కాన్పూర్ చేరిన భారత్, వెస్టిండీస్ జట్లు | Teams India, West Indies arrive in Kanpur | Sakshi
Sakshi News home page

కాన్పూర్ చేరిన భారత్, వెస్టిండీస్ జట్లు

Published Tue, Nov 26 2013 1:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

Teams India, West Indies arrive in Kanpur

కాన్పూర్ : సిరీస్‌ ఫలితం తేల్చే చివరి వన్డే కోసం భారత్, వెస్టిండీస్‌ జట్లు మంగళవారం కాన్పూర్‌ చేరుకున్నాయి.  చాలా రోజుల తర్వాత వచ్చిన టీమిండియాకు నిర్వాహకులు సాంప్రదాయ స్వాగతం పలికారు. ఆటగాళ్లు బస చేసే హోటల్లో ప్రత్యేకంగా ఓ కేక్‌ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు టీమ్స్‌ 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో చివరి వన్డే కీలకంగా మారింది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌ సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో అనూహ్యంగా టీమిండియాకు షాకిచ్చిన వెస్టిండీస్‌.. ఆ  కొత్త ఉత్సాహంతో మూడో వన్డే మ్యాచ్ కోసం బరిలోకి దిగుతోంది. అటు ఈ ఏడాది వరసగా ఏడో వన్డే సిరీస్‌ గెలవాలని ధోనీసేన ఉబలాటపడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement