంది. చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత రేణుక పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. వచ్చే నెల 2వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో.. పాదయాత్రకు జనం నుంచి వచ్చే స్పందనను పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు ఎన్నికలకు అయ్యే మొత్తం వ్యయాన్ని కూడా భరిస్తామని బుట్టా రేణుకకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే తక్షణ ప్రయోజనంగా రూ.70 కోట్ల భారీ ప్యాకేజీతో పాటు పలు కాంట్రాక్టులు కూడా కట్టబెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే రాజకీయ దిగజారుడుతనం...! వాస్తవానికి అధికార తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. సంతలో కొనుగోలు చేసినట్టు ఒక్కొక్కరికి ఒక్కో రేటు కట్టి మరీ కొనుగోలు చేసింది. అంతేకాకుండా రాజకీయ విలువలను తోసిరాజని రాజీనామా చేయని నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు ప్యాకేజీని కూడా ఇచ్చింది. ఈ విధంగా పార్టీ మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు పొందినవారు ఇప్పటికీ రాజీనామా చేయకపోవడం గమనార్హం. ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. ఇప్పటివరకు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. ఆయనతో పాటు బుట్టా రేణుక భర్త నీలకంఠం కూడా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ బుజ్జగింపులు, ఎమ్మెల్యేలు నచ్చజెప్పడంతో తాత్కాలికంగా పార్టీ మారడాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం అభివృద్ధి కార్యక్రమాల పేరిట మంత్రి లోకేష్ను బుట్టా రేణుక కలిసారు. దీనిపై అప్పట్లోనే పార్టీ ఎమ్మెల్యేల నుండి నిరసన వ్యక్తం అయ్యింది. తాజాగా బుట్టా రేణుకను రాజీనామా చేయకుండానే పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. -
ఓట్ల కోసమే నంద్యాలపై సర్కార్ ప్రేమ
-
‘చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించండి’
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి చేనేత రంగాన్ని మినహాయించి చేనేతకారుల జీవనోపాధిని రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి చేశారు. శుక్రవారం లోక్సభ జీరో అవర్లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. జీఎస్టీలో చేనేత రంగంపై పన్ను విధించడం వల్ల ఈ రంగంపై ఆధారపడిన 4.5 కోట్ల మంది సామాన్యులు, అలాగే పరోక్షంగా ఆధారపడ్డ ఆరు కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎలాంటి పన్ను లేని కాటన్, నూలుపై ఐదు శాతం, సింథటిక్ ఫైబర్ నూలుపై 18 శాతం జీఎస్టీలో పన్ను విధించారన్నారు. దీని వల్ల చేనేత రంగం పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వివరించారు. చాలా మంది చేనేతకారులు జీవనోపాధి కోసం ఇప్పటికే ఇతర రంగాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇది దేశ జీడీపీపై పెనుప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందువల్ల జీఎస్టీ విధింపు వల్ల చేనేత రంగంపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాన్ని పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని బుట్టా రేణుక కేంద్రాన్ని కోరారు. -
టెక్స్టైల్ పరిశ్రమకు GST భారంగా మారింది
-
‘ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ పెంచాలి’
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మహిళ సాధికారత కోసం కేంద్రం కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుకా కోరారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె బుధవారం సభలో విన్నవించుకున్నారు. కర్నూలు జిల్లాలో ట్రిపుల్ ఐటీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లోక్సభలో బుట్టా రేణుకా విజ్ఞప్తి చేశారు. అలాగే భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో మహిళలు అగ్రగామి సంస్థల్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న తీరును ప్రోత్సహిస్తూ..మహిళలకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ శాతం పెంచాలన్న అంశాన్ని బుట్టా రేణుక ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. -
పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎంపీ
హొళగుంద/ఆలూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. శనివారం కర్నూలు జిల్లా హొళగుందలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారని.. అలాంటి పార్టీని వదిలి టీడీపీలో చేరే ప్రసక్తే లేదని ఆమె మరోసారి తేల్చి చెప్పారు. ఎల్లో మీడియా అసత్య ప్రసారాలు చేస్తోందని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరం: బుట్టా రేణుక
గుంటూరు: చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ జాతీయ ప్లీనరీలో ఆమె చేనేత సంక్షేమంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పరిపాలన విధానంలో ప్రతి వర్గమూ ఆనందంగా, సంతోషంగా బతికింది. చేనేతల పరిస్థితి దుర్భరంగా ఉంది. మనిషికి కావాల్సిన దుస్తులు తయారుచేస్తున్న చేనేత కార్మికులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వైఎస్ఆర్ పాలనలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. 50 ఏళ్ల కార్మికులకు పింఛన్లు ఇప్పించారు. ఇప్పటి పరిపాలన చూస్తే దారుణంగా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హమీకూడా చంద్రబాబు నెరవేర్చలేదు. చేనేతలకు గుర్తింపు కార్డులు లేవు. ఆస్తి పన్ను మినహాయింపు అన్నారు. బ్యాంకు రుణాలు మాఫీ అన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, షెడ్డు కట్టుకునేందుకు రుణాలు ఇస్తామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఇలా రకరకాలుగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. వైఎస్ జగన్ ముందుకొచ్చి చేనేత కార్మికులను పరామర్శించి, ఆర్థికసాయం చేశారు. ప్రభుత్వంలో లేకున్నా ప్రజల సమస్యలపై స్పందిస్తూ చేనేత కార్మికులను ఆదుకుంటున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అందరం ఊహించగలం. కేంద్రం ప్రకటించిన అనేక పథకాలు కొందరికే పరిమితమయ్యాయి. చేనేత కార్మికులకు ఆర్థికసాయం అందించాలి. సకాలంలో రుణాలు, ఉపకరణాలు ఇవ్వాలి. దళారుల బెడద తగ్గించాలి. చేనేత కార్మికులకు వైద్యపరీక్షలు ఉచితంగా చేయించాలి. ముద్ర రుణాలు ఇవ్వాలి. ఆరోగ్య భీమా పథకం వర్తింపచేయాలి' అని బుట్టా రేణుక కోరారు. చేనేత కార్మికుల సమస్యలపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచిన వైఎస్ఆర్సీపీ నేత మోహన్రావు మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రూ. 100 కోట్లు రుణమాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ, రూ. 25 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదన్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించాలని కోరినా స్పందించలేదని, కానీ వైఎస్ జగన్ మాత్రం వెంటనే స్పందించి జైట్లీ లేఖ రాశారని ఆయన అన్నారు. -
‘ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతి చెందా’
కర్నూలు: ‘నిన్ననే నారాయణరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. 30న జరగనున్న వైఎస్పార్ సీపీ ప్లీనరీ గురించి చర్చించారు. ఇవాళ ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాన’ని వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేయడాన్ని ఆమె ఖండించారు. రాజకీయ పార్టీ నాయకుల కదలికలపై పోలీసులకు సమాచారం ఉంటుందని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. నారాయణరెడ్డి మృతి బాధాకరమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలతోనే దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. నారాయణరెడ్డి రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అని, అదును చూసి ఆయనను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వెయిటింగ్ హాల్స్ ప్రారంభించిన ఎంపీ.
-
మహిళా...! మేలుకో..!
సాక్షి, అమరావతిబ్యూరో : ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఉగ్రవాదం, అణచివేత, రాజ్యదురహంకారం తదితర రుగ్మతలను రూపుమాపే శక్తి మహిళలకే ఉందని దలైలామా ఉద్బోధించారు. ప్రపంచంలో కనీసం సగం దేశాలకు అయినా మహిళలు నాయకత్వం వహిస్తేనే ప్రపంచ శాంతి సిద్ధిస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ దిశగా మహిళలు రాజకీయ రంగంలో పురోగమించి దేశ నాయకత్వాన్ని సాధించాలని ఉద్బోధించారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ... : ‘ఉద్యోగాన్ని కోరుకునే స్థితికి పరిమితం కాకుండా ఉద్యోగాలను కల్పించే స్థాయిలో మహిళలు ప్రగతి సాధించాలి’ అని నోబుల్ బహుమతి గ్రహీత, బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త మహ్మద్ యూనస్ ఉద్బోధించారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించి పారిశ్రామిక వేత్తలుగా రూపొందాలని సూచించారు. పేదరికం, నిరుద్యోగం l, పర్యావరణంలో కర్బన అవశేషాలను పూర్తిగా నిర్మూలిస్తేనే ప్రపంచం పురోగమించగలదని ఆయన చెప్పారు. మహిళా జయంతోనే సమాజ విజయం ... స్వయం సహాయక సంఘాల విజయం స్ఫూర్తితో భారతీయ మహిళలు పేదరికంపై పూర్తిగా విజయం సాధించాలని మిలిందా గేట్స్ సూచించారు. బిల్–మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అయిన ఆమె వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు. మహిళలు విజయం సాధిస్తే అందరికీ ప్రగతి ఫలాలు సిద్ధిస్తాయని ఆమె అన్నారు. విజయ ప్రస్థానం పార్లమెంట్ వరకు సాగాలి ‘ఒక్క బాలిక కూడా చదువుకు దూరం కాకుండా చూడాలి... ఒక్కరిపై కూడా వేధింపులు లేకుండా ఎదురొడ్డాలి. అప్పుడే మహిళా సాధికారత సాధించగలం’అని సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ రంజనా కుమారి పేర్కొన్నారు. ఈ మహిళా పార్లమెంట్ సదస్సు స్ఫూర్తితో విజయ ప్రస్థానం ఢిల్లీలోని పార్లమెంట్ వరకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. వివక్షకు ఎదురొడ్డాలి ... : సమాజంలోని వివక్ష మహిళలకు ప్రతిబంధకంగా నిలుస్తోందని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత పేర్కొన్నారు. మహిళలపై వివక్ష, హింసలను రూపుమాపేందుకు కలసికట్టుగా కృషి చేయాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యలను గృహిణులు ఆర్థికవేత్తలకు కూడా తీసిపోని రీతిలో ఎదుర్కొన్నారని ఆమె చెప్పారు. గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న సామర్ధ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందం అంటే ఏమిటో పునర్నిర్వచించాలి అందం అంటే బాహ్య సౌందర్యం కాదని అంతః సౌందర్యం, ఆత్మవిశ్వాసమని సమాజం గుర్తించేలా పునర్నిర్వచించాలని ప్రముఖ సామా జికవేత్త లక్ష్మీ అగర్వాల్ పేర్కొన్నారు. యాసిడ్ దాడుల నిర్మూలన కోసం ఉద్యమిస్తున్న ఆమె ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. యాసిడ్ దాడులకు పాల్పడినవారిని శిక్షించడం ఎంత ముఖ్యమో...దాడుల బాధితులకు పునరావాసాన్ని కల్పించడం కూడా అంతే ప్రధానమన్నారు. బాధితులు స్వయం ఉపాధి రంగంలో రాణించేలా తోడ్పాటు అందించాలన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లతోనే రాజకీయ సాధికారత చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదం పొందేలా కలసికట్టుగా ఉద్యమించాలని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్లే సామాన్య మహిళలు రాజకీయ నాయకత్వ అనుభవాన్ని సాధించగలిగారని ఆమె చెప్పారు. కానీ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్లోనే ఉండటం దురదృష్టకరమన్నారు. మహిళా సాధికారత దిశగా చట్టాలు రావాలంటే చట్టసభల్లో మహిళలకు దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం తప్పనిసరి అని స్పష్టంచేశారు. ప్రపంచ పౌరులుగా మహిళలు రాణించాలి అంతర్జాతీయ స్థాయిలో కూడా మహిళలు నాయకత్వ పటిమను ప్రదర్శించాలని అమెరికాలోని మేరిల్యాండ్ సెనేటర్ అరుణా మిల్లర్ పేర్కొన్నారు. అమెరికాకు తొలిసారిగా ఓ మహిళ నాయకత్వం వహించే అవకాశాన్ని తాము దురదృష్టవశాత్తు కోల్పోయామని ఆమె విచారం వ్యక్తం చేశారు. అవకాశాల కోసం కాలయాపన చేయకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలన్నారు. -
చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యం పెరగాలి
-
రెండున్నరేళ్లు గడుస్తున్నా..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం లోక్సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ వైఖరిని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 'రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క అడుగు వేయలేదు. ప్రత్యేక హోదాపై ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. చట్టంలో ఉన్న అంశాలను ఎందుకు అమలు చేయడం లేదు' అని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. మరో ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలన్నారు. ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని రేణుక డిమాండ్ చేశారు. -
రెండున్నరేళ్లు గడుస్తున్నా...
-
‘వైఎస్ జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం’
-
‘వైఎస్ జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం’
నెల్లూరు : ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదానే కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీ మేకపాటి గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆ విషయం తెలిసే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హోదాను మరిచి ఆర్థిక సాయం మంచిదంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మేకపాటి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు తాము సిద్ధమని ఆయన తెలిపారు. కాగా ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని పార్టీ మరో ఎంపీ బుట్టా రేణుక...కర్నూలులో జరిగిన యువభేరిలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చూపిన బాటలో నడుస్తామని ఆమె హామీయిచ్చారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గుత్తిరోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న యువభేరిలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం యావత్తు ప్రత్యేక హోదా కోరుకుంటుంటే అధికార పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. 'ప్రత్యేక హోదాతో రాష్ట్రం అన్ని రకాలు అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఈ విషయంలో జగనన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పాటించడానికి సిద్దంగా ఉన్నాం. అవసరమైతే రాజీనామా వల్ల ప్రత్యేక హోదా వస్తుందని విశ్వసిస్తే, మీ భవిష్యత్ కోసం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ'ని బుట్టా రేణుక అన్నారు. -
రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక
-
'హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు'
-
స్త్రీ శిశు సంక్షేమ మండలిలో బుట్టా రేణుక
-
కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిలో బుట్టా రేణుక
కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి పార్లమెంటు నుంచి ప్రాతినిథ్యం వహించే ఇద్దరు సభ్యుల్లో ఒకరిగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బుట్టా రేణుక నియమితులయ్యారు. మరొక ఎంపీ ప్రియాంక రావత్ కూడా నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. రాష్ట్రాల సాంఘిక సంక్షేమ మండలి ఛైర్పర్సన్లు కూడా ఈ మండలిలో సభ్యులుగా కొనసాగుతారు. -
‘కువైట్ జైల్లో ఉన్న వారి శిక్షను తగ్గించాలి’
సాక్షి, న్యూఢిల్లీః కువైట్లో వివిధ నేరాలకు పాల్పడి 17 మంది భారతీయులు పలు జైళ్లలో ఉన్నారని, వీరిలో 13 మందికి ఉరిశిక్ష పడిందని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వై.ఎస్.అవినాష్రెడ్డి, బుట్టా రేణుక అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఉరిశిక్ష పడిన 13 మంది మాదక ద్రవ్యాల కేసులో అరోపణలు ఎదుర్కొన్నారని, వీరి శిక్షను జీవిత ఖైదుకు తగ్గించాలని కువైట్ను కోరినట్టు తెలిపారు. ఇండియా, కువైట్ల మధ్య ఖైదీల పరస్పర బదిలీకి ఒప్పందం కుదిరిందని, అయితే ఉరిశిక్ష పడిన వారి విషయంలో ఇది వర్తించదని తెలిపారు. -
'మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ విజయవంతమైందని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. హోదాపై స్పష్టత వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ లోపల ఒకమాట, బయట మరోమాట మాట్లాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వాగ్దానం చేశాక ఇంకా చర్చలెందుకు లోక్ సభ స్పీకర్ అన్ని పార్టీలతో మాట్లాడారని, బీఏసీలో మాట్లాడాక ప్రత్యేక హోదాపై చర్చను పరిశీలిస్తామన్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. వాగ్దానం చేశాక ఇంకా చర్చలెందుకని తాము అడిగామన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, మళ్లీ చర్చలంటున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని మేకపాటి సూచించారు. రెండేళ్లు వేచి చూశాం.. ప్రత్యేక హోదా కోసం రెండేళ్లు వేచి చూశామని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఇక వేచి చూసే ప్రసక్తే లేదని, ఏపీకి ద్రోహం చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఐదేళ్లలో రెండేళ్లు గడిచిపోయాయని, హామీలను ఎప్పుడు అమలు చేస్తారని వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని హామీకి విలువ లేకపోతే ఎలా? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వైఎస్ఆర్ సీపీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కాదని, హోదానే కావాలన్నారు. ప్రధాని హామీకి విలువ లేకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు. -
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్
* మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం * చివరి సర్వే కోసం లక్నో నుంచి వచ్చిన నిపుణుల బృందం * బృందంతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అలంపూర్ రూరల్: తెలంగాణ, ఏపీ సరిహద్దు అలంపూర్లో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల సూర్యప్రకాష్రెడ్డి కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ మంజూరైంది. దీని నిర్మాణానికి ఏపీ, తెలంగాణ ప్రాంతంలో 123 ఎకరాల భూములను గుర్తించారు. ఈ మేరకు గురువారం ఈ పనులకు సంబంధించి లక్నో నుంచి సీఏవో దినేష్కుమార్, సీఎంఈ సునీల్కుమార్, సీఈ సహాయకులు ఏకే సింగ్, కోచ్ ఫ్యాక్టరీ ఇన్చార్జ్, డిప్యూటి చీఫ్ ఇంజనీర్ ఏకే శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్కే సింగ్, సీనియర్ ఇంజనీర్ ఆఫ్ మెకానికల్ శర్మ అలంపూర్ రైల్వేస్టేషన్ను సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. రైల్వే లైన్ స్థలంలో ఓ పారిశ్రామికవేత్త రోడ్డు వేసుకున్నారని.. ఆ రోడ్డును తొలగిస్తామని అధికారులు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక చొరవ... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల టెండర్లు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ పెండింగ్లో ఉండడంతో ఆదిలోనే బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కేంద్రంతో సంప్రదింపు లు జరిపిన అనంతరం ఈ పనులకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో అలంపూర్ వచ్చిన అధికారులతో ఎంపీ రేణుక కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడి, ప్లాన్ను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు ఏపీ, తెలంగాణ ప్రాంతంలోని 123 ఎకరాల భూములు గుర్తించినట్లు చెప్పారు. అందులో ఏపీలోని కర్నూలు జిల్లా దగ్గర గల పంచలింగాలలో 100 ఎకరాలు, తెలంగాణ అలంపూర్ రైల్వేస్టేషన్ వరకు మరో 23 ఎకరాలను గుర్తించినట్టు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు ఎకరాకు రూ.13 లక్షల 60 వేల చొప్పున నష్టపరిహారం అందజేసినట్టు తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకు రూ. 2 లక్షల 65 వేల చొప్పన నష్టపరిహారం అందజేస్తున్నట్టు రైల్వే అధికారులు బుట్టా రేణుకకు తెలియజేశారు. ఈ విషయమై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ విషయాలను కలెక్టర్ పరిశీలనలోకి తీసుకుని.. మాట్లాడుతున్నారని ఎంపీకి వారు వివరించారు. తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన రైల్వే కోచ్ కోసం తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన లభించిందని ఎంపీ తెలిపారు. మరో పది రోజుల్లో అంతా ఫైనల్ కానుందన్నారు. ప్రస్తుత పనులకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ పనులు ఇక వేగవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్
మహబూబ్నగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఎట్టకేలకు లైన్క్లియిర్ అయింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన భూమిని రైల్వే శాఖ ఉన్నతాధికారులు దినేష్కుమార్, సునీల్కుమార్ తదితరులు గురువారం అలంపూర్ రైల్వేస్టేషన్ను సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. గతంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యాక్టరీ మంజూరైంది. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో మొత్తం 123 ఏకరాల స్థలాన్ని గుర్తించారు. ఎంపీ బుట్టా రేణుక చొరవ.. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పనుల టెండర్లు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ తదితర అంశాలు పెండింగ్లో ఉండడంతో మొదటిలోనే బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కర్నూల్ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బుట్టా రేణుకా కేంద్రప్రభుత్వంలో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ వచ్చిన సమాచారాన్ని ఎంపీ బుట్టా రేణుకా తెలుసుకున్నారు. అనంతరం ఆమె కూడా అలంపూర్ చేరుకుని... కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత మాస్టర్ ప్లానింగ్ను పరిశీలించారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుక విలేకరులతో మాట్లాడుతూ... కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు ఏపీ, తెలంగాణ ప్రాంతంలోని సుమారు 123 ఎకరాల భూములను గుర్తించినట్టు తెలిపారు. అందులో ఏపీలోని కర్నూలు జిల్లాలో పంచలింగాలలో 100 ఎకరాలను గుర్తించామని... అలాగే తెలంగాణలో అలంపూర్ రైల్వేస్టేషన్ వద్ద మరో 23 ఎకరాలను గుర్తించినట్టు వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు ఎకరాకు రూ.13 లక్షల 60 వేల చొప్పున నష్టపరిహారం అందజేసినట్టు బుట్టా రేణుక పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకు రూ. 2 లక్షల 65 వేల చొప్పన నష్టపరిహారం అందజేస్తున్నట్టు రైల్వే అధికారులు బుట్టా రేణుకకు తెలియజేశారు. అయితే కొంతమంది రైతులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆ అంశాన్ని కలెక్టర్ పరిశీలనలోకి తీసుకుని..మాట్లాడుతున్నారని ఎంపీకి ఉన్నతాధికారులు వివరించారు. తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన రైల్వే కోచ్ కోసం తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన లభించిందని ఎంపీ బుట్టారేణుక తెలిపారు. ప్రస్తుతం మరో పది రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫైనల్ కానుందన్నారు. ప్రస్తుత పనులకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో పనులు వేగవంతం అవుతాయని బుట్టారేణుక ఆశాభావం వ్యక్తం చేశారు. -
పోరాడకపోతే ఎప్పటికీ వెనుకబాటే
కర్నూలు: నదులపై ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కడుతూ నీళ్లు వాడుకుంటున్నారని, మనకు ఎక్కడ నుంచి నీళ్లు వస్తాయని, దీనిపై పోరాడకపోతే ఎప్పటికీ వెనుకబడిఉంటామని వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష వేదికపై ఆమె మాట్లాడారు. రాయలకాలంలో రత్నాలసీమగా పేరుగాంచిన రాయలసీమ నేడు వెనుకబడిపోవడానికి నీళ్లు లేకపోవడమే కారణమని బుట్టా రేణుక అన్నారు. నీళ్లులేకపోతే ఎలా అభివృద్ధి చెందుతామని వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఏవిధంగా న్యాయం చేస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదని చెప్పారు. చంద్రబాబు చేయాల్సిన పనిని వైఎస్ జగన్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం కలసివుంటే ఇలాంటి సమస్యలు రావనే ముందుచూపుతో సమైక్యఉద్యమం చేశామని చెప్పారు. -
నేడు బుట్టా రేణుక బళ్లారి రాక
సాక్షి, బళ్లారి : వైఎస్సార్సీపీకి చెందిన కర్నూలు లోక్సభ సభ్యురాలు బుట్టా రేణుక ఆదివారం బళ్లారికి రానున్నట్లు జిల్లా కురుహీనశెట్టి తరుణ సంఘం జిల్లా అధ్యక్షుడు తుక్కా రాజేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బళ్లారి నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి 9వ వార్షికోత్సవం పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కురుహీన శెట్టి సమాజానికి చెందిన బుట్టా రేణుక లోక్సభ సభ్యురాలు అయిన తర్వాత బళ్లారికి ప్రప్రథమంగా వస్తున్న నేపథ్యంలో ఆమెను ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. కాగా బుట్టా రేణుక ఆదివారం బళ్లారికి విచ్చేస్తున్న నేపథ్యంలో నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
లోకేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన బుట్టా రేణుక
కర్నూలు : ప్రత్యేక హోదా రావడం లేదంని తీవ్ర మనస్తాపం చెందిన గుండెపోటుతో మరణించిన జి.లోకేశ్వరరావు (37) కుటుంబాన్ని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరామర్శించారు. శనివారం కర్నూలు జిల్లా గూడూరులోని లోకేశ్వరరావు నివాసానికి బుట్టా రేణుక విచ్చేశారు. ఈ సందర్భంగా లోకేశ్వరరావు భార్య కృష్ణవేణితో ఆమె మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా కృష్ణవేణికి రేణుకా భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. -
గుర్తు చేస్తున్నా.. పట్టించుకోవట్లేదు
-
గుర్తు చేస్తున్నా.. పట్టించుకోవట్లేదు
రాష్ట్రాన్ని విభజించిన సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీని మర్చిపోయారని.. ఇప్పుడు దాన్ని తాము గుర్తుచేస్తున్నా ఏమాత్రం పట్టనట్లు వదిలేస్తున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. ఆమె ఏమన్నారంటే... హక్కును పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన రోజు అందరూ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కూడా హామీలిచ్చారు. ఆ హామీలను పక్కనబెట్టి ఈ రోజు మన పరిస్థితిని వాళ్ల ముందు గోడు పెట్టుకున్నా వినిపించుకోని హీన స్థితిలో వదిలిపెట్టేశారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు వస్తాయని అంటున్నారు. కానీ, ఏ రాష్ట్రాన్నీ ఇంత దారుణంగా విడగొట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎందుకు గ్రహించలేకపోతున్నారో ప్రశ్నార్థకమే. ఎంపీలంతా గత వారం రోజుల నుంచి పార్లమెంటులో మా గోడు వినిపిస్తున్నా పట్టించుకోవడం లేదు. మాకు ఏదో సర్దిచెప్పాలని.. మీకు అన్యాయం చేయబోమని చెబుతున్నారు తప్ప న్యాయం ఎలా చేస్తారన్న స్పష్టత ఇవ్వడం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా కాలాన్ని గడిపేస్తూ మభ్యపెడతారో. వాళ్లలో చలనాన్ని తీసుకురావాలి. వాళ్లిచ్చిన హామీలను గుర్తు చేయాలన్న బాధ్యతతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పోరాటం ప్రారంభించారు. మనకు ప్రత్యేక హోదా వచ్చేవరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్క పౌరుడికి విజ్ఞప్తి. ఇదే నమ్మకంతో ముందుకెళ్దాం. -
ఆడపిల్లలు పుట్టడమే పాపమా?
-
ఆడపిల్లలు పుట్టడమే పాపమా?
కర్నూలు: కఠిన శిక్షలు లేకపోవడం వల్లే మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పెచ్చుమీరుతున్న అత్యాచార ఘటనల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామని చెప్పారు. కర్నూలు పట్టణంలో అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికను మంగళవారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇది బాధకరమైన విషయం అన్నారు. ఏ ఇంట్లో కూడా ఇలాంటి దారుణం జరగకూడదన్నారు. ఆడపిల్లలు పుట్టడమే పాపం అన్నట్టు పరిస్థితి తయారు చేస్తున్నారు. ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలన్న భయంతో తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. ఆడుకోవడానికి పిల్లలకు బయటకు పంపించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులను కఠిన శిక్షలు అమలు చేసినప్పుడే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. కొన్ని దేశాల్లో రేపిస్టులను బహిరంగంగా ఉరి తీస్తారు కాబట్టే అక్కడ ఇలాంటి నేరాలు తక్కువని గుర్తు చేశారు. మన చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కర్నూలులోని కడగ్ పూరా కాలనీకి చెందిన ఖాజా భాషా అనే వ్యక్తి శనివారం రాత్రి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కర్నూలు పెద్దాసుపత్రిలో ఉన్న నిందితుడిపై పాతబస్తీ వాసులు సోమవారం దాడికి యత్నించారు. నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. -
'మంత్రాలయాన్ని పర్యాటక ఆలయంగా అభివృద్ధి చేస్తా'
కర్నూలు: తన సొంత జిల్లాలో ఉన్న మంత్రాలయం ఆలయాన్ని పర్యాటక ఆలయంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శనివారంతో ఆమె ఎంపీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏడాది పాలన ఎంతో సంతృప్తిగా ఉందని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. కర్నూలు నియోజక వర్గంలో ఎంపీ నిధులతో రూ.2.5 కోట్లతో తాగునీటి సౌకర్యం కల్పించినట్టు ఆమె తెలిపారు. కేంద్రం నుంచి జిల్లాకు అధిక నీరు తీసుకు రావడానికి కృషి చేస్తానని బుట్టా రేణుక ఈ సందర్భంగా తెలిపారు. -
'ఉపాధి'లో సాగు పనుల ప్రతిపాదన లేదు
ఎంపీలు కవిత, బుట్టా రేణుక ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అన్వయించే ప్రతిపాదనలు కేంద్రం వద్ద లేవని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్భాయ్ కుందారియా స్పష్టం చేశారు. భూసార పరీక్షల నిర్వహణకు కేంద్రం తీసుకుంటున్న చర్య లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో వ్యవసాయ పనులను చేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక, టీఆర్ఎస్ ఎంపీ కవిత లోక్సభలో ప్రశ్నను లేవనెత్తారు. ఈ మేరకు కుందారియా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. -
కేంద్రం నిధుల్నిపెంచండి: వైఎస్సీర్సీపీ ఎంపీ రేణుక
వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. అభివృద్ధిలో వెనుకబడ్డ కర్నూలు జిల్లాకు కేంద్రం ప్రకటించిన రూ.50 కోట్లు సరిపోవని, నిధులు ఇంకా పెంచాలని మంత్రిని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు బీరేంద్ర సింగ్, కటారియాలను కూడా కలిసిన రేణుక.. కర్నూలు జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించి రైతన్నలను ఆదుకోవాలని విన్నవించారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి: బుట్టా
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇక్కడ వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. -
విఐపి రిపోర్టర్ - కర్నూలు ఎంపి బుట్టారేణుక
-
లోక్సభలో చేనేత సమస్యలపై బుట్టారేణుక
-
రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకోండి: బుట్టా
సాక్షి, న్యూఢిల్లీ: తుంగభద్ర నదిపై హవేరీ జిల్లాలో మరో రిజర్వాయర్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవాలని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ బుట్టా రేణుక కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే దిగువన ఉన్న కర్నూలు జిల్లా రైతాంగ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈమేరకు ఆమె ఉమాభారతికి శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచడంతో ఆగస్టు తర్వాత శ్రీశైలం డ్యాంకి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతోందని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనివల్ల కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఎగువ తుంగభద్రపై మరో డ్యాం నిర్మిస్తే జిల్లా రైతుల ఇబ్బందులు మరింత పెరుగుతాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించకుండా అడ్డుకోవాలని కోరారు. -
''నాణ్యమైన విద్యకు టీచర్స్కు మంచి ట్రైనింగివ్వాలి''
-
ఉద్యోగుల పంపకాలు ఇలా
వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి, బుట్టాల ప్రశ్నలకు కేంద్ర మంత్రి వివరణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకాలకు సంబంధించి ఏర్పా టు చేసిన కమల్నాథన్ కమిటీ పరిగణనలోకి తీసుకున్న ప్రతిపాదనలు, నిబంధనలపై ప్రణాళిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ వివరణ ఇచ్చారు. పంపిణీకి సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, బుట్టా రేణుకలు అడిగిన ప్రశ్నకు ఆయన బుధవారం లోక్సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 80 ప్రకారం ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో వివరించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల ఉద్యోగుల సంఖ్యను లెక్కించడం, వీరిని తెలంగాణ,ఏపీ రాష్ట్రాలకు ప్రత్య క్ష నియామకాల , పదోన్నతుల కోటాల వారీగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించడం వంటి అంశాలను తన సమాధానంలో మంత్రి వివరించారు. -
గౌడ.. మా గోడు ఇదీ
మెరుగైన సౌకర్యాలను పక్కనపెడితే.. కనీస సౌకర్యాలు కల్పించలేని దయనీయ స్థితి నెలకొంది. ప్రతి బడ్జెట్లో జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకోవడం.. తీరా ఆ శాఖ మంత్రి ప్రకటనలో ఎలాంటి విశేషాలు ఉండకపోవడం పరిపాటిగా మారుతోంది. ఈ అన్యాయంపై గళం విప్పే నాయకులు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల కంటితుడుపు పురోగతి సాధించగా.. శాశ్వత ప్రాతిపదికన రూపురేఖలు తీసుకురాలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారు మంగళవారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఎప్పటిలానే జిల్లా ప్రజలు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడపై కోటి ఆశలు పెట్టుకున్నారు. గత ఫిబ్రవరి 12న యూపీఏ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చివరి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టినా జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కనీసం ఈసారైనా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలిగించాలని.. 44 ఏళ్ల డిమాండ్ అయిన మంత్రాలయం-కర్నూలు మధ్య కొత్త రైల్వే లైన్కు పచ్చజెండా ఊపాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు (రాజ్విహార్): రాయలసీమ ముఖద్వారం.. రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబాటే. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే చందంగా మారింది. ప్రధానంగా రైల్వే బడ్జెట్లో సవతి ప్రేమ కారణంగా ఏటా నిరాశే మిగులుతోంది. ప్రభుత్వాలు మారినా.. జిల్లాకు చెందిన నేత రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టినా ఒరిగింది శూన్యమే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఓ డివిజన్కు నోచుకోకపోగా.. కనీసం డబుల్ ట్రాక్ కూడా కరువైంది. గరీబ్థ్ ్రఊసే కరువవగా.. పలు సూపర్ఫాస్ట్లకు స్టాపింగ్ లభించని పరిస్థితి. కర్నూలుకు ప్రాధాన్యతనివ్వాలి రవాణా రంగంలో వెనుకబడిన కర్నూలుకు రైల్వే బడ్జెట్లో ప్రాధాన్యతనివ్వాలి. కర్నూలు-మంత్రాలయం కొత్త లైను ఏర్పాటుతో పాటు గతంలో ప్రకటించిన వర్క్ షాపు నిర్మాణం, కోసిగి-ఎర్నగల్లు-మంత్రాలయం డబుల్ లైను, కొల్లాపూర్-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న రైళ్లను కోసిగిలో ఆపాలి. మంత్రాలయం స్టేషన్ను ఆధునీకరించి మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దాలి. కర్నూలులో అదనపు రిజర్వేషన్ కౌంటరు ఏర్పాటు, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య గరీభ్థ్ ్రరైలు, కర్నూలు-జైపూరు మధ్య కొత్త రైలు, సికింద్రాబాద్ నుంచి కర్నూలు మీదుగా గోవాకు కొత్త రైలును ఏర్పాటు చేయాలి. బెంగళూరు నుంచి కర్నూలు, సికింద్రాబాద్ మీదుగా ముంబైకి నేరుగా రైలు వేయాలి. కర్నూలు మీదుగా వెళ్లే ప్రతి రైలు సిటీ స్టేషన్లో నిలపాలి. ఈ డిమాండ్లతో ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో పాటు ఆ శాఖ మంత్రి సదానందగౌడను కలిసి వినతిపత్రం అందించా. కేంద్ర ప్రభుత్వం కరుణ చూపుతుందని భావిస్తున్నా. - బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ ఆధ్యాత్రిక కేంద్రం మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త రైల్వే లైన్ పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. రెండు సార్లు సర్వే చేయగా.. నిధుల వృథాయే తప్పిస్తే ‘మార్గం’ కరువైంది. 110 కిలోమీటర్ల పొడవైన ఈ లైను ఏర్పాటుకు రూ.1100 కోట్లు అవసరమని అంచనా. కర్నూలు, పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు ఉపయోగకరం. కర్నూలులో రైల్వే మిడ్లైఫ్ రీహాబిలిటేషన్ వర్క్షాపు నిర్మాణాన్ని 2013 బడ్జెట్లో ప్రతిపాదించారు. స్థల సేకరణ చేపట్టినా వివిధ కారణాలతో రద్దయినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.250కోట్లు అవసరమని అంచనా. దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్(నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని గతంలో మాజీ మంత్రి కోట్ల చెప్పారు. ఇందుకు రూ.2కోట్లు అవసరం. పూర్తయితే దాదాపు 5వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. జిల్లా కేంద్రం కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. విజయవాడ వరకు కనీసం రెండు రోజు వారీ ఎక్స్ప్రెస్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది. గుంటూరు-డోన్-గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల మేర డబుల్ లైను, విద్యుదీకరణకు సర్వే పూర్తయినా నిధుల విడుదల మరిచారు. డోన్ మీదుగా గుంటూరు వరకు సింగిల్ లైనులో రెండు మూడు రైళ్లు మాత్రమే నడుపుతున్నారు. సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణం, ఆదోని స్టేషన్ను మోడల్గా తీర్చిదిద్దేందుకు రూ.2కోట్లకు పైగా నిధులు అసవరం. గుత్తి నుంచి డోన్, కర్నూలు మీదుగా సికింద్రబాద్ వరకు డబుల్ లైన్, విద్యుదీకరణకు సర్వే చేసినా పెండింగ్లో ఉంది. తాత్కాలికంగా హాల్ట్ ఇచ్చిన కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కు పూర్తి స్థాయి స్టాపింగ్ ఇవ్వాలి. అన్ని ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లను కర్నూలు రైల్వేస్టేషన్లో నిలపాలి. హోస్పెట్-మంత్రాలయం-కర్నూలు-నంద్యాల-శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్ను కలుపుతూ కొత్త రైలు మార్గం నిర్మించాలి. డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు. అర్ధాంతరంగా నిలిచిపోయిన కడప జిల్లా ఎర్రగుంట్ల-బనగానపల్లె-నంద్యాల లైను పనులు. పెండింగ్లోని 20 కిలోమీటర్ల(నంద్యాల క్రాస్లైన్ వెంకటేశ్వరపురం వరకు) పనులు పూర్తి చేసేందుకు, అసంపూర్తిగా ఉన్న బనగానపల్లె, కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ల పనుల పూర్తికి రూ.70 కోట్లు అవసరం. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వరకు గరీబ్థ్ ్రనడపాలి. విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు, హైదరాబాద్ మీదుగా రాజ్కోట్ వరకు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. ఆదోని మీదుగా ఔరంగాబాద్ నుంచి రేణిగుంట, యశ్వంత్పూర్ నుంచి ఆదోని మీదుగా కాటా(ఉత్తరప్రదేశ్) వరకు రైలు. కర్నూలు నంద్యాల మధ్య వారంలో ఐదు రోజులు నడుస్తున్న డెమూ ప్యాసింజరు రైలును ప్రతి రోజూ నడపడంతోపాటు ఇందులో మూత్రశాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. కర్నూలు-హైదరాబాద్ మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైలును డోన్ వరకు పొడిగించాలి. కర్నూలు- విజయవాడ మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు. కర్నూలులోని కృష్ణానగర్, గుత్తి పెట్రోల్ బంక్ వద్ద, డోన్, బేతంచెర్ల వద్ద అండర్గ్రౌండ్ బ్రిడ్జి, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా లభించని మోక్షం. తెనాలి, రేపల్లె, గుంటూరు మధ్య నడుస్తున్న ప్యాసింజరు రైలును ఇటీవలే ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు పొడగించారు. దీనిని నంద్యాల మీదుగా డోన్, కర్నూలు వరకు నడపాలి. మచిలీపట్నం నుంచి ముంబయికి డోన్ మీదుగా రైలు ప్రవేశపెట్టాలని రెండేళ్ల క్రితం బడ్జెట్లో ప్రకటించినా అమలు కాకపోవడం. డోన్ రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ను 8 నుంచి 12 గంటల వరకు పొడిగించాలి. మరో రెండు ప్లాట్ఫాంల నిర్మాణం చేపట్టాలి. -
రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక మంగళవారం కలిశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కడప, కర్నూలు జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని వారు ఈ సందర్బంగా రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై ఏడో తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎనిమిదో తేదీన రైల్వే బడ్జెట్ను రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు ...సదానంద గౌడను కలిసి జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భేటీ అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట్ల, నంద్యాల, కడప, బెంగళూరు రైల్వే మార్గాలను పునరుద్దరించాలని కోరామన్నారు. హైదరాబాద్-డోన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ను కడప వరకూ పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. -
దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధి
కర్నూలు(కలెక్టరేట్) : దశలవారీగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఆమె కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డిని ఆయన చాంబర్లో కలిసి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూ సేకరణ, కోడుమూరు-మంత్రాలయం రైల్వేలైన్ సర్వే వివరాలు తీసుకుని రైల్వే మంత్రిని కలుస్తామన్నారు. కేంద్ర విద్యా సంస్థలను జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. జిల్లాలో ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఏ పరిశ్రమలు నెలకొల్పవచ్చు అనే దానిపై జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తీసుకుంటామని తెలిపారు. సీమాంధ్రలో జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని ఇక్కడ పరిశ్రమలతో పాటు విద్యా సంస్థలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటి సమస్య పరిష్కారంపై తన వంతు కృషి చేస్తానన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం జిల్లాకు 24 టీఎంసీల నీటిని కేటాయిస్తే 16 టీఎంసీలు మాత్రమే వస్తుందని, కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్తో చర్చించినట్లు అందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలన్నింటినీ తెలుసుకున్నానని, వీటి పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. -
వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా: బుట్టా రేణుక
న్యూఢిల్లీ: తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నానని, ఇందులో ఎలాంటి అయోమయానికి తావులేదని వైఎస్సార్సీపీ తరఫున కర్నూలు ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక స్పష్టం చేశారు. నియోజవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశానని వివరణ ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కొత్తపల్లి గీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఏమవుతుందో తెలుసుకునేలోపే అంతా జరిగింది. ఇదంతా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన’’ అని రేణుక తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలకు ఇక్కడితో ముగింపు పలుకుతున్నట్టు చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న మీ భర్త అందులోనే కొనసాగుతారా అని ప్రశ్నించగా.. ‘‘నాతో చర్చించకుండానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో నేను పార్లమెంట్కి వెళ్లాను. ఆయన టీడీపీలో చేరినట్టు నాకూ మీడియా ద్వారానే తెలిసింది. అందుకే దాని గురించి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను’’ అని తెలిపారు. రాజకీయానుభవం లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరిగాయని, భవిష్యత్తులో ఇలాం టివి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పారు. ఎస్పీవై రెడ్డి ఇకనైనా తప్పు తెలుసుకోవాలి: మేకపాటి తన ప్రాంత అభివృద్ధి కోసం టీడీపీలో చేరానని చెబుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి సూచించారు. ఎస్పీవై రెడ్డిని టీడీపీ నాయకులు భ్రమపెట్టారో, భయపెట్టారో తెలియడం లేదన్నారు. ‘‘గత రెండు రోజులుగా చోటు చేసుకున్న సంఘటనలు ఎంతో దురదృష్టకరం. టీడీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత మద్దతు ప్రజలు ఇచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వాన్ని నడుపుతూ, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అది వదిలేసి ఇతర పార్టీల నాయకులను ప్రలోభ పెట్టడం అనైతికం. టీడీపీ నాయకులు ఇప్పటికైనా అలాంటి కార్యక్రమాలకు ముగింపు పలికితే మంచిది’’ అని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారని ప్రజలంతా ఆశతో ఉన్నారని, చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజలు ఆలోచిస్తారన్నారు. వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..బాబు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేస్తుంటారని, రుణమాఫీ అమలు ఏవిధంగా చేస్తారో వేచి చూద్దామన్నారు. ఎస్పీవై రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే తీసుకుంటారా అని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని మేకపాటి సమాధానమిచ్చారు. -
ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఆ పార్టీ నేతలు సాగిస్తున్న మైండ్గేమ్కు తెరపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదంటూ ఆ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కేంద్ర కమిటీ సభ్యుడు ఎదురూరు విష్ణువర్దన్రెడ్డితో పాటు కొందరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం తేల్చి చెప్పారు. వీరి ప్రకటనలో తమ్ముళ్ల నోళ్లకు తాళం పడినట్లయింది. జిల్లాలో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు సరికొత్త డ్రామాకు తెరతీశారు. అందులో భాగంగానే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వారి మాయలో పడ్డారు. ఆ పార్టీ ప్రలోభాలకు తలొగ్గి పచ్చకండువా కప్పుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ప్రజా తీర్పును అగౌరవపరిచారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను సైతం పార్టీ మారాలంటూ గందరగోళానికి గురిచేశారు. రాజకీయాలకు కొత్త కావడంతో ఆమె కూడా తడబడ్డారు. తప్పు చేసినట్లు తెలుసుకునే లోపు టీడీపీలో చేరిపోయినట్లు ప్రచారం జరిగిపోయింది. ఇదంతా కుట్రపూరితమేనని బుట్టా రేణుక ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ డ్రామాకు శుభం కార్డు వేశారు. రాజకీయ ఎదుగుదలకు అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని ఆమె తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తూ.. కర్నూలు పార్లమెంట్ పరిధిలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. తప్పుడు ప్రచారం మానుకోవాలి: తనపై టీడీపీ శ్రేణులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు విష్ణువర్దన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారెళ్లారు.. వీరెళ్తున్నారంటూ తమ్ముళ్లు సాగిస్తున్న తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. కర్నూలు, గూడూరు, సి.బెళగల్ మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో మంగళవారం కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తామంతా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతామంటూ స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు సైతం ఆయా ప్రాంతాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ వీడబోమంటూ ప్రకటించారు. టీడీపీ నేతల అసత్య ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లాలో అపరిష్కృత సమస్యలపై పోరుకు అధికార టీడీపీ నేతలు కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. మైండ్గేమ్ను పక్కనపెట్టి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని వారు హితవు పలికారు. -
'ఇకనైనా ఎస్పీవై రెడ్డి చేసిన తప్పు తెలుసుకోవాలి'
న్యూఢిల్లీ : కేవలం తన ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెబుతున్ననంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయన చేసిన తప్పులను ఇకనైనా తెలుసుకోవాలని మేకపాటి హితవు పలికారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన చంద్రబాబు నాయుడు ...ఇతర పార్టీల నేతలను భయపెట్టో, ప్రలోభాలకు గురి చేయటమో మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేకపాటి సూచించారు. బాబు ఇచ్చిన హామీలపై ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వ్యవహారంలో జరిగినవ్నీ చాలా దురదృష్టకరమైనవన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. -
వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతా : బుట్టా రేణుక
న్యూఢిల్లీ : తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఆమె మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, తాను వైఎస్ఆర్ సీపీలోనే ఉన్నానని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు బుట్టా రేణుక పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే బాబును కలిసినట్లు చెప్పారు. రాజకీయంగా తనకు ఎలాంటి అనుభవం లేనందువల్లనే కొంత గందరగోళానికి గురైన మాట వాస్తవమని బుట్టా రేణుక అంగీకరించారు. అందువల్లే ఇటువంటి పరిణామాలు జరిగాయని ఆమె తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని బుట్టా రేణుక తెలిపారు. ఈ ఎపిసోడ్కు ఇంతటితో ముగింపు పలుకుతున్నట్లు ఆమె చెప్పారు. భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాదని బుట్టా రేణుక తెలిపారు. -
పార్టీ ఫిరాయింపు వ్యభిచారం కన్నా హీనం: రఘువీరా
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎంపీలిద్దరూ పార్టీ ఫిరాయించడం ముమ్మాటికి అనైతికమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కొందరు నేతలు ఆక్సిజన్ లేకుండా ఉంటారేమో కానీ అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని రఘువీరా ఎద్దేవా చేశారు. ఫిరాయింపుల నిరోదక చట్టం ప్రకారం ఎన్నికల సంఘం వీరిపై చర్యలు తీసుకోవాలని రఘువీరా డిమాండ్ చేశారు. నేతల ఫిరాయింపు వ్యవహరం వ్యభిచారం కన్నా హీనంగా ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్పూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్ సీపీలోనే ఉన్నా: ఎంపీ రేణుక
సాక్షి, న్యూఢిల్లీ: తాను వైఎస్సార్ సీపీలోనే ఉన్నానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీని వీడుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ఢిల్లీలోని ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను టీడీపీలో చేరడం లేదు. చంద్రబాబుకు అభినందనలు తెలిపేందుకే వచ్చాను. నా నియోజకవర్గం అభివృద్ధికి వారి సహాయం అవసరం ఉంది. అందుకే ఆయన్ను కలిశాను. నేను టీడీపీకి కేవలం అసోసియేట్ సభ్యురాలిగానే కొనసాగుతాను. ప్రజలకు ఏదో మంచి చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చాను. వెనుకబడిన కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఆ మాట నిలబెట్టుకునేందుకు చాలా నిధులు అవసరం’’అని రేణుక చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచి టీడీపీ అసోసియేట్ సభ్యురాలిగా ఎలా కొనసాగుతారన్న విలేకరుల ప్రశ్నకు తాను ఆ విషయాలన్నీ ఆలోచించలేదంటూ సమాధానం దాటవేశారు. ఆమె భర్త టీడీపీలో చేరిన విషయమై ప్రశ్నించగా... తన వ్యక్తిగత అభిప్రాయం వేరని, తాను వైస్సార్సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. సాంకేతిక అంశాలపై తనకు అంతగా అవగాహన లేదన్నారు. ఒకవేళ పార్టీ అనర్హత వేటు వేస్తే మళ్లీ పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు... మళ్లీ పోటీ చేసే స్థోమత ఉంటే చేస్తాను, లేద ంటే సామాజిక సేవ చేసుకుంటానని సమాధానమిచ్చారు. టీడీపీకి అంశాల వారీగానే మద్దతు ఉంటుందన్నారు. -
సంతలో బేరం!
* ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న చంద్రబాబు * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల కొనుగోలుకు తెరలేపిన తెలుగుదేశం * హామీలను నెరవేర్చలేమని తెలిసే బాబు కొత్త కుట్రలు * వైఎస్సార్సీపీ గట్టి ప్రతిపక్షంగా ఉంటే నిలదీస్తుందనే భయం * బలహీనపరచడమే లక్ష్యంగా ఎంపీలతో బేరసారాలు * ప్రమాణ స్వీకారమైనా చేయకముందే ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.. టీడీపీకి అనుబంధంగా * కొనసాగుతానన్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక * మరికొందరూ చేరుతున్నారంటూ మైండ్గేమ్కు తెరతీసిన తెలుగుదేశం పార్టీ సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేశారు. ప్రజలిచ్చిన తీర్పునే వంచించారు. అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ రాజకీయ దుర్నీతికి, తన మార్కు అక్రమాలకు తెర తీసింది. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ సంతలో పశువుల్లా ప్రజాప్రతినిధుల కొనుగోలుకు బరితెగించింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తమదే అధికారమంటూ నేతలను నయానా భయానా ప్రలోభ పెడుతూ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తూ పార్టీలో చేర్చుకునే రాజకీయాలకు తెరతీసింది. ఈ క్రమంలో... ‘వస్తే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తాం, రాకుంటే ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతోంది! అనర్హత వేటు పడదంటూ చట్టాలకు సైతం వక్రభాష్యం చెబుతూ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా ఎడాపెడా ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చలేమని గ్రహించిన బాబు, ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలను మొదలుపెట్టారు. ‘‘సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మొదటగా రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేస్తా. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇస్తా’నంటూ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా లేక, వాటినుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే ఒక పథకం ప్రకారం ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించే అజెండాను తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. హామీల సంగతేమిటని రేపటి రోజున గట్టిగా నిలదీయడానికి సిద్ధమవుతున్న వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోళ్లకు దిగుతున్నారు. ఇందుకోసం బాబు స్వయంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి మరీ టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బాబు అజెండాను అమలు చేసేందుకు టీడీపీ నేతలు నిస్సిగ్గుగా నడిబజారులోకి వచ్చారు. సీమాంధ్రలో ప్రజల తీర్పు వెలువడి పది రోజులు కూడా గడవకముందే, ఎన్నికైన సభ్యులు కనీసం ప్రమాణ స్వీకారమైనా చేయకముందే వారిని లోబరుచుకునే చర్యలకు దిగారు. సీమాంధ్రలో గట్టి ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఉండటం సహించలేని బాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు ఒడిగట్టారు. ఏ పదవులు గానీ, ఎన్నికలు గానీ లేని సమయంలో కొందరు నేతలు ప్రజల పక్షాననిలిచి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరితే దాన్ని ‘ఆకర్ష్ పథకం’ అంటూ విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు అధికారం తమ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి మరో పార్టీలో చేరితే అనర్హత వేటు ఖాయమని ప్రజాప్రాతినిధ్య చట్టం చాలా స్పష్టంగా చెబుతున్నా, దానికి కూడా టీడీపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారంటే ఏ స్థాయిలో ప్రలోభాలకు దిగుతున్నారో తెలుస్తోంది. కేంద్రంలో తమదే ప్రభుత్వమని చెప్పుకుంటూ, అనర్హత వేటు లేకుండా చూసుకుంటామనే తప్పుడు వాగ్దానాలతో నేతలను మభ్యపెట్టి మరీ టీడీపీలో చేరాల్సిందిగాఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇది కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం కావడం లేదు! జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సైతం స్వయంగా చంద్రబాబు ఫోన్లు చేస్తూ టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు!! గట్టి ప్రతిపక్షమంటే బాబుకు భయం సీమాంధ్ర శాసనసభలో అత్యంత బలమైన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించడాన్ని టీడీపీ నేతలు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేకపోతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రేపటి రోజున ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నాయని గ్రహించిన టీడీపీ నేతలు ఏదో రకంగా ఆ పార్టీని బలహీన పరచాలన్న చర్యలకు దిగినట్టు స్పష్టమవుతోంది. అందులో భాగంగా... ఢిల్లీలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కొలువుదీరనున్న ప్రభుత్వంలో తమ హవాయే సాగనుందంటూ నేతలపై మైండ్ గేమ్ మొదలుపెట్టారు. అనర్హత వేటు పడినా పర్లేదని, ఉప ఎన్నికల్లోనూ ఓడినా మరో పదవి ఇస్తామంటూ టీడీపీ తరఫున రాయబారం నెరుపుతున్న బేరగాళ్లు వైఎస్సార్సీపీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు బాబు తరఫున ఆయన కోటరీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతల ఇళ్లకు వెళ్లి మరీ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ‘మీకైన ఎన్నికల ఖర్చునంతటినీ చెల్లించడమే గాక ఉప ఎన్నికల ఖర్చు కూడా భరిస్తాం. అదనంగా మంచి ‘ప్యాకేజీలు’ కూడా ఇస్తాం’ అంటూ ఒక ఎమ్మెల్యేపై రెండు రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. ‘మీరు వ్యాపార రంగంలో ఉన్నారుగా! వైఎస్సార్సీపీలో కొనసాగితే మీకేం ప్రయోజనం? మావైపు రండి. అవసరమైన పనులు చేసి పెడతాం’ అంటూ మరో ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నారు. హామీల అమలు అక్కర్లేదా? బలమైన ప్రతిపక్షముంటే ఎన్నికల హామీలను అమలు చేసేలా పాలక పక్షంపై ఒత్తిడి తెస్తుంది. అవసరమైతే అందుకోసం ప్రభుత్వం మెడలు వంచుతుంది. వైఎస్సార్సీపీ నుంచి అలాంటి ఒత్తిళ్ల ప్రమాదం లేకుండా చేసుకోవడానికే టీడీపీ నేతలు ఫిరాయింపు కుట్రలకు తెరతీశారని సర్వత్రా వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ఆదివారం బాబును కలిశారు. తర్వాత నేరుగా పచ్చ కండువా ధరించి, ఆ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తూ తాజాగా వైఎస్సార్సీపీ తరఫున కర్నూలు ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక కూడా ఆదివారం బాబును కలిసి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే వారిద్దరూ కూడా ఏం చెప్పాలో తెలియక, ‘మా నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్నాం. అందుకే టీడీపీలో చేరుతున్నాం’ అన్నారు. కానీ అది సాకు మాత్రమేనని వైఎస్సార్సీపీ నేతలంటున్నారు. ‘బాబు నిజంగా అభివృద్ధి చేస్తారని భావించి ఉంటే వారు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరి ఉండేవారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు బాబు తన హామీలను నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉంటేనే వాటి అమలు కోసం ఒత్తిడి చేయడానికి వీలవుతుంది’ అని గుర్తు చేస్తున్నారు. పైగాబాబును కలిశాక బుట్టా రేణుక పొంతన లేకుండా మాట్లాడిన తీరు కూడా టీడీపీ కుట్రలను బాహాటంగా బయట పెట్టిందని వారన్నారు. ముందుగా బాబును కలిసి ఎస్పీవై రెడ్డి ఏకంగా తాను టీడీపీలో చేరినట్టు ప్రకటించగా, ఆ తర్వాత కలిసిన రేణుక మాత్రం తడబడ్డారు. టీడీపీలో చేరలేదని, ఆ పార్టీకి అనుబంధ సభ్యురాలిగా ఉంటానని, వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని రకరకాలుగా మాట్లాడారు. తెర వెనుక... కేంద్రంలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న కడప జిల్లాకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వారిని పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని, టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ముగ్గురు ఎంపీలు, మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం మొదలుపెట్టారు. ఆర్థిక ప్రలోభాలను ఎరగా చూపడంతో పాటు ‘రాష్ట్రంలో మా ప్రభుత్వం, కేంద్రంలో మేం భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంటాయి గనుక మీ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సంపూర్ణ సహకారం అందిస్తాం. నియోజకవర్గ ప్రజల సంగతి అలా ఉంచి, మీ సొంత ప్రయోజనాలు చూసుకోండి’ అంటూ మైండ్గేమ్ మొదలుపెట్టారు. ఈ కోవలోనే వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన ఎస్పీవై, బుట్టా కనీసం లోక్సభలో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే టీడీపీలో చేరినట్టు తెలుస్తోంది. ప్రజలకు సమాధానం చెప్పాలి: మైసూరా అధికారంలోకి వచ్చిన పార్టీ తాను ప్రజలికిచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకుండా, ఇతర పార్టీల్లో గెలిచిన వారిని ప్రలోభపెట్టజూడటం మంచిది కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి తప్పుబట్టారు. దీనికి తెలుగుదేశం పార్టీ ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో కలిసి ఆదివారం హైదరాబాద్లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరే హక్కు తమ పార్టీకి ఉందనడం నిస్సందేహమన్నారు. టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడం సరైంది కాదని చెప్పారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్నది కేవలం ఒకవర్గం మీడియా అత్యుత్సాహంతో చేస్తున్న ప్రచారమేనని ఒక ప్రశ్నకు బదులుగాచెప్పారు. ఒకరిద్దరు అలాంటివారు తప్పుగా అలా చేసి ఉండొచ్చుగానీ ఎవరూ పార్టీ వీడరని తెలిపారు. వేటు ఖాయం ‘‘ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అభ్యర్థి తానున్న పార్టీని వదిలి మరో పార్టీలోకి వెళ్తున్నానని చెప్పినా, ఆ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీకి రాజీనామా చేసినా సదరు అభ్యర్థి తానున్న ఆ పార్టీని వదిలేయడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఫిరాయింపు నిషేధ చట్టం ప్రకారం ఆ అభ్యర్థికి అనర్హత వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఇదే చెబుతోంది. అయితే ఇక్కడ గుర్తింపు ఉన్న పార్టీయా, లేని పార్టీయా అన్న వివాదాన్ని లేపుతున్నారు. గుర్తించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే... రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీనా, లెజిస్లేచర్ పార్టీనా అన్నారే తప్ప ‘రికగ్నైజ్డ్, నాన్ రికగ్నైజ్డ్’ అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. రాజకీయ పార్టీగా నమోదైతే చాలు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే చాలు. పోటీ చేయడానికి అర్హత ఉన్నప్పుడు, ఆ పార్టీ నుంచి వెళ్లిపోతున్నపుడు అనర్హత ఎందుకు వర్తించదు? ఎన్నికైన పార్టీని వదిలేయడం, మరో పార్టీలోకి చేరడం వల్ల అభ్యర్థికి కచ్చితంగా అనర్హత వర్తిస్తుంది. రికగ్నైజ్డ్ పార్టీ కాదనుకుంటే ఆ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేసినట్టు? ఒక పార్టీ పక్షాన ఎన్నికై మరో పార్టీలో చేరడమనేది అనైతిక, రాజ్యాంగ వ్యతిరేకమైన, దుర్మార్గపు చర్య. ఈ తరహా పోకడలను నివారించడానికే చట్టం చేశారు’’ - మాడభూషి శ్రీధర్, న్యాయ కోవిదుడు -
''వైసీపీలోనే కొనసాగుతా... కాని..''
-
వైఎస్సార్ సీపీలో కొనసాగుతా..టీడీపీ సభ్యురాలిగా ఉంటా!
ఢిల్లీ: తాను వైఎస్సార్ సీపీలో కొనసాగుతూనే..టీడీపీ అసోసియేట్ సభ్యురాలిగా ఉంటానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రెండు విరుద్ధ ప్రకటనలు చేశారు. వైఎస్సార్ సీపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసిన మాట వాస్తవమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గెలిచిన వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరడానికి కాదని రేణుక తెలిపారు. తన నియోజక వర్గ అభివృద్ధిలో భాగంగానే చంద్రబాబును కలిసినట్లు ఆమె తెలిపారు. అయితే టీడీపీ అసోసియేట్ సభ్యురాలిగా ఉంటానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కర్నూలు ఎంపీగా ప్రజలకు అభివృద్ధి అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ అంశాలపై చర్చించడానికి తాను బాబు కలవలేదని..అభివృద్ధిలో భాగంగానే ఆయన్ను వ్యక్తిగతంగా కలిశానంటూ తెలిపారు. ఒక పార్టీలో ఉంటూ.. మరో పార్టీలో సభ్యురాలిగా ఎలా కొనసాగుతారని మీడియా ప్రశ్నించగా తనకు ఆ విషయం అంతగా తెలియదంటూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. -
నేను వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతా:ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు: తాను వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసిన మాట వాస్తవమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గెలిచిన వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరడానికి కాదన్ని రేణుక తెలిపారు. తన నియోజక వర్గ అభివృద్ధిలో భాగంగానే చంద్రబాబును కలిసినట్లు ఆమె తెలిపారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బట్టా రేణుక కూడా వైఎస్సార్ సీపీని వీడుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీంతో స్పందించిన రేణుక.. వైఎస్సార్ సీపీ వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. -
నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆధిక్యం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థిపై ముందంజలో ఉన్నారు. ఇక నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ముందంజలో ఉన్నారు. కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిని బుట్టా రేణుక ముందు వరుసలో ఉన్నారు. అలాగే కర్నూలు అసెంబ్లీ స్థానంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. -
ఎల్లెల్సీ రైతుల కష్టాలు పరిష్కరిస్తా
ఆదోని టౌన్, న్యూస్లైన్: తుంగభద్ర దిగువ కాల్వ ఆయకట్టు రైతుల కష్టాలు పరిష్కరిస్తానని కర్నూలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం బుట్టారేణుక ఆదోనికి వచ్చారు. మార్కెట్ యార్డులో సాయి, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి బుట్టా ప్రచారం చేశారు. మార్కెట్ యార్డులోని వ్యాపార సముదాయాలు, వ్యాపారస్తులు, హమాలీలు, ఉద్యోగుల వద్దకు వెళ్ళి అయ్యా, అక్కా, తాతా, అవ్వా, అంటూ అప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పనిచేస్తుందన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక నుంచి తుంగభద్ర దిగువ కాలువ, ఆలూరు బ్రాంచ్ కెనాల్కు రావాల్సిన వాటా నీటికోసం కృషి చేస్తానన్నారు. పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే కర్నూలు పార్లమెంట్ పరిధిలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆదోని నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. జననేతను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నాని ఆమె పేర్కొన్నారు. -
బాబూ.. ఆమెకు చోటేదీ?
మాటల్లోనే మహిళా సాధికారత ‘మహిళా సాధికారత మా వల్లే సాధ్యం. డ్వాక్రా రుణాలు తెచ్చింది మేం. రిజర్వేషన్ల కోసం పోరాడింది మేం. స్త్రీల రక్షణ మావల్లే సాధ్యం’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతుంటారు. అయితే ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నా.. ఒక్క మహిళకు కూడా టికెట్ కేటాయించలేకపోయారు. కాంగ్రెస్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఆ పార్టీ తరఫున ఆలూరు నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకంగా ముగ్గురు మహిళలకు చోటు కల్పించింది. కర్నూలు పార్లమెంట్, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాల నుంచి బుట్టా రేణుక, భూమా శోభా నాగిరెడ్డి, చరితారెడ్డిని బరిలోకి దింపింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు,రైతు, డ్వాక్రా రుణాలు రద్దుచేస్తామని టీడీపీ అధినేత హామీ ఇవ్వడం.. వారి ఓట్లను దండుకోవటానికేనని తేలిపోయింది. జిల్లాలో మొత్తం ఓటర్లు 29,64,148 ఉన్నారు. అందులో మహిళా ఓటర్లే 14,88,875 ఓటర్లు ఉన్నారు. అంటే సగానికి పైనే మహిళా ఓటర్లు ఉన్నారు. 1952 నుంచి లోక్సభకు 15 పర్యాయాలు, శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు జిల్లా నుంచి కేవలం ఐదుగురు మాత్రమే చట్టసభల్లో అడుగుపెట్టారు. 1962లో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా యశోదారెడ్డి పోటీ చేసి చట్టసభలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మహిళలకు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన దాఖలాలు లేవు. నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుట్టా రేణుకకు కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది. ఈ ఘనత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందనటంలో సందేహం లేదు. 1985లో పత్తికొండ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కె. మహాబలేశ్వరగుప్త హత్యకు గురయ్యారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం ఆయన సతీమణి కె. సుబ్బరత్నమ్మకు టికెట్ ఇచ్చారు. ఆ తరువాత 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉప ఎన్నికలో, 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేసి గెలుపొంది ఆసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీకి ఎన్నికైన రెండోమహిళగా శోభా నాగిరెడ్డికి స్థానం దక్కింది. తరువాతి స్థానంలో గౌరు చరితారెడ్డి, కోట్ల సుజాతమ్మలు నిలిచారు. 2004లో జరిగిన ఎన్నికల్లో గౌరు చరితారెడ్డి, కోట్ల సుజాతమ్మ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 సాధారణ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి, నీరజారెడ్డి విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్టీనే నమ్ముకుని ఉన్న మహిళలు.. దివంగత ఎన్టీ రామారావు నుంచి నేటి వరకు పార్టీ కోసమే పనిచేస్తూ.. టీడీపీనే నమ్ముకుని పనిచేస్తున్న మహిళలు ఉన్నారు. వారిలో మసాల పద్మజ, గుడిసె క్రిష్ణమ్మ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఉన్నారు. ఈ ముగ్గురూ టికెట్లు ఆశించిన వారే. ఓ సారి మసాల పద్మజకు ఎమ్మెల్సీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గుడిసె క్రిష్ణమ్మను ఆదోని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించి పార్టీ నాయకులే ఓడించారని ప్రచారం ఉంది. ఇక బొజ్జమ్మ విషయానికి వస్తే తండ్రి కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్యకు గురైనప్పటి నుంచి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే కుదరదని చెప్పేశారు. ఇలా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే మాటలకు.. చేతలకు పొంతనే ఉండదని పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పి తీరుతారని మహిళలు హెచ్చరిస్తున్నారు. -
వైఎస్ఆర్ పథకాలే శ్రీరామ రక్ష
కల్లూరు రూరల్, న్యూస్లైన్: మహానేత ప్రవేశ పెట్టిన పథకాలే తమ పార్టీకి శ్రీరామరక్షగా నిలిచాయని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక అన్నారు. రమేష్బాబు ఆధ్వర్యంలోనగరంలోని 13వ వార్డు, 41వ వార్డులకు చెందిన ముస్లిం మహిళలు, యువకులు, విద్యార్థులు సుమారు 200 మంది పార్టీలో చేరారు. అలాగే ఇంతియాజ్, మోయిజ్ల నాయకత్వంలో 15, 11 వార్డులకు చెందిన యువకులు, విద్యార్థులు సుమారు 150 మంది పార్టీలో చేరారు. వీరు నగరంలోని బుట్టా రేణుక నివాసంలో ఆమె సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరిని పార్టీ విద్యార్థి విభాగం కన్వీనర్ రాకేష్రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ రోజురోజుకూ పార్టీపై అభిమానుల వెల్లువ కొనసాగుతుందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉండి, అందరి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షబానా, ఖైరున్బీ, నాగేశ్వరి, భాస్కర్, పెద్ద నర్సింహులు, ప్రసాద్, చాణక్య, అబ్దుల్ రవూఫ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బీసీలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీ జనాభా దృష్ట్యా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ సమన్వయకర్తగా చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ఖరారు చేశారు. అదేవిధంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా భూమా నాగిరెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. జిల్లా చరిత్రలో ఓ పార్టీ బీసీ మహిళకు కర్నూలు పార్లమెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. చారిత్రక నిర్ణయానికి వైఎస్ఆర్సీపీ బీజం వేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళలతో పాటు బీసీ కులస్తులు, రాజకీయ పరిశీలకులు హర్షిస్తున్నారు. పత్తికొండ నివాసి అయిన బుట్టా నీలకంఠం సతీమణి రేణుక ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం వీరు వ్యాపార నిర్వహణలో భాగంగా హైదరాబాద్లో ఉంటున్నారు. కర్నూలు పార్లమెంట్లోని ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో చేనేత సామాజిక వర్గీయులు అత్యధికంగా ఉన్నారు. అదేవిధంగా బీసీ జనాభాను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా భూమా నాగిరెడ్డి పేరును ఖరారు చేయడంతో విమర్శకుల నోళ్లు మూతపడినట్లయింది. ప్రస్తుతం పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా కూడా పని చేస్తున్న భూమా.. గతంలో నంద్యాల ఎంపీగా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్రను సొంతం చేసుకున్నారు. తాజాగా నంద్యాలలో ప్రజల సమస్యలపై అలుపెరగని పోరు సాగిస్తూ దూసుకుపోతున్నారు. చెత్తపై సమరం.. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బాక్స్ ఏర్పాటు.. కాల్ యువర్ భూమా తదితర కార్యక్రమాలతో జనానికి చేరువవుతున్నారు. అధ్యక్షుడి స్ఫూర్తితో నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ.. కష్టసుఖాల్లో పాల్పంచుకోవడం పట్ల ప్రజలు కూడా అదే స్థాయిలో ఆకర్షితులవుతుండటం విశేషం.