ఢిల్లీ: 2,2,3,1,10,6,5,0,3,6,4..ఇవేమి మ్యాజికల్ నంబర్స్ కాదు. దేశవాళీ లీగ్ సందర్భంగా ఒక జట్టులోని ఆటగాళ్లు వరుసగా నమోదు చేసిన పరుగులు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా గ్రూప్-సిలో ఇక్కడ గురువారం బరోడాతో జరిగిన మ్యాచ్ లో త్రిపుర జట్టు ఘోర ప్రదర్శన ఇది. త్రిపుర కెప్టెన్ మురాన్ సింగ్ నమోదు చేసిన 10 పరుగులే అత్యధిక స్కోరు కాగా, కేవలం 22.2 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టులో 16 పరుగులు ఎక్సట్రాలు రూపంలో రావడం గమనార్హం.
బరోడా బౌలరల్లో స్వప్నిల్ సింగ్ ఐదు , యూసఫ్ పఠాన్ మూడు వికెట్లు తీసి త్రిపుర బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన బరోడా కూడా ఆదిలో తడబడి 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే అంబటి రాయుడు(31 నాటౌట్), హార్థిక్ పాండ్యా(5 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో బరోడా 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో విజయంతో బరోడా 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఐదు మ్యాచ్ ల్లో ఓటమి చవిచూసిన త్రిపుర పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
సింగిల్ డిజిట్స్ 10.. ఎక్సట్రాలు 16.. జట్టు స్కోరు 58
Published Thu, Dec 17 2015 7:47 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM
Advertisement
Advertisement