ఈస్ట్బోర్న్ (లండన్) : ఎగాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లో ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా జోడి 5-7, 4-6తో గార్సియా (ఫ్రాన్స్)- స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీ చేతిలో ఓడింది. సానియా జోడీకి 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వచ్చినా మూడు మాత్రమే సాధించింది.