ముంబై భారీ స్కోరు
బుచ్చిబాబు టోర్నీ
చెన్నై: బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు తడబడ్డారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్లో ముంబై 100 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బ్యాట్స్మెన్ బ్రావిష్ శెట్టి (157), నిఖిల్ పాటిల్ (123) సెంచరీలతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ 121 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...లెఫ్టార్మ్ సీమర్ అన్వర్ ఖాన్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
మరో వైపు అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర 100 ఓవర్లలో 365 పరుగులు చేసింది. కె.భరత్ రెడ్డి (96), శ్రీకర్ భరత్ (95) సెంచరీలు చేజార్చుకోగా...జి. చిరంజీవి (66), బోడ సుమంత్ (41) రాణించారు.
తడబడిన హైదరాబాద్ బౌలర్లు
Published Mon, Aug 18 2014 11:45 PM | Last Updated on Fri, Sep 7 2018 2:20 PM
Advertisement