బులవాయో: ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా జింబాబ్వే, శ్రీలంక జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దరుుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 13.3 ఓవర్లలో రెండు వికెట్లకు 55 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు.