
ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభా వేదిక
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): నెల్లూరులో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న సమరశంఖారావం సభ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరులో నిర్వహించే సమరశంఖారావం సభలో పాల్గొని పార్టీ శ్రేణులు, బూత్కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఇందు కోసం నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో సభ జరగనుంది. ఈ సభకు విచ్చేయనున్న వారికి కుర్చీలు, వాహనాల పార్కింగ్ సదుపాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.