
అమ్మాయి నెంబర్ వన్ కాగలదని నిరూపించా
హైదరాబాద్: ఓ సాధారణ అమ్మాయి ప్రపంచంలో తొలిస్థానానికి చేరుకోగలదని తాను నిరూపించానని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేర్కొంది. తన విజయం ఎంతోమంది ఆడబిడ్డలకు స్ఫూర్తిదాయకం అని చెప్పింది. ఆడపిల్లలను కలిగి ఉండటం ఓ బలహీనతగా తల్లిదండ్రులే చూడటం ఈ దేశంలో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది.
మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీఏ ఫ్యామిలీ సర్కిల్ కప్ మహిళల డబుల్స్ ఫైనల్స్లో సానియా మీర్జా - మార్టినా హింగిస్ జో్డీ విజయంతో ఈ ఘనత దక్కించుకుంది. భారత్లో ఈ స్థాయికి చేరిన మొదటి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియానే.