ముంబై: వన్డేల్లో రెండు కొత్త బంతుల వినియోగాన్ని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలవుతున్నప్పటికీ... వచ్చే జనవరిలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ నిబంధన వద్దే వద్దని స్పష్టం చేస్తామని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
గత సెప్టెంబర్లో జరిగిన భేటీలో భారత్తో సహ శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ బోర్డులు ఈ కొత్త నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత్లోని స్పిన్ వికెట్లపై కొత్త బంతుల నిబంధన వల్ల స్పిన్నర్లకు పట్టు దొరకదనే కచ్చితమైన అభిప్రాయంతో ఉన్న బీసీసీఐ దీన్ని పూర్తి స్థాయిలో అమలు జరిపేందుకు మోకాలడ్డుతోంది.
రెండు కొత్త బంతులకు నో
Published Wed, Oct 16 2013 1:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement
Advertisement