‘జమిలి’ రాజ్యాంగ ధిక్కారం: కాంగ్రెస్‌ | Proposal for Simultaneous Polls a 'Constitutional Perversity': Congress | Sakshi
Sakshi News home page

‘జమిలి’ రాజ్యాంగ ధిక్కారం: కాంగ్రెస్‌

Published Wed, Jul 11 2018 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Proposal for Simultaneous Polls a 'Constitutional Perversity': Congress

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ యోచనను కాంగ్రెస్‌ ‘రాజ్యాంగ ధిక్కారం’గా పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారుతుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి అన్నారు. ‘వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌’ అనే అర్థంపర్థం లేని ప్రజాస్వామ్య వ్యతిరేక వాదనతో ఏకకాలంలో ఎన్నికలకు ప్రభుత్వం యత్నిస్తోంది.

ఈ ప్రయత్నం నియంతృత్వానికి మరో ఉదాహరణ. చెప్పుకోవటానికి మంచిగా అనిపించే ఈ యోచన..ప్రభుత్వ గిమ్మిక్‌. ఏకకాలంలో ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగంలో కనీసం 10 సవరణలు చేయాలి. ఇందుకు మూడింట రెండొంతుల మెజారిటీ ప్రభుత్వానికి ఉందా?’ అని ప్రశ్నించారు. ఏకకాలంలో ఎన్నికలంటే ప్రభుత్వాన్ని, ప్రతినిధులను ఎన్నుకునేందుకు ప్రజలకు గల హక్కును నిరాకరించటమేనన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement