![Rajasthan to Spend Rs 7 Crore to Transport Welfare Scheme Beneficiaries for PM Modi’s Rally - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/7/mod.jpg.webp?itok=2zhc31_w)
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ర్యాలీ కోసం రాజస్తాన్ ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు చేస్తోంది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిర్వహించే ఈ భారీ ర్యాలీ ఈ నెల 7న జైపూర్లో జరగనుంది. ప్రజల తరలింపునకు అయ్యే ఖర్చును వివిధ పథకాల నిధుల నుంచి మళ్లించినట్లు కూడా అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన 12 సంక్షేమ పథకాల లబ్ధిదారులైన దాదాపు 2.5లక్షల మంది ఈ ర్యాలీకి తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జైపూర్లోని అమృదోన్ కా బాగ్ స్టేడియంలో జరిగే సభకు 33 జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం 5,579 బస్సులను కేటాయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.2కోట్లు ఖర్చు పెడుతోందని సాధారణ పాలనా విభాగం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment