రైతుబంధుతో ప్రతిపక్షాలకు బొంద: సోలిపేట | solipeta ramalinga reddy slams oppgatation | Sakshi

రైతుబంధుతో ప్రతిపక్షాలకు బొంద: సోలిపేట

May 17 2018 5:04 AM | Updated on Aug 15 2018 9:06 PM

solipeta ramalinga reddy slams oppgatation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 8 వేలు ఇస్తున్న రైతుబంధు పథకంతో ప్రతిపక్షాలను రైతులే బొంద పెట్టడం తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ రైతులను గత పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. రైతులకు సాగునీరు, సాగుకు పెట్టుబడి, గిట్టుబాటు ధర వరకూ అన్ని సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా, రైతు బాంధవునిగా పనిచేస్తున్నారని అన్నారు. రైతుబంధు వద్దని ప్రతిపక్షనేతలు అనగలరా అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement