doubles title
-
టౌన్సెండ్ - సినియకోవా జోడీకి డబుల్స్ టైటిల్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో గతంలో ఒక్కసారి కూడా మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయిన అమెరికా క్రీడాకారిణి టేలర్ టౌన్సెండ్ ఈసారి మాత్రం డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో జత కట్టి తన కెరీర్లో రెండోసారి గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ను దక్కించుకుంది.గత ఏడాది వింబుల్డన్ టోర్నీలో సినియకోవాతో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన టౌన్సెండ్ ఈసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ టౌన్సెండ్ృసినియకోవా ద్వయం 6-2, 6-7 (4/7), 6-3తో సె సు వె (చైనీస్ తైపీ)-ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జోడీపై గెలిచింది. టౌన్సెండ్-సినియకోవాలకు 8,10,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 4 కోట్ల 41 లక్షలు)... సె సు వెృఒస్టాపెంకోలకు 4,40,000 డాలర్లు (రూ. 2 కోట్ల 39 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. సినియకోవా కెరీర్లో ఇది 10వ గ్రాండ్స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో ఆమె బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి 2022, 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్లో... 2018, 2021 ఫ్రెంచ్ ఓపెన్లో... 2018, 2022 వింబుల్డన్ టోర్నీలో... 2022 యూఎస్ ఓపెన్లో... కోకో గాఫ్ (అమెరికా)తో కలిసి 2024 ఫ్రెంచ్ ఓపెన్లో... టౌన్సెండ్తో కలిసి 2024 వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ను సాధించింది. భళా బెర్నెట్... మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ జూనియర్ గ్రాండ్స్లామ్ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి స్విట్జర్లాండ్ ప్లేయర్గా హెన్రీ బెర్నెట్ గుర్తింపు పొందాడు. జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బెర్నెట్ 6-3, 6-4తో బెంజమిన్ విల్వెర్త్ (అమెరికా)పై విజయం సాధించాడు. గతంలో స్విట్జర్లాండ్ తరఫున జూనియర్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో హెయింజ్ గుంతార్ట్ (1976 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్), రోజర్ ఫెడరర్ (1998 వింబుల్డన్), రోమన్ వాలెంట్ (2001 వింబుల్డన్), స్టానిస్లాస్ వావ్రింకా (2003 ఫ్రెంచ్ ఓపెన్), డొమినిక్ స్ట్రయికర్ (2020 ఫ్రెంచ్ ఓపెన్) విజేతలుగా నిలిచారు. -
శభాష్ రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) ద్వయం తమ కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకుంది. కజకిస్తాన్లో ఆదివారం ముగిసిన అల్మాటీ ఓపెన్ అసోసియేన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్–అర్జున్ జోడీ డబుల్స్ టైటిల్ను దక్కించుకుంది. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ టైటిల్ కావడం విశేషం. ఒక గంటా 41 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ జంట 3–6, 7–6 (7/3), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ బారింటోస్ (కొలంబియా)–స్కాండర్ మన్సూరి (ట్యూనిషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన రిత్విక్–అర్జున్లకు 54,780 డాలర్ల (రూ. 46 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 6–9తో వెనుకబడి... తొలి సెట్ను కోల్పోయిన రిత్విక్–అర్జున్రెండో సెట్ను టైబ్రేక్లో నెగ్గి నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో రిత్విక్–అర్జున్ 6–9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచారు. అయితే పట్టుదలతో పోరాడిన రిత్విక్–అర్జున్ స్కోరును సమం చేశారు. చివరకు 14–12తో విజయాన్ని అందుకున్నారు. సాధారణ టైబ్రేక్లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన వారికి సెట్ లభిస్తుంది. ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం తొలుత పది పాయింట్లు నెగ్గిన వారికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు 9–9తో సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం లభించినపుడు గెలుపు ఖరారవుతుంది. 23 ఏళ్ల రిత్విక్ ఈ ఏడాది మూడు ఏటీపీ–250 టోర్నీల్లో (హాంగ్జౌ, అట్లాంటా, న్యూపోర్ట్) ఆడినా తొలి రౌండ్ను దాటలేకపోయాడు. అయితే నాలుగో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం టైటిల్ను అందుకున్నాడు. ఇంతకుముందు రిత్విక్ 10 ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరుకున్నాడు. మూడింటిలో టైటిల్స్ నెగ్గి, ఏడింటిలో రన్నరప్గా నిలిచాడు. -
యూకీ–ఒలివెట్టి జోడీకి టైటిల్
స్టాడ్ (స్విట్జర్లాండ్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్ను సాధించాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం విజేతగా నిలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో హంబెర్ట్–మార్టిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. యూకీ–ఒలివెట్టిలకు 30,610 యూరోల (రూ. 27 లక్షల 87 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జీవన్–అర్జున్ జోడీకి డబుల్స్ టైటిల్
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో భారత్కు చెందిన జీవన్ నెడున్జెళియన్–అర్జున్ ఖడే జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–అర్జున్ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ మటుస్జెవ్స్కీ (పోలాండ్)–రోమియోస్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. జీవన్–అర్జున్ జోడీకి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్మనీ,75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సాకేత్ జోడీకి టైటిల్
బెంగళూరు: భారత డేవిస్ కప్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో డబుల్స్ టైటిల్ సాధించాడు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో రామ్కుమార్ రామనాథన్తో జోడీ కట్టిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ శనివారం జరిగిన ఫైనల్లో ఫ్రెంచ్ జంటపై విజయం సాధించాడు. భారత ద్వయం 6–3, 6–4తో మ్యాక్సిమ్ జాన్వియెర్–బిటన్ కౌజ్మినె జంటపై వరుస సెట్లలో గెలుపొందింది. సింగిల్స్లో భారత టాప్ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్కు మాత్రం సెమీస్లో చుక్కెదురైంది. రెండో సీడ్ నగాల్ 6–7 (2/7), 4–6తో ఇటలీకి చెందిన ఏడో సీడ్ స్టెఫానో నెపొలిటనో చేతిలో పరాజయం చవిచూశాడు. ఆట ఆరంభంలో సుమీత్ 4–1తో ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అయితే ఇటలీ ప్లేయర్ వరుసగా గేమ్లను గెలవడంతో తొలి సెట్ టైబ్రేక్కు దారి తీసింది. భారత ఆటగాడు రెండో సెట్ ఆరంభంలో పట్టుదల కనబరిచినప్పటికీ తర్వాత స్టెఫానో జోరు ముందు నిలువలేకపోయాడు. -
యూకీ ఖాతాలో మూడో డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సాధించాడు. ఫ్రాన్స్లో ఆదివారం ముగిసిన బ్రెస్ట్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–జూలియన్ క్యాష్ (బ్రిటన్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో యూకీ–క్యాష్ జోడీ 6–7 (5/7), 6–3, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ రాబర్ట్ గాలోవే (అమెరికా)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంటను ఓడించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ ద్వయం ఏడు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. టైటిల్ నెగ్గిన యూకీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది యూకీ గిరోనా చాలెంజర్ టోర్నీ (స్పెయిన్), నొంతబురి (థాయ్లాండ్) చాలెంజర్ టోర్నీలో కూడా డబుల్స్ టైటిల్ సాధించాడు. -
యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్
మలోర్కా (స్పెయిన్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలి ఏటీపీ టోర్నీ డబుల్స్ టైటిల్ సాధించాడు. మలోర్కా చాంపియన్షిప్ ఏటీపీ–250 టోర్నీ లో యూకీ బాంబ్రీ (భారత్) –లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయం విజేతగా నిలి చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–హారిస్ జోడీ 6–3, 6–4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన యూకీ–హారిస్ జోడీకి 48,380 యూరోల (రూ. 43 లక్షల 31 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
సాత్విక్- చిరాగ్ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయ జోడీగా రికార్డు
Satwiksairaj Rankireddy- Chirag Shetty- బాసెల్: కీలకదశలో పట్టుదల కోల్పోకుండా ఆడిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. 68 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ గుర్తింపు పొందింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 54 నిమిషాల్లో 21–19, 24–22తో రెన్ జియాంగ్ యు–టాన్ కియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టిలకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కాగా, ఓవరాల్గా ఐదో టైటిల్. ఐదో టైటిల్! ఇక విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 16,590 డాలర్ల (రూ. 13 లక్షల 66 వేలు) ప్రైజ్మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా సాత్విక్–చిరాగ్ కెరీర్లో గెలిచిన వరల్డ్ టూర్ డబుల్స్ టైటిల్స్. స్విస్ ఓపెన్ కంటే ముందు ఈ జంట హైదరాబాద్ ఓపెన్ (2018), థాయ్లాండ్ ఓపెన్ (2019), ఫ్రెంచ్ ఓపెన్ (2022), ఇండియా ఓపెన్ (2022) టోర్నీల్లో విజేతగా నిలిచారు. ఏడోసారి స్విస్ ఓపెన్లో భారత్ ప్లేయర్లకు టైటిల్ దక్కడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ (2011, 2012), పీవీ సింధు (2022)... పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018)... పురుషుల డబుల్స్లో సాత్విక్–చిరాగ్ (2023) విజేతగా నిలిచారు. ఇవి కూడా చదవండి: బోపన్న జోడీకి షాక్ ఫ్లోరిడా: గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో మాత్రం నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 6–4, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న–ఎబ్డెన్ 11 ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశారు. కీలకమైన సూపర్ టైబ్రేక్లో మాత్రం బోపన్న, ఎబ్డెన్ తడబడి ఓటమి చవిచూశారు. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 18,020 డాలర్ల (రూ. 14 లక్షల 83 వేలు) ప్రైజ్మనీ లభించింది. హంపి, హారిక తొలి గేమ్ ‘డ్రా’ న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి టోర్నీని భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ గేమ్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడ్డారు. తెల్లపావులతో ఆడిన హంపి 31 ఎత్తుల్లో గేమ్ను ‘డ్రా’గా ముగించింది. భారత్కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) వైశాలికి తొలి గేమ్లో ‘వాకోవర్’ లభించింది. ఆమెతో తొలి రౌండ్లో తలపడాల్సిన జర్మనీ గ్రాండ్మాస్టర్ ఎలిజబెత్ పాట్జ్ టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో తొలి గేమ్లో వైశాలిని విజేతగా ప్రకటించారు. టోర్నీ నిర్వాహకుల నిర్వహణ వైఫల్యాల కారణంగానే తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని ఎలిజబెత్ తెలిపింది. నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో కజకిస్తాన్ గ్రాండ్మాస్టర్ జాన్సయ అబ్దుమలిక్ కూడా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్కు షాక్.. భరత్కు చోటు -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి టైటిల్
భారత సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 23వ డబుల్స్ టైటిల్ను సాధించాడు. దోహాలో శుక్రవారం జరిగిన ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్స్టంట్ లెస్టిన్ (ఫ్రాన్స్)–బోటిక్ జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్ను నెగ్గి మ్యాచ్లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్లకు 72,780 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీ దక్కింది. -
Guangzhou Open 2022: గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో రన్నరప్ సాకేత్ జోడీ
ఈ ఏడాది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సాధించాలని ఆశించిన భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. కొరియాలో జరిగిన గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ జోడీ 6–2, 3–6, 6–10తో టాప్ సీడ్ బారియెంటోస్ (కొలంబియా)–రెయస్ వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. సాకేత్–యూకీ జోడీకి 1,800 డాలర్ల (రూ. లక్షా 48 వేలు) ప్రైజ్మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టైటిల్ పోరులో సిక్కి–అశ్విని జంట
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించేందుకు నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి–అశ్విని జంట 21–12, 21–12తో ఫాన్ కా యాన్–వు యి టింగ్ (హాంకాంగ్) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో సిక్కి–అశ్విని జంట తలపడుతుంది. ఫైనల్లో సౌరభ్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్ సౌరభ్ 23–21, 21–16తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో లో కీన్ యె (సింగపూర్)తో సౌరభ్ తలపడతాడు. -
సాకేత్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చెంగ్డూ చాలెంజర్ టూర్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 0–6, 10–6తో జి సంగ్ నామ్–మిన్ యు సంగ్ (కొరియా) జంటపై నెగ్గింది. 62 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్లో సాకేత్ జంట 4 ఏస్లు సంధించి, 3 డబుల్స్ ఫాల్ట్లు చేసింది. ఈ విజయంతో సాకేత్ జోడీకి 7,750 డాలర్ల (రూ. 5 లక్షల 40 వేలు) ప్రైజ్మనీ, 110 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
గాయత్రి డబుల్ ధమాకా
హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి సత్తా చాటింది. పీజీబీఏలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 21–19, 21–16తో తన్వి లాడ్పై కేవలం 37 నిమిషాల్లోనే గెలుపొంది కెరీర్లో తొలి సీనియర్ ర్యాంకింగ్ టైటిల్ను అందుకుంది. డబుల్స్ టైటిల్పోరులో గాయత్రి –రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 19–21, 21–14, 21–10తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చి చాంపియన్గా నిలిచింది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ) 25–23, 14–21, 13–21తో లక్ష్యసేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ గారగ (ఆంధ్రప్రదేశ్)–ద్రువ్ కపిల(ఎయిరిండియా) ద్వయం 23–21, 21–17తో ఏడో సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంటపై, మిక్స్డ్ డబుల్స్లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంట 21–19, 13–21, 21–12తో కృష్ణ ప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతలుగా నిలిచాయి. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్లో ఆదివారం ముగిసిన ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్–వరేలా (మెక్సికో) ద్వయం రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో పేస్–వరేలా జోడీ 6–3, 4–6, 2–10తో శాండర్–వీజెన్ (బెల్జియం) జంట చేతిలో ఓడింది. రన్నరప్గా నిలిచిన పేస్ జోడీకి 3,820 యూరోలు (రూ. 3 లక్షల 18 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. యూపీ యోధ గెలుపు పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో రైడర్లు శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్ చెలరేగడంతో యూపీ యోధ జట్టు మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ యో«ధ 38–36తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. విజేత జట్టు తరఫున శ్రీకాంత్ 12, ప్రశాంత్ 11 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్లో నితీశ్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 43–32తో పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యచ్ల్లో పుణేరీ పల్టన్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
చెంగ్డూ ఓపెన్ రన్నరప్ జీవన్ జంట
కెరీర్లో రెండో ఏటీపీ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ క్రీడాకారుడు జీవన్ నెడుంజెళియన్కు నిరాశ ఎదురైంది. ఆదివారం చైనాలో ముగిసిన చెంగ్డూ ఓపెన్లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో జీవన్–ఆస్టిన్ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్ జీవన్–ఆస్టిన్ జంటకు 30,490 డాలర్ల (రూ. 22 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
వియత్నాం ఓపెన్ విజేత సాకేత్ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. హోచి మిన్ సిటీలో ఆదివారం జరిగిన వియత్నాం ఓపెన్ టోర్నమెంట్లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–విజయ్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గో సొయెదా–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ ద్వయం నాలుగు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ కెరీర్లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–విజయ్ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
విష్ణు జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్లోని అస్తానా నగరంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్ (భారత్)–తొషిహిదె మత్సుయ్ (జపాన్) జోడీ 7–6 (7/3), 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎవ్గెని కర్లోవ్స్కీ–తుర్నెవ్ (రష్యా) జంటపై గెలిచింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో విష్ణు ద్వయం ఎనిమిది ఏస్లు సంధించింది. రెండు జోడీలు తమ సర్వీస్ను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో విష్ణు జోడీదే పైచేయిగా నిలిచింది. ఈ సీజన్లో విష్ణుకిది రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గత నెలలో భారత్కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి అతను ఫెర్గానా ఓపెన్ టైటిల్ను గెలిచాడు. మరోవైపు అమెరికాలో జరుగుతున్న న్యూపోర్ట్ ఓపెన్ టోర్నీ సెమీఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)–సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జంట 6–4, 6–7 (6/8), 9–11తో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
పేస్ జంటకు టైటిల్
ఇల్క్లే (బ్రిటన్): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ను సాధించాడు. శనివారం ముగిసిన ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో తన భాగస్వామి ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 2–6, 6–2, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. 45 ఏళ్ల పేస్ ఈ సీజన్లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు. -
రన్నరప్ సానియా జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొమ్మిదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. చైనాలో శనివారం జరిగిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం రన్నరప్గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సానియా-స్ట్రికోవా జోడీ 1-6, 4-6తో బెథానీ మాటెక్ సాండ్స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోరుుంది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జంట తమ సర్వీస్ను ఆరుసార్లు కోల్పోరుు, ప్రత్యర్థి జోడీ సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రన్నరప్గా నిలిచిన సానియా జోడీకి 68 వేల 200 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 45 లక్షల 39 వేలు)తోపాటు 585 ర్యాంకింగ్ పారుుంట్లు... విజేతగా నిలిచిన బెథానీ-సఫరోవా జంటకు లక్షా 35 వేల డాలర్ల (రూ. 89 లక్షల 85 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
సాయి దేదీప్యకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) జాతీయ అండర్-16 సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో సాయి దేదీప్య-ధరణ ముదలియార్ (చత్తీస్గఢ్) జంట 4-6, 7-6 (7/1), 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో షేక్ హుమేరా-షేక్ ముబాషిరా (ఆంధ్రప్రదేశ్) ద్వయంపై గెలిచింది. -
సానియాకు మరో డబుల్స్ టైటిల్
న్యూ హవెన్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన కనెక్టికట్ డబ్ల్యూటీఏ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)-మోనికా నికెలెస్కూ (రొమేనియా) ద్వయం 7-5, 6-4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెరుున్)-చువాంగ్ చియా జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది. ఈ ఏడాది సానియాకిది ఏడో టైటిల్కాగా... కెరీర్లో 38వది. విజేతగా నిలిచిన సానియా జంటకు 40,650 డాలర్ల (రూ. 27 లక్షల 29 వేలు) ప్రైజ్మనీతోపాటు 470 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సానియా-మోనికా జంట 2-6, 6-3, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆంద్రెజా క్లెపాక్-కాటరీనా స్రెబెత్నిక్ (స్లొవేనియా) జోడీపై గెలిచింది. -
రన్నరప్ పేస్ జంట
విన్స్టన్-సాలెమ్ (అమెరికా): ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు నిరాశే మిగిలింది. శనివారం జరిగిన విన్స్టన్-సాలెమ్ ఓపెన్ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో పేస్-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) ద్వయం 6-4, 6-7 (6/8), 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెరుున్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్) జంట చేతిలో ఓడిపోరుుంది. రెండో సెట్లో టైబ్రేక్లో పేస్ జంటకు మూడు మ్యాచ్ పారుుంట్లు లభించినా ఫలితం లేకపోరుుంది. 2015 జనవరిలో ఆక్లాండ్ ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత పేస్ మరో డబుల్స్ టైటిల్ గెలువలేకపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో పేస్-బెగెమన్ ద్వయం 1-6, 7-6 (7/5), 10-4తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ లిండ్స్టెడ్ (స్వీడన్)-ఐజామ్ ఉల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీపై గెలిచింది. రన్నరప్గా నిలిచిన పేస్ జంటకు 18,470 డాలర్ల (రూ. 12 లక్షల 40 వేలు) ప్రైజ్మనీతోపాటు 150 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
ఇంకొక్క అడుగే...
♦ టైటిల్కు విజయం దూరంలో సానియా-హింగిస్ జంట ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఇండో-స్విస్ ద్వయం మెల్బోర్న్: జతగా వరుసగా మూడో గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ సాధించే దిశగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ మరో అడుగు ముందుకేశారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో జోడీగా మహిళల డబుల్స్ టైటిల్స్ నెగ్గిన వీరిద్దరు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్లోనూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-0తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జంటను చిత్తుగా ఓడించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సానియా-హింగిస్ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మొత్తానికి సానియా-హింగిస్లకిది వరుసగా 35వ విజయం కావడం విశేషం. శుక్రవారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటతో ఈ ఇండో-స్విస్ ద్వయం తలపడుతుంది. సెమీస్లో హలవకోవా-హర్డెకా 3-6, 6-3, 6-1తో యి ఫాన్ జు-సాయ్సాయ్ జెంగ్ (చైనా)లపై గెలిచారు. బోపన్న జంటకు నిరాశ మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది. అన్సీడెడ్ జంట ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)-ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్) ద్వయం 6-2, 7-5తో మూడో సీడ్ బోపన్న-జాన్ చాన్ జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముగిసిన ప్రాంజల పోరాటం జూనియర్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల, కర్మాన్ కౌర్ థండి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. పదో సీడ్ ప్రాంజల 5-7, 5-7తో ఎనిమిదో సీడ్ అనస్తాసియా పొటపోవా (రష్యా) చేతిలో; కర్మాన్ కౌర్ 6-3, 5-7, 5-7తో సారా టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-కర్మాన్ జంట 6-7 (3/7), 5-7తో మాడిఇంగ్లిస్-జైమీ జోడీ చేతిలో ఓడారు. -
బోపన్న జంటకు నిరాశ
రెండోసారీ రన్నరప్తో సరి * రోజర్-టెకావ్ జోడీకి డబుల్స్ టైటిల్ * ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ లండన్: ప్రతిష్టాత్మక ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం 4-6, 3-6తో రెండో సీడ్ హొరియా టెకావ్ (రుమేనియా)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది. 2012లో భారత్కే చెందిన మహేశ్ భూపతితో కలిసి ఈ టోర్నీలో ఫైనల్కు చేరిన బోపన్న రన్నరప్గా నిలువగా... ఈసారి మెర్జియాతో కూడా రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్నాడు. డబుల్స్లో నంబర్వన్ ర్యాంక్తో ఈ సీజన్ను ముగించనున్న టెకావ్-రోజర్ ద్వయం ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ సాధించడం విశేషం. 1986లో ఈ టోర్నీలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిని ప్రవేశపెట్టాక ఈ ఘనతను సాధించడం ఇదే తొలిసారి. గంటపాటు జరిగిన ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం సర్వీస్లలో నిలకడ లోపించింది. ఈ జంట ఏడు ఏస్లు సంధించినప్పటికీ మరోవైపు నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. మరోవైపు టెకావ్-రోజర్ జోడీ ఏడు ఏస్లు సంధించి, ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం బోపన్న-మెర్జియాలకు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. టెకావ్-రోజర్ మాత్రం బోపన్న జోడీ సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. ఇప్పటిదాకా టెకావ్-రోజర్ జంటతో ఆడిన నాలుగు పర్యాయాలు బోపన్న-మెర్జియాలకు ఓటమే ఎదురైంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ సెమీఫైనల్లో, ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో, రోమ్ మాస్టర్స్ సిరీస్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న ద్వయం టెకావ్-రోజర్ల చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచి విజేతగా అవతరించిన టెకావ్-రోజర్ జంటకు 4,23,000 డాలర్లు (రూ. 2 కోట్ల 79 లక్షలు), రన్నరప్గా నిలిచిన బోపన్న జోడీకి 2,29,000 డాలర్లు (రూ. కోటీ 51 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. -
సాకేత్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఇజ్మీర్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్ను సాధించాడు. భారత్కే చెందిన తన భాగస్వామి దివిజ్ శరణ్తో కలిసి సాకేత్ విజేతగా నిలిచాడు. టర్కీలోని ఇజ్మీర్ పట్టణంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-దివిజ్ శరణ్ ద్వయం 7-6 (7/5), 4-6, 9-8తో ఆధిక్యంలో ఉన్న దశలో నాలుగో సీడ్, ప్రత్యర్థి జంట మాలిక్ జజిరి (టర్కీ)-మొల్చనోవ్ (ఉక్రెయిన్) గాయం కారణంగా వైదొలిగింది. విజేతగా నిలిచిన సాకేత్ జోడీకి 3,950 యూరోల (రూ. 2 లక్షల 92 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గతంలో అతను సనమ్ సింగ్తో కలిసి పుణే, ఢిల్లీ, కోల్కతాలలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లలో డబుల్స్ టైటిల్స్ను సాధించాడు. -
సానియాకు ‘ఖేల్ రత్న'!
క్రీడా మంత్రిత్వ శాఖ యోచన న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్వితీయ విజయాలు సాధిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు సిఫారసు చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. గత ఏప్రిల్లో మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సాధించి... ఇటీవల వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్నూ నెగ్గి చరిత్ర సృష్టించిన సానియా ఇప్పటివరకు ఈ అవార్డుకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోలేదు. అయితే నిబంధనల ప్రకారం క్రీడా మంత్రిత్వ శాఖ అర్హత ఉన్న వారి ఎవరి పేరునైనా ఈ అవార్డుకు సిఫారసు చేసే వీలుంది. సానియా గతేడాది ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్లో కాంస్యం సాధించింది. అంతేకాకుండా బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే ‘ఖేల్త్న్ర’ అవార్డు విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ తెలిపారు. -
వారెవ్వా... సానియా
-
వారెవ్వా... సానియా
-
వారెవ్వా... సానియా
హింగిస్తో కలిసి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సొంతం లండన్: కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అనుకున్నది సాధించింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ప్రతిష్టాత్మక వింబుల్డన్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 5-7, 7-6 (7/4), 7-5తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) ద్వయంపై గెలిచి చాంపియన్గా నిలిచింది. విజేత సానియా జంటకు 3 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 3 కోట్ల 34 లక్షలు), రన్నరప్ మకరోవా-వెస్నినా జోడీకి లక్షా 70 వేల పౌండ్లు (రూ. కోటీ 67 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 2003లో అలీసా క్లెబనోవా (రష్యా)తో కలిసి వింబుల్డన్ జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన సానియా 12 ఏళ్ల తర్వాత హింగిస్తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ను నెగ్గడం విశేషం. గతంలో సానియా నెగ్గిన మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. భారత్కే చెందిన మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012), బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి 2014లో యూఎస్ ఓపెన్ సాధించింది. -
మనసులు గెలుచుకుంది!
సాక్షి క్రీడావిభాగం ఏడేళ్ల క్రితం... ఒకదాని వెంట మరో వివాదం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దుస్తులు-ఫత్వాలు, సెక్స్పై వ్యాఖ్యలు, జాతీయ పతాకానికి అవమానం, మసీదులో షూటింగ్... ఎంత స్థితప్రజ్ఞత కనబర్చినా, వీటన్నింటినీ తట్టుకోవడం 21 ఏళ్ల సానియా మీర్జా వల్ల కాలేదు. ఏం చేసినా కొత్త వివాదానికి కారణం కావడంతో ఆమె కన్నీళ్ల పర్యంతమైంది. ‘నేను తప్పు చేస్తే అనండి కానీ చేసే ప్రతీదీ తప్పంటే నేనేమీ చేయలేను’ అంటూ ఇకపై భారత్లో టెన్నిస్ ఆడలేనని తనపై తాను నిషేధం విధించుకుంది. నాలుగేళ్ల తర్వాత ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్తోనే ఆమె మళ్లీ భారత అభిమానుల ముందుకు వచ్చింది. బీజింగ్ నుంచి లండన్ ఒలింపిక్స్ వరకు... పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో పెళ్లి నుంచి ‘తెలంగాణ రాష్ట్ర ప్రచారకర్త’ కావడం వరకు ప్రతీసారి ఆమె తన దేశభక్తిపై పరీక్షను ఎదుర్కొంది. ఎప్పటికప్పుడు నేను భారతీయురాలినే అని నిరూపించుకుంటూ రావాల్సి వచ్చింది. అదే సానియా ఇప్పుడు ప్రపంచ పటంపై భారత కీర్తి పతాకను ఎగురవేసింది. ఎవరికీ అందనంత ఎత్తులో శిఖరాన నిలిచింది. ఇప్పుడు ఆమె అందరి మనిషి. ఈ ఘనత అద్వితీయం. ఈ గెలుపు ఆమె ఒక్కదానిదే కాదు. ఇది ప్రతీ భారతీ యుడి గెలుపు. అడ్డంకులు, అవరోధాలు ఎన్ని ఎదురైనా ముందుకు సాగాలనే మహిళా స్ఫూర్తికి సాని యా ఇప్పుడు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్. పుష్కర కాలపు ప్రస్థానం... 2003లో జూనియర్ వింబుల్డన్ డబుల్స్ టైటిల్ గెలిచిన నాటినుంచి పన్నెండేళ్ల తర్వాత డబుల్స్లో ప్రపంచ నంబర్వన్గా ఎదగడం వరకు సానియా మీర్జా కెరీర్లో ఎన్నో మలుపులున్నాయి. భారత్లో టెన్నిస్కు అంత ప్రోత్సాహకర పరిస్థితులు లేని సమయంలో కూడా స్వశక్తితోనే ఎదగడం ఆమె గొప్పతనం. 2004 నుంచి డబ్ల్యూటీఏ సర్క్యూట్లో ఉన్న సానియా, ఈ 12 ఏళ్లలో 2005, 2008 మినహా ప్రతీ ఏడాది కనీసం ఏదో ఒక టైటిల్ గెలుచుకుంది. సానియా కెరీర్లో ఏ దశలోనూ పూర్తి స్థాయి కోచ్ లేరు. అప్పుడప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన ఒకరిద్దరిని ట్రావెలింగ్ కోచ్గా పెట్టుకున్నా... ఆమెను తీర్చిదిద్దడంలో వారి పాత్ర చాలా స్వల్పం. ఎక్కువ భాగం తండ్రి ఇమ్రాన్ మీర్జా మార్గదర్శనమే కొనసాగింది. తన బలహీనత అయిన సర్వ్ అండ్ వాలీని వెనక్కి నెట్టి... బలమైన ఫోర్హ్యాండ్తో అద్భుతాలు సాధించింది. 2007లో తన సింగిల్స్ అత్యుత్తమ ర్యాంక్ 27కు చేరిన సానియాను... కొద్ది రోజులకే గాయాలు వెంటాడాయి. దాంతో సింగిల్స్కు గుడ్బై చెప్పి డబుల్స్పై దృష్టి సారించాలనే ఆమె ముందుచూపు మంచి ఫలితాలు ఇచ్చింది. 14 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి సానియా 26 టైటిల్స్ సాధించడంలో ఆమె ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ ప్రదర్శన... సానియా కెరీర్లో 2013, 2014 అద్భుతంగా సాగాయి. సింగిల్స్ను పూర్తిగా వదిలి 2013లో ఒక్క డబుల్స్లోనే బరిలోకి దిగింది. ఏకంగా ఐదు డబ్ల్యూటీఏ టోర్నీలలో విజేతగా నిలిచిన సానియా, తొలి సారి 9వ ర్యాంక్తో సీజన్ను ముగించింది. 2014లో కూడా ఇదే జోరు కొనసాగింది. ఈసారి కూడా మూడు టైటిల్స్ సాధించి కెరీర్ బెస్ట్ అయిన ఐదో ర్యాంక్కు చేరుకుంది. 2015లో అయితే ఇప్పటికే నాలుగు టోర్నీలు తన ఖాతాలో వేసుకుంది. అదీ గెలిస్తే... నాకు రెండే కోరికలు... ఒకటి ప్రపంచ నంబర్వన్ కావడం, రెండోది మహిళల డబుల్స్లో గ్రాండ్స్లామ్ గెలవడం... ఇటీవల సానియా చేసిన వ్యాఖ్య ఇది. ఇప్పుడు నంబర్వన్ కోరిక తీరిపోయింది. 2011లో వెస్నినా (రష్యా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ వరకు వచ్చిన మీర్జా అడుగు దూరంలో ఆ అవకాశం కోల్పోయింది. సానియా-హింగిస్ జోడి తాజా ఫామ్ చూస్తే వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్తోనే ఆ కోరిక తీరుతుందేమో. మిక్స్డ్ డబుల్స్లోనూ మూడు గ్రాండ్స్లామ్లు నెగ్గిన ఆమెకు వింబుల్డన్ మాత్రం ఇంకా అందలేదు. దీంతో పాటు వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్లో పతకం కూడా లక్ష్యంగా పెట్టుకున్న సానియా మరిన్ని విజయాలు సాధించాలనేదే ప్రతీ భారతీయుడి కోరిక. సానియా కెరీర్గ్రాఫ్ డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్స్: 26 డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్స్: 1 డబుల్స్ గెలుపు-ఓటముల రికార్డు: 352-173 సింగిల్స్ గెలుపు- ఓటముల రికార్డు: 271-161 గ్రాండ్స్లామ్ కెరీర్: మిక్స్డ్ డబుల్స్లో 3 టైటిల్స్, రెండు సార్లు రన్నరప్ సింగిల్స్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్: 27 (2007) డబుల్స్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్: 1 (2015) ఆసియా క్రీడల్లో ఏడు పతకాలు కామన్వెల్త్ క్రీడల్లో 1 రజతం, 1 కాంస్యం కెరీర్ ప్రైజ్మనీ: 43 లక్షల 59 వేల డాలర్లు (దాదాపు రూ. 27 కోట్ల 15 లక్షలు) -
మన ముద్ర కనిపించింది
అంతర్జాతీయ టోర్నీలకు వెళ్తారు... రిక్తహస్తాలతో తిరిగి వస్తారు... భారత క్రీడాకారుల గురించి ఒకప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు వినిపించేవి. కానీ కొన్నాళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారతీయ క్రీడాకారులు తమదైన ముద్ర వేశారు. సకల సౌకర్యాలు కల్పిస్తే తమలో కూడా క్రీడా శక్తిగా ఎదిగే లక్షణాలు ఉన్నాయని నిరూపించారు. ఈ ఏడాది కనీసం ఐదారు క్రీడాంశాల్లో మనోళ్లు ప్రశంసనీయ పురోగతి సాధించారు. వచ్చే ఏడాది మరిన్ని మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. 2014లో అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన ఓసారి గుర్తు చేసుకుందాం. - సాక్షి క్రీడావిభాగం టెన్నిస్ సానియా మేనియా అందరి అంచనాలను తారుమారు చేస్తూ, విమర్శకుల నోళ్లు మూయిస్తూ ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త శిఖరాలను అధిరోహించింది. నమ్మశక్యంకాని విజయాలు సాధించి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో హొరియా టెకావ్ (రుమేనియా)తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్గా నిలిచిన సానియా... యూఎస్ ఓపెన్లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను సాధించింది. కారా బ్లాక్తో కలిసి మూడు డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్స్ను సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ మరో నాలుగు టోర్నీల్లో రన్నరప్గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్’లో కారా బ్లాక్తో కలిసి సానియా టైటిల్ నెగ్గడం ఆమె కెరీర్లోనే గొప్ప విజయంగా చెప్పవచ్చు. ఇక ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్లో కాంస్యం సాధించి సానియా తన విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చింది. మరోవైపు భారత పురుషుల టెన్నిస్కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. డబుల్స్లో లియాండర్ పేస్, బోపన్న వేర్వేరు భాగస్వాములతో కలిసి ఒక్కో టైటిల్ను సాధిం చారు. ఏడాది చివర్లో విజయ్ అమృత్రాజ్ ఆధ్వర్యంలో చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్), మహేశ్ భూపతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) సందడి చేశాయి. స్టార్లు ఫెడరర్, జొకోవిచ్, ఇవనోవిచ్ తదితరులు తమ ఆటతీరుతో భారత ప్రేక్షకులను అలరించారు. హాకీ కొత్త ఊపిరి జాతీయ క్రీడకు ఈ ఏడాది అంతా కలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియా 2016 రియో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. కామన్వెల్త్ గేమ్స్లో మరోసారి రజతం నెగ్గింది. ప్రపంచకప్లో నిరాశపరిచినా... చాంపియన్స్ ట్రోఫీలో నాలుగో స్థానాన్ని సంపాదించింది. విశ్వవిజేత ఆస్ట్రేలియాతో వారి గడ్డపైనే జరిగిన 4 మ్యాచ్ల సిరీస్ను భారత్ 3-1తో నెగ్గి చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ మోదం, ఖేదం ఈ ఏడాది భారత బాక్సింగ్ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఆసియా క్రీడల్లో మేరీకోమ్ (51 కేజీలు) స్వర్ణం సాధించగా... ఇవే క్రీడల్లో సెమీఫైనల్ ఫలితంపై నిరసన వ్యక్తం చేస్తూ సరితా (60 కేజీలు) కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించింది. ప్రపంచ చాంపియన్షిప్లో సర్జూబాలా (48 కేజీలు), స్వీటీ (81 కేజీలు) రజ తం గెలిచింది. ప్రపంచ యూత్ బాక్సింగ్లో వైజాగ్ బాక్సర్ కాకర శ్యామ్ కాంస్యం నెగ్గగా...నేషన్స్ కప్లో నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం దక్కించుకుంది. ఆసియా క్రీడల్లో వికాస్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు) కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. కామన్వెల్త్లో దేవేంద్రో, విజేందర్, మన్దీప్, సరితా దేవి రజత పతకాలను సాధించారు. ‘బాక్సింగ్ ఇండియా’ను గుర్తించబోమని భారత ఒలింపిక్ సంఘం స్పష్టం చేయగా... కోర్టులో కేసు గెలిచి ‘అర్జున అవార్డు’ను మనోజ్ దక్కించుకున్నాడు. షూటింగ్ గురి అదిరింది ఈ ఏడాది భారత షూటింగ్ ప్రయాణం ‘పిస్టల్ షూటర్’ జీతూ రాయ్ చుట్టూ సాగింది. ఈ సంవత్సరం తాను బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్లో జీతూ రాయ్ పతకంతో తిరిగి వచ్చాడు. ప్రపంచకప్లో మూడు పతకాలు సాధించిన ఈ ఆర్మీ షూటర్ ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో, ఆసియా క్రీడల్లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకాలు నెగ్గాడు. దాంతోపాటు ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకం నెగ్గి 2016 రియో ఒలింపిక్స్కు బెర్త్ ఖాయం చేసుకున్నాడు. స్టార్ షూటర్ అభినవ్ బింద్రా కామన్వెల్త్ గేమ్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గడంతోపాటు ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించి తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు. గగన్ నారంగ్, ప్రకాశ్ నంజప్ప, సంజీవ్ రాజ్పుత్... మహిళా షూటర్లు రాహీ సర్నోబాత్, అయోనిక పాల్, అపూర్వీ చందేలా, మలైకా గోయల్ తదితరులు కూడా కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించి భారత ‘గన్’ పవర్’ను చాటుకున్నారు. బిలియర్డ్స్, స్నూకర్ పంకజ్ ప్రతాపం తన జోరును కొనసాగిస్తూ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 12వ ప్రపంచ టైటిల్ను జమ చేసుకున్నాడు. 12 ప్రపంచ టైటిల్స్లో నాలుగు ఈ ఏడాది సాధించడం విశేషం. బెంగళూరుకు చెందిన పంకజ్ ఈ సంవత్సరం టైమ్ ఫార్మాట్, పాయింట్ల ఫార్మాట్, వరల్డ్ టీమ్ బిలియర్డ్స్, వరల్డ్ సిక్స్-రెడ్ స్నూకర్ టోర్నీల్లో విజేతగా నిలిచాడు. అయితే ఏడాది చివర్లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ స్నూకర్ చాంపియన్షిప్లో మాత్రం పంకజ్ క్వార్టర్ ఫైనల్లో 14 ఏళ్ల చైనా కుర్రాడు యాన్ బింగ్తావో చేతిలో ఓడిపోయాడు. చెస్ గొప్ప ఎత్తులు ఏడాది పొడవునా మన చెస్ క్రీడాకారులు నిలకడగా రాణించారు. చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ తొలిసారి కాంస్య పతకాన్ని నెగ్గి చరిత్ర సృష్టించింది. పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్, అధిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ లలిత్బాబు సభ్యులుగా ఉన్నారు. కోనేరు హంపి దిలిజాన్, తాష్కెంట్లలో జరిగిన మహిళల గ్రాండ్ప్రి సిరీస్లలో విజేతగా నిలిచి ఓవరాల్గా రెండో స్థానాన్ని సంపాదించింది. క్యాండిడేట్స్ టోర్నీ, బిల్బావో మాస్టర్స్, లండన్ క్లాసిక్ టోర్నీల్లో విజేతగా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చాంపియన్షిప్లో మరోసారి కార్ల్సన్ (నార్వే) చేతిలో ఓడిపోయాడు. చివరగా అండర్-16 చెస్ ఒలింపియాడ్లో భారత జట్టు పసడి పతకాన్ని నెగ్గి ఏడాదిని ఘనంగా ముగించింది. రెజ్లింగ్ పట్టు సడలించలేదు ప్రపంచ చాంపియన్షిప్లో మినహా... మిగతా అన్ని ఈవెంట్స్లో భారత రెజ్లర్లు పతకాల పట్టు పట్టారు. కామన్వెల్త్ గేమ్స్లో యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్, అమిత్ కుమార్, వినేశ్ స్వర్ణ పతకాలను సాధించారు. ఆసియా క్రీడల్లోనూ యోగేశ్వర్ దత్ రాణించి పసిడి పతకం నెగ్గాడు. 1986 తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్గా అతను గుర్తింపు పొందాడు. ఆర్చరీ గురి తడబాటు రికర్వ్ విభాగంతో పోలిస్తే కాంపౌండ్ ఆర్చర్లు మెరుగ్గా రాణించారు. దీపిక కుమారి నిరాశపరచగా... కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ సత్తా చాటుకున్నాడు. ఆసియా క్రీడల్లో అతను టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గడంతోపాటు వ్యక్తిగత విభాగంలో రజతం సాధించాడు. యూత్ ఒలింపిక్స్లో అతాను దాస్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఫుట్బాల్ ఐఎస్ఎల్ హవా తొలిసారి జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) విజయవంతం కావడం భారత ఫుట్బాల్కు ఊతమిచ్చింది. దక్షిణాసియా మహిళల చాంపియన్షిప్లో భారత్ ‘హ్యాట్రిక్’ సాధించింది. పురుషుల జట్టు మాత్రం చెప్పుకోతగ్గ విజయాలు సాధించలేదు. వెయిట్లిఫ్టింగ్ డోపీల్లేకుండా ఈ ఏడాది భారత్ నుంచి ఒక్క వెయిట్లిఫ్టర్ కూడా డోపింగ్ పరీక్షలో పట్టుబడకపోవడం శుభవార్త. రాగాల వెంకట్ రాహుల్ యూత్ ఒలింపిక్స్లో రజతం... కామన్వెల్త్ లో మత్స సంతోషి రజతం నెగ్గారు. కామన్వెల్త్లో సతీశ్ శివలింగం, రవికుమార్ వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలు సాధించి మొత్తం 64 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ నాలుగో ర్యాంక్కు శ్రీకాంత్ ఈ ఏడాది సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకుల్లో నాలుగో స్థానానికి చేరాడు. గతంలో ప్రకాశ్ పదుకొనే (1వ ర్యాంక్), గోపీచంద్ (4వ ర్యాంక్) మాత్రమే భారత్ నుంచి టాప్-5 ర్యాంక్లు సాధించారు. ఈ ఏడాది ఆరంభంలో 45వ ర్యాంక్లో ఉన్న శ్రీకాంత్ అనూహ్యమైన ఆటతీరుతో అద్భుతమైన ప్రగతి సాధించి నాలుగో ర్యాంక్కు చేరాడు. ‘ఈ సీజన్లో నా ఆటతీరు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. నాలుగో ర్యాంక్కు చేరతానని ఊహించలేదు. వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ అర్హత టోర్నీలు ఉన్నాయి. కాబట్టి మరింత మెరుగ్గా ఆడటమే లక్ష్యం’ అని శ్రీకాంత్ తెలిపాడు. ఏడాది మధ్యలో గాయమైనా శ్రీకాంత్ ఇంత గొప్ప ర్యాంక్ సాధించడం విశేషమని కోచ్ గోపీచంద్ ప్రశంసించారు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ నాలుగో ర్యాంక్లోనే కొనసాగుతోంది. -
సాకేత్ మైనేని జోడీకి డబుల్స్ టైటిల్
పుణె: పుణె ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. సనమ్ సింగ్తో జత కట్టిన సాకేత్ ఫైనల్లో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాకేత్, సనమ్ జంట 6-3, 6-2 స్కోరు తేడాతో థాయ్లాండ్ జోడీ సంచాయ్, సొంచాట్ను ఓడించింది. కాగా పురుషుల సింగిల్స్లో సాకేత్కు నిరాశ ఎదురైంది. సెమీస్లో సాకేత్ ఓటమి చవిచూశాడు. -
సానియా జోడీకి టైటిల్
పాన్ పసిఫిక్ ఓపెన్ టోక్యో: ప్రస్తుత సీజన్లో అద్వితీయ ఆటతీరును ప్రదర్శిస్తున్న సానియా మీర్జా పాన్ పసిఫిక్ ఓపెన్లోనూ మెరిసింది. జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్తో కలిసి ఆమె డబుల్స్ టైటిల్ను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ జోడి గార్డిన్ ముగురుజా, కార్లా స్వారెజ్ నవారోపై 6-2, 7-5 తేడాతో సానియా ద్వయం నెగ్గింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా, బ్లాక్ ఏడు సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన సానియా జోడికి 44 వేల 835 డాలర్లు (రూ. 27 లక్షల 26 వేలు) ప్రైజ్మనీగా లభించింది. కెరీర్లో సానియాకిది 21వ డబుల్స్ టైటిల్కాగా... కారా బ్లాక్తో కలిసి నాలుగోది. తాజా విజయంతో సానియా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగేందుకు ఇంచియాన్ బయలుదేరి వెళ్లనుంది. దివిజ్ శరణ్ లేదా సాకేత్లలో ఒకరితో కలిసి మిక్స్డ్ డబుల్స్లో ఆడనుంది. -
రన్నరప్ సానియా జోడి
స్టట్గార్ట్ (జర్మనీ): ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు మరోసారి నిరాశ ఎదురైంది. పోర్షె గ్రాండ్ప్రి డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రన్నరప్గా నిలిచింది. టాప్ సీడ్ సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడి 6-2, 6-3తో సానియా-కారా బ్లాక్ జంటను ఓడించి విజేతగా నిలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జోడి ఏస్ కానీ, డబుల్ ఫాల్ట్గానీ నమోదు చేయలేదు. అయితే తమ సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. రన్నరప్ సానియా జంటకు 16,129 యూరోలు (రూ. 13 లక్షల 52 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఇటీవల ఇండియన్ వెల్స్ టోర్నీ ఫైనల్లోనూ సానియా-కారా బ్లాక్ జోడి రన్నరప్తో సరిపెట్టుకుంది. -
రిషిక జోడికి డబుల్స్ టైటిల్
సింగిల్స్ సెమీస్లో ఓడిన నిధి ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ చెన్నై: అంతర్జాతీయు టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీలో తెలుగు అమ్మాయి రిషిక సుంకర డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. తన భాగస్వామి షర్మదా బాలు (భారత్)తో కలిసి ఆడిన రిషిక ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో 6-0, 7-6(7/4)తో నటాషా-ప్రార్థన (భారత్) జోడిపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి చిలుముల పరాజయం పాలైంది. ఆరో సీడ్ నిధి 3-6, 5-7తో టాప్ సీడ్ ప్రార్థన (భారత్) చేతిలో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో ఏడో సీడ్ ఇతీ మెహతా (భారత్) 3-6, 7-5, 6-3తో రెండో సీడ్ నటాషా (భారత్)పై నెగ్గి ఫైనల్స్కు చేరుకుంది. నేటి ఫైనల్ మ్యాచ్లో ఇతీ మెహతా, ప్రార్థన అమీతుమీ తేల్చుకోనున్నారు. -
విష్ణు ఖాతాలో 18వ డబుల్స్ టైటిల్
చెన్నై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తన కెరీర్లో 18వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ను సాధిం చాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఐటీఎఫ్ ఇండియా ఫ్యూచర్స్-3 టోర్నీలో తన భాగస్వామి జీవన్ (భారత్)తో కలిసి విష్ణు విజేతగా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్ విష్ణు-జీవన్ ద్వయం 7-6 (7/1), 6-3తో టాప్ సీడ్ శ్రీరామ్ బాలాజీ-రంజిత్ (భారత్) జోడిపై విజయం సాధించింది. తొలి సెట్లో రెండు జంటలు తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో విష్ణు జంట పైచేయి సాధిచింది. రెండో సెట్లో ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసిన విష్ణు ద్వయం అదే జోరులో విజయాన్ని ఖాయం చేసుకుంది. గతేడాది ఆగస్టులో గాబోన్ టోర్నీలో జీవన్తోనే కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన విష్ణు ఆ తర్వాత మరో టైటిల్ను తన ఖాతాలో వేసుకోలేదు. -
రన్నరప్ బోపన్న జంట
సిడ్నీ: తుదికంటా పోరాడినా రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జోడీ సీజన్లో తొలి డబుల్స్ టైటిల్ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. శనివారం ముగిసిన సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-పాక్ ద్వయం రన్నరప్తో సంతృప్తి చెందింది. ఫైనల్లో డానియల్ నెస్టర్ (కెనడా)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జోడి 7-6(7/3), 7-6(7/3)తో బోపన్న-ఖురేషీ జంటపై నెగ్గింది. మ్యాచ్లో ఎక్కడా ఒక్కసారి కూడా సర్వీస్ బ్రేక్ కాకపోవడంతో రెండు సెట్లలోనూ టైబ్రేకర్లోనే ఫలితం వచ్చింది. బోపన్న జోడికి 13,100 డాలర్ల (రూ. 8 లక్షలు) ప్రైజ్మనీతో పాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఈ ఏడాది కలిసొచ్చింది
న్యూఢిల్లీ: ఈ ఏడాది తనకు బాగా కలిసొచ్చిందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. శనివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో ఆమె కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఆమె సాధించిన ఐదో టైటిలిది. ఈ నేపథ్యంలో హైదరాబాదీ స్టార్ మాట్లాడుతూ... గతేడాది కంటే ఈ ఏడాదే తన ఆటతీరు, విజయాల శాతం మెరుగయ్యాయని చెప్పింది. ‘మొత్తం మీద నా ప్రదర్శన బాగా మెరుగైంది. గత సీజన్తో పోల్చుకుంటే ఒక్క ఫిట్నెసే కాదు... ఆటతీరుతో సహా అన్నింట్లో పరిస్థితి మెరుగైంది. కారాతో కలిసి చక్కని విజయాలు సాధించాను. మా జోడి సరిపోయింది. కోర్టుల్లో మా సమన్వయం కుదరడంతో నిలకడైన విజయాలు దక్కుతున్నాయి. వచ్చే సీజన్ అంతా ఆమెతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాను’ అని సానియా తెలిపింది. ముఖ్యంగా కారాతో కలిసి ఆమె తొమ్మిది మ్యాచ్ల్లో అజేయ జైత్రయాత్ర కొనసాగించింది. ఈ ద్వయం జపాన్ ఓపెన్, చైనా ఓపెన్లలో వరుస టైటిళ్లు సాధించింది. -
చైనాలోనూ సానియా ‘షో’
బీజింగ్: మూడు పదుల వయసు దాటిన భాగస్వామి దొరికినా... ఇద్దరి మధ్య మంచి సమన్వయం కుదిరితే... అద్భుత ఫలితాలు సాధించవచ్చని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి నిరూపించింది. వారం రోజుల వ్యవధిలో ఆమె వరుసగా రెండో డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది. 34 ఏళ్ల కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి 26 ఏళ్ల ఈ హైదరాబాదీ చైనా ఓపెన్ టైటిల్ను హస్తగతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-కారా బ్లాక్ జోడి 6-2, 6-2తో వెరా దుషెవినా (రష్యా)-అరంటా సన్టోంజా (స్పెయిన్) ద్వయంపై విజయం సాధించింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సానియా కెరీర్లో ఇది 19వ డబుల్స్ టైటిల్ కాగా... ఈ సీజన్లో ఐదోది కావడం విశేషం. మరోవైపు కారా బ్లాక్ కెరీర్లో ఇది 57వ టైటిల్. విజేతగా నిలిచిన సానియా జోడికి 2 లక్షల 91 వేల డాలర్ల ప్రైజ్మనీ (రూ. కోటీ 78 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన సానియా-కారా బ్లాక్ తమ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. గతవారమే సానియా-కారా బ్లాక్ టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ను సాధించిన సంగతి తెలిసిందే. పేస్ జోడికి షాక్ మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ లియాండర్ పేస్ (భారత్) -డానియల్ నెస్టర్ (కెనడా) జోడి సెమీఫైనల్లో ఓడిపోయింది. పేస్-నెస్టర్ ద్వయం 6-3, 5-7, 8-10తో ఫాగ్నిని-సెప్పి (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది.