JDS
-
సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా
బెంగళూరు: కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాంలో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కాంలో సిద్ధరామయ్య అవకతవకు పాల్పడ్డారని, ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ తరుణంలో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. అదే సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీపై సైతం విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రా అని ప్రశ్నించారు. Mr. @siddaramaiah..Ughe Ughe to your 'Sidvilasa'Then: To escape from scams, you build a 'samadhi' for Lokayukta and formed ACB!Now: The same Lokayukta is a place you found to get rid of 'Mudahagaran'!!Isn't it Karma Mr siddaramaiah?ACB was also dismissed by the High Court…— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) September 27, 2024మోదీ కేబినెట్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి.. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్వయం ప్రతిపత్తి వ్యవస్థ లోకాయుక్తపై ఆంక్షలు విధించి..అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.కర్మ సిద్ధాంతం అంటే ఇదేగతంలో లోకాయుక్తాకు బదులు ఏసీబీని ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్య అనుకున్నారు. కానీ 2022లో హైకోర్టు రాష్ట్రంలో లోకాయుక్త లేదంటే ఏసీబీ ఏదో ఒకటి ఉండాలని తీర్పు ఇచ్చింది. దీనిపై కుమారస్వామి స్పందిస్తూ.. ఇది కర్మ కాదా..సిద్ధరామయ్య. లోకాయుక్త వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు వద్దనుకున్న లోకాయుక్త ఆధ్వర్యంలో ముడా స్కామ్లో విచారణ ఎదుర్కోనున్నారు అంటూ సెటైర్లు వేశారు. చదవండి : ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్యాకు చిక్కులు -
జేడీఎస్ అధినేత కుమారస్వామికి అస్వస్థత
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆదివారం(జులై 28) సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ నాయకులు ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా కుమారస్వామి ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు బెయిల్
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు బెయిల్ లభించింది. బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.సూరజ్ రేవణ్ణ ఫామ్హౌజ్లో తనని లైంగికంగా వేధించాడని 27ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీన్నారు. విచారణ చేపట్టిన కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో సూరజ్ రేవణ్ణ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.తనపై వచ్చిన ఆరోపణలపై సూరజ్ రేవణ్ణ స్పందించాడు.ఫిర్యాదు దారుడు తన వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు రాబట్టేందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్
బెంగళూరు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో హాసన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీసు స్టేషన్లో జేడీఎస్ కార్యకర్త చేతన్.. సూరజ్ రేవణ్ణపై లౌంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తిరస్కరించటంతో పోలీసులు సూరజ్ను బెంగళూరు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనకు పొటెన్సీ పరీక్ష నిర్వహించనున్నారు.తనపై సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ కార్యకర్త చేతన్, మరోవ్యక్తి హోలెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘సూరజ్ ఫామ్ హైజ్లో జూన్ 16 తేదీన నాపై లైంగికంగా దాడి చేశాడు. బదులుగా నాకు రాజకీయంగా ఎదగటానికి సాయం చేస్తాననని బలవంతంగా లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్కు మెసెజ్ చేస్తే.. ‘ఏం కాదు. అంతా సర్దుకుంటుంది’అని రిప్లై ఇచ్చాడు’అని కార్యకర్త చేతన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఫిర్యాదుపై స్పందించిన సూరజ్, అతని స్నేహితుడు శివకుమార్ తమను బ్లాక్మెయిల్ చేయడానికే చేతన్, మరోవ్యక్తి అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. చేతన్ అనే వ్యక్తి తమతో స్నేహంగా ఉంటూ ఉద్యోగం కావాలని కోరితే.. ఉద్యోగం కోసమనే తాను సూరజ్ను పరిచయం చేశానని శివకుమార్ తెలిపారు. -
సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు
బనశంకరి: జేడీఎస్కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్ తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కే.ఎస్. అనే జేడీఎస్ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని సూరజ్ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్.. సూరజ్ రేవణ్ణ బ్రిగేడ్కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నా రు. శివకుమార్ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది. -
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడిపై లైంగిక ఆరోపణలు.. బెదిరింపులపై ఫిర్యాదు
బెంగళూరు: జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక ఆరోపణల కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆయన సోదరుడు సూరజ్ రేవణ్ణపై ఓ యువకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పోలీసులకు లేఖ రాశారు. దీనిపై సూరజ్ రేవణ్ణ స్నేహితుడు శివకుమార్ సదరు యువకుడితో పాటు మరో వ్యక్తిపై హసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘చేతన్, అతని బావ ఇద్దరూ నన్ను కలిశారు. వారు నా దగ్గర రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. వారు కోరినట్లు రూ. 5 కోట్లు ఇవ్వకపోతే.. సూరజ్ రేవణ్ణపై లైంగిక దాడి కేసు నమోదు చేస్తామని బెదిరించారు’ అని శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చేతన్ ముందు తననను కలిసి.. ఉద్యోగం ఇప్పించటం కోసం సాయం చేయాలని కోరాడని శివకుమార్ తెలిపారు. దీంతో నేను సూరజ్ రేవణ్ణ ఫోన్ నంబర్ ఇచ్చాను. అతనికి ఉద్యోగం ఇప్పించనందుకే తమ ఇద్దరినీ (శివకుమార్, సూరజ్ రేవణ్ణ)ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫోలీసులకు శివకుమార్ ఫిర్యాదు చేశారు.మరోవైపు.. చేతన్ సైతం ఓ ప్రైవేట్ ఛానెల్తో మాట్లాడుతూ.. సూరజ్ రేవణ్ణ తనను ఆయన ఫామ్ హౌజ్లో లైంగిక వేధింపులుకు గురిచేశాడని ఆరోపించారు. ఇక.. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్న కొన్ని రోజులకే ఓ యువకుడు అతని సోదరుడు సూరజ్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు రావటం రాజకీయం తీవ్ర చర్చనీయాంశం అయింది. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.ఇక మైసూర్లోని కేఆర్ నగర్కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.కాగా జర్మనీ నుంచి బయల్దేరిన ప్రజ్వల్ రేవణ్ణ.. గురువారంయ అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్పోర్టులో దిన వెంటనే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవణ్ణకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్ను సిటీ సివిల్ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ప్రజ్వలను 14 రోజులపాటు తమ కస్టడికి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది.మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ 2014-19లో హాసన నుంచి జీడీఎస్ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్సభల్లోనూ ఎన్డీయూ కూటమి తరపున. హాసన నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఆచూకి కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. -
బెంగళూరులో బిగ్ ట్విస్ట్.. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.చదవండి: ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణSuspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.చదవండి: మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవణ్ణపలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్ గత ఏప్రిల్లో భారత్ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్ను కోరిన విషయం తెలిసిందే.చదవండి: ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్యచదవండి: ప్రజ్వల్ రేవణ్ణకు తాత దేవెగౌడ వార్నింగ్.. వెంటనే భారత్కు రావాలి -
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టులో బుధవారం(మే29) ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ప్రజ్వల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గురువారమే బెయిల్ పిటిషన్పై విచారణ జరపాల్సిందిగా ప్రజ్వల్ తరపు న్యాయవాది కోరగా కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ సమయం కోరింది. దీంతో జడ్జి సంతోష్ గజానన్ విచారణను మే 31కి వాయిదా వేశారు. లైంగిక దౌర్జన్యం వీడియోలు వెలుగు చూసిన తర్వాత ఏప్రిల్లో ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ప్రజ్వల్ మే31న భారత్ వస్తానని ఇప్పటికే ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాజాగా కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను 31కే వాయిదా వేయడంతో ఆయన ఆరోజు వస్తారా మళ్లీ ఏదైనా తేదీ ప్రకటిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.ప్రజ్వల్ ఎన్డీఏ కూటమి తరపున జేడీఎస్ పార్టీ నుంచి హసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కర్ణాటకలో పోలింగ్ ముగిసింది. -
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ త్వరలోనే భారత్కు తిరిగి రానున్నారు. ఈనెల 31న సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై నమోదైనవి తప్పుడు కేసులు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.’ అని సోమవారం పేర్కొన్నారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవణ్ణ పేర్కొన్నాడు. తాను మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. తన ఆచూకీ వివరాలు చెప్పనందుకు జేడీఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (కుమారస్వామి],పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు చేయలేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్లో నాపై ఈ ఆరోపణలను చూశాను. అలాగే ఏడు రోజుల సమయం కావాలని నా లాయర్ ద్వారా సిట్కి లేఖ రాశాను.’ అని పేర్కొన్నారు.కాగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ(36) మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియో బయటకు రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయారు.కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హొళె నరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీసు' కూడా జారీ అయ్యింది.తన మనవడిని భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా అతని ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని కోరుతూ హెచ్డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అతని ప్రకటన రావడం గమనార్హం. అంతేగాక ప్రజ్వల్ దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
‘లొంగిపో.. లేదంటే’.. ప్రజ్వల్కు మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్ ఇచ్చారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ లేఖ విడుదల చేశారు.‘‘ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది. ప్రజ్వల్పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024 ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు. ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్నపు జారీ చేసినా.. దౌత్య పాస్పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు. -
ప్రజ్వల్ భారత్కు వచ్చి లొంగిపో: బాబాయ్ విజ్ఞప్తి
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి ఆరోపణల కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. ప్రజ్వల్కు సంబంధించినవిగా అసభ్య వీడియో వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ విషయంలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. అయితే ఆదివారం ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో బాబాయ్ అయిన జేడీఎస్ చీఫ్ కుమారస్వామి స్పందించారు. విదేశంలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే ఇండియాకు రావాలని కోరారు. లైంగిక ఆరోపణల కేసులో సిట్ ముందు దర్యాప్తు ఎదుర్కొవాలన్నారు. లేకపోతే ప్రజలు తమ కుటుంబాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపారు.‘‘మీడియా ముఖంగా నేను ప్రజ్వల్ రేవణ్ణను ఇండియాకు రావాల్సిందిగా కోరుతున్నా. అతను ఏ దేశంలో ఉన్నా భయం లేకూడా భారత్ తిరిగి రావాలి. ఇంకా ఎంత కాలం ఇలా దాచుకొని తిరుగుతూ ఉంటావు?. ప్రజ్వల్ రేవణ్ణకు తన తాత మాజీ ప్రధాని దేవెగౌడపై గౌరవం ఉంటే వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోవాలి. మన కుటుంబం గురించి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా చూడాలి. ...రెండు రోజుల్లో ప్రజ్వల్ పోలీసులకు లొంగిపోవాలి. లక్షల మంది పార్టీ కార్యకర్తలు నీకు ఓటు వేశారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా విదేశంలో ఉంటావు. దయచేసి ఇండియాకి తిరిగి వచ్చి అధికారులు ముందు హాజరుకావాలి. అప్పడే ఈ విషయంలో ఓ ముగింపు వస్తుంది. ఈ వ్యవహారంలో బాధితులకు నేను బహిరంగా క్షమాపణలు చేబుతున్నా. వారి బాధను నేను అర్థం చేసుకోగలను’’ అని కుమారస్వామి అన్నారు. ఇక.. అధికార కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని అనేక సార్లు టార్గెట్ చేసిందని, కానీ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోరాడుతున్నామని కుమారస్వామి పేర్కొన్నారు. -
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి లైంగిక దాడి, వైరలైన అభ్యంతర వీడియోల వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా తొలిసారి ఈ వ్యవహారంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణపై నేరం నిరూపణ అయి దోషిగా తేలితే.. చర్యలు తీసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. హెచ్డీ రేవణ్ణపై మహిళల వేధింపు, కిడ్నాప్ కేసులు కావాలని సృష్టించినవి’ అని దేవెగౌడ్ అన్నారు. ‘‘హెచ్ డీ రేవణ్ణకు సంబంధించిన కేసు కోర్టు ఉంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ప్రజ్వల్ విదేశంలో ఉన్నాడు. ఈ వ్యవహరంలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం ప్రభుత్వం విధి. మహిళ వేధింపుల కేసులో ఇంకా చాలా మందికి సంబంధం ఉంది. నేను ఎవరీ పేరును బయటపెట్టాలనుకోవటం లేదు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని, వారికి నష్ట పరిహారం అందిచాలని ఇప్పటికే హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు’’ అని దేవెగౌడ అన్నారు.ఇక.. ప్రజ్వల్కు సంబంధించిన లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనుసాగుతోంది. అభ్యంతరమైన వీడియోలు వైరల్ అయిన అనంతరం జర్మనీ వెళ్లిపోయిన ప్రజ్వల్ ఇంకా భారత్కు తిరిగిరాకపోవటం గమనార్హం. -
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
బెంగళూరు: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతర వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా కొన్ని అభ్యంతర వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన దేశం వదిలి.. జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్వల్ ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన భారత్ రానున్న విషయంలో.. జర్మనీ నుంచి ఇండియాకు బుక్ చేసుకున్న విమానం టికెట్ బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ప్రజ్వల్ బుక్ చేసిన విమాన టికెట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజ్వల్ బుక్ చేసుకున్న టికెట్ ప్రకారం ఆయన ఈరోజు (బుధవారం) రాత్రికి భారత్కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేస్తున్నారు. హాసన్కు చెందిన జేడీఎస్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజ్వల్పై పోలీసుల కేసు నమోదు చేశారు.అభ్యంతర వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్పై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది. అప్పటికే జర్మనీ వెళ్లినపోయిన ప్రజ్వల్ కోసం పోలీసులు.. బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రజ్వల్ ఇండియా వస్తే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముందుకు సాగనుంది. -
ప్రజ్వల్ రేవణ్ణ స్కాండల్ కేసులో 2 బిగ్ ట్విస్టులు
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల కేసు కీలక మలుపు తిరుగుతోంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనను బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. మహిళ ఆరోపణల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా గురువారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి మండిపడ్డారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలగా ఫిర్యాదులు చేయకపోతే వ్యబిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు.‘‘కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు. వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు. బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడను కుమారస్వామి ప్రశ్నించారు. తాను ప్రజ్వల్ను సమర్థించట్లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే. దోషులకు శిక్ష పడాల్సిందే. హెడ్డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మా అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయి. నేను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే హసన్ జిల్లాకు వెళ్లాను’’ అని ఆయన అన్నారు.మరోవైపు, సిట్ దర్యాప్తును కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పలేను. సిట్పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసు ఫైల్ చేయమనండి. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తేలాక వాటిని ప్రజల ముందుంచుతాం. వీడియోల్లోని బాధితులను బ్లాక్ మెయిల్ చేసినట్టు తేలితే దోషులపై చర్యలు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.దేవరాజ్ గౌడ్పైనా లైంగిక దాడి కేసుఇక ప్రజ్వల్ ఎపిసోడ్లో ఊహించని మరో మలుపు చోటు చేసుకుంది. ఈ భాగోతం మొత్తం బయటపెట్టిన బీజేపీ నేత, ప్రముఖ లాయర్ దేవరాజ్ గౌడపైనా లైంగిక దాడి కేసు ఒకటి నమోదు అయ్యింది. హోలెనరసిపురా టౌన్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 1వ తేదీన కేసు నమోదు అయ్యింది. అంతకు ముందురోజు ఆమె భర్త.. గౌడ తమ ఇంటికి వచ్చి బెదిరించాడనే ఫిర్యాదు చేశారు.తమకు సంబంధించిన ఆస్తుల అమ్మకాల విషయంలో సాయం చేస్తానని గౌడ నమ్మించారని, ఆ వంకతో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా పోలీసులను ఆశ్రయించారు .ప్రజ్వల్ సెక్స్ వీడియో క్లిప్ల పెన్ డ్రైవ్లను బీజేపీ అధిష్టానానికి దేవరాజ్ గౌడే అందించారని, వచ్చే లోకసభ ఎన్నికల్లో జేడీఎస్తో పొత్తు వద్దని వారించింది ఈయనేనని ఒక ప్రచారం ఉంది. -
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనిపైన రాష్ట్రంలో రాజకీయ నేతలు ధ్వజమెత్తారు. ఈ తరుణంలో ఆర్జేడీ నేత మిసా భారతి కూడా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.పశ్చిమ బెంగాల్ గవర్నర్పై వచ్చిన అభియోగం ఆందోళన కలిగించే విషయం. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మిసా భారతి అన్నారు. ఈమె పాట్లీపుత్ర లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.ఈ విషయం మీద తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. రాజ్భవన్లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. -
‘‘జేడీఎస్తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్ ప్రశ్న
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్ కాంగ్రెస్తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్ షా చెప్పాలి’అని డీకే డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్ కార్తిక్ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు. -
ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జేడీఎస్) అసభ్యకర వీడియోల విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పందించారు. రేవణ్ణపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ప్రధాని మౌనమేలారేవణ్ణపై వ్యవహారంపై ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఈ విషయంలోనూ ప్రధాని మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణ చేసిన నేరాలు వింటేనే గుండె తరుక్కు పోతుంది. వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేశారు. అయినప్పటికీ ప్రధాని మోదీ మౌనంగానే ఉంటారా అని ట్వీట్లో పేర్కొన్నారు.అక్కడుంది మీ ప్రభుత్వమే కదాప్రియాంక గాంధీ ట్వీట్పై మంగళవారం ఉదయం అమిత్ షా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలోని మాతృశక్తికి మేం అండగా ఉంటాం. అయితే కాంగ్రెస్ను ఓ మాట అడగాలనుకుంటున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. ఇంతవరకు రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. లైంగిక వేదింపుల కేసు గురించి ప్రియాంక గాంధీ వాద్రా వారి సీఎంను, డిప్యూటీ సీఎంను అడగాలని సూచించారు. విచారణకు బీజేపీ డిమాండ్ఇది రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతల సమస్య. కాబట్టే దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కేసులో విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.పరువు పోతుందంటూకాగా, రేవణ్ణ వేదింపులు కేసు వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందంటూ పలువురు నేతలు జేడీఎస్ అధినేత దేవెగౌడకు లేఖలు రాశారు. దీంతో దేవెగౌడ ప్రజ్వల్ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు ప్రకటించారు.రేవణ్ణను రప్పిస్తాంమరో వైపు కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్ బి.కె.సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు రాగా, కన్నడనాట రాజకీయంగా పెను దుమారం రేగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జేడీఎస్.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజ్వల్ సస్పెన్షన్ ముందు ఆయన బాబాయ్, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి డీకే శివకుమర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందులో ఉన్నది అతడేననే ఆధారం ఏంటి?. అయినా సరే తాము నైతికత ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక.. ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.లోక్సభ ఎన్నికల వేళ రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేగటంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సోమవారం జేడీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
HD Revanna: అంతా రాజకీయ కుట్ర
బెంగళూరు/శివమొగ్గ: తనపై, తన కుమారుడు ప్రజ్వల్పై లైంగిక వేధింపులు, కేసులు అంతా రాజకీయ కుట్రలో భాగమని కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ వ్యా ఖ్యానించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటా. ఆరోపణల్లో నిజం ఉందని దర్యాప్తులో తేలితే ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధం. నాలుగైదేళ్లనాటి పాత అంశాలను పట్టుకుని ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సిట్ దర్యాప్తు చేశాక నిజాలు బయటికొస్తాయిగా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్లనుకున్నదే చేస్తారు. ఇవన్నీ ఈనాటివి కాదు. కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా ఇది పెద్ద సెక్స్ కుంభకోణమే అయితే సిట్ ఏర్పాటుచేశారుగా. సమగ్ర దర్యాప్తు చేయనివ్వండి. సాధారణంగానే ప్రజ్వల్ విదేశాలకు వెళ్తాడు. ఇప్పుడూ అలాగే వెళ్లాడు. ఎఫ్ఐఆర్ వేస్తారనిగానీ, సిట్తో దర్యాప్తు చేయిస్తారనిగానీ ప్రజ్వల్కు తెలీదు. దర్యాప్తు అధికారులు ఆదేశించినప్పుడు ప్రజ్వల్ వచ్చి వారికి సహకరిస్తాడు’’ అని రేవణ్ణ చెప్పారు.పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్!లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్ను సస్పెండ్ చేయాలనే నిర్ణయానికొచ్చినట్లు జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సోమ వారం చెప్పారు. ‘‘ ప్రజ్వల్పై ఆరోపణలు నిజమైతే ఆయనకు శిక్ష పడాల్సిందే. వివాదంలో ప్రజ్వల్ను వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదు. తప్పు అని తేలితే కఠినచర్యలు తీసు కోవాల్సిందేనని మా కుటుంబం మొత్తం కోరుకుంటోంది. ప్రజ్వల్ సస్పెన్షన్ నిర్ణయా న్ని మంగళవారం హుబ్బళిలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ప్రతిపాదిస్తాం. పార్ల మెంట్సభ్యుడు కాబట్టి నిర్ణయం ఢిల్లీ స్థాయి లో జరగాలి. ఈ విషయాన్ని జేడీఎస్ జాతీ య అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు వివరించా’’ అని కుమారస్వామి అన్నారు. -
అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి ఎమ్మెల్యే హెడ్డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. ఇక ఆ వీడియోలు నాలుగైదేళ్ల కిందటివని అన్నారు.‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి తెలియదు’ అని హెచ్డీ రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్ వంటి అనేక విచారణలు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు.ఇక.. ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. -
Lok sabha elections 2024: కన్నడిగుల తొలి ఓటెవరికో!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నాటకలో 14 లోక్సభ స్థానాలకు శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్స్వీప్ చేయగా ఈసారి బీజేపీ–జేడీ(ఎస్) కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతోంది. జేడీ(ఎస్) పోటీ చేస్తున్న హసన్, మండ్య, కోలార్ స్థానాలకు రెండో విడతలోనే పోలింగ్ ముగియనుంది. ఆ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో జట్టు కట్టడం విశేషం! ఈసారి పలు స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది... బెంగళూరు నార్త్బీజేపీ నేత సదానంద గౌడ 2014 నుంచీ ఇక్కడ గెలుస్తున్నారు. ఈసారి మాత్రం కేంద్ర సహాయ మంత్రి శోభ కరంద్లాజె పోటీ చేస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, కాంగ్రెస్ నేత ఎంవీ రాజీవ్గౌడను ఆమె ఢీకొడుతున్నారు. గౌడ బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సభ్యుడు. ఈ స్థానం 1999 దాకా కాంగ్రెస్ కంచుకోట. 2004 నుంచీ బీజేపీ జైత్రయాత్రే సాగుతోంది. దీనికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.బెంగళూరు సౌత్1996 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోట. బీజేపీ దివంగత నేత అనంతకుమార్ ఇక్కడినుంచి ఏకంగా 28 ఏళ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు! 2019 ఎన్నికల్లో యువ నేత తేజస్వి సూర్య బీజేపీ తరఫున 3.31 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారీ ఆయనకే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారీ విజయం తనదేనని తేజస్వి ధీమాగా ఉన్నా పోరు హోరాహోరీగా సాగవచ్చంటున్నారు.హసన్మాజీ ప్రధాని దేవెగౌడ ఐదుసార్లు నెగ్గిన స్థానమిది. 2019లో మనవడు ప్రజ్వల్ రేవణ్ణను బరిలో దింపారు. బీజేపీ నేత ఎ.మంజుపై ఆయన 1.41 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా జేడీ(ఎస్) నుంచి ప్రజ్వలే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన నేతగా పేరున్న జి.పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్ పటేల్ పోటీలో ఉన్నారు. ఒకప్పుడు దేవెగౌడ, పుట్టస్వామి పోటీకి వేదికైన హసన్ వారి మనవళ్ల పోరుకు కేంద్రంగా మారింది!కోలార్ఒకప్పుడు కాంగ్రెస్కు బలమైన పట్టున్న కోలార్లో ఈసారి గట్టి పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన హామీలు ఇక్కడ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం కాంగ్రెస్కు ప్రతికూలంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేత ఎస్.మునిస్వామి 2.1 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ నేత కె.హెచ్.మునియప్పపై నెగ్గారు. ఈసారి పొత్తులో భాగంగా జేడీ(ఎస్) అభ్యర్థి ఎం.మల్లేశ్బాబు పోటీ చేస్తున్నారు. అంతర్గత విభేదాలు కూడా ఇక్కడ కాంగ్రెస్కు చేటు చేసేలా ఉన్నాయి. ఇక్కడ ఆరుసార్లు గెలిచిన మునియప్ప ఇటీవలి అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లోక్సభ టికెట్ను తన అల్లుడికి ఇప్పించుకునేందుకు ప్రయతి్నంచగా సొంత పార్టీ నేతలే మోకాలడ్డారు. సామాజిక వర్గాల ప్రభావం..రెండో దశలో భాగంగా ఎన్నికలు నిర్వహించే 14 స్థానాలకు గాను మెజారిటీ చోట్ల వొక్కళిగ సామాజిక వర్గం ఓటర్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుంటారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనా బీజేపీ దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లను ఆకర్షించడంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది.కరవు కోరలుకర్ణాటకలోని అధిక ప్రాంతాలు ప్రస్తుతం చరిత్రలోనే అతి తీవ్రమైన కరువును చూస్తున్నాయి. దాదాపు అధిక శాతం పట్టణాలను కరువు ప్రాంతాలుగా ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కరువు కోరల్లోనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఐదు గ్యారంటీలతో నెగ్గుకొచి్చన కాంగ్రెస్కు.. లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ గ్యారంటీల ప్రభావం ఇప్పుడు అంతగా పనిచేయకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. మండ్యవొక్కళిగ ఆధిపత్యమున్న స్థానమిది. గత ఎన్నికల్లో నటి సుమలత బీజేపీ మద్దతుతో 1.26 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. ఈ స్థానం పొత్తులో భాగంగా ఈసారి జేడీ(ఎస్)కు వెళ్లింది. కుమారస్వామే బరిలో ఉన్నారు. సుమలత బీజేపీలో చేరడం ఆయనకు మరింత కలిసి రానుంది. కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గౌడ (స్టార్ చంద్రు) బరిలో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి జేడీ(ఎస్) విజయం సాధించడం కూడా కుమారస్వామికి కలిసొచ్చే అంశాల్లో ఒకటి.బెంగళూరు రూరల్2019 లోక్సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానమిది. ఈసారి కూడా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు, సిట్టింగ్ ఎంపీ డీకే సురేశ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేడీ(ఎస్) నేత కుమారస్వామి గెలిచారు. కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండటంతో దేవెగౌడ అల్లుడు, ప్రముఖ వైద్యుడు సి.ఎన్.మంజునాథను బీజేపీ బరిలో దింపింది. ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. చారిత్రకంగా ఇక్కడ హస్తానిదే ఆధిపత్యం. ఆ పార్టీ ఏకంగా 13 సార్లు నెగ్గగా మూడుసార్లు జేడీ(ఎస్) గెలిచింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
HD Deve Gowda: ఫ్యామిలీ ప్యాకేజీ
కర్నాటక జనాలకు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ‘కుటుంబ కథాచిత్రమ్’ చూపిస్తున్నారు! ఆ కుటుంబం నుంచి ఈసారి కూడా ముగ్గురు లోక్సభ ఎన్నికల బరిలో ఉండటం విశేషం. తమ వొక్కళిక సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో ప్రత్యర్థులు జేడీ(ఎస్)ను ‘ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ ఆఫ్ ఫ్యామిలీ’ అంటూ జోరుగా ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవలి కాలం దాకా ఇవే విమర్శలు చేసిన బీజేపీ ఈసారి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోవడం విశేషం!కర్ణాటకలో 28 లోక్సభ స్థానాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జేడీ(ఎస్)కు మూడు దక్కాయి. వాటిలో జేడీ(ఎస్) కంచుకోట అయిన మండ్య నుంచి దేవేగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి, హసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథ్ బీజేపీ టికెట్పై బెంగళూరు రూరల్ నుంచి బరిలో ఉండటం విశేషం! చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారస్వామికి ఇవి ఆరో లోక్సభ ఎన్నికలు.వరుసగా రెండోసారి...ఇలా దేవెగౌడ కుటుంబంనుంచి ముగ్గురు లోక్సభ ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్ ప్రాంతంలో జేడీ(ఎస్)కు బాగా పట్టుంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. 2019లో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా జేడీ (ఎస్)కు 9 సీట్లు దక్కాయి. తుముకూరు నుంచి దేవెగౌడ, హసన్ నుంచి ప్రజ్వల్, మండ్య నుంచి కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేశారు. ప్రజ్వల్ ఒక్కరే గెలిచారు.ఏ ఎన్నికల్లో చూసినా...దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో రేవణ్ణ, కుమారస్వామి రాజకీయాల్లో ఉన్నారు. రేవణ్ణ హోలెనర్సిపుర ఎమ్మెల్యే. ఆయన భార్య భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇప్పించుకునేందుకు రేవణ్ణ విఫలయత్నం చేశారు. వారి ఇద్దరు కుమారుల్లో ప్రజ్వల్ హాసన్ ఎంపీ కాగా సూరజ్ ఎమ్మెల్సీ. రెండుసార్లు సీఎంగా చేసిన కుమారస్వామి తన కొడుకు నిఖిల్ను రాజకీయాల్లో నిలబెట్టేందుకు 2019 నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.జేడీ(ఎస్) యువజన విభాగం నేతగా ఉన్న నిఖిల్ 2019 లోక్సభ ఎన్నికల్లో మండ్య నుంచి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసినా ఓటమి పాలే అయ్యారు. ఈసారి మండ్యలో కుమారస్వామి గెలిస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అక్కడి నుంచి ఉప ఎన్నికలో నిఖిల్ పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారస్వామి భార్య అనిత రామనగర ఎమ్మెల్యేగా చేశారు. దేవెగౌడ మరో కుమారుడు రమేశ్ భార్య సౌమ్య కూడా గత ఎన్నికల్లో పోటీకి విఫలయత్నం చేశారు. ఆమె తండ్రి డీసీ తమ్మన్న మద్దూరు జేడీ(ఎస్) ఎమ్మెల్యే. ఇదంతా పార్టీ ప్రయోజనాల కోసమేనని కుమారస్వామి సమరి్థంచుకుంటున్నారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
మాజీ సీఎం ఫ్యామిలీ సీట్లు కన్ఫమ్!
లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థులపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికిన జేడీఎస్ కర్ణాటకలో మూడు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మండ్య నుంచి హెచ్డీ కుమారస్వామి, కోలారు నుంచి మల్లేష్బాబు, హాసన్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణల పేర్లు వెల్లడించింది. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి మండ్య లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన చన్నపట్టణ నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామి పదేళ్ల విరామం తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆయన చిక్కబల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా ప్రస్తుత ఎంపీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ మనవడు, కుమారస్వామి మేనల్లుడు ప్రజ్వల్ రేవణ్ణవరుసగా రెండవసారి హాసన్ నుండి పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఈయన ఇదే స్థానం నుండి 2019 లోక్సభ ఎన్నికలలో అరంగేట్రం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎం. మల్లేష్ బాబు నిలిచారు. 2023 ఎన్నికల్లో బంగారుపేట (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎన్ నారాయణస్వామి చేతిలో ఓడిపోయారు. -
కూటమిలో ఘర్షణ.. బీజేపీ నేతపై జేడీఎస్ ఎమ్మెల్యే విమర్శలు
బెంగళూరు: లోకసభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ-జేడీఎస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపకం కూడా అయిపోయంది. అయితే తాజాగా ఇరు పార్టీల నేతల మధ్య అసమ్మతి బయటపడింది. ఇరుపార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచార సమావేశంలో జేడీఎస్-బీజేపీ నేతల ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప బీజేపీ నేత కొండజ్జి విశ్వనాథ్పై విమర్శలు చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తన ఓటమికి కారణం కొండజ్జి విశ్వనాథ్ అని సమావేశంలో విమర్శలు చేయటంతో ఒక్కసారిగా కార్యకర్తల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గతంలో జేడీఎస్లో ఉన్న విశ్వనాథ్ అనంతరం బీజేపీలో చేరారు. అయితే ఈ సమావేశంలో విశ్వనాథ్ మాట్లాడటానికి ప్రయత్నించగా బీజేపీ సీనియర్ నేత సోమన్న అడ్డుకున్నారు. ఇక.. జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభించింది. కొంత సమయం తర్వాత ఇరు పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ సద్దుమణిగింది. బీజేపీతో పొత్తులో భాగంగా జేడీఎస్.. హసన్, మాండ్య, కోలార్ లోక్సభ స్థానాలను బీజేపీ ఇచ్చింది. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు డా. మంజూనాథ్ బీజేపీ టికెట్ మీద బెంగళూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కుమార్ను పోటీలోకి దింపింది. పాత మైసూరు ప్రాంతంలో.. జేడీఎస్ పొత్తుతో బీజేపీ ఒక్కలిగ ఓటర్ల మద్దుతు పొందాలని భావిస్తోంది. -
జేడీ(ఎస్) ఆత్మహత్యకు పాల్పడుతోంది: డీకే శివకుమార్
బెంగళూరు రూరల్ బీజేపీ టికెట్పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్ను పోటీకి దింపడం ద్వారా జేడీ(ఎస్) ఆత్మహత్యకు పాల్పడుతోందని అన్నారు. సీట్ల పంపకంపై జేడీ(ఎస్), బీజేపీ కూటమితో నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందిస్తూ.. నేను ఇది ఊహించాను. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జేడీ(ఎస్) ఇబ్బంది పడుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన భాగస్వాములతో ఇలాగె చేస్తోందని అన్నారు. మాజీ సీఎం, బీజేపీ ఎంపీ డీవీ సదానంద గౌడను కాంగ్రెస్లోకి చేర్చుకునే యోచనలో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రాజకీయ నాయకులకు పార్టీ టికెట్స్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, మరొక పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడం సహజం అన్నారు. ఆయనూరు మంజునాథ్కు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో జేడీఎస్ టికెట్పై పోటీ చేశారు. ముదిగెరెలో ఎంపీ కుమారస్వామి టికెట్ నిరాకరించడంతో జేడీ(ఎస్) టికెట్పై పోటీ చేశారు. పార్టీ సిద్ధాంతాలను అంగీకరించి పార్టీలో చేరిన వారిని మేము తీసుకుంటాము అన్నారు. అయితే సదానందగౌడకు కాంగ్రెస్ టికెట్ ఇస్తారా అనే దానిపై తాను వ్యాఖ్యానించలేనని చెప్పారు. -
‘‘2 సీట్ల కోసం పొత్తా..? సొంతగానే గెలుస్తాం’’
బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత కుమారస్వామి అన్నారు. బీజేపీతో పొత్తు విషయమై మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘పొత్తులో భాగంగా మేం ఆరు, ఏడు సీట్లు అడగడం లేదు. మూడులేదా నాలుగు సీట్లు మాత్రమే అడుగుతున్నాం. మా బలమేంటో బీజేపీకి తెలుసు. మాకు బీజేపీపై నమ్మకం ఉంది. రెండు సీట్ల కోసం నేను పొత్తు పెట్టుకోవాలా’ అని కుమారస్వామి ప్రశ్నించారు. పొత్తు లేకుండా పోటీ చేసినా మాండ్యా, హసన్ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మాండ్యా, హసన్, కోలార్ ఎంపీ సీట్లు తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీని అడిగినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే బీజేపీ కర్ణాటకలో ఉన్న 28 సీట్లకు గాను 26 మంది అభ్యర్థులను మార్చ్ 13న రిలీజ్ చేసిన రెండో జాబితాలో ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడులో బీజేపీ వ్యూ హం -
సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు..
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. వీడియోలో.. ఓ మీటింగ్లో జనం మధ్య ఉన్న యతీంద్ర తన తండ్రి సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో సీఎం చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘వివేకానంద.. ఎక్కడ? నేను ఆ పేరు ఇవ్వలేదు.. ఈ మహదేవ్ ఎవరు? నేను అయిదు మాత్రమే ఇచ్చాను’ అని మాట్లాడారు..ఈ వీడియోను జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ట్విటర్లో షేర్ చేశారు. క్యాష్ఫర్ పోస్టింగ్ (ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయడం) కుంభకోణంలో యతీంద్ర భాగమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో క్యాష్ ఫర్ పోస్టింగ్ స్కామ్ నడుస్తోందని, ఎలాంటి భయం లేకుండా అవినీతి చోటుచేసుకుంటున్నట్లు అన్నారు.. దానికి సాక్ష్యం ఈ వీడియోనే అని తెలిపారు. సీఎం ఆఫీసు కలెక్షన్ కేంద్రంగా మారిందని, సిద్దరామయ్య కుమారుడు కలెక్షన్లకు రాకుమారుడిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ట్రాన్స్ఫర్ మాఫియా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితేకొడుకు వీడియోపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. యతీంద్రపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. యతీంద్ర తెలిపిన జాబితా వరుణ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల భవనాల మరమ్మతుల కోసం కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) ఫండ్స్ గురించి అని తెలిపారు. క్యాష్ ఫర్ ఫోస్టింగ్ గురించి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో సుధీర్ఘ పోస్టు చేశారు. Unfortunately, former Chief Minister H.D. Kumaraswamy, who was involved in rampant corruption during his tenure, thinks all are like him. His pessimistic attitude does not allow him to think beyond corruption. His insecurity in politics often forces him to fabricate fake stories… — Siddaramaiah (@siddaramaiah) November 16, 2023 అయిదు పేర్లు అని చెబితే బదిలీ అవుతుందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాము మాట్లాడింది క్యాష్ ఫర్ ట్రాన్స్ఫర్ అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కాగా వరుణ నుంచి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ Yathindra Siddaramaiah : ವರುಣಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಡಾ.ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹವಾ ಪ್ರತಿಕ್ಷಣದ ಸುದ್ದಿಗಾಗಿ ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ಲೈವ್ ಲಿಂಕ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ Click Here to Watch NewsFirst Kannada Live Updates LIVE Link : https://t.co/GFweTyzikB@siddaramaiah#CMSiddaramaiah #YathindraSiddaramaiah pic.twitter.com/Py38uVLcVv — NewsFirst Kannada (@NewsFirstKan) November 16, 2023 -
డీకే సీఎం అయితే మద్దతిస్తాం: కుమార
బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు జేడీయస్లోని 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని ఆ పార్టీ మాజీ సీఎం హెచ్డీ.కుమారస్వామి ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఎంతమంది సీఎం అవుతారో తెలియదని వ్యంగ్యమాడారు. శనివారం నగరంలోని పార్టీ ఆఫీసులో రాష్ట్రంలో కరువు పరిస్థితిపై సమీక్ష చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే తాత్కాలిక ముఖ్యమంత్రి ప్రభుత్వమని పిలవవచ్చునని ఆరోపించారు. కరువు నుంచి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. సీఎం అవుతానన్న మంత్రి ప్రియాంక ఖర్గే కలబురిగి ప్రజలకు చేసింది ఏమిటి అన్నారు. గృహలక్ష్మీ పథకంలో ఎంతమందికి డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు. -
వేడెక్కుతున్న బెళగావి రాజకీయం
బనశంకరి: గత జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన బెళగావి పీఎల్డీ బ్యాంకు అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ పదవిని తమ వర్గీయులకు కట్టబెట్టాలని మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, మరో వైపు ప్రజాపనులశాఖమంత్రి సతీశ్జార్కిహోళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో మంత్రుల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. సంకీర్ణ సర్కార్ హయాంలో తమవర్గానికి చెందిన నేతకు పీఎల్డీ బ్యాంకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అప్పట్లో బెళగావి గ్రామాంతర ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మీహెబ్బాల్కర్, గోకాక్ ఎమ్మెల్యే రమేశ్జార్కిహొళి పట్టుబట్టారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న డీకే.శివకుమార్ లక్ష్మీ హెబ్బాల్కర్కు మద్దతుగా నిలవగా రమేశ్జార్కిహొళికి సోదరుడు, మంత్రిగా ఉన్న సతీశ్జార్కిహొళి మద్దతు ఇచ్చారు. సోదరుల సవాల్కు ఎదురొడ్డి నిలబడిన లక్ష్మీహెబ్బాల్కర్ చివరికి వారిపై పైచేయి సాధించి తమ మద్దతుదారుడికి పీఎల్డీ బ్యాంకు అధ్యక్ష పదవి దక్కేలా చూశారు. ఈ వివాదం రాజీద్వారా పరిష్కారమైనట్లు కనబడినప్పటికీ లక్ష్మీహెబ్బాళ్కర్– రమేశ్జార్కిహొళి బ్రదర్స్ మధ్య వర్గపోరు అలాగే కొనసాగి ఆపరేషన్ కమలకు దారితీసి సంకీర్ణప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. అనంతరం మూడన్నరేళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కాగా ఈ ఏడాదిజరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కానీ పీఎల్డీ బ్యాంకు అధ్యక్ష పదవి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య పోరు మొదలైంది. పైకి ఇద్దరు మంత్రులు కలిసిపనిచేస్తున్నట్లు కనబడినా అధికారుల బదిలీలు, స్థానికంగా పార్టీ కార్యకలాపాల్లో వైరుధ్యం అలాగే ఉంది. లక్ష్మీహెబ్బాల్కర్కు డిప్యూటీసీఎం డీకే.శివకుమార్ లాశీస్సులు ఉండటంతో జార్కిహొళి కుటుంబానికి తలనొప్పిగా మారింది. మంత్రి వర్గ కూర్పులో కూడా మహిళా ఎమ్మెల్యేలు అందరిని వెనక్కి నెట్టి లక్ష్మీహెబ్బాల్కర్ మంత్రివర్గంలో స్ధానం దక్కించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతవ్యక్తుల సహకారం ఉండటంతో లక్ష్మీహెబ్బాల్కర్ పీఎల్డీ బ్యాంకుపై పట్టుసాధించాలని భీష్మించుకున్నారు. దీనిపై బహిరంగంగా మాట్లాడలేక రగిలిపోతున్న సతీశ్జార్కిహొళి 20 మందికి పైగా ఎమ్మెల్యేలను విహారయాత్రకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ–జేడీఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్లో విభేదాలు కొంపముంచే అవకాశం ఉంది. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య తన ఆప్తుల ద్వారా రాజీప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో బయటివారి జోక్యం తగ్గకపోతే రానున్న రోజుల్లో తీవ్రరూపం దాల్చేఅవకాశం ఉంది. -
జేడీఎస్ అధినేత దేవెగౌడ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి ఆగ్రహం
తిరువనంతపురం: బీజేపీతో పొత్తు విషయంలో ఇటీవల మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో బీజేపీతో పొత్తుకు కేరళ సీఎం ఒప్పుకున్నట్లు ఇటీవల హెచ్డీ దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై విజయన్ మాట్లాడుతూ.. దేవెగౌడ ప్రకటన పూర్తి అవాస్తవమని, అసంబద్దమని పేర్కొన్నారు. రాజకీయ స్వలాభం కోసం అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాగా కేరళలో పినరయి విజయన్ పార్టీ సీపీఎంతో పొత్తు కొనసాగిస్తున్న జేడీఎస్.. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జీడీఎస్ కేరళ యూనిట్ కూడా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టింది. అయితే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా జేడీఎస్ రాష్ట్ర యూనిట్లన్నీ బీజేపీతో పొత్తుకు సమ్మతించాయని దేవెగౌడ గురువారం ప్రకటించారు. కేరళ యూనిట్ కూడా సమ్మతించింది ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వంలో తాము భాగమేనని పేర్కొన్నారు. అక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాల జేడీఎస్ విభాగాలు అర్థంచేసుకొని మద్దతిచ్చాయని తెలిపారు. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వంలోని తమ మంత్రి కే కృష్ణన్కుట్టి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొన్నారు.పార్టీని కాపాడుకునేందుకు కర్ణాటకలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పూర్తి సమ్మతి తెలిపారని దేవెగౌడ పేర్కొన్నారు. కుమారస్వామిని సీఎం చేసేందుకే.. ఈ వ్యాఖ్యలను తాజాగా పినరయి విజయన్ ఖండించారు. జేడీఎస్ అధినేత చేసిన ప్రకటన అవాస్తమని పేర్కొన్నారు. కేవలం తన రాజకీయ పరిణామాలను సమర్థించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంతేగాక తన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు దేవెగౌడ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని దీని ద్వారా తన పార్టీ సిద్ధాంతాలకు వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు. చదవండి: టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మేం జోక్యం చేసుకోం కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు(ఎల్డీఎఫ్) జెడీఎస్ చాలా కాలంగా మిత్రపక్షంగా ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ నాయకత్వ నిర్ణయాన్ని విబేధించి ఎల్డీఎఫ్కు తమ నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు జేడీఎస్ రాష్ట్ర నాయకత్వం ప్రకటించడంపై ప్రశంసలు కురిపించారు. జేడీఎస్ అంతర్గత వ్యవహారాల్లో తాను కానీ, సీపీఎం కానీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అది తమ పద్దతి కాదని తెలిపారు. కేరళలో వామపక్ష పార్టీతోనే.. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యే కె కృష్ణన్కుట్టి.. దేవెగౌడ ప్రకటనను శుక్రవారం ఖండించారు. తాను కేరళ జీడీఎస్ అధ్యక్షుడు మాథ్యూ టీ థామస్ కలిసి దేవెగౌడను కలిశామని, బీజేపీలో చేరడంపై తమ అభ్యంతరం తెలియజేశామని చెప్పారు. కేరళలో వామపక్ష పార్టీతోనే(సీపీఎం) కలిసి ఉండాలని రాష్ట్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. -
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో బీజేపీకి తన పాత మిత్రుడు తోడు నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ చేరిక తదనంతర.. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. జేడీఎస్కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు. 'ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji. I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc — Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023 బీజేపీతో చేరిపోతున్నారా..? అని గతవారం కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. అయితే.. లోక్సభ ఎన్నికల కోసం నాలుగు సీట్లు జేడీఎస్కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అవుతుందా? రాష్ట్ర రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనేదానిపై మాత్రం ఇరు వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
BJP Alliance: బీజేపీతో జట్టు ఖరారు!
ఢిల్లీ/బెంగళూరు: భారతీయ జనతా పార్టీ(BJP), జనతా దళ్(సెక్యులర్) (JDU) పొత్తు దాదాపు ఖరారు అయ్యింది. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి.. ఇరు పార్టీలు కలిసే పోటీ చేయాలని ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. సీట్ల పంపకంపై చర్చలు ఇంకా తుది దశలో ఉన్నాయి. ఆ నిర్ణయం ప్రధానిదేనని తెలుస్తోంది. బీజేపీ-జేడీయూ.. ఇరు పార్టీల పొత్తుల గురించి చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డాను, అమిత్ షాను.. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో.. లోక్సభ పోటీకి గానూ జేడీఎస్ ఐదు స్థానాల్ని కేటాయించాలనే ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచింది. అందుకు ఆ ఇద్దరు నేతలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీనే తీసుకుంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ-జేడీఎస్ పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లే. జులైలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరే చేస్తామంటూ చేసిన ప్రకటనను.. పక్కన పెట్టేసి మరీ బీజేపీతో సంప్రదింపులు జరిపారు 91 ఏళ్ల దేవగౌడ. మరోవైపు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి సైతం ఇదే తరహాలో స్వరం మార్చారు. ఈ క్రమంలో.. మాండ్యా, హసన్, తుమకురు, చిక్బళ్లాపుర్, బెంగళూరు రూరల్ సీట్లను జేడీఎస్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాల ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ సోలోగా 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ చోరో సీటు దక్కించుకున్నాయి. అందులో హసన్ స్థానం నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్ ఎన్నిక ప్రకక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ ఈ మధ్యే కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందింది. ఈ నేపథ్యంలో.. లోక్సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది. ఇదీ చదవండి: అందుకే గుడికి వెళ్లలేదు-సీఎం సిద్ధరామయ్య -
దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్..
సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్ లోక్సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ తరపున లోక్సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. అపోలోకు తరలింపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Health bulletin on HD Kumaraswamy | "Currently, he is hemodynamically stable, comfortable and coherent and has been kept under close observation," Apollo Specialty Hospital, Jayanagar pic.twitter.com/qMDI9wlyqz — ANI (@ANI) August 30, 2023 ఇక, చికిత్స అనంతరం అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించారు. Former Karnataka Chief Minister HD Kumaraswamy admitted to Apollo Hospital in Bengaluru as he suffers a high temperature. A health bulletin released by the hospital says that the former CM is responding to treatment and is on the road to recovery. #HDKumaraswamy #Karnataka… pic.twitter.com/uDdhqa7x0c — NewsFirst Prime (@NewsFirstprime) August 30, 2023 గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు.. -
జేడీఎస్ భవిష్యత్పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్(జనతా దళ్(సెక్యులర్)) పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తును కొనసాగించింది. కానీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి తర్వాత జేడీఎస్ పార్టీ భవిష్యత్తుపై పునరాలోచనలో పడింది. బీజేపీతో కలిసే వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధినేత దేవె గౌడ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నామని జనతా దళ్(సెక్యులర్) అధినేత హెచ్డీ దేవె గౌడ తెలిపారు. దీంతో బీజేపీతో జేడీఎస్ పొత్తు కొనసాగించనుందనే అంశానికి తెరపడింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి జేడీఎస్ పోరాడుతుందని దేవె గౌడ కుమారుడు కుమారస్వామి గత వారం తెలిపాడు. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ జేడీఎస్.. బీజేపీతో కలిసే పోటీ చేయనుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనూ ఐఏఎస్ల బదిలీల అంశంలో బీజేపీ నేతలతో పాటు జేడీఎస్ సభ్యులు కూడా పోరాడారు. ఈ క్రమంలో పలువురు నేతలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఈ అంశాల అనంతరం బెంగళూరులో మీడియా సమావేశం అనంతరం మాట్లాడిన దేవె గౌడ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని స్పష్టం చేశారు. ఒక్క సీటు గెలిచినా పర్వాలేదు.. కానీ తాము తప్పకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతామని అన్నారు. తమకు ప్రాబల్యం ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేయనున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలతో చర్చించి ఆయా స్థానాలను నిర్ణయిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మణిపూర్ రచ్చ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు -
పొలిటికల్ భేటీలు.. బిగ్ షాకిచ్చిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. దీంతో, దేశంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇక, విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, కాసేపట్లో ప్రతిపక్ష నేతల సమావేశం ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేదు. ఈ నేపథ్యంలో విపక్షాల మహాకూటమిలో తాము చేరే ప్రసక్తి లేదన్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఆ ఫ్రంట్నూ చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. On joint Opposition meeting in Bengaluru, JD(S) leader HD Kumaraswamy says, "Opposition never considered JD(S) a part of them. So, there is no question of JD(S) being a party of any Mahagathbandhan." On any invitation from NDA, he says, "NDA has not invited our party for any… pic.twitter.com/hPoH2ClgDw — ANI (@ANI) July 17, 2023 మరోవైపు.. రానున్న లోక్సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: వీడియో: వందే భారత్ రైలులో మంటలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణీకులు -
కన్నడ నాట పొత్తు రాజకీయం
శివాజీనగర: రానున్న లోక్సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీజేపీ హైకమాండ్తో జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. దీనికి జేడీఎస్ను ఆహ్వానించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. పిలుపు వస్తే వెళ్లాలని కుమారస్వామి సిద్ధమయ్యారు. అక్కడ చర్చలు ఫలిస్తే లోక్సభ ఎన్నికలకు పొత్తు కుదిరే అవకాశముంది. కానీ కుమారస్వామితో పొత్తు పెట్టుకొంటే పాత మైసూరు భాగంలో పార్టీ ప్రభావం తగ్గుతోంది, అంతేకాకుండా ఒక్కలిగుల ఓట్ బ్యాంకును కోల్పోతాము. పొత్తు వద్దని బీజేపీ రాష్ట్ర నాయకులు, అందులోనూ ఒక్కలిగ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది గ్రహించిన కుమారస్వామి రాష్ట్ర నాయకులను కాదని బీజేపీ కేంద్ర నాయకులతో పొత్తు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్తో చేతులు కలిపి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుపొందాలని బీజేపీ కూడా ఆశిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డుస్థాయిలో 20కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి అదే జాదూను పునరావృతం చేయాలనుకుంటోంది. కాగా, బీజేపీ–జేడీఎస్ పొత్తు వార్తలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అవకాశవాద జేడీఎస్ పార్టీ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించింది. జేడీఎస్ను చీల్చేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ ఇదిలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగడలో ఉంది. బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. సుమారు 12 జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకు రావటం ద్వారా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా చూడాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జేడీఎస్కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా వచ్చే వారికి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అదనుచూసి జేడీఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పథకం వేస్తోంది. చర్చలు జరిగాయి: బొమ్మై పొత్తు గురించి బీజేపీ మాజీ సీఎం బస్వరాజ బొమ్మై ఆదివారం స్పందిస్తూ తమ హైకమాండ్, జేడీఎస్ అధినేత దేవేగౌడ మధ్య పొత్తులపై చర్చలు జరిగాయన్నారు. చర్చలు సఫలమైతే రాజకీయ మార్పులు తథ్యమన్నారు. -
బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
కర్ణాటక: జేడీఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ.దేశపాండే ఆఫీసులో జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, పార్టీలోని 19 మంది కొత్త ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమార మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. -
‘కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్.. మూడు నెలల్లో అనేక మార్పులుంటాయ్’
కర్ణాటక: రాబోయే అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఉంటాయని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. గురువారంనాడు రామనగరలో మాట్లాడిన ఆయన కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా ఉండదని, మూడు నెలల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. త్వరలో తాలూకా,జిల్లా పంచాయతీల ఎన్నికలు వస్తాయని, అప్పుడు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో అనుకున్న స్థానాల్లో గెలవకపోవడానికి అనేక కారణాలున్నాయని, ఈ ఓటమి వల్ల పార్టీకి ఢోకా ఏమీ లేదని, ఇలాంటి పరాజయాలు తమకు కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంత సులభం కాదన్నారు. ప్రకటించిన పథకాలకు ఏడాదికి కనీసం రూ. 70 వేల కోట్లు అవసరమని, అన్ని నిధులను ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. -
అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్!
హంగ్ వస్తే ఎలా కింగ్మేకర్ కావాలో అనే ఆలోచనలోనే ఉండి అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్! -
Karnataka: తనయుని కోసం త్యాగం
దొడ్డబళ్లాపురం: మాజీ ప్రధాని మనవనిగా, మాజీ సీఎం కుమారునిగా, సినీ హీరోగా ఉన్న నిఖిల్ కుమారస్వామి వరుసగా అపజయాలు చవిచూస్తున్నాడు. గత ఎంపీ ఎన్నికల్లో మండ్య నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి నిలబడి మరోసారి మట్టి కరిచాడు. దీంతో దేవెగౌడ కుటుంబం మూడోతరం రాజకీయ అరంగేట్రానికి కాలం కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది. తనయుని కోసం త్యాగం తాత, తండ్రి, తల్లిని గెలిపించిన రామనగర ప్రజలు నిఖిల్ను అసెంబ్లీకి పంపించలేకపోయారు. తల్లి అనిత కుమారస్వామి తన నియోజకవర్గాన్ని కుమారుని కోసం త్యాగం చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించి అతన్ని గెలిపించాలని కోరినా ఓటర్లు పట్టించుకోలేదు. 10,715ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ గెలవడంతో జేడీఎస్ పెద్దలు నిశ్చేషు్టలయ్యారు. ఇక్కడ సునాయాస విజయం సాధ్యమని వారు అనుకున్నారు. రామనగరను పట్టించుకోలేదనా? నిఖిల్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామనగర తాలూకాను ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడి నుంచి దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరు గెలిచినా, ప్రజల చేతికి అందరని, సమస్యలు చెప్పుకోవాలంటే స్థానిక జేడీఎస్ నేతల కాళ్లు పట్టుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్థానిక జేడీఎస్ నేతలను గుర్తించకపోవడం, అధికారంలో ఉన్న సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజల్లో నిరసన భావం ఏర్పడింది. కోవిడ్ సమయంలో అనితాకుమారస్వామి నియోజకవర్గంలో పర్యటించింది లేదు. టీపీ, జీపీ, జడ్పీ తదితర ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీచేస్తే కనీసం వారిని పెద్దలెవరూ పట్టించుకుని సాయం చేసింది లేదని, అందుకే ఈ పరాజయం అని స్థానికులు పేర్కొన్నారు. -
ఆ ఐదు శాతమే! రాత మార్చింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విలక్షణమైనదనే చెప్పాలి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలవారీ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి ట్రెండునే మార్చేసిన గెలుపది. చారిత్రకంగా బీజేపీ, జేడీ(ఎస్)ల కంచుకోటలైన కీలక ప్రాంతాల్లో ఈసారి కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అది కూడా రెండు పార్టీలనూ ఒకే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బ తీయడం విశేషం. బీజేపీ ఓడినా మొత్తమ్మీద ఆ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉండటం మరో విశేషం. బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36.2 శాతం ఓట్లు రాగా ఈసారీ 36 శాతం దక్కాయి. కాకపోతే ఈసారి జేడీ(ఎస్) రాష్ట్రవ్యాప్తంగా కోల్పోయిన 7 శాతం ఓట్లలో 5 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. అదే సమయంలో అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకంగా మారిన పలు అసెంబ్లీ స్థానాల్లో కలిపి మొత్తమ్మీద 5 శాతం ఓట్లను కాంగ్రెస్కు కోల్పోయింది. దాంతో మెజారిటీకి బీజేపీ సుదూరంలో ఆగిపోగా ఆ ఓట్ల ఊపుతో కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగరేసింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ, ఈసారి 43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 66 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి గట్టి పట్టున్న ముంబై కర్ణాటక, జేడీ(ఎస్) దుర్గమైన పాత మైసూరు ప్రాంతాలు ఈసారి కాంగ్రెస్కు జై కొట్టాయి. కర్ణాటక ఫలితాల ప్రాంతాలవారీ విశ్లేషణలో ఇలాంటి పలు ఆసక్తికరమైన విశేషాలు తెరపైకి వస్తున్నాయి... కోస్తా కర్ణాటక బీజేపీ కంచుకోటల్లో ఈ ప్రాంతమూ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ బీజేపీదే పై చేయి. ఈసారి కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ రెట్టింపు సీట్లు నెగ్గిన, ఆ పార్టీకి ఊరటగా నిలిచిన ఏకైక ప్రాంతం కోస్తానే. ఇక్కడి 19 స్థానాల్లో బీజేపీ 13, కాంగ్రెస్ 6 నెగ్గాయి. అయినా 2018తో పోలిస్తే బీజేపీకి 3 సీట్లు తగ్గగా ఆ మేరకు కాంగ్రెస్కు పెరిగాయి. బీజేపీకి దాదాపుగా 3 శాతం ఓట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్కు పెరగడమే ఇందుకు కారణం. బెంగళూరు సిటీ రాజధాని కావడంతో పూర్తిగా నగర ఓటర్లతో కూడిన వైవిధ్యమైన ప్రాంతమిది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రతి ఎన్నికల్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ రెండు పార్టీలకూ దాదాపుగా చెరో 40 శాతం ఓట్లొచ్చాయి. ఈసారి కూడా బీజేపీ 46 శాతం, కాంగ్రెస్కు 41 శాతం ఓట్లు సాధించాయి. అయితే బీజేపీ 2018 కంటే 4 సీట్లు ఎక్కువగా గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాలు కోల్పోయింది. ఇక జేడీ(ఎస్) ఇక్కడ 2018లో గెలిచిన 2 సీట్లనూ కోల్పోయింది. ముంబై కర్ణాటక లింగాయత్ల ప్రాబల్యమున్న ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. 1990లో రాజీవ్గాంధీ చేతిలో తమ సామాజిక వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్కు జరిగిన ఘోర అవమానం నేపథ్యంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ను దూరం పెట్టిన లింగాయత్లు ఈసారి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. దాంతో దాదాపు 45 శాతం ఓట్లతో మొత్తం 50 స్థానాల్లో ఏకంగా 33 సీట్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. గత 3 దశాబ్దాల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్ల శాతం 40 శాతం దాటడం ఇదే తొలిసారి! ఇక బీజేపీ ఈసారి దాదాపు 3 శాతం ఓట్లను కాంగ్రెస్కు కోల్పోయింది. దాంతో 2018తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయి 16 సీట్లకు పరిమితమైంది. లింగాయత్ల జనాభా 20 శాతానికి పైగా ఉండి వారి ఓట్లు నిర్ణాయకంగా మారే మొత్తం 69 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటిలో కాంగ్రెస్ ఏకంగా 45 సీట్లు కొల్లగట్టగా బీజేపీకి కేవలం 20 స్థానాలు దక్కాయి. పాత మైసూరు 64 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో అతి పెద్ద ప్రాంతమిది. జేడీ(ఎస్)కు ఆవిర్భావం నుంచీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఈసారి కాంగ్రెస్ ఇక్కడ ఏకంగా 42 శాతం ఓట్లు సాధించింది. 2018 కంటే ఇది ఏకంగా 7 శాతం ఎక్కువ! దాంతో కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యధికంగా ఇక్కడ 43 సీట్లు కొల్లగొట్టింది. మరోవైపు జేడీ(ఎస్) 2018తో పోలిస్తే ఏకంగా 9 శాతం ఓట్లు కోల్పోయింది. అప్పుడు 26 సీట్లు నెగ్గగా ఈసారి 14కు పరిమితమైంది. ఇక బీజేపీకి ఓట్లు 2.8 శాతం పెరిగినా ఏకంగా 11 సీట్లు తగ్గాయి! సెంట్రల్ కర్ణాటక ఇది స్వింగ్ ప్రాంతంగా పేరుబడింది. ఒక్కోసారి ఒక్కో పార్టీని ఆదరిస్తూ వస్తోంది. 2008లో బీజేపీని, 2013లో కాంగ్రెస్ను అక్కున చేర్చుకుంది. మళ్లీ 2018లో ఇక్కడి 23 సీట్లలో బీజేపీ 16 గెలవగా ఈసారి కాంగ్రెస్ 15 నెగ్గింది! హైదరాబాద్ కర్ణాటక తన కంచుకోటైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఈసారి స్వీప్ చేసేసింది. ఎస్సీల ఆదరణకు తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం కావడం ఈసారి ఆ పార్టీకి మరింత కలిసొచ్చింది. దాంతో 46 శాతం ఓట్లతో మొత్తం 40 సీట్లకు గాను ఏకంగా 26 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ 10 సీట్లకు పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుమారస్వామికి భంగపాటు...
-
ఘోరంగా ఓటమిపాలైన నిఖిల్
దొడ్డబళ్లాపురం: ఎన్నో ఏళ్లుగా రామనగర జిల్లాను కంచుకోటగా భావిస్తున్న జేడీఎస్కు ఈసారి ఘోర పరాజయం ఎదురైంది. జిల్లాలో నాలుగు స్థానాలపైకి మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగురవేసింది. రామనగర నియోజకవర్గంలో మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్కుమారస్వామి ఘోరంగా ఓటమిపాలయ్యాడు. దీంతో జేడీఎస్ కంచుకోటకు బీటలు పడ్డాయి. అనూహ్యంగా రామనగరలో కాంగ్రెస్ అభ్యర్థి, డీకే శివకుమార్ ఆప్తుడు ఇక్బాల్ హుసేన్ విజయం సాధించారు. మాగడిలో హెచ్సీ బాలక్రిష్ణ, కనకపురలో డీకే శివకుమార్ విజయం సాధించారు. ఒక్క చెన్నట్టణలో మాత్రం కుమారస్వామి ఎలాగో గట్టెక్కారు. చెన్నపట్టణలో అపర భగీరథుడిగా పిలవబడే ఎమ్మెల్సీ యోగేశ్వర్ పరాజయం పాలవడం చర్చనీయాంశంగా మారింది. -
‘కింగ్మేకర్’ కలలు భగ్నం.. జేడీఎస్ను ఆ తప్పులే దెబ్బ తీశాయా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్)ను పూర్తిగా నిరాశపరిచాయి. ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలుచుకుంది. మరోసారి ‘కింగ్మేకర్’ అవ్వాలన్న జేడీ(ఎస్) కలలు భగ్నమయ్యాయి. కర్ణాటకలో 2004, 2018లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడి జేడీ(ఎస్) అధికారంలోకి వచి్చంది. హంగ్ వచి్చన ప్రతిసారీ ఆ పార్టీ కింగ్మేకర్ అవతారం ఎత్తుతూ వచి్చంది. 2004లో బీజేపీతో, 2018లో కాంగ్రెస్తో జతకట్టింది. కంచుకోటలో ప్రభావం అంతంతే 2018 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందిన జేడీ(ఎస్) ఈసారి మాత్రం 19 సీట్లకే పరిమితం అయింది. తమ కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలోనూ జేడీ(ఎస్) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల ముందు ‘పంచరత్న రథయాత్ర’ పేరిట జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన బస్సు యాత్ర సత్ఫలితాన్ని ఇవ్వలేదు. 87 ఏళ్ల రాజకీయ దురంధరుడు హెచ్డీ దేవెగౌడ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. అధికారం అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను వేడుకున్నారు. అయినా ఉపయోగం కనిపించలేదు. రాష్ట్రంలో జేడీ(ఎస్) ఓట్ల శాతం క్రమంగా పడిపోతోంది. 2004లో ఆ పారీ్టకి 20.8 శాతం, 2018లో 18 శాతం, ఈసారి దాదాపు 13 శాతం ఓట్లు లభించాయి. నిఖిల్ గౌడ పరాజయం దేవెగౌడ కుటుంబంలోని లుకలుకలు కూడా ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ పెద్ద కోడలు భవానీ రేవణ్ణ.. హాసన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని తన వదినకు ఇచ్చేందుకు కుమారస్వామి సానుకూలంగా లేకపోవడంతో కుటుంబంలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇలా కుటుంబంలో వివాదాలు, పారీ్టలో కుటుంబ పెత్తనం అనే అపవాదులు జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయగా, ఇద్దరు గెలిచారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్∙రామనగరలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఓటమిని పరాజయం పాలైన నిఖిల్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం గమనార్హం. హాసన్లో దేవెగౌడ కుటుంబాన్ని సవాలు చేసిన బీజేపీ అభ్యర్థి ప్రీతం గౌడ తన ప్రత్యర్థి హెచ్పీ స్వరూప్ను ఓడించారు. చెన్నపట్టణలో కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం జేడీ(ఎస్) కొంతలో కొంత ఊరట కలిగించింది. హోలెనరసిపురలో దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్ణ గెలుపొందారు. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
Karnataka: ఖట్టా-మీఠా
చాలా ఏండ్ల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది ఓ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనబర్చిన ఓటర్లు.. చివరికి మంత్రులను, పలువురు కీలక నేతలను సైతం తమ ఓటు ఆయుధంతో తిరస్కరించారు. ► ఈ లిస్ట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురించి. బీజేపీ నుంచి సీటు నిరాకరించడంతో కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పోటీని ఆసక్తికరంగా గమనించాయి రాజకీయవర్గాలు కూడా. అయితే.. హుబ్బళ్లి-ధార్వాడ్- సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ► దేవగౌడ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దేవేగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.. రామ నగర స్థానం నుంచి ఓటమి పాలయ్యాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ నెగ్గారు. ► బొమ్మై సర్కారులో మంత్రులుగా చేసిన 13 మంది ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ► వరుణ నుంచి నుంచి సోమన్న ఓటమిపాలుకాగా.. బళ్లారి నుంచి పోటీ చేసిన శ్రీరాములు, చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిన కె. సుధాకర్(హస్య నటుడు బ్రహ్మనందం ఈయన తరపున ప్రచారం చేశారు కూడా), కృష్ణ రాజపేట నుంచి కేసీ నారాయణ గౌడ, నవల్ గుండ్ స్థానం నుంచి పోటీ చేసిన సీసీ పాటిల్, హిరికేరూర్ నుంచి పోటీ చేసిన బీసీ పాటిల్ ఓటమి చెందారు. ► బీజేపీ కీలక నేత, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్ మంగళూరు నుంచి ఓటమి పాలయ్యాడు. గెలిచిన ప్రముఖులు.. ► షిగ్గావ్ నుంచి పోటీ చేసిన భాజపా నేత, సీఎం బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారీ విజయం సాధించారు. ► వరుణ నుంచి పోటీ చేసి మాజీ సీఎం సిద్ధ రామయ్య విజయం సాధించారు. ► కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురా నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డీకేకు లక్షకు పైగా ఓట్లు (70శాతం) రాగా.. భాజపా, జేడీఎస్ అభ్యర్థులకు 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ► జేడీఎస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నుంచి మరోసారి గెలుపొందారు. ► కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణ సైతం విజయం సాధించారు. ► ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నుంచి పోటీ చేసి గెలు పొందారు. ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన గాలి జనార్దన రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు. ► షెట్టర్ మాదిరే బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన లక్ష్మణ్ సావడి అథని స్థానం విజయం సాధించారు. -
ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్కు ఊహించని భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. గత ఎన్నికల్లో గెల్చిన 37 సీట్లతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. దీంతో ప్రజల తీర్పుని గౌరవిస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పారు. ప్రజల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా.. చెన్నపటణ నుంచి పోటీ చేసిన హెచ్డీ కుమారస్వామి ఘన విజయం సాధించారు. హోలెనరసీపుర్ నుంచి బరిలోకి దిగిన ఈయన సోదురుడ హెచ్.డీ రేవన్న కూడా గెలుపొందారు. కానీ రామనగరం నుంచి పోటీ చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాత్రం ఓటమిపాలయ్యారు. తన తాత హెచ్డీ దేవెగౌడకు కంచుకోటగా చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో నిఖిల్ ఓడిపోవడం జేడీఎస్ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతంది. బీజేపీ 64 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 20, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. బెంగళూరులో రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదివారం సాయంత్రం గవర్నర్ను కలవనుంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
బీజేపీ ఓటమి.. బసవరాజు బొమ్మై ఫస్ట్ రియాక్షన్..!
-
ఊహించని మెజారిటీ దిశగా కాంగ్రెస్.. సీఎం రేసులో ఎవరెవరున్నారంటే?
సాక్షి, కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్దే పైచేయిగా నిలిచింది. ఏ ఎగ్జిట్పోల్ ఊహించని మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బీజేపీ, జేడీఎస్ కలిసినా వంద స్థానాలకు చేరే అవకాశం లేదు. ఫలితాల్లో జేడీఎస్ దారుణంగా దెబ్బతింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాలకు నుంచి ఈ సారికి 21కి జేడీఎస్ పడిపోయింది. కుమారస్వామి కొడుకు నిఖిల్ సైతం ఓటమి చెందారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు(ఆదివారం) బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యానిదే విజయం అని ఖర్గే అన్నారు. అధికారం,డబ్బు ప్రభావం పనిచేయలేదన్నారు. సీఎం అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాగా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: అంచనాలకు మించి.. కాంగ్రెస్ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 -
కాంగ్రెస్దే విజయం..! కర్ణాటక ప్రజల నాడి
-
కర్ణాటకలో మొదలైన ‘రిసార్ట్’ పాలిటిక్స్.. ఎమ్మెల్యేలను తరలించేందుకు 12 హెలికాప్టర్లు!
కర్ణాటక: కర్ణాటకలో రిసార్ట్’పాలిటిక్స్ మొదలయ్యాయి. బెంగుళూరులోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో కుమారస్వామితో బీజేపీ అగ్రనేతలు భేటీ అయినట్లు తెలిసింది. కర్ణాటక బీజేపీ నేతలతో అమిత్షా కూడా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మరో వైపు, ఆధిక్యంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో కాంగ్రెస్ హైకమాండ్ టచ్లోకి వచ్చింది. అందరినీ బెంగుళూరు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ కీలక నేతలకు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. బీజేపీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులతో డీకే శివకుమార్ టచ్లో ఉన్నారు. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులను హుటాహుటిన బెంగుళూరుకు కాంగ్రెస్ తరలిస్తోంది. ఎమ్మెల్యేలను తరలించేందుకు 12 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. కాగా, అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలన్న సంప్రదాయాన్ని కన్నడిగులు కొనసాగిస్తున్నారు. చదవండి: సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: సిద్ధరామయ్య -
గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్.. బీజేపికి పెద్ద దెబ్బ..!
-
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సిద్ధరామయ్య ఫస్ట్ రియాక్షన్
-
ఫలితాలపై జీవీఎల్ రియాక్షన్
-
గాలి జనార్థన్రెడ్డి ముందంజ
-
130 స్థానాలు పైనే..! కాంగ్రెస్ తిరుగులేని విజయం?
-
సెంట్రల్ కర్ణాటక, మైసూరులోనూ కాంగ్రెస్ ముందంజ
-
ఆధిక్యంతో దూసుకుపోతున్న కాంగ్రెస్.. షాక్లో బీజేపీ...
-
కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి.. జీవీఎల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. మ్యాజిక్ ఫిగర్ను దాదాపు క్రాస్ చేసే అవకాశం ఉంది. దీంతో, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉండదు. కర్ణాటక ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతాయి. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మేమే గెలిచాం. కర్ణాటకలో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. తొలుత మాకు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ, అంతకంటే ఎక్కు సీట్లు మాకు వస్తున్నాయి. కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 111 స్థానాల్లో లీడింగ్లో ఉంది. బీజేపీ 73 స్థానాల్లో, జేడీఎస్ 30 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇక, కాంగ్రెస్కు ఫలితాలు ఫేవర్గా వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd — ANI (@ANI) May 13, 2023 ఇది కూడా చదవండి: రిసార్ట్ పాలిటిక్స్.. తెలంగాణను తాకిన కర్ణాటక రాజకీయం! -
Karnataka Election Result 2023: ముందంజలో సిద్ధరామయ్య, శివకుమార్..!
-
Karnataka Election Result 2023: కర్ణాటక ఫలితాలు మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
-
Karnataka Election Result 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్..
-
బళ్లారిలో 144 సెక్షన్...
-
Karnataka Results: కాంగ్రెస్కు లీడ్..బీజేపీకి ఫస్ట్ టైమ్ ఇలా..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇక, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరి ఫైట్ నడిచింది. కాగా, పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి 82, కాంగ్రెస్కు 114, జేడీఎస్కు 23, ఇతరులకు 5 ఓట్లు లభించాయి. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన ప్రతీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి భారీగా ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూసుకుపోయేది. కానీ అనుహ్యంగా కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ దూసుకెళ్లింది. తాజాగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ సీనియర్ నేతలు లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. #WATCH | Postal ballots to be counted first as counting of votes in Karnataka Assembly elections begins in Hubballi pic.twitter.com/BQ7tzIFZU5 — ANI (@ANI) May 13, 2023 ఇక, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్పై జేడీఎస్ అధినేత కుమారస్వామి సెటైర్లు వేశారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదన్న కుమారస్వామి. మరో రెండు, మూడు గంటలు వేచి చూద్దామన్నారు. తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనంటూ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023) అంతకుముందు, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం బసవరాజు బొమ్మ హుబ్లీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయి.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు కూడా గెలుపు తమదేనని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్ద సంబురాలు చేసుకున్నారు. #WATCH | Celebrations underway at national headquarters of Congress party in New Delhi as counting of votes gets underway for #KarnatakaPolls. pic.twitter.com/e0eGObhLh3 — ANI (@ANI) May 13, 2023 #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 12 seats, BJP in 8 seats while the JDS leads in one seat.#KarnatakaPolls pic.twitter.com/hnkhpjfXqv — ANI (@ANI) May 13, 2023 -
కౌంటింగ్ కూడా జరగకముందే మీరే మా ఎమ్మెల్యే.. రిజల్ట్ ఇలా!
కర్ణాటక : కౌంటింగ్ కూడా జరగకముందే మీరే మా ఎమ్మెల్యే అంటూ జేడీఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. తుమకూరు సిటీలో జేడీఎస్ విజయం సాధిస్తుందని చెబుతూ అభ్యర్థి గోవిందరాజకు నేమ్ బోర్డు తయారు చేసి అందించారు. ఈ విషయం తెలిసి ఓటర్లు అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకు వెల్లడైన ఫలితాల సరళిని పరిశీలిస్తే.. గోవిందరాజ లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ సమీప అభ్యర్థి జీ.బీ. జ్యోతిగణేష్పై ఆయన 1014 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. అభిమానుల అంచనాలు నిజం చేస్తూ గోవిందరాజ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారో చూడాలి. -
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
Time: 9:03 PM ►రేపు సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరులో సీఎల్పీ సమావేశం ►సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య Time: 7:50 PM ►సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం సాధ్యమైందని, కాంగ్రెస్ని గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది అని 'ఖర్గే' వ్యాఖ్యానించారు. Time: 6:38PM ►కర్ణాటకలో 43 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ ►2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 5% ఓట్లు ఎక్కువ ►36 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ ►2018 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన జేడీఎస్ ఓట్లు Time: 6:10 PM ►బెంగళూరు సిటీ(28): కాంగ్రెస్ 13, బీజేపీ 15, జేడీఎస్ 0 ►సెంట్రల్ కర్ణాటక(25): కాంగ్రెస్ 19, బీజేపీ 5, జేడీఎస్ 1 ►కోస్టల్ కర్ణాటక(19): కాంగ్రెస్ 6, బీజేపీ 13, జేడీఎస్ 0 ►హైదరాబాద్ కర్ణాటక(41): కాంగ్రెస్ 26, బీజేపీ 10, జేడీఎస్ 3 ►నార్త్ కర్ణాటక(50): కాంగ్రెస్ 33, బీజేపీ 16, జేడీఎస్ 1 ►ఓల్డ్ మైసూర్(61): కాంగ్రెస్ 39, బీజేపీ 6, జేడీఎస్ 14 Time: 5:50 PM ►కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations. — Narendra Modi (@narendramodi) May 13, 2023 Time: 5:35 PM ►కర్ణాటక ప్రజలకు ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఘన విజయం సాధించామని, భారత్లో జోడో యాత్ర ప్రజల్లో జోష్ నింపిందన్నారు. దుష్టపరిపాలనను కర్ణాటక ప్రజలు అంతమొందించారని, ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని ప్రియాంక గాంధీ ప్రస్తావించారు. Time: 5:05 PM ►కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం ►ఐదేళ్ల తర్వాత అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ►136 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ►65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ►19 స్థానాల్లో సరిపెట్టుకున్న జేడీఎస్ Time: 4:55 PM ►సోనియా, రాహుల్కి ఫోన్ చేసి అభినంధనలు తెలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్ ►ప్రజలకిచ్చిన హామీలను మొదటి రోజు నుంచే అమలు చేస్తాం - రాహుల్ Time: 4:35 PM ►ప్రజల తీర్పుని గౌరవిస్తాం, కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన పనిలేదు, అభివృద్ధి చేసినా ఓటమిపాలయ్యాం - యడియూరప్ప ►ప్రజా తీర్పుని గౌరవిస్తాం, ఓటమిని విశ్లేషించుకుని ముందుకెళ్తాం - కుమార స్వామి Time: 4:15 PM ►కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డీకే.శివకుమార్ ►ప్రజాస్వామ్యానిదే విజయం, బీజేపీ దృష్టంతా కర్ణాటక మీదే పెట్టింది - ఖర్గే ►రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వనున్న బొమ్మై Time: 3:05 PM ► కర్ణాటకలో ఏ ఎగ్జిట్పోల్ ఊహించని మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 137 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 62 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేడీఎస్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. Time: 2:28 PM ► అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అంచనాలకు మించి దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 136 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 64, జేడీఎస్ 20 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉన్నాయి. #KarnatakaElectionResults | Congress at 136 including 10 seats that the party has won so far and 126 seats where it is leading. BJP continues to lead in 60 seats. (Source: ECI) pic.twitter.com/GxwL8HgfpP — ANI (@ANI) May 13, 2023 Time: 1:18 PM ► రెండు చోట్ల ఓడిపోయిన బిజెపి మంత్రి సోమన్న వరుణ: కాంగ్రెస్ అగ్రనేత సిద్ధ రామయ్య చేతిలో ఓటమి చామరాజ నగర్: కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగ శెట్టి చేతిలో ఓటమి Time: 1:15 PM ► కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr — ANI (@ANI) May 13, 2023 Time: 12:50 PM ► కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయోత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. Time: 12:45 PM ► చల్లకేరే నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ గణాంకాల ప్రకారం కాంగ్రెస్ ప్రస్తుతం 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ 67 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ కేవలం 22 స్థానాల్లోనే ముందంజలో ఉంది. Congress wins in Challakere constituency, leads in 128 seats in Karnataka BJP ahead in 67 seats and Janata Dal (Secular) leading in 22 constituencies pic.twitter.com/mPOjg3mKOY — ANI (@ANI) May 13, 2023 Time: 12:40 PM ► బీదర్ జిల్లా ఓవరాల్ 1. ఔరాద్లో బీజేపీ ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి భీం సేన్ షిండేపై 9126 ఓట్ల ఆధిక్యంలో మంత్రి ప్రభు చౌహన్ 2. బీదర్ సిటీలో కాంగ్రెస్ ముందంజ 12 రౌండ్లు ముగిసే సరికి JDS అభ్యర్థి సూర్యకాంత్ పై 9184 ఓట్ల ఆధిక్యంలో రహీం ఖాన్ 3. బీదర్ సౌత్ లో కాంగ్రెస్ ముందంజ 12 రౌండ్లు ముగిసేసారికి బిజెపి అభ్యర్థి శైలేంద్రపై 1756 ఓట్ల ఆధిక్యంలో అశోక్ ఖేని 4. బాల్కిలో కాంగ్రెస్ ముందంజ బిజెపి అభ్యర్థి ప్రకాష్ ఖండ్రేపై 14054 ఓట్ల ఆధిక్యంలో ఈశ్వర్ ఖండ్రే 5. హుమ్నా బాద్ లో కాంగ్రెస్- బిజెపి మధ్య తీవ్ర పోటీ 15 రౌండ్లు ముగిసే సరికి బిజెపి అభ్యర్థి సిద్దు పాటిల్ పై 484 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి రాజశేఖర్ పాటిల్ 6. బసవ కళ్యాణ్ లో బిజెపి ముందంజ మాజీ సీఎం కొడుకు విజయ్ సింగ్ పై 4418 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి శరణు తల్గర్ ఆధిక్యం Time: 12:31 PM ►బళ్లారి రూరల్లో శ్రీరాములు(బీజేపీ) ఓటమి ►శ్రీరాములుపై కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర గెలుపు ►వరుణ నుంచి సిద్ధరామయ్య విజయం ►చిత్తాపూర్ నుంచి ప్రియాంక్ ఖర్గే విజయం ►కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జగదీష్ శెట్టర్ ఓటమి Time: 12:15 PM ► రామనగరలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ వెనుకంజ ► చిక్కమగళూరులో బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి వెనుకంజ ► హుబ్లీ ధార్వాడ్లో మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ వెనుకంజ Time: 12:10 PM ► సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్లో ముందంజ ► మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణలో ముందంజ ► చెన్నపట్నంలో జేడీఎస్ నేత హెచ్డీ కుమార స్వామి ముందంజ Time: 11:53 AM ►హసన్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్ గౌడ ఓటమి Time: 11:53 AM ►కనకపుర స్థానంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ విజయం. కనకపురా నుంచి నాలుగో సారి గెలుపొందిన శివకుమార్ Time: 11:42 AM ►ఎల్లాపురాలో బీజేపీ అభ్యర్ధి శివరామ్ విజయం ►హసన్లో స్వరూప్(జేడీఎస్) విజయం ►చల్లకెరలో రఘుమూర్తి( కాంగ్రెస్) విజయం ►హిరియూర్లో సుధాకర్(కాంగ్రెస్) విజయం ►'నందిని మిల్క్ గెలిచింది ...అమూల్ ఓడింది' అంటూ కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు... కెపీసీసీ ఆఫీస్ దగ్గర సెలబ్రేషన్స్. Time: 11:37 AM ►కాంగ్రెస్ కి ఫుల్ మెజార్టీ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.140 సీట్లు వస్తాయన్న ధీమా మాకు ఉంది. రిసార్ట్ పాలిటిక్స్ జరిగేటటువంటి అవకాశం లేదు. బీజేపీ అవినీతే వాళ్లను ఓడిస్తోంది: డీకే.శివకుమార్ Time: 11:24 AM: ►వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య ఆధిక్యం, బీజేపీ మంత్రి సోమన్నపై 2710 ఓట్ల ఆధిక్యం. ►చెన్నపట్టణంలో జేడీఎస్ ఛీఫ్ కుమారస్వామి ఆధిక్యం Time: 11:23 AM: ►బీజేపీ మంత్రి మురుగేష్ నిరానీ 200 ఓట్ల స్వల్ప ఆధిక్యం. Time: 11:21 AM: ► కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ సవాదీ విజయం సాధించారు. 9వేల మెజార్టీతో లక్ష్మణ్ సవాదీ గెలుపొందారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన లక్ష్మణ్ సవాదీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? డి కె శివకుమార్ సిద్ధ రామయ్య మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికి లింక్పై క్లిక్ చేయండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 Time: 11:16 AM ►గంగావతి నియోజకవర్గంలో 6000 ఓట్ల ఆధిక్యత తో కొనసాగుతున్న గాలి జనార్ధన్ రెడ్డి Time: 11:07 AM ►గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ►పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం ►కోస్టల్ కర్ణాటక, బెంగుళూరులో బీజేపీ ఆధిక్యం ►హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యం ►ఓల్డ్ మైసూర్లో జేడీఎస్కు గండికొట్టిన కాంగ్రెస్ ►ఓల్డ్ మైసూర్లో మూడో స్థానంలో బీజేపీ ►ఉత్తర కార్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యం ►చిత్తాపూర్లో ప్రియాంక్ ఖర్గే(కాంగ్రెస్) ఆధిక్యం ►గంగావతిలో గాలి జనార్థన్రెడ్డి ఆధిక్యం ►బళ్లారి సిటీలో గాలి అరుణ లక్ష్మి వెనుకంజ Time: 10:57 AM కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ షిమ్లాలోని జాకూ ఆలయంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు చేశారు. #WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offers prayers at Shimla's Jakhu temple pic.twitter.com/PRH47u36Zm — ANI (@ANI) May 13, 2023 Time: 10:45 AM మరోసారి జేడీఎస్ పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే 30 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యంలో ఉండగా.. మరోసారి చక్రం తిప్పేందుకు కుమారస్వామి సిద్ధమవుతున్నారు. ఆయనతో బీజేపీ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు. Time: 10:38 AM ►షిగ్గావ్ స్థానంలో బస్వరాజ్ బొమ్మె (భాజపా) ఆధిక్యం ►వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య (కాంగ్రెస్) ఆధిక్యం ►రామనగరలో నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) ఆధిక్యం ►ఆధిక్యంలోకి వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామి ►హోళెనర్సీపూర్ నియోజకవర్గంలో రేవణ్ణ (జేడీఎస్) ఆధిక్యం Time: 10:32 AM ►కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్(113) దాటింది.140 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు బెంగుళూరు రావాలని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. రేపు మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. దూసుకుపోతున్న కాంగ్రెస్.. ► కాంగ్రెస్ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార బీజేపీ 71 స్థానాల్లో, జేడీఎస్ 23 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd — ANI (@ANI) May 13, 2023 ► గంగావతి నియోజకవర్గంలో 2700 ఓట్ల ఆధిక్యతలో గాలి జనార్ధన్ రెడ్డి ► మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ► రెండో రౌండ్లో కాంగ్రెస్ మరింత దూకుడు. ► అనేక ప్రాంతాల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు ► బసవ కళ్యాణ్లో మాజీ సీఎం ధరమ్ సింగ్ కొడుకు విజయ్ సింగ్ కి షాక్ ► బసవ కళ్యాణ్లో ముందంజలో బీజేపీ అభ్యర్థి శరణు తల్గర్. ► 4 రౌండ్లు ముగిసే సరికి 12980 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ► బాగేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి ఆధిక్యత. ► పావగడ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి తిమ్మరాయప్ప ముందంజ ►బీదర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జేడీఎస్ అభ్యర్థి సూర్యకాంత్ ఆధిక్యం ► ఔరద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి మంత్రి ప్రభు చవాన్ ముందంజ ► హుమనబాద్ లో బీజేపీ అభ్యర్థి సిద్దూ పాటిల్ ఆధిక్యంలో ► బీదర్ సౌత్ లో బీజేపీ అభ్యర్థి శైలేంద్ర బెల్దాలే ముందంజ. ► బాల్కి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రే ముందంజ Time: 09:57 AM ►హైదరాబాద్లో కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ ►ప్రముఖ హోటల్స్లో రూమ్లు బల్క్ బుకింగ్ ►కర్ణాటక, హైదరాబాద్ వ్యక్తుల పేర్లతో రూమ్స్ బుకింగ్ ►ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించే అవకాశం Time: 09:44 AM ►కాంగ్రెస్ 82, బీజేపీ 52, జేడీఎస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి ►6 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో డీకే శికుమార్ ►షిగ్గావ్లో బస్వరాజు బొమ్మై(బీజేపీ) ముందంజ ►వరుణలో సిద్ధరామయ్య(కాంగ్రెస్) ముందంజ ►చెన్నపట్టణలో కుమారస్వామి(జేడీఎస్) స్వల్ప ఆధిక్యం ►రామనగర్లో నిఖిల్ కుమారస్వామి(జేడీఎస్) ముందంజ ►బెంగుళూరులో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 82 seats, BJP in 52 seats while the JDS is leading in 16 seats. #KarnatakaPolls pic.twitter.com/sL4RFJUYJ6 — ANI (@ANI) May 13, 2023 Time: 09:32 AM గాలి జనార్దన్ రెడ్డి దంపతులు ఆధిక్యం గంగావతి స్థానంలో గాలి జనార్దన్ రెడ్డి ఆధిక్యం - బళ్లారి పట్టణంలో గాలి లక్ష్మీ అరుణ ఆధిక్యం - బళ్లారి (ఎస్ టీ) స్థానంలో శ్రీరాములు (భాజపా) ఆధిక్యం - చిక్కబళ్లాపూర్ స్థానంలో సుధాకర్ (భాజపా) వెనుకంజ - హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్) ఆధిక్యం - చిక్కమగళూరు స్థానంలో సి.టి.రవి (భాజపా) ఆధిక్యం Time: 09:29 AM ►హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, మైసూరులో కాంగ్రెస్ హవా ►కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి ఆధిక్యం ►బెంగుళూరు, సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ►షిగ్గావ్లో బస్వరాజ్ బొమ్మై ముందంజ Time: 09:24 AM 8 మంది కర్ణాటక మంత్రుల వెనుకంజలో ఉన్నారు. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్(113)ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 44 స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో, జేడీఎస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. Karnataka Election Results: As per ECI, Congress takes the lead in 44 seats, BJP in 23 seats while JDS leads in 07 seats.#KarnatakaElectionResults2023 pic.twitter.com/bFP4AfpZjN — ANI (@ANI) May 13, 2023 Time: 09:20 AM 113 మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 25 స్థానాల్లో, బీజేపీ 12 స్థానాల్లో, జేడీఎస్ 02 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 25 seats, BJP in 12 seats while the JDS is leading in 02 seats. #KarnatakaPolls pic.twitter.com/ReFREHP7Wt — ANI (@ANI) May 13, 2023 Time: 09:12 AM ►8 మంది కర్ణాటక మంత్రుల వెనుకంజ ►చిక్ మంగుళూరులో సీటీ రవి వెనుకంజ ►గంగావతిలో గాలి జనార్థన్రెడ్డి ముందంజ ►బళ్లారి సిటీలో గాలి అరుణలక్ష్మి ముందంజ Time: 09:05 AM ►ఏడుగురు కర్ణాటక మంత్రుల వెనుకంజ ►మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ►రామనగరలో నిఖిల్ కుమారస్వామి వెనుకంజ ►వరుణాలో సిద్ధరామయ్య ముందంజ #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 12 seats, BJP in 8 seats while the JDS leads in one seat.#KarnatakaPolls pic.twitter.com/hnkhpjfXqv — ANI (@ANI) May 13, 2023 Time: 09:02 AM ►బసవరాజు బొమ్మై ముందంజ ►బీజేపీ రెబల్ నేత జగదీష్ శెట్టర్ ముందంజ Time: 08:59 AM ►ముంబై కర్ణాటకలో హోరాహోరీ ►ఇప్పటివరకు చెరో 23 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆధిక్యం ►బెంగుళూరు నగరంలో కాంగ్రెస్ 17, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యం ►హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ 23, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యం Time: 08:49 AM ►100 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ►చిత్తాపూర్లో ప్రియాంక్ ఖర్గే వెనుకంజ ►బీజేపీ రెబల్ నేత జగదీష్శెట్టర్ వెనుకంజ ►గాంధీనగర్లో దినేష్ గుండూరావు ముందంజ Time: 08:46 AM ►కనకపురంలో డీకే శివకుమార్ ముందంజ ►బళ్లారి రూరల్లో శ్రీరాములు ముందంజ ►వరుణలో సిద్ధరామయ్య ముందంజ Time: 08:39 AM ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చెన్న పట్టణంలో కుమారస్వామి, బళ్లారిలో గాలి అరుణలక్ష్మి వెనుకంజలో ఉన్నారు. Time: 08:36 AM పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో తొలుత ఆధిక్యంలో బీజేపీ కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లో జేడీఎస్ పుంజుకుంటోంది. Time: 08:31 AM కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే హుబ్బళ్లిలోని హనుమాన్ ఆలయాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై దర్శించుకున్నారు. #WATCH | As counting of votes begins for #KarnatakaPolls, CM Basavaraj Bommai visits Hanuman temple in Hubballi. pic.twitter.com/isXkxoa79D — ANI (@ANI) May 13, 2023 Time: 08:18 AM పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ కర్ణాటక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు 224, మ్యాజిగ్ ఫిగర్ 113, కాంగ్రెస్ అనుకూలంగా ఎగ్జిట్పోల్స్ అంచనాలు ఉండగా, జేడీఎస్సే మళ్లీ కింగ్ మేకర్ అంటూ జోరుగా చర్చ సాగుతోంది. Time: 08:14 AM పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యం Time: 08:11 AM బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది:బొమ్మై మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయి.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని బొమ్మై అన్నారు. #WATCH | Today is a big day for Karnataka as the people's verdict for the state will be out. I am confident that BJP will win with absolute majority and give a stable government, says Karnataka CM Basavaraj Bommai, in Hubballi. pic.twitter.com/8r9mKGiTIe — ANI (@ANI) May 13, 2023 Time: 08:02 AM కౌంటింగ్ ప్రారంభం కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, వయో వృద్ధుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. Time: 07:44 AM ప్రభుత్వం ఏర్పాటు చేసేది నేనే: కుమారస్వామి ►ఎగ్జిట్ పోల్స్పై జేడీఎస్ అధినేత కుమారస్వామి సెటైర్లు వేశారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదన్న కుమారస్వామి.. మరో రెండు, మూడు గంటలు వేచి చూద్దామన్నారు. తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనంటూ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. #WATCH | "No one has contacted me till now. There is no demand for me, I am a small party" says JD(S) leader HD Kumaraswamy, ahead of Karnataka election results. pic.twitter.com/0Mkbqdd7Tr — ANI (@ANI) May 13, 2023 ►ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ►ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. ►కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ►ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ►ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ►ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు ►కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. ►వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ►ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
కర్ణాటక తీర్పు
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
Karnataka: బెంగళూరులో 144 సెక్షన్
బెంగళూరు: కర్ణాటకలో రేపు(శనివారం) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు గెలుపు తమదంటే తమదేనని తెగేసి చెబుతున్నాయి. అటు జేడీఎస్ మాత్రం కీరోల్ మాదేనంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎన్నికల్లో ఫలితాల్లో సందర్భానుసారం, కర్ణాటకకు ఎవరితో మంచి జరుగుతుందో బేరీజు వేసుకుని మద్దతు ప్రకటిస్తామని జేడీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బెంగళూరు పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించన్నట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరు పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపుపై భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఫలితాలపై కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్టు తెలుస్తోంది. Karnataka Assembly Elections 2023 LIVE Updates: Sec 144 imposed in Bengaluru, liquor sale banned https://t.co/oCoxBnE9Pd Ramesh rightly observed that Modi is responsible for Karnataka, TN, Kerala, AP, Telangana losses. South India will be renamed as Islamic Republic of India — Nationalist (@JagdeepakSharma) May 12, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్ -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్
-
Karnataka: కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతాం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయాం అన్నారు. తాము నిధుల కొరతతో గెలిచే 25 స్థానాల్లో వెనుకపడ్డామని చెప్పుకొచ్చారు తాను జేడీఎస్ అభ్యర్థులకు ఆర్థికంగా సాయపడలేకపోయానంటూ వాపోయారు. కనీసం 120 రాకపోయినప్పటికీ మాకే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. జేడీఎస్ మేకర్ కాదని కచ్చితంగా కింగ్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: ఎగ్జిట్పోల్స్పై సీఎం బొమ్మై రియాక్షన్ ఇదే..) -
Karnataka: 2018 టైంలో అలా.. మరి ఇప్పుడు ఎలా?
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. కానీ, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవీ కూడా.. ఏ పార్టీకి మెజార్టీని, అధికారాన్ని కట్టబెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మాత్రమే దాదాపు చాలావరకు ఎగ్జిట్పోల్స్ సర్వేలు వెల్లడించాయి. విచిత్రంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో(ప్రధాన పార్టీలు మారాయంతే) ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికాగా.. ఆ సమయంలో ఆ జోస్యమే ఫలించింది కూడా!. 👉 కర్ణాటక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. 2023 ఎన్నికల తరహా ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాయి. అయితే అప్పుడు తుది ఫలితం కూడా అంచనాలకు తగ్గట్లే వచ్చింది. ఆరు జాతీయ వార్తా సంస్థలతో పాటు ఓ రీజినల్ ఛానెల్ సర్వే కూడా బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పాయి. చెప్పినట్లుగానే బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. 👉 అదే సమయంలో వేసిన హంగ్ అంచనా కూడా ఫలించింది. గత ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ.. కానీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం నాటకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎంగా ప్రమాణం చేసిన యాడ్యూరప్ప.. మూడు రోజులకే రాజీనామా చేశారు. ఆపై కాంగ్రెస్, జేడీఎస్లు సర్కార్ను ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, 14 నెలల తర్వాత బీజేపీలోకి కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలతో సీన్ మారింది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. కాషాయ పార్టీ బలం 116కు చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 👉 అప్పుడు ఎగ్జిట్పోల్స్ మాదిరే ఇప్పుడు గణాంకాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నాలుగైదు ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి కనిపిస్తోంది. 👉 ఇక.. గత ఎగ్జిట్పోల్స్కి ఇప్పటి ఎగ్జిట్పోల్స్కు ప్రధానంగా కనిపిస్తున్న మూడో సారుప్యత.. జేడీఎస్ పార్టీ. గత ఎన్నికల్లో 20 నుంచి 40 స్థానాల నడుమ గెలుస్తుందని వేసిన అంచనా జేడీఎస్ విషయంలో నిజమైంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కింగ్మేకర్ అవుతుందని కూడా ఎగ్జిట్పోల్స్ చెప్పిన జోస్యం ఫలించింది. 👉 ఇప్పుడు కూడా ఎగ్జిట్పోల్స్.. జేడీఎస్కు 20 నుంచి 30 సీట్ల దాకా రావొచ్చని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమయ్యే స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవచ్చని భావిస్తున్న తరుణంలో.. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. -
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మరి జేడీఎస్?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం.. పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు. 13వ తేదీన ఏ పార్టీ భవితవ్యం ఏంటన్నది తేలిపోతుంది. ఈలోగా ఓటర్నాడిని అంచనా వేస్తూ.. ఎగ్జిట్పోల్స్ ఫలితాలు పొలిటికల్ హీట్ను పెంచాయి. ప్రధానంగా భావించిన మూడు పార్టీలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టకుండా.. దాదాపు మెజార్టీ ఎగ్జిట్పోల్స్ హంగ్ సంకేతాలను అందించాయి. ఈలోపు రీజియన్ల వారీగా ఆ ఫలితాలను ఓసారి పరిశీలిస్తే.. 👉 కోస్టల్ కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రీజియన్లో స్థానాలను మొత్తం బీజేపీ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్కు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో స్థానిక జనతాదళ్ సెక్యులర్ ఇక్కడ ఎలాంటి ఖాతా తెరవకపోవచ్చనే ఎగ్జిట్పోల్స్ కోడై కూస్తున్నాయి. 👉 ఈ రీజియన్లో ఓటింగ్ శాతంలోనూ.. బీజేపీ ఆధిక్యం కనబర్చవచ్చని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. సగానికి పైగా ఓట్ షేర్ను కాషాయం పార్టీ దక్కించుకోనుంది. కాంగ్రెస్ కూడా దాదాపు 40 శాతం ఓట్ షేర్ దక్కించుకోవచ్చని, అదే సమయంలో జేడీఎస్ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం కావొచ్చని ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. 👉 ఇక రాజధాని బెంగళూరు రీజియన్లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ విజయదుంధుబి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సగానికి పైగా సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరుస్తుందని, సింగిల్ డిజిట్ నుంచి పది స్థానాల దాకా బీజేపీ గెలవొచ్చనే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 👉 ఓట్ షేరింగ్లో.. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 44 శాతం, కాషాయం పార్టీకి 40 శాతం, జేడీఎస్ ఓట్ షేరింగ్ 15 శాతానికి ఉండొచ్చని అంచనా. ఈ రీజియన్లో మెల్కోటోలో అత్యధికంగా 67.4 శాతం పోలింగ్ నమోదు కాగా.. సీవీ నగర్లో అత్యల్పంగా 32 శాతం పోలింగ్ రికార్డు అయ్యింది. 👉 సెంట్రల్ కర్ణాటకలో ప్రధాన పార్టీలు బీజేపీ-కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. 23 సీట్లున్న సెంట్రల్ కర్ణాటకలో సగం సగం సీట్లు గెలిచి ఇరు పార్టీలు గట్టి పోటీ ఇవ్వొచ్చని ముక్తకంఠంతో ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. ఇక జేడీఎస్ ఇక్కడ అసలు ఆధిపత్యం ప్రదర్శించకపోవచ్చని.. గెలిచినా ఒకటికి మించి స్థానం కైవసం చేసుకోకపోవచ్చనే అంచనా నెలకొంది. 👉 హైదరాబాద్-కర్ణాటక రీజియన్లో.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఈ రీజియన్లో 40కిగానూ.. 30 దాకా కాంగ్రెస్ సొంతం కావొచ్చని అంచనా వేశాయి. అదే సమయంలో బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. జేడీఎస్ ఇక్కడ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావొచ్చని ఎగ్జిట్పోల్స్ చెబుతున్నాయి. అదే సమయంలో ఓటు షేర్లోనూ 47 శాతం దాకా కాంగ్రెస్కే దక్కవచ్చని అంచనా వేశాయి. ఇక కుమారస్వామి ఎంతగానో ఆశలుపెట్టుకున్న.. ఉత్తర కర్ణాటక, పాత మైసూర్ రీజియన్ల ఓటర్లు సైతం జేడీఎస్ ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నారు. -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్..
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్పై ఉత్కంఠ నెలకొంది. ఇక, అన్ని ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ఎగ్జిట్పోల్స్ అన్ని ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ 113. అయితే, ఏ పార్టీ 113 స్థానాల్లో పూర్తి మెజార్టీ రాలేదని అన్ని ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేశాయి. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 94-108 బీజేపీ: 85-100 జేడీఎస్: 24-32 #KarnatakaVotes | BJP leader Charu Pragya #LIVE on Republic, speaks on Republic-PMARQ Exit Poll projections which show that BJP gets a clean sweep in Coastal Karnataka with 14-18 seats.#KarnatakaElections #ExitPolls#BJP #Congresshttps://t.co/4WhdtSeq74 pic.twitter.com/N4Y6LXcFBl — Republic (@republic) May 10, 2023 జన్కీ బాత్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 91-106 బీజేపీ: 94-117 జేడీఎస్: 14-24 AsiaNet Jan Ki Baat Exit Poll #KarnatakaAssemblyElections2023 pic.twitter.com/C7wzN3df25 — News Arena India (@NewsArenaIndia) May 10, 2023 మ్యాటరేజ్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 103-118 బీజేపీ: 79-99 జేడీఎస్: 23-25 ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్పోల్స్ ఫలితాలు.. కాంగ్రెస్: 122-140 బీజేపీ: 62-80 జేడీఎస్: 20-25 ఇతరులు: 3 టైమ్స్ నౌ/ ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 106-120 బీజేపీ: 78-92 జేడీఎస్: 20-26 ఇతరులు: 2-4 Predicting #KarnatakaAssemblyElections2023. Here's .@TNNavbharat-ETG Research seat and vote share predictions#ExitPoll #KarnatakaAssemblyElection pic.twitter.com/RHjTdRhrnB — ETG Research (@ETG_Research) May 10, 2023 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 99-109 బీజేపీ: 88-98 జేడీఎస్: 21-26 Exit Poll: Poll Strat ಸಮೀಕ್ಷೆ - 2023 BJP -88-98 Congress - 99-109 JDS - 21-26 Others - 00#KarnatakaElections2023 #PollStrat #KarnatakaAssemblyElection2023 #ResultsOnRitamKannada #Karnataka #ExitPolls pic.twitter.com/jzWf5XLCtk — Ritam ಕನ್ನಡ (@RitamAppKannada) May 10, 2023 ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 100-112 బీజేపీ: 83-95 జేడీఎస్: 21-29 Watch : कौन बनेगा कर्नाटक का किंग मेकर? + कर्नाटक में जीत किसकी, क्या कहते हैं एग्जिट पोल के आंकड़ें, जानिए@RubikaLiyaquat | @romanaisarkhan | @dibanghttps://t.co/smwhXUROiK #ExitPollOnABP #KarnatakaElections pic.twitter.com/t3Vx1B49Sf — ABP News (@ABPNews) May 10, 2023 న్యూస్ నేషన్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 86 బీజేపీ: 114 జేడీఎస్: 21 ఇతరులు: 3 News Nation CGS Exit Poll BJP : 114 INC : 86 JDS : 21 OTH : 3 First exit poll to predict clear cut win for BJP. #KarnatakaAssemblyElections2023 — News Arena India (@NewsArenaIndia) May 10, 2023 జీ న్యూస్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 103-108 బీజేపీ: 79-94 జేడీఎస్: 25-33 #ExitPollOnZee | कर्नाटक के #ExitPoll में कांग्रेस को बढ़त LIVE: https://t.co/KqtjwEjRLK#KarnatakaElections #KarnatakaAssemblyElection2023 #BJP #Congress || @DChaurasia2312 @ShobhnaYadava pic.twitter.com/1vjkeCKGxZ — Zee News (@ZeeNews) May 10, 2023 సీ-డైలీ ట్రాకర్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 130-157 బీజేపీ: 37-56 జేడీఎస్: 22-34 ఇతరులు: 3 We will not publish any other exit poll because we are sure that the opinion polls we publish will be in the result. See you on 13th May ⚫️ Total Seat - 224/224 ▪️BJP - 37-56 ▪️ INC - 130-157 ▪️JD(S)- 22-34 ▪️ OTH - 00 - 03#CdailyTracker #KarnatakaElections2023 #OpinionPoll pic.twitter.com/CTZNf3Qu7V — C-Daily Tracker (@CdailyTracker) May 9, 2023 పీపుల్స్ పల్స్ ఎగ్జిట్పోల్ ఫలితాలు.. కాంగ్రెస్: 107-119 బీజేపీ: 78-90 జేడీఎస్: 23-29 ఇతరులు: 1-3 ఇక పీపుల్స్ పల్స్ టాప్ సీఎం ఛాయిస్ ఎగ్జిట్పోల్లో.. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు అత్యధిక శాతం (42) ఓట్లు దక్కాయి. ఆ తర్వాతి ప్లేస్లో ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి, బీఎస్ యాడియూరప్ప, డీకే శివకుమార్ ఉన్నారు. -
యాద్గిర్... బరాబర్.. కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లాలో రసవత్తర పోరు
కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లా అయిన యాద్గిర్లో ఎన్నికల వేడి హోరెత్తిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలయిన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్లు ఇక్కడ హోరాహోరీ తలపడుతున్నాయి. బీమా నదీ పరివాహక ప్రాంతమైన ఈ జిల్లాలోని ఓ చిన్న భాగానికి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తుండడంతో ఇక్కడ వ్యవసాయాధారిత ప్రజలు ఎక్కువగా ఉంటారు. గుర్మిట్కల్లో కొంత మేర పరిశ్రమలు ఉండగా, షాహ్పూర్లో తెలుగు ప్రజలు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అయితే, రాజకీయంగా చైతన్యవంతమైన ఇక్కడి ప్రజలు ఏకపక్షంగా లేరని, విలక్షణ తీర్పు ఇవ్వనున్నారని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. యాద్గిర్ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి నియోజకవర్గాల వారీగా.. షాహ్పూర్ తెలుగు ప్రజల ప్రభావం కన్పించే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్కు కొంత మొగ్గు కనిపిస్తోంది. ఇక్కడ చాలా కాలంగా శరణబసప్ప, గురుపాటిల్ శిర్వాల్ కుటుంబాల మధ్యనే రాజకీయంగా వైరం ఉంది. ఈసారి కూడా కూడా ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఈ కుటుంబాలకు చెందిన వారే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గతంలో జేడీఎస్ నుంచి పోటీ చేసిన అమీన్రెడ్డి బరిలో ఉన్నారు. కుటుంబ రాజకీయ వైరంలో ఈయన ఈసారి కూడా వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సుర్పూర్ ఇక్కడ ఓసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. పోటీ మాత్రం 2008 నుంచి తలపడుతోన్న నరసింహనాయక్ (రాజగౌడ), రాజా వెంకటప్పనాయక్ల మధ్యనే కనిపిస్తోంది. నరసింహ నాయక్ బీజేపీ సిట్టింగ్కాగా, వెంకటప్పనాయక్ కాంగ్రెస్ పక్షాన బరిలో ఉన్నారు. ఇక్కడ జేడీఎస్ నుంచి బరిలో ఉన్న కొత్త అభ్యర్థి శ్రవణ్కుమార్ నాయక్ ప్రభావం తక్కువగానే ఉంది. కురబ యాదవ సామాజిక వర్గం ఇక్కడ ప్రభావిత శక్తి కాగా, బీజేపీ వైపు కొంత సానుకూలత కనిపిస్తోంది. గుర్మిట్కల్ ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్ల మధ్య పోరు నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఈసారి ఎన్నికల్లో జేడీఎస్ పక్షాన గత ఎన్నికల్లో గెలిచిన నాగనగౌడ కుమారుడు శరణ గౌడకు టికెట్ లభించింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూరావు చించన్సూర్, బీజేపీ నుంచి కొత్త అభ్యర్థి లలితా అనపూర్ తలపడుతున్నారు. ఈ ఇద్దరి సామాజిక వర్గం ఒకటే. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే కోలీ (ముదిరాజ్) వర్గానికి చెందిన ఇద్దరిలో కొంత మొగ్గు బాబూరావు వైపే కనిపిస్తున్నా లలిత చీల్చే ఓట్లను బట్టి గెలుపోటములు నిర్ధారణ కానున్నాయి. ఇక్కడి ప్రజలు జేడీఎస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. యాద్గిర్ లింగాయత్ సామాజికవర్గ ప్రభావం కనిపించే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్నుంచి మాజీ ఎమ్మెల్సీ చెన్నారెడ్డి పాటిల్ బరిలో ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన ఎ.బి.మలక్రెడ్డి ఈసారి జేడీఎస్ పక్షాన పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వెంకట్రెడ్డి ముద్నాల్ బరిలో ఉన్నారు. జేడీఎస్ ఇక్కడ బలహీనంగా ఉన్నప్పటికీ మలక్రెడ్డి రాకతో పోటీలోకి వచ్చింది. మొత్తంగా బీజేపీ కొంత ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. చదవండి: మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి -
Karnataka, assembly elections 2023: మైకులు బంద్
బెంగళూరు: కర్ణాటకలో మైకులు మూగబోయాయి. నెలకు పైగా జోరుగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. పార్టీలు, అభ్యర్థులు మంగళవారం కేవలం ఇంటింటి ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు నెల రోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా అభివర్ణిస్తూ అవినీతే ప్రధానాంశంగా ప్రజల్లోకి వెళ్లారు. ఇక బీజేపీ పూర్తిగా ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకుంది. అమిత్ షా, నడ్డా వంటి అతిరథులు రంగంలోకి దిగినా ప్రధానంగా మోదీయే సుడిగాలి పర్యటనలు, వరుస సభలు, రోడ్షోలతో హోరెత్తించారు. ఎన్నికల షెడ్యూలుకు ముందు నుంచే కర్ణాటకలో పదేపదే పర్యటించిన ఆయన, 10 రోజుల్లో ఏకంగా 19 భారీ బహిరంగ సభలు, ఆరు రోడ్షోలతో రాష్ట్రమంతటా చుట్టేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 40 శాతం కమీషన్ల సర్కారు విమర్శలకు విరుగుడుగా కాంగ్రెస్ 85 శాతం కమిషన్ల పార్టీ అంటూ ప్రతి దాడికి దిగారు. ఇక ప్రచారం చివరి దశలో బజరంగ్ దళ్ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ రెండు చేతులా అందిపుచ్చుకుంది. ఆ పార్టీని హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. బీజేపీ జాతీయ నేతలు మొత్తం 206 సభలు, 90 రోడ్షోలు, రాష్ట్ర నేతలు 231 బహిరంగ సభలు, 48 రోడ్ షోలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నేతలంతా కలిసి 99 బహిరంగ సభలు, 33 రోడ్షోలు జరిపారు. విషసర్పం, పనికిమాలిన కుమారుడు, విషకన్య తదితర వ్యక్తిగత విమర్శలు ఈసారి కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో హైలైట్గా నిలిచాయి. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు, ఎలాగైనా గెలిచి విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నించాయి. ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధనే లక్ష్యంగా రెండు పార్టీలూ పరిశ్రమించాయి. జేడీ(ఎస్) నేతలు కూడా నిప్పులు చెరిగే ఎండల్లో చెమటలు కక్కారు. ఇప్పుడిక బుధవారం జరగబోయే కీలకమైన పోలింగ్ మీదే అందరి దృష్టీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు 13వ తేదీన వెలువడనున్నాయి. రూ.375 కోట్లు జప్తు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డబ్బు కట్టలు తెంచుకుని పారింది. మార్చి 29 నుంచి ఏకంగా రూ.375.6 కోట్ల మేరకు నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.147 కోట్లు నగదు, రూ.84 కోట్ల విలువైన మద్యం, రూ.97 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.24 కోట్ల విలువైన కానుకలు, రూ.24 కోట్ల డ్రగ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏకంగా 2,896 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. మార్చి 29కి ముందు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న రూ.58 కోట్ల విలువైన నగదు తదితరాలు దొరికాయి. -
Karnataka Elections: తెలుగువారి ప్రభావమున్న జిల్లాలో ఎవరిది పైచేయి
నారాయణపూర్, హోస్పేట ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో.. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన తెలుగు ప్రజలు చేసే వ్యవసాయంతో కళకళలాడుతూ కనిపించే కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు రాజకీయంగా చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి కనిపించకపోవడం, పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయాభివృద్ధి కనిపిస్తుంది. రాయచూర్ (పట్టణ), రాయచూర్ (గ్రామీణ), సింధనూర్, మస్కి, మాన్వి, దేవదుర్గం, లింగుసూగుర్ నియోజకవర్గాలున్న రాయచూర్ జిల్లాలో.. ఈసారి ఎన్నికల్లో అనేక రాజకీయ, సామాజిక అంశాలు ప్రభావం చూపనున్నాయి. లింగాయత్, వాల్మీకి (నాయక్)లతోపాటు తెలుగు ప్రజలు ఇక్కడ ఎక్కువ. రెండు నియోజకవర్గాల్లో అయితే తెలుగు ప్రజలే నిర్ణాయక శక్తిగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ఇది. రాయచూర్ పట్టణ (అర్బన్) రాయచూర్ పట్టణ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, లింగాయత్ వర్గానికి చెందిన శివరాజ్పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ మహ్మద్షా ఆలం, జేడీఎస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్, ఈడిగ సామాజిక వర్గానికి చెందిన వినయ్కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పాటిల్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీ పరంగా బీజేపీకి సానుకూలత కనిపిస్తోంది. షా ఆలంకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. రాయచూరు గ్రామీణ (రూరల్) ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన రాయచూరు రూరల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దద్దల్ బసన్నగౌడ, బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తిప్పరాజు, జేడీఎస్ అభ్యర్థి, మాజీ జెడ్పీ సభ్యుడు చిన్న నర్సింహనాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యేకు సాత్వికుడనే పేరుంది. పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే ఈ నియోజకవర్గానికి కృష్ణా, తుంగభద్ర జలాలు తీసుకురావడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయన్న భావన ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి బసన్నగౌడ పట్ల సానుకూలత కనిపిస్తోంది. సింధనూర్ జేడీఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వెంకట్రావ్ నాడగౌడ, కాంగ్రెస్ నుంచి అంపన్నగౌడ బాదర్లి బరిలో ఉండగా, బీజేపీ నుంచి కరియప్ప పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభావం తక్కువే అయినా కరియప్ప కాంగ్రెస్ నుంచి వెళ్లి బీజేపీ టికెట్ తెచ్చుకోవడంతో.. త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ తెలుగువారు ఎక్కువ. వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు చెప్తున్నారు. లింగుసూగుర్ ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. కాంగ్రెస్ నుంచి డీఎస్ ఉలిగేరి, బీజేపీ నుంచి మానప్ప వజ్జల్, జేడీఎస్ నుంచి సిద్ధూ బండి పోటీ చేస్తున్నారు. పైకి మాత్రం ఉలిగేరి, వజ్జల్ మధ్య పోటీ భీకరంగా కనిపిస్తోంది. అయితే, సిద్ధూ బండిపై సానుభూతి కనిపిస్తోంది. ఆయన గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి ఆయనకు ఓట్లు పడతాయనే అంచనాలున్నాయి. జేడీఎస్ ప్రభుత్వం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ఈ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చారనే అభిప్రాయం కలసిరానుంది. మస్కి ఇక్కడ పారీ్టలు మారినా ప్రత్యర్థులు పాతవారే. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న బసన్నగౌడ గతంలో బీజేపీలో పనిచేశారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న ప్రతాపగౌడ పాటిల్ అంతకుముందు కాంగ్రెస్లో పనిచేశారు. గత ఎన్నికల్లో, తర్వాత ఉప ఎన్నికల్లో వారు తలపడ్డారు. ఇప్పుడూ వీరి మధ్యనే పోటీ ఉంది. ఇక్కడ వాల్మీకి, లింగాయత్లు చెరోసగం బీజేపీ, కాంగ్రెస్ల వైపు ఉండగా.. ఇతర కులాలు, తెలుగు క్యాంపులు కాంగ్రెస్ వైపు కనిపిస్తున్నాయి. జేడీఎస్ నామమాత్రపు పోటీకి మాత్రమే పరిమితమనే అంచనాలున్నాయి. మాన్వి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం మాన్విలో హోరాహోరీ పోరు నడుస్తోంది. జేడీఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా వెంకటప్పనాయక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అంపయ్యనాయక్, బీజేపీ నుంచి బీవీ నాయక్ పోటీ చేస్తున్నారు. లింగాయత్, వాల్మీకి వర్గాలు ప్రధాన ఓటర్లు అయినా తెలుగువారి ప్రభావం ఎక్కువే. మాన్వి జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు బోసురాజు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత వెంకటప్పనాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఇద్దరూ తెలుగు ఓటర్ల మద్దతుతోనే గెలిచారని అంచనా. ఈసారి కూడా వారు కాంగ్రెస్వైపు మొగ్గుచూపుతున్నారు. లింగాయత్లు బీజేపీ వైపు కనిపిస్తున్నారు. దేవదుర్గం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ ఏమీ చేయలేదని, జేడీఎస్ అధికారంలో ఉన్నప్పుడే నారాయణపూర్ నుంచి సాగునీరు తీసుకువచ్చిందన్న సానుకూలత కనిపిస్తోంది. ఇక్కడ జేడీఎస్ నుంచి కరెమ్మ నాయక్, కాంగ్రెస్ నుంచి శ్రీదేవీ నాయక్, బీజేపీ నుంచి శివన్నగౌడ పోటీలో ఉన్నారు. జేడీఎస్ రెండు సార్లు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కరెమ్మ నాయక్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. కాంగ్రెస్ అభ్యరి్థకి ఉన్న కుటుంబ రాజకీయ బలం కొంతమేర ప్రభావం చూపనుంది. -
Karnataka assembly elections 2023: ఓట్లెక్కువ.. సీట్లు తక్కువ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తోంది. ఈ సారైనా మేజిక్ ఫిగర్ దాటడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. 1999, 2013లో మినహా గత మూడు దశాబ్దాల ఎన్నికల్లో కన్నడ ఓటరు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టడం లేదు. ఈసారి ఓటర్ల మనోగతం ఎలా ఉందోనని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన సంగతులు వెలుగు చూస్తాయి. ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఓట్లు తక్కువగా పోలయినా సీట్ల బలంతో అధికార అందలం ఎక్కుతున్నారు. ఈ విచిత్రకరమైన పరిస్థితి గత నాలుగు శాసనసభ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను సాధించి అగ్రస్థానంలో ఉంటోంది. కానీ సీట్ల సాధనలో వెనుకబడిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 36.59% ఓట్లను సాధించి 224 స్థానాలున్న అసెంబ్లీలో 122 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ ఓటు షేర్ 38శాతానికి పెరిగినప్పటికీ కేవలం 78 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ 36శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. అదే విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35.27% ఓట్లు కొల్లగొట్టి 65 స్థానాలు సాధించింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువగా 28.3% ఓట్లను గెలుచుకున్న బీజేపీ 79 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా ఒక్క శాతం తగ్గినప్పటికీ 80 స్థానాల్లో గెలుపొందింది. 2013 ఎన్నికలు ప్రత్యేకం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు, ఆశ్చర్యకర సంఘటనలు జరిగిన ఎన్నికలు ఇవే . 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాటు పాలన సాగించింది. బీజేపీలోని అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. బీఎస్ యడియూరప్ప బీజేపీని వీడి సొంతంగా కేజేపీ స్థాపించి ఎన్నికలకు వెళ్లారు. ఆయన సహచరుడు బి.శ్రీరాములు కూడా బీఎస్ఆర్ పార్టీని నెలకొల్పి ఎన్నికల బరిలో దిగారు. ఈ పరిణామాలతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36.6 శాతం ఓట్లను రాబట్టి 112 నియోజకవర్గాల్లో గెలుపొందింది. బీజేపీ 19.9 శాతం ఓట్లతో 40 సీట్లు, జేడీఎస్ పార్టీ 20.2 శాతం ఓట్లతో 40 సీట్లు, యడియూరప్ప కేజేపీ పార్టీ 9.8 శాతం ఓట్లతో ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్నాయి. ఈ దెబ్బతో బీజేపీ యడియూరప్పను బుజ్జగించి పార్టీలోకి తిరిగి చేర్చుకుంది. ఎందుకీ పరిస్థితి..? కర్ణాటక ఓటరు నాడి ఎవరికీ అందకుండా ఉంటుంది. పోలింగ్ బూత్కి వెళ్లేవరకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలా అని నిర్ణయించుకోలేని ఓటర్లు 20% వరకు ఉంటారని అంచనాలున్నాయి. దీనివల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందో చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్లిష్టమైన కులాల చిక్కుముడులు, లింగాయత్లు, వొక్కలిగల జనాభా ఎంత ఉంటుందో స్పష్టమైన గణాంకాలు లేకపోవడం వంటివి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడానికి కారణాలన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ జేడీ(ఎస్) పాత మైసూరుకే పరిమితమైంది.ఆ ప్రాంతంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. దీంతో ఎక్కడైనా రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొంటోంది. పాత మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. దీంతో అయితే భారీ మెజార్టీ, లేదంటే అతి స్వల్ప మెజార్టీతో పార్టీలు విజయం సాధిస్తున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల ఆ పార్టీ ఓట్ల శాతంలో అగ్రభాగంలో నిలుస్తున్నా అధికారానికి అవసరమైన సీట్లను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. -
తెలుగు ప్రజల మధ్దతుతో మేమె గెలుస్తాం...