కాంగ్రెస్‌-జేడీఎస్‌ 2019లోనూ.. | Congress And JDS To Contest Jointly In 2019 Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌-జేడీఎస్‌ 2019లోనూ..

Published Fri, Jun 1 2018 5:15 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress And JDS To Contest Jointly In 2019 Lok Sabha Elections - Sakshi

కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి

సాక్షి, బెంగళూరు : 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జనతా దళ్‌ సెక్యులర్‌లు కలసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం ప్రకటన చేశారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల మధ్య కేబినేట్‌ విస్తరణ పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీన కేబినేట్‌ను విస్తరించనున్నట్లు వెల్లడించారు.

ఇరువర్గాలు ఓ ఉమ్మడి కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. దీనికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య నేతృత్వం వహించనున్నారు. ప్రతి నెలా ఒకసారి ఈ కమిటీ భేటీ అవుతుంది. మొత్తం 34 శాఖల్లో కాంగ్రెస్‌కు 22(హోం, ఇరిగేషన్‌, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమ తదితరాలు), జేడీఎస్‌కు 12(ఎక్సైజ్‌, పీడబ్ల్యూడీ, విద్య, పర్యాటకం, రవాణా తదితరాలు) దక్కాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement