మధ్యప్రదేశ్‌లో మేజిక్‌ మార్క్‌ చేరుకున్న కాంగ్రెస్‌ | Congress Emerges Single Largest Partty In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో మేజిక్‌ మార్క్‌ చేరుకున్న కాంగ్రెస్‌

Dec 11 2018 3:43 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Emerges Single Largest Partty In Madhya Pradesh - Sakshi

మధ్యప్రదేశ్‌లో ముందున్న హస్తం..

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డ బీజేపీ, కాంగ్రెస్‌లు తుది రౌండ్ల వరకూ ఉత్కంఠ పెంచేలా పోటీపడుతున్నాయి. ప్రారంభం నుంచీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య స్వల్ప ఆధిక్యంతో విజయం దోబూచులాడుతున్నా తాజాగా కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 116 స్ధానాలు కాగా, కాంగ్రెస్‌ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ఆధిక్యం సాధించింది.

ఇక నాలుగు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న బీఎస్పీ, ఆరు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ, ఇతరుల సహకారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement