పుణె ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది.
పుణె: పుణె ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. సనమ్ సింగ్తో జత కట్టిన సాకేత్ ఫైనల్లో విజయం సాధించాడు.
శుక్రవారం జరిగిన ఫైనల్లో సాకేత్, సనమ్ జంట 6-3, 6-2 స్కోరు తేడాతో థాయ్లాండ్ జోడీ సంచాయ్, సొంచాట్ను ఓడించింది. కాగా పురుషుల సింగిల్స్లో సాకేత్కు నిరాశ ఎదురైంది. సెమీస్లో సాకేత్ ఓటమి చవిచూశాడు.