అహ్మదాబాద్: ఐపీఎల్-7లోఇప్పటికే ప్లే ఆప్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నేడు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జోరును అడ్డుకుని ప్లే ఆప్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా గత మ్యాచ్లో అతడు ఆడలేదు.
అజింక్య రహానే స్థానంతో ఉన్ముక్త్ చాంద్ను తీసుకున్నారు. స్టీవెన్ స్మిత్ బదులు బ్రాడ్ హగ్, ప్రవీణ్ తాంబే స్థానంలో అంకిత్ శర్మ జట్టులోకి వచ్చారు. ముంబై కూడా మూడు మార్పులతో బరిలోకి దిగింది. లసిత్ మలింగ, సీఎం గౌతమ్, ఆండర్సన్ స్థానంలో క్రిష్ మార్ సంతోకి, శ్రేయాస్ గోపాల్, మైఖల్ హసీని తీసుకున్నారు.
రాజస్థాన్ జోరును ముంబై అడ్డుకుంటుందా?
Published Mon, May 19 2014 4:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement
Advertisement