ద్రవిడ్‌, గంగూలీ తర్వాత విహారే! | Hanuma Vihari Becomes Third Indian to score 50 on Test debut At England | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 9 2018 8:16 PM | Last Updated on Sun, Sep 9 2018 8:16 PM

Hanuma Vihari Becomes Third Indian to score 50 on Test debut At England - Sakshi

హనుమ విహారి

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తర్వాత అతని స్థానంలోనే తుది జట్టులోకి వచ్చి ఈ ఘనతను అందుకోవడం..

లండన్‌ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తెలుగు క్రికెటర్‌ హను విహారి అరుదైన రికార్డ్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఈ యువక్రికెటర్‌ క్లిష్ట సమయంలో హాఫ్‌ సెంచరీ సాధించి భారత్‌ను గట్టెక్కించాడు. దీంతో అరంగేట్రపు మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన 26వ భారత క్రికెటర్‌గా విహారి గుర్తింపు పొందాడు. ఈ మధ్యకాలంలో ఈ ఘనతను టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా శ్రీలంకపై అందుకున్నాడు.

అతని స్థానంలోనే తుది జట్టులోకి వచ్చిన విహారి సైతం ఈ జాబితాలో చేరడం విశేషం. ఇంగ్లండ్‌ గడ్డపై అరంగేట్ర మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా విహారి నిలిచాడు. 1996లో లార్డ్స్‌ టెస్ట్‌లో సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌లు ఈ ఘనతను అందుకున్నారు. 104 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన విహారి ఇంగ్లండ్‌ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. అంతేకాదు జడేజాతో కలిసి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల (73) మిడిలార్డర్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు జడేజా(86) సైతం సూపర్‌ ఇన్నింగ్స్‌తొ పోరాడటంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేయగలిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement