Kanpur
-
ఇజ్రాయెల్ మెషీన్తో చిటికెలో నవయవ్వనం, కట్ చేస్తే రూ. 35 కోట్లు
ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి. ముఖం మీద చిన్నముడత కూడా ఉండకూడదు. దీనికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఈ క్రేజ్నే క్యాష్ చేసుకొంటున్నారు మరికొంతమంది కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులను నమ్మించి వలలో వేసుకుంది. "ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మెషిన్" ద్వారా అందర్నీ నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి నమ్మబలికారు. అలా ఏకంగా 35 కోట్ల రూపాయలను దండుకుంది. ఇందుకోసం కాన్పూర్లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ - ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. "ఆక్సిజన్ థెరపీ" తో ఏకంగా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90వేలు... ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్ చేశారు. అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాను రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు రూజ35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు. ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. -
భారత్- బంగ్లా టెస్టుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట కూడా డౌటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా ప్రారంభం కాలేదు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ పార్క్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అయితే ప్రస్తుతం కాన్పూర్లో వర్షం కురవడం లేదు. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. గ్రీన్ పార్క్ స్టేడియంలో మెరుగైన డ్రైనజీ వ్యవస్ధ లేకపోవడంతో గ్రౌండ్ను రెడీ చేసేందుకు సిబ్బందికి కష్టతరం అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు అంపైర్లు పిచ్ను పరిశీలించనున్నారు. కాగా ఇప్పటికే రెండో రోజు(శనివారం) ఆట కనీసం బంతి పడకుండానే రద్దు అయింది. ఇప్పుడు మూడో రోజు ఆటకు కూడా భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మళ్లీ వర్షం ఏమైనా తిరుగుముఖం పడితే మూడో రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశముంది. కాగా బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
Ind vs Ban 2nd Test: 35 ఓవర్లకే ముగిసిన ఆట
IND vs BAN 2nd test live updates and highlights: టీమిండియా- బంగ్లాదేశ్ తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. వర్షం కారణంగా 35 ఓవర్లకే ఆగిపోయింది. దీంతో శుక్రవారం ఆట పూర్తయినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. కాన్పూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లా 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఆటంకంటీమిండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటకు ఆటంకం కలిగింది. వెలుతురులేమి కారణంగా ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.సెంచరీ మార్కు దాటిన బంగ్లాదేశ్34 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 102-3.మొమినుల్ హక్ 36, ముష్ఫికర్ రహీం 5 పరుగులతో ఆడుతున్నారు. అశ్విన్ మ్యాజిక్.. బంగ్లా మూడో వికెట్ డౌన్కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో రూపంలో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన శాంటో.. అశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 30 ఓవర్లకు బంగ్లా స్కోర్: 80/3. క్రీజులోకి రహీం వచ్చాడు.నిలకడగా ఆడుతున్న బంగ్లాబంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో మమూనల్ హాక్(17), శాంటో(28) పరుగులతో ఉన్నారు. కాన్పూర్లో వర్షం కూడా మొదలైంది.రెండో వికెట్ డౌన్..షాద్మాన్ ఇస్లాం రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షాద్మాన్.. ఆకాష్ దీప్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ శాంటో వచ్చాడు. 13 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 37/2తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాబంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ ఆకాష్ దీప్ బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ను పెవిలియన్కు పంపాడు. జైశ్వాల్ స్లిప్లో అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్రీజులోకి మమూనల్ హాక్ వచ్చాడు.5 ఓవర్లకు బంగ్లా స్కోర్: 13/05 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(8), జకీర్ హసన్(0) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్నభారత్..కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లా మాత్రం రెండు మార్పులు చేసింది. జట్టులోకి టాస్కిన్ ఆహ్మద్, నహిద్ రాణా స్ధానంలో ఖాలీల్ ఆహ్మద్, తైజుల్ ఇస్లాం వచ్చారు. గ్రీన్ పార్క్ పిచ్ కాస్త స్పిన్కు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన అదనపు స్పిన్నర్తో బంగ్లా ఆడుతోంది.తుది జట్లుబంగ్లాదేశ్: షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్టాస్ ఆలస్యంకాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమవ్వాల్సిన రెండో టెస్టుకు వరుణుడు ఆడ్డంకిగా మారాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.ప్రస్తుతం వర్షం ఆగడంతో గ్రౌండ్ను సిద్దం చేసే పనిలో సిబ్బంది పడ్డారు. దీంతో 9:00 గంటలకు పడాల్సిన టాస్ కాస్త ఆలస్యం కానుంది. మైదానాన్ని అంపైర్లు 9:30లకు పరిశీలించనున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు బయటకు వచ్చి సాధన చేస్తున్నారు. -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. భారత్ క్లీన్ స్వీప్పై కన్నేయగా.. మరోవైపు బంగ్లా ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట తొలి రెండు రోజుల పాటు కాన్పూర్లో భారీ వర్షం కురిసే అవకాశన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27(శుక్రవారం), శనివారం నాడు 90 శాతానికి పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఆదివారం కూడా వర్షం కురవడానికి 50 శాతం ఆస్కారం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ తెలుపుతుంది.ఆఖరి రెండు రోజులకు ఎటువంటి వర్షం ముప్పులేనిట్లు సమాచారం. అయితే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఆప్రమత్తమైంది. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ నుంచి అదనపు కవర్లను తెప్పించేందుకు యూపీసీఎ సిద్దమైంది. ముందు జాగ్రత్తగా మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచాలని యూపీసీఎ అధికారులు భావిస్తున్నారు. అయితే కాన్పూర్ గ్రౌండ్లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. దీంతో చిన్నపాటి వర్షం పడిన కూడా మ్యాచ్కు తీవ్ర అంతరాయం కలిగే చాన్స్ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా ఈ సిరీస్ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో కాన్పూర్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇరు జట్లు ఇప్పటికే కాన్పూర్కు చేరుకున్నాయి. -
గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే?
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు సమయం అసన్నమైంది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి టెస్టులో విఫలమైన బంగ్లాదేశ్ కనీసం కాన్పూర్ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.మూడేళ్ల తర్వాత..కాగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 2021లో న్యూజిలాండ్తో భారత్ తలపడింది. ఆఖరి సెషన్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో కివీస్ అసాధారణ పోరాటం కనబరిచింది. ఈమ్యాచ్తోనే రచిన్ రవీంద్ర కివీస్ తరపున టెస్టు క్రికెట్లోకకి అడుగుపెట్టాడు.బంగ్లాకు స్పిన్ ఉచ్చు..ఇక రెండో టెస్టుకు ముందు భారత జట్టు మెనెజ్మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. ఈ మ్యాచ్ కోసం గ్రీన్ పార్క్ మైదానంలో బ్లాక్ సోయిల్ పిచ్ను తాయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గరుండి పిచ్ను తాయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ సోయిల్ పిచ్ బౌన్స్ తక్కువగా ఉండి, టర్న్ ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ కొనసాగే కొద్దీ వికెట్ స్లో కానుంది. దీంతో ఈ ట్రాక్పై స్పిన్నర్లు పండుగ చేసుకుంటారు. ఈ క్రమంలో భారత స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరోసారి బంగ్లా బెండు తీసే అవకాశముంది. మరోవైపు బంగ్లాలో కూడా షకీబ్, మెహదీ హసన్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు.కాగా చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెడ్ సాయిల్ పిచ్ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఈ వికెట్ పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్, స్పిన్కు సహకరించింది. కానీ నల్లమట్టి పిచ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో కాన్పూర్ టెస్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: IT 2024: జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్ -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద భారీ భద్రత
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్పై టీమిండియా కన్నేసింది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో బంగ్లాతో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ సోమవారం గ్రీన్ పార్క్ స్టేడియం ముందు అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బంగ్లా జట్టు బస చేసే హోటల్ వద్ద భద్రతను భారీగా పెంచినట్లు కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు.యూపీ పోలీస్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అదనపు భద్రతను ఏర్పాటు ఆయన వెల్లడించారు. అదే విధంగా మ్యాచ్ జరిగే సమయంలో సీనియర్ ర్యాంక్ స్ధాయి ఆధికారులు కూడా బందోబస్తులో ఉంటరాని హరీష్ చందర్ స్పష్టం చేశారు. కాగా రెండో టెస్టు కోసం ఇరు జట్లు మంగళవారం సాయంత్రం కాన్పూర్కు చేరుకోనున్నాయి.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర
కాన్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్పై రైల్వే సిబ్బందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.కాన్పూర్లోని ప్రేమ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్లో ఎల్పీజీ సిలిండర్ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్పీఎఫ్కి, డిపార్ట్మెంట్లోని ఇతర అధికారులకు తెలియజేశారు.ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్పై ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్లోని ప్రయాగ్రాజ్ డివిజన్ పీఆర్వో అమిత్ సింగ్కు సమాచారం అందించారు.ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్పూర్- పూణె స్పెషల్ రైలు -
తల లేకుండా మహిళ మృతదేహాం.. యూపీలో కలకలం
లక్నో: ఉత్తరప్రదేశ్లో తలలేకుండా.. నగ్నంగా గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. కాన్పూర్ సమీపంలోని గుజైనా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం మహిళ నగ్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలిపై అత్యాచారం చేసి, హత్యచేసి రహదారిపై పడేసే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు. అయితే ఆమె ఎవరు? అనేది ఇంకా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.బుధవారం ఉదయం 5 గంటలకు తలలేని మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహాం పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలం దగ్గర ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు కానీ.. హైవేకి అవతలి వైపున ఉన్న ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కొన్ని గంటల ముందు అలాగే ఉన్న ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. ఫుటేజీలో మహిళ బూడిద రంగు ప్యాంటు ధరించి కనిపించగా.. మృతదేహానికి సమీపంలోనూ బూడిద రంగు దుస్తులముక్కలు కనిపించాయని పేర్కొన్నారు. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జిల్లాలో మహిళ మిస్సింగ్పై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: శ్రుతి జీవితంలో మరో పెను విషాదంమరోవైపు ఘటనా స్థలిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి, ఆమె దంతాలు, ఎముకల నుంచి నమూనాలను సేకరించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా నేరమా? బాధితురాలు స్థానిక మహిళేనా? వేరే ప్రాంతానికి చెందింది అనేది నిర్దారించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరిగిన మరో షాకింగ్ ఘటన ఇది.. తల లేకుండా.. నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని కాన్పూర్ జాతీయ రహదారిపై గుర్తించారు.. ఈ అంశంపై నిప్పక్షపాతంగా విచారణ జరిపించి.. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా నిందితులకు కఠిన శిక్ష విధించాలి’ అని డిమాండ్ చేశారు. -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్స్టార్స్తో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్స్టార్స్కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్కు ఫోర్తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
యూపీలో మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్-కాన్పూర్ రైల్వే లైన్లో కాస్గంజ్ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ట్రాక్పై ఉంచిన భారీ కర్ర దుంగను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొంది. దానిని రైలు ఇంజిన్ 550 మీటర్ల దూరంవరకూ ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ ముందు భాగంలో దుంగ ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ డివిజన్లో వారం వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. గత శుక్రవారం నాడు పంకిలో బండరాయిని ఢీకొనడంతో సబర్మతి ఎక్స్ప్రెస్ బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా కాస్గంజ్ నుండి ఫరూఖాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (05389) భటాసా స్టేషన్ సమీపంలో ట్రాక్పై ఉంచిన భారీ కర్ర దుంగను ఢీకొంది. నాలుగున్నర అడుగుల పొడవున్న దుంగ బరువు 35 కిలోలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ జహీర్ అహ్మద్, ఆర్పీఎఫ్ ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అంకుష్ కుమార్, ఇంజన్ విభాగానికి చెందిన రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ కర్ర దుంగను తొలగించి 33 నిమిషాల తర్వాత రైలును పంపించారు. ఘటనా స్థలానికి 50 అడుగుల దూరంలో ఒక పొలంలో మృతదేహం పడివుండటాన్ని వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చిడతలు వాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యే సందడి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో లోక్సభ నాలుగో దశ పోలింగ్ సందడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్కు చేరుకోవడం ప్రారంభించారు. ఈ దశలో యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు.కాన్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతాని సందడి చేశారు. చిడతలు, తాళాలు, డోలు వాయిస్తూ ఊరేగింపుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటర్లందరూ ఉత్సాహంగా బయటకు వచ్చి ఓటేసేలా చైతన్యపరచడానికి ఇలా చేసినట్లు ఆయన వివరించారు. -
Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
కనౌజ్/కాన్పూర్: విపక్షాల ‘ఇండియా’ కూటమి తుపాను ఉత్తరప్రదేశ్లోకి దూసుకొస్తోందని ఈ ధాటికి మరోసారి మోదీ ప్రధాని కాలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యూపీలో 80 స్థానాలకుగాను కనీసం 50 చోట్ల మా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని కనౌజ్, కాన్పూర్లలో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశ ప్రధానిగా మోదీ మరోసారి పగ్గాలు చేపట్టలేరని లిఖితపూర్వక గ్యారెంటీగా భావించండి. ఇక అంతా అయిపోయింది. బీజేపీ ఓటమి ఖాయం. అందుకు అనుగుణంగానే విపక్షాల కూటమి చాన్నాళ్ల క్రితమే ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించింది. విద్వేష బజార్లలో ప్రేమ దుకాణాలను తెరిచాం. భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర చేశాం. దేశవ్యాప్తంగా విపక్షాల సమావేశాలు నిర్వహించాం’’ అని అన్నారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న మోదీ ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఓటర్లు పదేళ్ల నుంచి చూస్తున్నారు. ఒక్కసారైనా మోదీ అదానీ, అంబానీల పేరెత్తలేదు. కానీ ఇప్పుడు ఓటమి సుడిగుండం నుంచి కాపాడతారేమోనని వాళ్ల పేర్లు తొలిసారిగా ప్రస్తావిస్తున్నారు. ఓడిపోతున్నాను.. కాపాడండి అదానీ, అంబానీజీ అంటూ మోదీ ప్రాథేయపడుతున్నారు’’ అని రాహుల్ వెటకారంగా మాట్లాడారు. మోదీకి టెంపో బాగా తెలుసు టెంపోల నిండా అదానీ, అంబానీల నుంచి నగదు మూటలు వచ్చినందుకేæ కాంగ్రెస్ నోరుమూసుకుందని మోదీ అనడంపై రాహుల్.. ‘‘ అంటే మోదీకి తరచూ అదానీ డబ్బులను టెంపోలో పంపిస్తారన్నమాట. ఏ రకం టెంపోలో డబ్బులు పంపిస్తారో ఆయనకు బాగా తెలుసు. టెంపోల గురించి మోదీకి బాగా అవగాహన ఉన్నట్లుంది’’ అని అన్నారు. -
బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
బాకీ తీర్చని ఓ టీనేజర్పై సీనియర్లు దాష్టికానికి దిగారు. తీర్చాల్సిన బాకీ కంటే ఎన్నో రెట్ల డబ్బులివ్వాలంటూ బెదిరించారు. ఇవ్వలేనని చెప్పడంతో వేధింపులకు దిగారు. ఆ వేధించడం మరీ హింసాత్మకంగా ఉండడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఉత్తరప్రదేశ్ ఎటావాకు చెందిన టీనేజర్.. నీట్ కోచింగ్ కోసం కాన్పూర్ వచ్చాడు. కోచింగ్ సెంటర్లో సీనియర్లతో స్నేహం కుదిరి..వాళ్లు ఉంటున్న ప్లాట్కి మకాం మార్చాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ కోసం వాళ్ల దగ్గరి నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. అయితే గేమ్లో ఆ డబ్బంతా పొగొట్టుకున్నాడు.దీంతో.. ఆ సీనియర్లు 20 వేలకు బదులు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. సదరు విద్యార్థి చెల్లించకలేకపోయేసరికి.. అతన్ని చిత్రహింసలు పెడుతూ ఆ తతంగం అంతా వీడియో తీశారు. ఆ విద్యార్థినిని కింద పడేసి చితకబాదారు. కాళ్లు మొక్కుతున్నా విడిచిపెట్టకుండా.. బలవంతంగా అతని దుస్తులు విప్పించారు. మర్మాంగానికి ఇటుకను కట్టి వేలాడదీస్తూ వేధించారు. ఈ దాష్టీకం ఇంతటితోనే ఆగలేదు. అతని వెంట్రుకల్ని తగలబెట్టే ప్రయత్నమూ చేశారు.#UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray.Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y— Siraj Noorani (@sirajnoorani) May 7, 2024చివరకు బాధితుడు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎటావా పోలీసులు నిందితులను పిలిపించి.. కేవలం మందలించి వదిలేశారు. ఈలోపు టీనేజర్ను వేధించిన వీడియోలు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వీడియోలో ఉన్న ఆరుగురు నిందితులను గుర్తించి.. అరెస్ట్ చేశారు. ఒక ముఠాగా మారి కోచింగ్సెంటర్కు వచ్చే విద్యార్థులను వీళ్లు టార్గెట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. -
స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి నానారావ్ పార్కులో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఎన్నాళ్లయినా అందుబాటులోకి రాకపోవడంపై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కాన్పూర్ పట్టణంలోని నానారావ్ పార్క్ ఎంతో పురాతనమైనది. యోగి ప్రభుత్వం పార్కు నిర్వహణ, సుందరీకరణకు సంబంధించి పలు వాగ్దానాలు చేసింది. వీటిలో స్విమ్మింగ్ పూల్ను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒకటి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తికాలేదు. దీనిపై ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఆయన ఒక చిన్న బాత్ టబ్తో ఈ పార్కుకు చేరుకుని, దానిని నీటితో నింపారు. ఆ తర్వాత ఆ టబ్లో ఆయన కూర్చున్నారు. దానిలోనే ఎంజాయ్ చేస్తూ, స్వీట్లు కూడా తిన్నారు. పైగా పక్కనే ఒక బ్యానర్ తగిలించి, దానిపై ‘రూ.11 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు’ అని రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్విమ్మింగ్ పూల్పై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, నగర ప్రజలు వేసవిలో ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోతున్నారని వాపోయారు. ఈ కొలను 2023లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదన్నారు. దీని నిర్మాణంలో ఆర్థిక సమస్య లుంటే తమకు తెలియజేయాలని, అప్పుడు ప్రజల నుండి విరాళాలు సేకరించి అందజేస్తామన్నారు. -
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాద్లో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్ అసద్ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపారు. -
‘దోమలు బాబోయ్ దోమలు’.. రైల్వే మంత్రికి ప్రయాణికుని ఫిర్యాదు!
దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. -
తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్ మ్యాచ్.. ఛార్జర్ కేబుల్తో ఉరేసి..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్ మ్యాాచ్ను యావత్ క్రికెట్ అభిమానులంతా ఆసక్తికరంగా వీక్షించారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ పోరును, టీవీ, హాట్స్టార్, పలుచోట్ల భారీ స్క్రీన్ల ద్వారా ఉత్కంఠగా చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫైనల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. అయితే వరల్డ్ కప్ తుది పోరు ఓ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ తండ్రి.. మ్యాచ్ మధ్యలో టీవీ ఆపేశాడన్న కోపంతో కన్న కొడుకుతో వాగ్వాదానికిదిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో కొడుకును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం వెలుగుచూసింది,. వివరాలు.. కాన్పూర్కు చెందిన గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలో అతడి కుమారుడు దీపక్.. తనకు ఆకలిగా ఉండటంతో త్వరగా వంట చేయాలని కోరాడు. తన మాటలను తండ్రి పట్టించుకోకుండా మ్యాచ్లో లీనమైపోవడంతో దీపక్ టీవీని ఆఫ్ చేశాడు. దీంతో గణేష్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కొడుకుతో గొడవపడ్డాడు. ఇది ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. చదవండి: అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి! అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్ ప్రసాద్.. పక్కనే ఉన్న మొబైల్ ఛార్జర్ కేబుల్తో కొడుకును ఉరేసి చంపాండు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. మెట్లపై దీపక్ మృతదేహాన్ని పడి ఉండటాన్ని గుర్తించిన వారి బంధువు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాన్పూర్ ఏసీపీ బ్రిజ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమైందని వెల్లడించారు. నిందితుడు హత్యకు మొబైల్ ఛార్జర్ కేబుల్ను ఉపయోగించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారని చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ తరుచూ మద్యం సేవించి గొడవ పడుతుంటారని తెలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల దీపక్ తన తల్లిని కొట్టాడంతో గతవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. -
దీపావళి విషాదం: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి!
దీపావళి రోజున ఉత్తరప్రదేశ్(యూపీ)లోని కాన్పూర్ దేహత్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో బాంబు పేలడంతో రసూలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్ నుంచి కాన్పూర్ నగర్ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్కు తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
30 ఏళ్ల మహిళతో తండ్రి సహాజీవనం.. తట్టుకోలేక కొడుకుల కిరాతకం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోరం వెలుగుచూసింది. తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేని కొడుకు వారి ఇద్దరిని అంతమొందించాలని పథకం వేశాడు. మధ్యలో తాత అడ్డు రావడంతో ముగ్గురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తాత, సహజీవనం చేస్తున్న మహిళ మృత్యువాత పడగా.. తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం కాన్పూర్ దేహత్ జిల్లాలో గురువారం ఉదయం జరిగింది.. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. రామ్ ప్రకాశ్ ద్వివేది(83), అతని కుమారుడు విమల్(63), అతని భాగస్వామి ఖుష్బు(30)కలిసి అమ్రోదా పట్టణంలో నివసిస్తున్నారు. విమల్ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విమల్ కొడుకు లలిత్(42), సోదరుడు అక్షత్(18) గురువారం ఉదయం తండ్రి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. తాత, తండ్రి, మహిళను విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం రామ్ ప్రకాశ్, ఖుష్బును కత్తితో పొడిచి చంపారు. నిందితుల దాడి నుంచి తప్పించుకొని విమల్ ఇంటి నుంచి బయటకు పరుగెత్తాడు. ఈ విషయాన్ని గమనించిన ఇంటి పక్కన ఉండే మున్నా వెంటనే పక్క ఇంట్లో ఉంటున్న విమల్ అన్న కమల్కు సమాచారం అందించాడు. అతడువిమల్ను జిల్లా ఆసుపత్రికి అటు నుంచి కాన్పూర్లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్షత్ లలిత్లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 30 ఏళ్ల ఖుష్బుతో తండ్రి సంబంధపై ఇద్దరు కుమారులు అసంతృప్తిగా ఉన్నారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ పాండే తెలిపారు. విచారణలో రామ్ప్రకాష్, ఖుష్బులను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. -
రొట్టె కోసం రక్తపాతం..అన్నను హత్య చేసిన తమ్ముడు!
యూపీలోని కాన్పూర్లో రొట్టె ముక్కకోసం అన్నదమ్ములు రక్తం కళ్లజూసుకున్నారు. రొట్టె కోసం జరిగిన వివాదంలో తమ్ముడు అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అన్నయ్య.. తమ్ముని కోసం ప్రత్యేకంగా రొట్టెలు తయారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అన్నను హత్య చేసిన తమ్ముడు అంతటితో ఆగక సోదరుని మృతదేహంతో ఏమి చేశాడో తెలిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ ఉదంతం కాన్పూర్లోని బిల్హౌర్ పరిధిలోని నానామవు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలో కల్లూ, భూరా అనే అన్నదమ్ములుంటున్నారు. వీరిలో కల్లూ పెద్దవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే అతని సోదరుడు భూరాకు వివాహం జరిగింది. అతని భార్య రక్షాభంధన్ కోసం పుట్టింటికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు భర్తకు, కల్లూకు వంటవండేది. తాజాగా భూరా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతూ అన్నతో తాను ఇంటికి వచ్చేసరికి రొట్టెలు తయారు చేసిపెట్టాలని కోరాడు. అయితే రాత్రి భూరా ఇంటికి వచ్చేసరికి కల్లూ అతని కోసం రొట్టెలు తయారు చేయలేదు. వెంటనే కోపంతో రగిలిపోయిన భూరా తన అన్నను ‘రొట్టెలు ఎందుకు తయారు చేయలేదని’ అడిగాడు. దానికి సమాధానంగా కల్లూ ‘నువ్వు నాకు రొట్టెలు తయారు చేయలేదు కనుక నేను నీకు రొట్టెలు తయారు చేయలేదు’ అని అన్నాడు. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇంతలో తమ్మడు ఇంటి బయట ఉన్న పెద్ద బండరాళ్లు తీసుకు వచ్చి ఏకధాటిగా అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మృతిచెందినా తమ్ముని ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అన్న మృతదేహానికి తాడుకట్టి, దానికి లాక్కుంటూ గ్రామం శివారులకు తీసుకువచ్చాడు. అక్కడున్న నదిలోని పడవలో అన్న మృతదేహాన్ని ఉంచి, నది మధ్యలో దానిని వదిలివేశాడు. అయితే తమ్ముడు అన్న మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నప్పుడు గ్రామానికి చెందిన కొందరు దానిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్ ఢులా మాట్లాడుతూ తమ విచారణలో నిందితుడు.. రొట్టె కోసం తనకు, తన అన్నకు వివాదం జరిగిందని, ఈ నేపధ్యంలోనే తాను అన్నను హత్యచేశానని తెలిపాడన్నారు. నదిలోని కల్లూ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
జైలు భయంతో బల్లిని మింగేశాడు..!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి బల్లిని మింగేశాడు. కాన్పూర్ జిల్లాలోని మల్లవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యాచార కేసులో అదుపులోకి తీసుకున్న మహేశ్ అనే నిందితున్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. నిందితున్ని రాత్రి సమయంలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సమయంలోనే మహేశ్ నోట్లో బల్లి ఉండటం చూసి కంగుతిన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన వైద్యులు మహేశ్ కడుపులో నుంచి బల్లిని బయటకు తీశారు. ప్రాణాపాయం ఏం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే.. ఈ అత్యాచార కేసులో మహేశ్పై చేసిన ఫిర్యాదును బాధితురాలు వెనక్కి తీసుకున్నారు. బల్లిని ఎందుకు మింగావని మహేశ్ను పోలీసులు అడగగా.. జైలంటే చాలా భయమని తెలిపాడు. అందుకే బల్లని మింగి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఇదీ చదవండి: హరిద్వార్లో రాకాసి మేఘం.. చూస్తే..! -
SUV పైన బోటు.. అందులో ఎమ్మెల్యే.. వీడియో వైరల్
లక్నో: ఇటీవల కాన్పూర్ లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోజులు గడుస్తున్నా నిలిచిపోయిన నీటిని తొలగించడానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిరసనగా తన SUV వాహనం మీదకు బోటు ఎక్కించి అందులో కూర్చుని నగరమంతా తిరుగుతూ నిరసన తెలిపారు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. కాన్పూర్లో ఇటీవల కుండపోతగా వానలు కురిశాయి. దీంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు ఆర్య నగర్ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. తన SUV పైకి ఒక బోటును ఎక్కించి అందులో కూర్చుని తెడ్డు చేతపట్టుకుని నగరమంతా ఈదారు. కాన్పూర్ లోని సరసయ్య ఘాట్ దగ్గర మొదలైన ఈ కార్యక్రమం బడా చౌరాహా, మేష్టన్ రోడ్, మూలం గంజ్ ఎక్స్ ప్రెస్ రోడ్, ఫూల్ బాగ్ మీదుగా కొనసాగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వీఐపీ రోడ్, సివిల్ లైన్స్, బాబుపూర్వ, రాయ్ పూర్వలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయని ఇక జుహీ బ్రిడ్జి వద్దైతే ఆ వరద ఉధృతికి ఇటీవల ఒక డెలివరీ ఏజెంటు కూడా చనిపోయాడని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ప్రజలను కూడా లైఫ్ జాకెట్లు, బోట్లు వాడమని సలహా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. कानपुर में सपा विधायक @AmitabhBajpai का जलभराव को लेकर अनोखा प्रदर्शन। अपनी कार के ऊपर नाव रख उसपर सवार होकर सड़कों पर निकले नगर निगम की विफलता पर किया प्रदर्शन ,उनका कहना है कि बारिश के चलते शहर बन गया था टापू pic.twitter.com/yEO1zFUtf5 — Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) June 30, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు -
కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి!
ఉత్తర ప్రదేశ్లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేదుకు ఓ కారును దొంగతనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే కారును దొంగిలించారు కానీ తరువాతే అసలు విషయం తెలిసింది. ముగ్గురిలో ఎవరికి కూడ డ్రైవింగ్ రాదని.. దీంతో చేసేదేం లేక కారును దాదాపు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారు. అమినా చివరకు పోలీసులకు పట్టుబట్టారు. అసలేం జరిగిందంటే.. కాన్పూర్లోని దబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అమన్ గౌతమ్, సత్యం కుమార్ కాలేజీ విద్యార్థులు. వీరికి అమిత్ వర్మతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి మే 7న కారు మారుతి వ్యాన్ను దొంగిలించాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారమే కారును దొంగిలించారు. అయితే అక్కడే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో ఎవరికి కారు డ్రైవింగ్ రాదని అర్థమైంది. అయినా కారును వదిలి వెళ్లాలని అనిపించలేదు. దీంతో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 కిలోమీటర్లు దబౌలి నుంచి కళ్యాణ్పూర్ వరకు వ్యాన్ను తోసుకుంటూ వెళ్లారు. 10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వచ్చి ఆ కారును అమ్మేయాలని కుట్ర పన్నారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. ఒకవేళ కారు కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. చదవండి: స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది! -
సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రితో జంప్ అయ్యింది. ఏడాది క్రితం యువతిని ప్రియుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి కమలేష్తో పరిచయం కాగా, తర్వాత అతనితో ఆ యువతి పారిపోయింది. కమలేష్ కుమారుడికి 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి తరచుగా ప్రియుడి ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్తో ఆమెకు చనువు ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది. వారు ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. 2022 మార్చిలో ఇంటి నుండి పరారీ అయ్యారు. చదవండి: బెట్టింగ్లో భారీ నష్టం.. అయ్యో మధు! యువతి కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. కమలేష్ కుమారుడిని పోలీసులు విచారించగా.. ఆ యువతి కమలేష్ను కలిసేందుకు వచ్చేదని కుమారుడు చెప్పడంతో నిజం వెలుగు చూసింది. ఏడాదిపాటు వేట సాగించిన పోలీసులు కమలేష్, ఆ యువతిని ఢిల్లీలో గుర్తించారు. కమలేష్, యువతి సహజీవనం సాగిస్తున్నారు. ఇష్టపూర్వకంగానే కమలేష్తో వెళ్లినట్లు యువతి చెప్పడంతో షాక్ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్గా ఉండగలవని.. -
మీరు సూపర్ మేడం.. ఐఏఎస్ అధికారిణిపై నెటిజన్ల ప్రశంసల వర్షం..
లక్నో: సామాన్య ప్రజలు తమ సమస్యల గోడు వినిపించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగుతుంటారు. ఒక్కోసారి వారిని పట్టించుకునేవారే ఉండరు. ఉన్నత అధికారులను నేరుగా కలిసే అవకాశమే తక్కువ. అయితే ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఓ ఐఏఎస్ అధికారిణి సౌమ్య పాండే మాత్రం తన సింప్లిసిటీతో నెటిజన్ల మనసులు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకం ద్వారా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు తనకు సాయం చేయాలని వెళ్లిన ఓ పెద్దాయన ధనీరామ్ సమస్యను ఆమె దగ్గరుండి తెలుసుకున్నారు. ఎండలోనూ అతని దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి కచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. చీఫ్ డెవలెప్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య.. ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దివ్యాంగుడైన ధనీరామ్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసేందుకు అవసరమైన సాయం అంధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సౌమ్య పాండే.. ధనీరామ్ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంత పెద్ద హోదాలో ఉండి సామాన్యుడితో సౌమ్య పాండే ప్రవర్తించిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. నవ భారత్లో సరికొత్త ఉత్తర్ప్రదేశ్ ఇది.. చూడండి ఐఏఎస్ అధికారి సామాన్యుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఎలా తీసుకుంటున్నారో.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
రైల్వే కానిస్టేబుల్ పాడుపని.. సిట్జర్లాండ్ మహిళలతో అసభ్యంగా..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో ఓ రైల్వే కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. తేజస్ ఎక్స్ప్రెస్లో స్విట్జర్లాండ్కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై భౌతికంగా దాడి చేయబోయాడు. ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అతిథి అని కూడా చూడకుండా విదేశీ మహిళను వేధించిన ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్. గత ఏడాదిన్నరగా యూపీ ఫిరోజాబాద్లోని ఆర్పీఎఫ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
‘బుల్డోజర్ న్యాయం’ ఎన్నాళ్లు?
బుల్డోజర్లే సర్వరోగ, సర్వ సమస్యల నివారిణిగా భావించటం ఎంత ప్రమాదకరమో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కనీసం ఇప్పటికైనా అర్థమైవుండాలి. ఆ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా మడౌలీలో ‘ఆక్రమణలు’ తొలగించే పేరిట సోమవారం బుల్డోజర్లు వీరంగం వేస్తుండగా హఠాత్తుగా ఒక గుడిసెలో మంటలు ఎగసి తల్లీకూతుళ్లిద్దరు సజీవదహనమయ్యారు. బాధితుల బంధువులు చెబుతున్నట్టు ఇవి దారుణ హత్యలా, అధికారులంటున్నట్టు ఆత్మహత్యలా అనేది తేలడానికి కొంత సమయం పడుతుంది. కానీ ప్రభుత్వ చర్య ఏదైనా చట్టాలకు అనుగుణంగానే ఉండాలని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం చెప్పి చాన్నాళ్లవుతున్నా ఆ రాష్ట్రంలో బుల్డోజర్ల వినియోగం ఆగలేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తను కించపరిచారని ఆరోపిస్తూ నిరుడు జూన్లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా ప్రయాగ్రాజ్, షహ్రాన్పూర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాక ఆ నిరసనలకు సూత్రధారులుగా భావిస్తున్నవారి ఇళ్లను బుల్డోజర్లు పంపి నేలమట్టం చేశారు. నిజానికి ఇది యూపీకే పరిమితమై లేదు. బీజేపీ సర్కారుండే మధ్యప్రదేశ్లో నిరుడు ఏప్రిల్లో మతపరమైన ఘర్షణలు జరిగాక 16 ఇళ్లనూ, 29 దుకాణాలనూ అధికారులు కూల్చేశారు. అదే నెలలో బీజేపీ అధీనంలోని అప్పటి ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మత ఘర్షణలు జరిగిన జహంగీర్పురిలో ఇదే పద్ధతిలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశారు. నిజానికి చట్టబద్ధ పాలన అనే భావన రాజ్యాంగంలో లిఖితపూర్వకంగా ఎక్కడా ఉండదు. కానీ అది సవరణకు వీలుకాని రాజ్యాంగ మౌలిక నిర్మాణ స్వరూపమని నిపుణులంటారు. ప్రజాస్వామ్యంలో సాధారణ పౌరులు మొదలుకొని అత్యున్నత స్థానాల్లో ఉండేవారి వరకూ అందరూ చట్టానికి లోబడి వ్యవహరించాల్సినవారే. కానీ ఈ ‘బుల్డోజర్ న్యాయం’ అన్ని చట్టాలనూ, నిబంధనలనూ బేఖాతరు చేస్తోంది. సాధారణంగా అయితే అక్రమమని తేలిన నిర్మాణాలను గుర్తించాక వాటి యజమానులకు అధికారులు ముందుగా నోటీసులివ్వాలి. వారినుంచి సంజాయిషీలు తీసుకున్నాక అవసరమైన వ్యవధినిచ్చి నిర్మాణాలు తొలగించాలి. కానీ ఈ ఉదంతాలన్నిటా జరుగుతున్నది వేరు. ఏదైనా ఘర్షణల్లో నిందితులుగా గుర్తించినవారి ఇళ్లనూ, దుకాణాలనూ ఒక పద్ధతి ప్రకారం కూల్చేస్తున్నారు. నామమాత్రంగా నోటీసులిచ్చి కనీసం వారి సామాన్లు తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. మడౌలీ ఉదంతమే తీసుకుంటే గత నెల 14న కిషన్ గోపాల్ దీక్షిత్ అనే ఆసామి ఇంటితోపాటు మరికొన్ని ఇళ్లను చెప్పాపెట్టకుండా వచ్చిన అధికారులు కూల్చేశారు. వేరే ఆశ్రయం పొందటం అసాధ్యం కావటంతో కూల్చినచోటే దీక్షిత్ కుటుంబం చిన్న గుడిసె వేసుకుని ఉంటోంది. సరిగ్గా నెల తర్వాత మళ్లీ వచ్చిన అధికారులు ఆ గుడిసెవైపు బుల్డోజర్ను గురిపెట్టారు. తామంతా గుడిసెలో ఉండగానే భయభ్రాంతుల్ని చేసి పంపేయటానికి బుల్డోజర్ను ప్రయోగించారని, దానికి లొంగకపోవటంతో గుడిసెకు నిప్పంటించమని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశించారని బాధితుడు శివం దీక్షిత్ అంటున్నాడు. తానూ, తండ్రి స్వల్పగాయాలతో తప్పించుకున్నా తల్లి, 21 ఏళ్ల సోదరి సజీవదహనమయ్యారని చెబుతున్నాడు. బుల్డోజర్ల ప్రయోగం మొదలెట్టినప్పుడు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ఎక్కువ సందర్భాల్లో ఒక మతంవారినే దృష్టిలో పెట్టుకుని ఈ కూల్చివేతలు జరగటం అందుకు కారణం కావొచ్చు. కానీ ఇలాంటి ధోరణి చివరకు అరాచకానికి దారితీస్తుందని చాలామంది హెచ్చరించారు. విచక్షణ మరిచి సమస్య ఉన్నచోటికల్లా బుల్డోజర్లు వెళ్లడం మొదలైతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించటం కష్టం. ఆమధ్య ఒక ఉదంతంలో రాళ్లు విసిరాడని ఆరోపణలొచ్చిన యువకుడు రెండు చేతులూ లేని వికలాంగుడు. అతని దుకాణాన్ని అధికారులు కూల్చేశారు. ఈ మాదిరి ఘటనల్లో అధికారులు తమ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా? మడౌలీ ఉదంతంలో తల్లీకూతుళ్లు సజీవదహనమయ్యారని తెలియగానే సబ్డివిజనల్ మేజిస్ట్రేట్తో సహా అధికారులంతా పరారయ్యారు. వారు అక్కడే ఉంటే ఏం జరిగేదో! దోషులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చేసిన ప్రకటనకు పెద్దగా విలువుండదు. బుల్డోజర్లను ఇష్టానుసారం వినియోగించే స్వేచ్ఛ ప్రభుత్వమే ఇచ్చినప్పుడు ఇలాంటి విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేముంది? ఈ ఉదంతాల్లో చివరకు దోషులుగా తేల్చేదెవరిని? శిక్షించేదెవరిని? నేరారోపణలు చేయటం, దాన్ని న్యాయస్థానాల్లో నిరూపించటం, తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు శిక్షించటం అనే ప్రక్రియలుంటాయి. ఈ మూడు పాత్రలనూ ఒకరే పోషించాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్యం మంటగలుస్తుంది. సాధారణ ప్రజానీకం సైతం ఈ ధోరణినే అనుసరించే ప్రమాదం ఉంటుంది. ఏతావాతా ఈ మాదిరి చర్యలు ఒకరకమైన అరాచకానికి దారితీస్తాయి. బుల్డోజర్ల గురించి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనప్పుడు అసలు కారణాలు దాచి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలుండటంవల్లే కూల్చామని యూపీ సంజాయిషీ ఇస్తోంది. ఒక ప్రభుత్వం తన చర్యల ఆంతర్యాన్ని తానే చెప్పుకోలేని దుఃస్థితిలో ఉండటం అధికార యంత్రాంగానికి నైతికబలం ఇవ్వగలదా? రెండు నిండు ప్రాణాలు బలిగొన్న మడౌలీ ఉదంతానికి మూలం ఎక్కడుందో ఇప్పటికైనా ఆదిత్యనాథ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరెక్కడా ఇలాంటి ఉదంతాలు పునరావృతం కానీయకుండా, చట్టవిరుద్ధతకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి. -
ఏం తెలివిరా నాయనా.. బ్యాంకులో కోటి విలువ చేసే బంగారం చోరి!
దొంగలు దొంగతనం చేసేందుకు తమ రూట్ మార్చుకుంటున్నారు. దొంగతనం కోసం క్రేజీగా థింక్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. కేటుగాళ్లు ఏకంగా బ్యాంక్ను టార్గెట్ చేసి రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం దొంగిలించారు. వారు దొంగతనం చేసి ప్లాన్ చూసి పోలీసులు ఖంగుతిన్నారు. వివరాల ప్రకారం.. కాన్పూర్లోని ఎస్బీఐ భనుతి శాఖలో భారీ దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన విషయంలో ఉద్యోగులు ఆఫీసుకు వచ్చిన తర్వాత వారికి ఈ విషయం బోధపడింది. అయితే, దొంగతనం కోసం దొంగలు మాస్టర్ ప్లాన్ వేసి స్కెచ్ గీసుకున్నారు. ప్లాన్ ప్రకారం.. ఆఫీసు పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకులోని స్ట్రాంగ్రూంలోకి 10 అడుగుల సొరంగం తవ్వి బ్యాంక్లోకి చేరుకున్నారు. అనంతరం.. లాకర్ను పగలగొట్టి అందులో ఉన్న రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం చోరీ చేశారు. ఉదయం బ్యాంక్కు వచ్చిన ఉద్యోగులకు ఈ విషయం తెలిసి షాకయ్యారు. ఈ క్రమంలో ఎంత సొమ్ము దొంగతనం చేశారో తెలుసుకునేందు బ్యాంకు అధికారుల తల ప్రాణం తోకకు వచ్చింది. కొన్ని గంటల తర్వాత ఎంత సొమ్ము చోరీకి గురైందో అంచనా వచ్చారు. దీంతో, వెంటనే బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో రంగంలో దిగిన టీమ్.. ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాల ద్వారా దొంగల కోసం గాలింపు ప్రక్రియ చేపటినట్టు తెలిపారు. అయితే, బ్యాంకు గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. #Kanpur में सचेंडी स्थित #SBI बैंक की शाखा में चोरों ने रात के समय सुरंग बनाकर गोल्ड रूम का दरवाजा तोड़ा और अंदर जितना भी सोना रखा था, सब चुरा कर ले गए। सुबह जब बैंक कर्मचारी शाखा पहुंचे और उन्हें इसका पता लगा तो तुरंत पुलिस को सूचना दी गई।#UPPolice pic.twitter.com/9171dEY2zi — UP Tak (@UPTakOfficial) December 24, 2022 -
షాకింగ్ ఘటన: కాళ్లు తెగిపడి పట్టాలపై దీనంగా రోదిస్తూ..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో హేయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వీధి వ్యాపారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఆ కంగారులో ఆ యువకుడు రైలు పట్టాల మీదకు పరిగెత్తాడు. అయితే వేగంగా దూసుకొచ్చే రైలు అతన్ని చిధిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాకు చేరింది. యూపీ కాన్పూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాహిబ్ నగర్కు చెందిన అర్సలాన్ అనే 18 ఏళ్ల యువకుడు.. కళ్యాణ్పూర్ ప్రాంతంలోని జీడీ రోడ్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు.. చిరువ్యాపారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే యత్నం చేశారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ కూరగాయల దుకాణం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. Shocker from Kanpur ! Policemen threw away a street vendor Irfan's articles on railway tracks in Kalyanpur. He was hit by Memu train while picking them back. He has lost both his legs. Police were clearing sides of GT Road of vendors selling vegetables, and other goods. pic.twitter.com/gbzY71rLg2 — Haidar Naqvi🇮🇳 (@haidarpur) December 2, 2022 ఆపై అర్సలాన్పై హెడ్ కానిస్టేబుల్ రాకేష్ చెయ్యి చేసుకుని.. అతని కూరగాయల తూకం రాయిని దూరంగా విసిరేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. అది రైలు పట్టాలపై పడడంతో దానిని తెచ్చుకునేందుకు పరిగెత్తాడు ఆ యువకుడు. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. అతని కాళ్లను ఛిద్రం చేసేసింది. అక్కడికక్కడే కాళ్లను పొగొట్టుకున్న ఆ యువకుడు బాధతో పట్టాల మధ్యలో పడి విలపిస్తూ సాయం కోసం చేతులు చాచాడు. అక్కడే ఉన్న కొందరు అతన్ని రోదన పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇంతలో జనం తిరగబడతారనే భయంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ను పట్టాల మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. రాకేశ్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడ కొందరు తీసిన వీడియోల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: పాముకి స్నానం.. ఇలాంటి వీడియోను చూశారా? -
రైల్లో ఘోర ప్రమాదం...సరాసరి మెడలోకి దిగిన రాడ్
ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాచల్ ఎక్స్ప్రెస్ రైలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్లోలో విండో సీటులో కూర్చొన్న వ్యక్తి కూర్చొన్నట్లుగానే చనిపోయాడు. అనుహ్యంగా ఒక ఇనుపరాడ్ కిటికి అద్దాలను పగలుగొట్టుకుంటూ వచ్చి సరాసరి విండోసీటు వద్ద కూర్చొన్న వ్యక్తి మెడలోకి దిగిపోయింది. దీంతో ఆ వ్యక్తి రక్తపు మడుగులో అలా కూర్చొనే మృతి చెందాడు. ప్రయాగ్రాజ్ డివిజన్ వద్ద ఉదయం 8.45 నిమిషాలకు ఈ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. దీంతో రైలుని అలీఘర్ జంక్షన్ వద్ద నిలిపేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడు హరికేష్ కుమార్ దూబేగా గుర్తించారు. రైల్వే ట్రాక్ పనుల్లో వినియోగించే ఇనుపరాడ్ కిటికి అద్దాలు పగలిపోయాలా లోపలికి దూసుకొచ్చి కిటికి వద్ద కూర్చొన్న హరికేష్ దూబే మెడకు గుర్చుకుందని చెప్పారు పోలీసులు. ఉత్తర మధ్య రైల్వే ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. (చదవండి: సౌండ్ వినలేక పేషెంట్ వెంటిలేటర్నే ఆపేసింది! నివ్వెరపోయిన పోలీసులు) -
పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లో 17 ఏళ్ల అమ్మాయిని బెదిరించాడు ఓ యువకుడు. పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో ముక్కలు ముక్కలుగా నరికేస్తానని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ ఆకతాయి పేరు ఫయాజ్. చాలా కాలంగా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఆమె స్కూల్కు వెళ్లే సమయంలో వెంటపడి తరచూ ఇబ్బందిపెడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వాళ్లు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ అతని బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. చివరకు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే అమ్మాయి అందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫయాజ్ ఆమెను భయపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ముక్కలు ముక్కలుగా నరికేస్తానని బెదిరించాడు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులను అశ్రయించారు. ఫిర్యాదు అనంతరం పోలీసులు ఫయాజ్ ఇంటికి వెళ్లగా.. కుటుంబసభ్యులు వాళ్లతో గొడవకు దిగారు. పలితంగా మరికొంత మంది పోలీసులను పిలిపించి అధికారులు ఫయాజ్ను అరెస్టు చేశారు. అతడిపై అక్టోబర్ 16న పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు తెలిపారు. చదవండి: కోటిన్నర నగలు కొట్టేశారు -
అమానుష ఘటన: బాలుడి చేతిలో డ్రిల్లింగ్ మిషన్ దింపిన టీచర్!
ఇటీవల కాలంతో ఉపాధ్యాయులు చిన్న చిన్న విషయాలకే కాస్త ఫ్రస్టేషన్కి గురయ్యి విద్యార్థులకు అత్యంత అమానుషమైన పనిష్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయుడు కొడవలితో పాఠశాల్లో హల్చల్ చేస్తూ... అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. అంతకు ముందు మరొక ప్రబుద్ధుడు స్ప్రుహ తప్పి పడిపోయాలా ఒక విద్యార్థిని కర్రతో దాడి చేసి చంపేశాడు. ఇలాంటి ఉదంతాలను మర్చిపోక మునుపే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒక విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్తో పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థికి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థి సిసామౌ నివాసి. అతను కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్నగర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఐతే సదరు విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థిని ఇంటికి పంపించడంతో ఫ్రాథమిక చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి నిర్వాకానికి ఆగ్రహం చెందిన బాధితుడు బంధువులు పాఠశాలకు చేరుకుని గొడవ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న ప్రాథమిక శిక్ష అధికారి, బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కాన్పూర్కి చెందిన ప్రాథమిక శిక్షా అధికారి సుజిత్ కుమార్ మాట్లాడుతూ...ఈ మొత్తం ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ప్రేమ్ నగర్, శాస్త్రి నగర్లోని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక పంపుతారు. ఈ ఘటనలో ఎవరైనా దోషులుగా తేలితే వారు శిక్షార్హమైన చర్యల ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. (చదవండి: క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు.. ) -
రాక్షసత్వం: ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు
కాన్పూర్: స్థానికులు, సీసీటీవీ కెమెరా సాక్షిగా ఓ వ్యక్తి రాక్షసత్వానికి పాల్పడ్డాడు. తనను చూసి తదేకంగా మొరుగుతుందనే కోపంతో ఇటుక రాయితో వీధి కుక్కను కొట్టి చంపేశాడు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇటుక రాయితో నిద్రిస్తున్న కుక్క తలపై కొట్టడంతో.. రక్తం మడుగులో పడి అది మరణించింది. పక్కనే కొందరు చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డగించే యత్నం చేయలేదు. అయితే ఆ కుక్కలు నిద్రించిన చోట దుకాణం ఉండడం, ఆ ఓనర్ సీసీ టీవీ ఫుటేజీలో జరిగిన దారుణం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని జాకీగా గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తనను చూసి పదే పదే మొరగడంతో తట్టుకోలేక కోపంతోనే చంపేశానని జాకీ నేరం ఒప్పుకున్నాడు. #kanpur-जूही में युवक ने सो रहे बेजुबान के सिर पर ईंट से हमला कर मौत के घाट उतारा,तस्वीरें सीसीटीवी में कैद, संवेदनहीन नज़र आई @Uppolice,@kanpurnagarpol के जूही इंस्पेक्टर ने आरोपी की गिरफ्तारी तो छोड़िए FIR तक दर्ज़ नही की।@myogiadityanath @brajeshlive @bstvlive pic.twitter.com/8Lxgv0SA8v — दीपक मिश्रा 'अज्ञात' (@Deepak_mishra13) October 16, 2022 -
ఫోన్ కొట్టేసిన దొంగ పోలీస్.. వీడియో వైరల్!
లక్నో: దొంగల బారీనుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే చోరీకి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో జరిగింది. రాత్రివేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నఇద్దరు పోలీసులు పక్కన మంచంపై నిద్రిస్తున్న ఓ వ్యక్తిని చూసి ఆగారు. అనంతరం ఓ పోలీసు ఆ వ్యక్తి వద్దకు వెళ్లాడు. హాయిగా నిద్రపోతున్న వ్యక్తి మంచంపై ఉన్న ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం చక్కా దాన్ని చూసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోను ఓ వ్యక్తి ట్వీట్టర్లో షేర్ చేశాడు. పోలీసుల తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనాలు చేయడమేంటని మండిపడ్డారు. ఇలాంటి వారికి పోలీసులుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. Shameful act of Kanpur Police The soldiers patrolling at night stole the phone of the sleeping person, the incident was captured in CCTV @drlaxmanbjp Anna Any words on this ?#doubleengine sarkaaru👇 pic.twitter.com/YdnFcbmxpb — AkshayKTRS (@AkshayKtrs) October 9, 2022 చదవండి: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు.. -
శివుడి ఎదుట మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్న మేక.. ఏం కోరుకుందో ఏమో?
జంతువులు దేవుళ్లను ప్రార్థించడం ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చూసే ఉంటాము. కాగా, తాజాగా ఓ మేక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివుడి గర్భగుడి ముందు ఓ మేక మొకాళ్ల మీద నిలబడి ప్రార్ధనలు చేసింది. దీంతో, మేకకు చూసిన భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ ఘటనను సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్న ఆనందేశ్వర్ మందిరంలో ఉన్న శివుడు గర్భగుడి ముందు ఓ మేక తన మొకాళ్ళ మీద మోకరిల్లి దేవుడికి ప్రార్థనలు చేసింది. గుడిలో ఉన్న భక్తులతో కలిసి ప్రార్థనలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. कानपुर के आनंदेश्वर मंदिर में बकरे का अनोखा अंदाज, बाबा को झुक-झुककर किया प्रणाम, श्रद्धालुओं की तरह टेका माथा#kanpur #Kanpurnews #Anandeshwarmandir #Hinduism #kanpurtemple #Uniquevideo pic.twitter.com/AjPTuqfMxF — Journalist Prabhat Kashyap (@Prabhat_1090) October 9, 2022 -
ఘోర ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 26 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా ఘటమ్పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ నీటిలో పడటంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే చంద్రికా దేవి ఆలయాన్ని దర్శించుకుని ఉన్నావ్ నుంచి కాన్పూర్కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, క్షతగాత్రులకు 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. -
హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని..
లక్నో: కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా వర్ణిస్తుంటారు. కానీ కొన్ని రకాల కుక్కలు మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మనుషులపై దాడి చేస్తుంటాయి. ఎక్కడి పడితే అక్కడ కొరికి కరిచేస్తుంటాయి. ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు దాడి చేస్తున్న ఘటన ఎక్కువ అవుతున్నాయి. అంతేగాక కుక్కల బారిన పడి అనేక చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను చాలానే చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుక్క దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో చోటుచేసుకుంది. పిట్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది. క్రూరమైన కుక్క ఆవు దవడను తన నోటితో బలంగా కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది. ఆవును రక్షించడానికి కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్కు ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది. అయితే అప్పటికే ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుక్క లైసెన్స్ చూపించాల్సిందిగా యాజమానిని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కుక్కను కూడా స్వాధీనం చేసుకొని బోనులో ఉంచారు. ఆవును పశువైద్యశాలకు పంపించారు. అలాగే దానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే నిరంజన్ తెలిపారు. కాగా పిట్బుల్ జాతికి చెందిన కుక్కలు మనుషులపై దాడి చేసే ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గత రెండు నెలల్లో వేర్వేరు సంఘటనల్లో దాదాపు అర డజను మంది పిట్బుల్ దాడిలో గాయపడ్డారు. कानपुर के सरसैया घाट पर ‘पिटबुल कुत्ते’ ने कर दिया गाय पर हमला। - ग्रामीणों की काफी देर की मशक्कत के बाद गाय को पिटबुल की कैद से छुड़ाया जा सका। - इस बीच पिटबुल डॉग ने गाय का जबड़ा चबा लिया। - इस घटना के बाद घाट पर जाने से कतरा रहे हैं सैलानी। pic.twitter.com/yvbBN5EgSS — Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022 -
ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. సస్పెన్షన్ వేటు
లక్నో: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు అధికారులు. ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్ క్రైమ్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్నాడు అజయ్ గుప్తా అనే కానిస్టేబుల్. ప్రధాని నరేంద్ర మోదీపై, ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై అసభ్యకరమైన ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతని ట్వీట్లు స్క్రీన్ షాట్ల రూపంలో బాగా వైరల్ అయ్యాయి. అలా విషయం ఉన్నతాధికారుల దృష్టితో వెళ్లింది. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు సందర్భంగా పోలీస్ మెడల్ కోసం తన పైస్థాయి అధికారుల నుంచి డీజీపీ కార్యాలయం స్థాయి వరకు నిలదీస్తూ ట్విటర్లో పోస్టులు చేశాడు అజయ్ గుప్తా. ఈ క్రమంలో అతని పాత ట్వీట్ల బండారం బయటపడింది. దీంతో అతను తన అకౌంట్ను డిలీట్ చేయగా.. అప్పటికే అభ్యంతకర ట్వీట్ల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ‘‘ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అతను చేసిన కొన్ని పోస్టులు మరీ మితిమీరి ఉన్నాయి. పోలీస్ సిబ్బంది అనే స్పృహ లేకుండా పోస్టులు చేశాడు. ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే. డిపార్టమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించాం అని పోలీస్ కమిషనర్ బీపీ జోగ్దంద్ తెలిపారు. ఇదీ చదవండి: తాగొద్దు అన్నందుకు ఇంటి ఓనర్ హత్య.. ఆపై సెల్ఫీ!! -
యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ మంత్రి రాకేశ్ సచాన్కు కాన్పూర్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 1991 అక్రమ ఆయుధాల కేసులో శనివారం ఆయనను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ నిర్ణయంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి, ఆయన మద్దతుదారులు, న్యాయవాదులు వెంటనే కోర్టు గది నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని, ప్రస్తుత పరిణామాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు శనివారం రాత్రి రాకేశ్ సచాన్పై కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కాన్పుర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీ ఫిర్యాదు అందినట్లు చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాకేశ్ సచాన్ 1993 నుంచి 2002వరకు సమాజ్వాదీ పార్టీలో ఉన్నారు. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఫతేపూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ములాయం సింగ్, శివ్పాల్ సింగ్కు సన్నిహితుడని గుర్తింపు ఉంది. అయితే ఎస్పీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: ప్రభుత్వం ఏర్పడి 36 రోజులు.. ఇప్పటివరకు నోచుకోని మంత్రివర్గ విస్తరణ -
‘నా భార్య అలిగి వెళ్లిపోయింది..3 రోజులు లీవ్ ఇవ్వండి సార్’
లక్నో: ఏదైనా పని ఉందనో, లేక ఆరోగ్యం బాగోలేదనో సెలవు తీసుకుంటారు ఎవరైనా. కానీ, తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, బుజ్జగించి తిరిగి తీసుకొచ్చేందుకు మూడు రోజులు సెలవు కావాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి కోరాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. ప్రేమ్ నగర్ బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు శాంషద్ అహ్మెద్. తనకు సెలవు ఎంత ముఖ్యమో వివరించారు. తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆమెను బుజ్జగించి తిరిగి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు అహ్మెద్. ‘నేను మానసికంగా బాధపడుతున్నా. ఆమెను బుజ్జగించి తీసుకొచ్చేందుకు వారి ఊరికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు, నగరం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.’అని హిందీలో లేఖ రాశారు అహ్మెద్. క్లర్క్ అభ్యర్థనను బీడీఓ అధికారి ఆమోదించారు. Kanpur man seeks leave to make amends with wife, letter goes #viral pic.twitter.com/4RmVvL2JQh — Aaquil Jameel (@AaquilJameel) August 3, 2022 ఇదీ చదవండి: బాధలో ఉన్న వ్యక్తిని తల్లిలా ఓదార్చిన కోతి.. నెటిజన్లు ఫిదా! -
దారుణం.. కట్నం కోసం స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్!
లక్నో: దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు.. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని కన్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, అతడి స్నేహితులపై ఛకేరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2020, మార్చి 6 నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె భర్త, ఆడపడుచు రూ.2 లక్షలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు. అయితే.. అడిగిన డబ్బు, కారు ఇవ్వలేకపోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు. నలుగురు కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనను చంపేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్ పతాక్ తెలిపారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
ఎయిర్పోర్ట్కి శంకర్ పేరు
భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను లాహోర్ జైలులో ఉరి తీశారన్న వార్తతో ఆగ్రహించిన ప్రజానీకం పలుచోట్ల గట్టిగా నిరసనలు తెలిపింది. కాన్పూర్లో ఘోరమైన మత కల్లోలాలు జరిగాయి. నాలుగు వందల మంది వరకు చనిపోయారు. అలాంటి సమయంలో ఆ రక్తపాతం నుంచి, ఆ మౌఢ్యం నుంచి అటు హిందువులను, ఇటు ముస్లిం మతానికి చెందిన అమాయకులను రక్షించడానికి ఒక జాతీయ కాంగ్రెస్ నాయకుడు, గాంధీజీ అనుచరుడు నేరుగా రంగంలో దిగారు. అదే అదనుగా ఒక మూక ఆయన మీద పడి, కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసింది. రెండురోజులకు గాని ఆయన మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఆయనే గణేశ్శంకర్ ‘విద్యార్థి’. గణేశ్ శంకర్ విద్యార్థి (1890–1931) ఒక పేద కుటుంబంలో పుట్టారు. అలహాబాద్ సమీపంలోన అట్టార్సుయి ఆయన జన్మస్థలం. ఆయన అభిరుచి అంతా పత్రికా రచనే. ‘స్వరాజ్య’ పత్రికకు రచనలు పంపించేవారు. ఆ రచనల కోసం ఆయన పెట్టుకున్న పేరు ‘విద్యార్థి’. చివరికి ఆయనే ‘ప్రతాప్’ అనే వారపత్రిక ఆరంభించారు. ‘అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిని నేను. ఉద్యోగులు, జమీందార్లు, పెట్టుబడిదారులు, కులీనులు ఎవరు ఈ పనికి పాల్పడినా నేను వారిపై పోరాడతాను. అమానవీయతకు వ్యతిరేకంగా నా ప్రాణమొడ్డి పోరాడతాను. అందుకు భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడని కాంక్షిస్తున్నాను’ అని ఒక సందర్భంలో విద్యార్థి అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన పోరాటానికి, కృషికి గౌరవ సూచకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2017 జూలై 18న కాన్పూర్ విమానాశ్రయానికి ‘గణేశ్ శంకర్ విద్యార్థి ఎయిర్పోర్ట్’ అని పేరు పెట్టింది. (చదవండి: నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్లోని పహార్తలి యూరోపియన్ క్లబ్... ప్రీతిలతా వడ్డేదార్) -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. నూపుర్ శర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆదివారం వెల్లడించింది. నవీన్ కుమార్ జిందాల్ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్గా ఉన్నారు. సస్పెన్షన్ లెటర్లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామం’ అని బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది. కాగా, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పరేడ్ మార్కెట్లోని దుకాణాలను మూసివేయాలని ముస్లిం వర్గం పిలుపునిచ్చింది. యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొవడలు చెలరేగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు. చదవండి: డబ్బులు వృధా చేసుకోవద్దు. మా వద్ద లేనిది ఈడీ మాత్రమే: సంజయ్ రౌత్ ఇదిలా ఉండగా.. వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాలలోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు నూపుర్ శర్మపై హైదరాబాద్, పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. అన్ని మతాలను గౌరవిస్తాం అయితే నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటుకు కొద్దిసేపటి ముందే బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని అన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందనని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీస్తే, మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. -
కాన్పూర్ హింస..800 మందిపై కేసులు
కాన్పూర్/లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు 800 మందికి పైగా కేసులు నమోదు చేశారు. వీరిలో 24 మందిని అరెస్ట్ చేసి, 12 మందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో రికార్డింగ్ల ఆధారంగా హింసకు పాల్పడిన 36 మందిని గుర్తించామని కాన్పూర్ పోలీస్ కమిషనర్ వీఎస్ మీనా వెల్లడించారు. బేకన్గంజ్ ఎస్హెచ్వో నవాబ్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ అసిఫ్ రజా ఫిర్యాదుల వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఘర్షణలకు సూత్రధారిగా అనుమానిస్తున్న మౌలానా మొహమ్మద్ అలీ(ఎంఎంఏ)జౌహార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా గ్రూప్ చీఫ్ హయత్ జఫర్ హస్మితోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తదితర సంస్థలతో లింకులున్నట్లు తేలితే కఠినమైన జాతీయ భద్రతా చట్టంతోపాటు గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కమిషనర్ మీనా వెల్లడించారు. విదేశీ నిధులు అందాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కుట్రదారుల ఆస్తులను జప్తు చేస్తామన్నారు. ఇటీవల ఓ టీవీలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత నూపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ శుక్రవారం కాన్పూర్లోని కొన్ని ప్రాంతాల్లో కొందరు దుకాణాలను మూసివేయించేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులు సహా మొత్తం 40 మంది గాయపడ్డారు. -
జాతీయ చెస్ చాంపియన్షిప్ విజేతగా అర్జున్..
కాన్పూర్: టోర్నీలో పరాజయమెరుగని గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ సీనియర్ జాతీయ చెస్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. సీనియర్ టైటిల్ సాధించిన తొలి తెలంగాణ ఆటగాడిగా ఘనత వహించాడు. ఆఖరి 11వ రౌండ్ గేమ్లో 18 ఏళ్ల అర్జున్ మాజీ చాంపియన్ సేతురామన్ (8)తో ‘డ్రా’ చేసుకున్నాడు. టైటిల్ రేసులో ఉన్న గుకేశ్కు గురువారం ఇనియన్ జతయ్యాడు. గుకేశ్ కూడా ఆర్యన్ చోప్రా (8)తో డ్రా చేసుకోగా, ఇనియన్... మిత్రభా గుహా (బెంగాల్)ను ఓడించాడు. దీంతో అర్జున్తో పాటు తమిళ గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ఇనియన్ ఉమ్మడిగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... చివరకు టైబ్రేక్ స్కోరుతో అర్జున్ను విజేతగా ఖరారు చేశారు. గుకేశ్, ఇనియన్లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. తెలంగాణ ఆటగాడికి ట్రోఫీతో పాటు రూ. 6 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. చదవండి: టీమ్ ఈవెంట్లో ఇషాకు స్వర్ణం -
సంయుక్తంగా అగ్రస్థానంలో అర్జున్
జాతీయ సీనియర్ పురుషుల చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్, తమిళనాడు గ్రాండ్మాస్టర్ గుకేశ్ 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. కాన్పూర్లో జరుగుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్లో అర్జున్ 41 ఎత్తుల్లో ఇనియన్ (తమిళనాడు)తో ‘డ్రా’ చేసుకోగా... గుకేశ్ 64 ఎత్తుల్లో అభిజిత్ గుప్తా (పీఎస్పీబీ)పై గెలిచాడు. నేడు చివరిదైన 11వ రౌండ్ గేముల్లో సేతురామన్ (పీఎస్పీబీ)తో అర్జున్, ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)తో గుకేశ్ ఆడతారు. -
Punjab Election 2022: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన
-
ఆడుకుంటానని చెప్పి వెళ్లాడు.. ఆపై చేనులో దుస్తులు లేకుండా!
వావీవరుసలు, వయో భేదం లేకుండా.. చివరికి మూగ జీవాలను వదలకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి మానవ మృగాలు. ఈ క్రమంలో యూపీలో జరిగిన ఓ ఘోరం.. వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఓ దళిత మైనర్ చిన్నారిని అత్యంత క్రూరంగా హత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ అవుటర్ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం రైతుది. అతని పదేళ్ల కొడుకు సోమవారం మధ్యాహ్నం.. ఆడుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా వెతిక్కి.. రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ లోపు ఊరి బయట ఆవ చేనులో ఓ బాలుడి మృతదేహాన్ని పనులకు వెళ్లిన ఓ మహిళ గుర్తించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అది కనిపించకుండా పోయిన మైనర్దేనని తేలింది. బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. దుస్తులు యాభై మీటర్ల దూరంలో పడేసి ఉన్నాయి. ఘాతుకానికి పాల్పడే సమయంలో ప్రతిఘటించడంతో ఆ పిల్లాడిపై బండరాళ్లతో దాడి చేసి ఉంటారని, కన్నుకి తీవ్రంగా గాయమైందని, ఒంటిపై పంటి గాట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ లైంగిక దాడి జరిగిందా? ఎలా హత్య చేశారు? అనే విషయాల నిర్ధారణకై శవపరీక్ష కోసం ఎదురుచూస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని కాన్పూర్ ఏఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు. మరోవైపు చనిపోయింది పదేళ్ల బాలుడు కావడం, ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటడంతో.. గ్రామస్థుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కాసేపు రహదారి దిగ్భంధించి నిరసనలు వ్యక్తం చేశారు. ఆపై పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
కాన్పూర్లో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి, విషమంగా తొమ్మిది మంది!
Kanpur Bus Accident: ఉత్తర ప్రదేశ్లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి జనాల మీదకు దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలు అయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి.. జనాల మీదకు దూసుకెళ్లింది. ఆపై బస్సు ఓ ట్రాఫిక్ బూతును ఈడ్చుకుంటూ వెళ్లి.. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కును ఢీ కొట్టి ఆగిపోయింది. ఘటన తర్వాత బస్సు డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు ఈస్ట్ కాన్పూర్ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులకు దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు.. వాళ్లలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకులు ఫేయిల్ అయినందునే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటన సమయంలో 20 మందికి పైగా గుంపు అక్కడ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. #Police_Commissionerate_Kanpur_Nagar के घण्टाघर से टाटमील चौराहे के बीच हुयी घटना व की गयी कार्यवाही के सम्बन्ध में पुलिस उपायुक्त पूर्वी @dcpekanpur द्वारा दी गयी बाइट।@Uppolice pic.twitter.com/QpGho35a0M — POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) January 30, 2022 ఇదిలా ఉండగా.. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు పొలిటీషియన్లు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. कानपुर में हुई बस दुर्घटना में कई लोगों के हताहत होने की खबर से अत्यंत दुःख हुआ है। इस घटना में अपने प्रियजनों को खोने वाले परिवारों के प्रति मेरी गहन शोक-संवेदनाएं। मैं घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ। — President of India (@rashtrapatibhvn) January 31, 2022 कानपुर से सड़क हादसे का बहुत ही दुखद समाचार प्राप्त हुआ। मृतकों के परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि घायलों को जल्द स्वास्थ्य लाभ मिले। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 30, 2022 -
నోట్ల గుట్టల మాయగాడు.. కొత్త ట్విస్ట్
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు. అలా అనలేదు.. మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు. పొలిటికల్ డ్రామా.. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్రాజ్ జెయిన్కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా. ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు. చదవండి: పీయూష్పై ఇంతకాలం అనుమానం ఎందుకు రాలేదంటే.. -
ప్రధాని మోదీ నోట ‘పీయూష్ జైన్’ మాట
PM Modi And Amit shah Slams SP Chief Akilesh Yadav Over Piyusj Jain Issue: యూపీ కాన్ఫూర్ వ్యాపారి పీయూష్ జైన్ వ్యవహారం ఆర్థిక నేరంగానే కాదు.. రాజకీయంగానూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ అత్తరు వ్యాపారి అయిన పీయూష్ నుంచి దాదాపు 200 కోట్లకు పైనే విలువైన సంపదను అధికారులు రికవరీ చేసుకోవడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ తరుణంలో యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. పీయూష్ వ్యవహారం ఆధారంగా ప్రతిపక్షంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాన్పూర్లో మంగళవారం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగించిన ప్రధాన మోదీ.. సమాజ్వాదీ పార్టీ, ఆ పార్టీ చీఫ్ అఖిలేష్పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేసినా.. అది తాము చేసిందేనని, బీజేపీ క్రెడిట్ను ఊరికే లాక్కుంటోందని వాళ్లు(అఖిలేష్ను ఉద్దేశించి) అంటారు కదా. మరి ఇప్పుడు నోట్ల కట్టలు నిండిన డబ్బాలు బయటపడ్డాయి. మరి బాధ్యతగా ఎందుకు ముందుకు రావడం లేదు. నోళ్లు మూసుకుని కూర్చుకున్నారు వాళ్లంతా. 2017కి ముందు దాకా అత్తరు అవినీతి యూపీలో ఏ విధంగా గుభాలించిందో అందరికీ తెలిసిందే అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా చూస్తోంది. ఇది వాళ్లు సాధించిన ప్రగతి. వాస్తవ పరిస్థితి. యూపీ ప్రజలు ప్రతీది గమనిస్తున్నారు. వాళ్లకు ప్రతీది అర్థమవుతోంది. గత ప్రభుత్వం ఎన్నికల గెలుపును.. దోచుకునేందుకు దొరికిన లాటరీగా భావించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం నిజాయితీతో బాధ్యతాయుతంగా పని చేస్తోందని అని వ్యాఖ్యానించారు ప్రధాని. షా నేరుగా.. అయితే ప్రధాని మోదీ పరోక్షంగా కామెంట్స్ చేస్తే.. కేంద్ర మంత్రి అమిత్ షా నేరుగా పేర్లతో విమర్శించడం విశేషం. ఈమధ్య సమాజ్వాదీ పార్టీకి చెందిన ఓ పర్ఫ్యూమ్ వ్యాపారి దొరికాడు. మేమేందుకు దాడులు చేయించామా? అనుకుంటూ అఖిలేష్ గారు మెలికలు తిరిగిపోతున్నారు. 250కోట్ల డబ్బు. ఎక్కడిది అఖిలేష్గారూ అంటూ సూటిగా ప్రశ్నించారు షా. అఖిలేష్ ఏమన్నాడంటే.. ఇక ప్రధాని, షాల ఆరోపణలపై ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సాదాసీదాగా స్పందించాడు. పొరపాటున వాళ్లకు చెందిన వ్యాపారిపైనే బీజేపీ దాడులు చేయించుకుందంటూ కౌంటర్ ఇచ్చారు. అతని(పీయూష్) కాల్ రికార్డులు పరిశీలిస్తే.. అతనితో టచ్లు ఉన్న బీజేపీ నేతల పేర్లు బయటపడతాయి. ఎస్పీ నేత పీయూజ్రాజ్ జెయిన్కు బదులు.. బహుశా పీయూష్ జైన్ మీద దాడులు చేసి ఉంటారేమో అంటూ సెటైరిక్గా స్పందించారు అఖిలేశ్. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేత.. లెక్కించేందుకు నాలుగు రోజులు?
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. తనిఖీల్లో భాగంగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ డబ్బును లెక్కించేందుకే దాదాపు నాలుగు రోజులు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్: ఒక్కరోజే 156 కొత్త కేసులు, మహారాష్ట్రను దాటేసిన ఢిల్లీ ఇక, సోదాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్లో 4, కన్నౌజ్లో 7, ముంబయిలో 2, దిల్లీలో ఒక ఆస్తికి చెందిన పత్రాలను గుర్తించారు. మరో రెండు ఆస్తులు దుబాయిలో ఉన్నట్లు తేలింది. కన్నౌజ్లో పీయూష్ జైన్ పూర్వీకుల ఇంట్లో 18 లాకర్లను అధికారులు గుర్తించారు. మరో 500 తాళాలు కూడా దొరికాయని సమాచారం. పన్ను ఎగవేత మొత్తంగా 1000కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ముందు ప్రేమ, ఆపై దూరం.. తట్టుకోలేక ఒకరినొకరు పొడుచుకున్న ప్రేమికులు సంబంధిత వార్త: గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే, షాక్లో అధికారులు.. ఫోటోలు వైరల్! -
సార్.. ఫోజులు తర్వాత.. ముందు గ్యాస్ వెలిగించు
లక్నో: సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా శ్రమించిన వారు విన్ అవుతుంటే.. ఏం లేకపోయినా.. హడావుడి చేసే బాపతు బ్యాచ్ మాత్రం తుస్సుమంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. సార్ చాలా శ్రమ పడి ఫోజులిచ్చారు కానీ.. మీ ప్రయత్నం వృథా అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు.. కాన్పూర్ కమిషనర్, ఐఏఎస్ అధికారి రాజ్ శేఖర్ ఆదివారం వంటింట్లో గరిటె పట్టిన ఫోటోని ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి.. వంటలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను.. ఉదయం టిఫిన్ కోసం పోహా తయారు చేస్తున్నాను.. అది కూడా హోం మినిస్టర్ అధ్వర్యంలో’’ అనే క్యాప్షన్తో ఫోటోని షేర్ చేశారు. (చదవండి: ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!) Please wish me Good Luck. Trying my luck in Cooking…😊 Preparing the Poha for the Breakfast under guidance of Home Minister…😊 pic.twitter.com/y607j5Yzr1 — Raj Shekhar IAS (@rajiasup) December 19, 2021 ఇక దీనిలో రాజ్ శేఖర్.. నీటుగా సూటు బూటు వేసుకుని తయారయి ఉన్నారు. అన్నింటికంటే.. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. వంట చేస్తున్నానని చెప్పారు.. కానీ గ్యాస్ వెలిగించి లేదు. ఇది గమనించుకోకుండా.. ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ నెటిజనులు ఎంత జాగ్రత్తగా గమనిస్తారో తెలుసు కదా.. దాంతో కమిషనర్ పరువు పొగొట్టుకునే పరిస్థితి తలెత్తింది. (చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి) ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ‘‘సార్.. వంట బాగా చేశావ్.. స్టవ్ వెలిగిస్తే.. ఇంకా బాగుండేదేమో’’.. ‘‘సూటు బూటు వేసుకుని వంట చేస్తారా ఎవరైనా’’.. ‘‘గ్యాస్ ధర చుక్కలనంటుతుంది.. మీరేమో మంటతో పని లేకుండా వంట చేశారు.. ఆ టెక్నిక్ మాకు కూడా చెప్పండి’’.. ‘‘ఈ ఫోటోని గనక ఐక్యరాజ్యసమితి చూస్తే.. దెబ్బకు మూర్ఛపోతుంది.. మీ ఐడియాను తెగ ప్రశంసిస్తుంది.. గ్లోబల్ వార్మింగ్ కూడా సగానికి సగం తగ్గుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. Cooking without fire while dressed in a suit ...yeah you do need help. Help in staging social media pics https://t.co/XQsfY2RpvQ — Lady Andolan Jeevi 🏳️🌈 (@LadyDramadragon) December 20, 2021 చదవండి: మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా? -
ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!
లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన తర్వాత వైద్య సిబ్బంది ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో.. సరైన అవగాహన లేకపోవడం.. వైరస్ గురించి పూర్తిగా తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆలోచించి చాలా మంది వైద్య సిబ్బంది రోజుల తరబడి ఆస్పత్రులకే పరిమితం అయ్యారు. కరోనా వైద్య సిబ్బందిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేసిందని విశ్లేషకులు తెలిపారు. వైరస్ తన రూపు మార్చుకుంటూ.. దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ జనాలను భయపెడుతుంది. ఇది డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ భయంతో ఓ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్య, బిడ్డలను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. నిందితుడి పేరు డాక్టర్ సుశీల్ కుమార్. ఇతడు కాన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు(18), కుమార్తె(15) ఉన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు తెలిసినప్పటి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. (చదవండి: Omicron India: భారత్లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదు.. ఎక్కడంటే) తన భార్య, బిడ్డలు మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ముందుగానే చంపేస్తే మంచిదని ఆలోచించాడు. విచక్షణ మరచిపోయి.. అత్యంత దారుణంగా వారిని హత్య చేశాడు. ఆ తర్వాత తన సోదరుడికి కాల్ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. నిందితుడు సోదరుడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు పారిపోయాడు. (చదవండి: Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్తో ముప్పు లేదు) సంఘటన స్థలంలో పోలీసులుకు ఓ డైరీ, హత్యకు వాడిన సుత్తి లభించింది. మృతులను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డైరీ చదివిన పోలీసులు షాక్ అయ్యారు. దానిలో నిందితుడు తాను నయం కానీ ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు రాసుకున్నాడు. అలానే ‘‘ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరం. అది అందరిని చంపేస్తుంది. నా అజాగ్రత్త వల్ల నేను తప్పించుకోలేని ఓ ప్రమాదంలో చిక్కుకున్నాను. నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ముందే సురక్షితమైన ప్రాంతానికి పంపాలి’’ అని రాసుకున్నాడు. డైరీ పరిశీలించిన పోలీసులు నిందితుడు తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడికి కోసం గాలిస్తున్నారు. చదవండి: వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్! -
ద్రవిడ్ రూటే సెపరేటు! గ్రౌండ్స్మెన్కు రూ.35 వేలు.. కారణం
ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్ ఆడుతుంది అంటే పిచ్ మన బౌలర్లకు అనూకూలంగా తయారు చేయడం సహజం. కానీ రాహుల్ ద్రవిడ్ రూటు మాత్రం సెపరేటు. టీమిండియాకు హెడ్కోచ్గా ఎంపికైనప్పటి నుంచి తనమార్క్ కోచ్ అంటే ఏంటో చూపిస్తూ వచ్చాడు. తాజాగా న్యూజిలాండ్, టీమిండియా మధ్య ముగిసిన తొలి టెస్టు గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. చదవండి: Rahane-Dravid: రహానే ఫామ్పై ఆందోళన వ్యర్థం: ద్రవిడ్ కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టుకు స్పోర్టింగ్ పిచ్ తయారు చేయాలంటూ గ్రౌండ్ మేనేజ్మెంట్ను కోరినట్లు తెలిసింది. అందుకు ద్రవిడ్ తన పర్సనల్ అకౌంట్ నుంచి రూ.35 వేలు గ్రీన్పార్క్ గ్రౌండ్స్మెన్కు ఇచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యుపీసీఏ) మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ద్రవిడ్పైన ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ యూపీ క్రికెట్ తెలిపింది. ద్రవిడ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆట ఫెయిర్గా.. స్పోర్టివ్గా ఉండాలని భావించేవాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా ద్రవిడ్లో అదే తీరు కనబడిందని.. పిచ్ తమకు అనుకూలంగా కాకుండా స్పోర్టింగ్ పిచ్ను తయారు చేయమని చెప్పడం ఒక్క ద్రవిడ్కు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం ద్రవిడ్ చేసిన పని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. '' మ్యాచ్ డ్రాగా ముగిసింది అన్న బాధ కంటే ద్రవిడ్ చేసిన పని ఆనందం కలిగించింది.. ఎంతైనా కోచ్గా ద్రవిడ్ రూటే సెపరేటు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Rachin-Ajaz Patel: రచిన్, ఎజాజ్ పటేల్.. భారత్తో బంధం -
IND Vs NZ 1st Test: జడేజా, అయ్యర్ అర్థశతకాలు.. ముగిసిన తొలిరోజు ఆట
►న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదటి రోజు ఆటను ముగించింది. తొలిరోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 75*, రవీంద్ర జడేజా 50* పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరిమధ్య ఇప్పటివరకు ఐదో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతకముందు శుబ్మన్ గిల్ 52 పరుగులు చేసి ఔట్ కాగా.. మిగతా టీమిండియా బ్యాటర్స్లో రహానే 35, పుజారా 26, మయాంక్ 13 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 3 వికెట్లు తీశాడు. ఓవరాల్గా తొలి రోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కాగా వెళుతురు లేమితో అంపైర్లు ఆరు ఓవర్లు ముందే ఆటను నిలిపివేశారు. ► తొలి టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 80 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 69, రవీంద్ర జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►అరంగేట్ర టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం మూడో సెషన్లో బ్యాటింగ్ కొనసాగిస్తున్న టీమిండియా 72 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అయ్యర్ 54, రవీంద్ర జడేజా 29 పరుగులతో ఆడుతున్నారు. ► 106 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగుల చేసిన పుజారా, సౌథీ బౌలింగ్లో బ్లండెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి భారత్ 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే (17), శ్రేయాస్ అయ్యర్(6)పరుగులతో ఉన్నారు. ►82 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన గిల్, కైల్ జామీసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఛతేశ్వర్ పుజారా(8), రహానే (0)పరుగులతో ఉన్నారు. ►న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్(40), ఛతేశ్వర్ పుజారా(8) పరుగులతో ఉన్నారు. ►టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జెమీషన్ బౌలింగ్లో బ్లండెల్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో నయా వాల్ ఛతేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. ►పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 24-1. ►భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా గురువారం జరుగుతున్న తొలి టెస్ట్లో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడించిన న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు కివీస్ కూడా టి20 సిరీస్లో ఎదురైన క్లీన్స్వీప్ పరాభవాన్ని రూపుమాపేందుకు తొలి టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ సారి సీనియర్ల గైర్హాజరీలో భారత యువ జట్టు బరిలోకి దిగుతున్నది. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్తో టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కాగా భారత్ గడ్డపై కివీస్ చివరి సారిగా 1988లో టెస్టు మ్యాచ్ గెలిచింది. భారత జట్టు: శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్విల్లే చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక.. -
IND Vs NZ 1st Test: ప్రాక్టీస్లో చమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు
-
భారత ఓపెనర్ల కంటే ఆ ఇద్దరు బాగా ఆడుతారు.. గెలుపు ఖాయం
Aakash Chopra makes his predictions for the 1st IND vs NZ Test: కాన్పూర్ వేదికగా గురువారం నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్పై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. భారత ఓపెనర్ల కంటే పుజారా, రహానే కలిసి ఎక్కువ పరుగులు చేస్తారని అతడు జోస్యం చెప్పాడు. "పుజారా, రహానే కలిసి భారత ఓపెనర్ల కంటే ఎక్కువ పరుగులు చేస్తారు. పుజారాపై కూడా ఒత్తిడి ఉంది. కానీ లీడ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్తో పూజారా తిరిగి తన ఫామ్ను అందుకున్నాడు. ఇద్దరు ఓపెనర్లు కూడా కొత్తవారే. అదే విధంగా న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ ఇద్దరూ స్పిన్కు బాగా ఆడుతారు. ఈ మ్యాచ్లో వారిద్దరూ కలిసి 125 కంటే ఎక్కువ పరుగులు చేస్తారని నేను భావిస్తున్నాను" అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక భారత స్పిన్నర్ల గురించి మాట్లాడూతూ.. ఈ మ్యాచ్లో భారత్ ఎంత మంది స్నిన్నర్లతో బరిలోకి దిగుతోందో నాకు తెలియదు. కానీ ఈ మ్యాచ్లో స్పిన్నర్లు పదికి పైగా వికెట్లు తీస్తారని నేను భావిస్తున్నాను " అని చోప్రా తెలిపాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆకాశ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. కాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమిండియా బరిలోకి లోకి దిగనుంది. చదవండి: Dinesh Karthik: మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ -
జికా వైరస్ కలకలం..100 దాటిన కేసులు
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో జికా వైరస్ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా మరో 16 జికా వైరస్ కేసులు నమోదు కావడంతో యూపీలో ఈ కేసుల సంఖ్య 100 దాటింది. ఇక ప్రత్యేకంగా కాన్పూర్లో అత్యధిక జికా వైరస్ కేసులు నమోదు అవుతూ ఆ ప్రాంతాన్ని వణికిస్తోన్నాయి. కాన్పూర్లో అక్టోబరు 23న తొలి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. జికా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. చదవండి: అరుణాచల్ ప్రదేశ్లో గ్రామం.. ‘అది చైనాలోనే ఉంది’ -
యూపీలోని కాన్పూర్లో విజృంభిస్తోన్న జికా వైరస్
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ విజృంభిస్తుండగా, గత వారం రోజులుగా కాన్పూర్లో పెరుగుతున్న జికా వైరస్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. దోమల ద్వారా సంక్రమించే ఈ కేసుల సంఖ్య సోమవారంనాటికి 89కి చేరింది. బాధితుల్లో ఒక గర్భిణీ, 17 మంది పిల్లలు ఉండటం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. మొదటి జికా కేసు అక్టోబర్ 23న గుర్తించగా, గత వారంలో కేసుల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడెస్ ఈజిప్టి దోమల ద్వారా జికా వ్యాపిస్తుంది. నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. డెంగ్యూ, చికున్ గున్యా వ్యాప్తికి కారకాలు కూడా. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్ర బారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాగా జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని, అనేక వైద్య బృందాలు వ్యాధిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాన్పూర్ జిల్లా మెడికల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ సింగ్ తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్తోపాటు, వైరస్ను వ్యాప్తి చేసే దోమ సంతానోత్పత్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. -
Zika Virus: కాన్పుర్లో 25 జికా వైరస్ కేసులు నమోదు
-
Zika Virus: కాన్పుర్లో 25 జికా వైరస్ కేసులు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్లో బుధవారం 25 కొత్త జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన 11 కేసులతో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 36 జికా వైరస్ కేసులు నమోదైనట్లు కాన్పుర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నెపాల్ సింగ్ తెలిపారు. 36 జికా కేసుల్లో ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ 400 నుంచి 500 ఇళ్లలో ఉన్నవారి నుంచి సాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ప్రతి ఇంటిలోను సాంపిల్స్ సేకరించే కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. జికా వైరస్ కేసులు పెరుగుతన్నాయని ఎవరూ ఆందోళన చెందవద్దని, నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాన్పుర్లోని తివారీపూర్, అష్రఫాబాద్, పోఖర్పూర్, శ్యామ్ నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో కొత్త జికా వైరస్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. -
Prerna Verma: 3 వేలతో వ్యాపారం ప్రారంభించి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్
Prerna Verma: Kanpur Based Entrepreneur Inspiring Story In Telugu: రోజువారీ అవసరాలకు కూడా వెతుక్కునే కుటుంబంలో పుట్టి పెరిగింది ప్రేరణ వర్మ. రోజువారీ ఖర్చుల కోసం అని ఉంచిన మూడు వేల రూపాయలతో కాన్పూర్లో మొదలు పెట్టిన లెదర్ వ్యాపారంతో నేడు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దిశగా ఎదిగింది. నేడు రోజూ రెండు కోట్ల రూపాయల టర్నోవర్తో లెదర్ కంపెనీని నడుపుతుంది. తన కుటుంబానికి అండగా ఉండటంతో పాటు, మరికొందరికి ఉపాధి కల్పిస్తోంది. ఎన్నో అవార్డులనూ సొంతం చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూరు నివాసి అయిన 38 ఏళ్ల ప్రేరణ వర్మ టెన్త్ క్లాస్ నుంచే ట్యూషన్లు చెప్పేది. ఆ తర్వాత కాలేజీ, ఉద్యోగం ఏ పనులు చేస్తున్నా ట్యూషన్లు ఆపలేదు. ‘‘ఏ పనులు మానేసినా ఆ నెల గడవదు అనే భయం వెంటాడేది. ఇంట్లో అమ్మ, తమ్ముడు, నేను. కొన్ని కారణాల రీత్యా మా నాన్నకు దూరమయ్యాం. ఇంటి బాధ్యత నా మీదనే ఉండటంతో సంపాదన గురించి ఎప్పుడూ ఆలోచించేదాన్ని. 2004లో మార్కెటింగ్ విభాగంలో ఓ సైబర్ కేఫ్లో పనిచేసేదాన్ని. ఓ అమ్మాయి అలా బయటకు వెళ్లి పనిచేయడమే మా చుట్టుపక్కల పెద్ద విషయంగా భావించేవారు’’ అని తన జీవితం తొలినాళ్లను గుర్తుచేసుకుంటుంది ప్రేరణ. వ్యాపారంలో మోసం ఆ తర్వాత వచ్చిన గడ్డు పరిస్థితులు, దాటిన విధానాల గురించి చెబుతూ... ‘‘సైబర్ కేఫ్లో ఓ పెద్దాయన కలిశాడు. తనతో పాటు మార్కెటింగ్ పనులు చేయమని సూచించాడు. దీంతో నేనూ వారి కంపెనీలో భాగస్వామినయ్యాను. ఎలాంటి ఒప్పంద పత్రాలు లేకపోవడంతో నెలన్నరలోనే అక్కణ్ణుంచి బయటకు రావాల్సి వచ్చింది. అది నాకు అనుభవాన్ని నేర్పింది. కానీ, ఇంటిని నిలబెట్టుకోవడానికి ఉద్యోగం తప్పనిసరి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. ‘ఇప్పుడేం చేయాలి?’ అనేది పెద్ద సందిగ్ధం. ఉద్యోగం లేకుండా జీవించే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎవరికోసమో మార్కెటింగ్ పనులు చేశాను. ఇప్పుడు నాకోసం నేనే ఎందుకు వ్యాపారం ప్రారంభించకూడదు అనుకున్నాను. కానీ, నా దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాయం పొందేందుకు డబ్బు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆ డబ్బుతోనే ఇంట్లో ఒక గదిలో లెదర్ నుంచి తాళ్లు తీసే పనిని మొదలుపెట్టాను. అవకాశం ఉన్న చోట, పరిశ్రమలకు వెళ్లి కొనుగోలుదారులను వెతికేదాన్ని. సరఫరా చేసే విధానం గురించి అడిగేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది. అనుకున్న సమయానికి డెలివరీ చేశాను. ఆ విధంగా వ్యాపారానికి పునాది పడింది. వినియోగదారులను సంపాదించడం ద్వారా మాత్రమే ఈ పరిశ్రమలో ఉండగలను అని తెలుసుకున్నాను. సొంతంగా కంపెనీ.. ‘క్రియేటివ్ ఇండియా’ అనే పేరుతో సంస్థ ప్రారంభించి నేటికి 15 ఏళ్లు. లెదర్ తాళ్లు తయారీనే కాదు, ఎగుమతి కూడా చేస్తాను. ఈ పనిని మొదలుపెట్టినప్పుడు ఎవరూ దీనిని ఒక పనిగా గుర్తించలేదు. ప్రాక్టీస్ మీద సాధించాను. నేను ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాలేదు. నేటికీ వ్యాపారంలో ఆడపిల్లలు చాలా తక్కువ. చాలా మంది నన్ను చూసి హేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆడపిల్లలు ఇలాంటి వ్యాపారాలు ఎలా చేస్తారు, అసాధ్యం అన్నారు. కానీ, నేను ఈ లెదర్ వ్యాపారంలో విజయం సాధించాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నది సాధించాను. రోజుకు రెండు కోట్ల టర్నోవర్తో కంపెనీని నడుపుతున్నాను. ఎక్కడకు వెళ్లినా వెళ్లినా అక్కడ కనీసం రెండు, మూడు వాహనాలైనా నా కోసం ఎదురుచూస్తుంటాయి. ప్రోత్సాహక అవార్డులు ఒక అమ్మాయి ఇంటి గుమ్మం బయట నుంచి పని చేస్తే ఆ కుటుంబసభ్యులే అనుమానంగా చూస్తారు. కానీ, 2010లో నాకు ఎక్స్పోర్ట్ బిజినెస్ అవార్డు వచ్చినప్పుడు నేను సరైన సమాధానం చెప్పాను అనిపించింది. ఆ తర్వాత 2015లో హస్తకళల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి, 2016లో జాతీయ ఉత్పాదక మండలి, 2017లో మళ్లీ హస్తకళల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి అవార్డులు వరుసగా వరించాయి’’ అని ప్రేరణ తన విజయం గురించి, అనుభవించిన గడ్డు స్థితి గురించి వివరిస్తారు. ఎవరైనా ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రేరణ స్ఫూర్తి కథనాన్ని చదివితే చాలు, తప్పక ప్రేరణ పొందుతారు. ‘విజయం ఒక్కరోజులో సాధ్యం కాదు, అందుకోసం ఓ తపస్సు చేయాలని చెబుతున్న ప్రేరణ వర్మ నేడు ఎంతోమంది మగువలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నా దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాయం పొందేందుకు డబ్బు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆ మూడు వేల రూపాయలతో ఇంట్లోనే ఒక గదిలో లెదర్ నుంచి తాళ్లు తీసే పనిని మొదలుపెట్టాను. – ప్రేరణ చదవండి: Pink Cafe: చాయ్తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి
ఉత్తరప్రదేశ్: సినిమాల్లో మాదిరి నిజ జీవితం అన్ని జరగవు. అయితే కొన్ని సంఘటనలు చూస్తే సినిమాల్లో మాదిరిగా చేస్తున్నారో లేక వాటిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్నారో కూడా తెలియదు. కానీ కాన్పూర్కి చెందిన పంకజ్ అనే వ్యక్తి 1999లో వచ్చిన బ్లాక్బస్టర్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాల్లో హీరో మాదిరిగా చేశాడు. (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....గుర్గామ్లోని ఓ ప్రైమేట్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తికి ఈ ఏడాది మేలో కోమల్ అనే ఆమెతో వివాహం అయ్యింది. అయితే పంకజ్ భార్య కోమల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనితో మాట్లాడకుండా దూరంగానే ఉండేది. అంతేకాక తనతోనే కాక ఇంట్లో వాళ్ల ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండేది. చివరికి అతను కోమలిని ఎంతో ప్రయత్నించి అడగగా ఆమె తాను పింటూ అనే వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పింది. దీంతో పంకజ్ తన అత్తమామలకు ఈ విషయాన్నితెలియజేశాడు. అయితే పంకజ్ అత్తమామలు కోమల్కు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఆమె అంగీకరించ లేదు. ఆ తర్వాత ఈ విషయం గృహ హింస నిరోధక విభాగం, ఆశాజ్యోతి సెంటర్కు చేరుకుంది. వారు పంకజ్కి అతని భార్య కోమల్, పింటూ, వారి బంధవులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కోమల పింటూనే వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకోవడంతో చివరికి పంకజ్ వారి వివాహానికి అంగీకరించాడు. ఈ మేరకు పంకజ్ దగ్గరుండి మరీ లాయర్ సమక్షంలో తన భార్య ప్రేమించిన పింటూతో ఘనంగా వివాహం జరింపించాడు. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
అత్యాచారం చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల అమ్మాయిని ఆమె పనిచేసే కంపెనీ యజమాని అత్యాచారం చేయడమే కాకుండా పదో అంతస్తు నుంచి కిందకి తోసి హత్య చేశాడు. డీసీపీ మూర్తి గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కాన్పూర్లో డెయిరీని నిర్వహించే ప్రతీక్ వైష్ (40)అనే వ్యక్తి తన దగ్గర సెక్రటరీగా పని చేసే 19 ఏళ్ల అమ్మాయికి ఆఫీసు పని ఉందని మభ్యపెట్టి కళ్యాణ్పూర్లో ఉన్న తన ఫ్లాట్కి తీసుకువెళ్లాడు. ఇంటికి తీసుకువెళ్లాక తనతో సెక్స్ చేస్తే డబ్బులు ఇస్తానని ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయమంతా పోలీసులకి చెబుతానని ఆమె గట్టిగా బెదిరించడంతో పదో అంతస్తులో ఉన్న తన ఇంటి బాల్కనీ నుంచి ఆమెని కిందకి తోసేశాడు. దీంతో ఆ అమ్మాయి మరణించింది. మొదట పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రతీక్ ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసు విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ప్రతీక్ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా అతనిని న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: హైదరాబాద్: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
సెంట్రల్ బ్యాంకుకు టోకరా.. మరో భారీ ‘రుణ’ కుంభకోణం
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్న బాగోతాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబుల బండారం బట్టబయలవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శ్రీలక్ష్మి కాట్సిన్తోపాటు ఆ సంస్థ చైర్మన్ కమ్ ఎండీ మాతా ప్రసాద్ అగర్వాల్, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీరు భారీగా రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. ఫలితంగా బ్యాంకుల కన్సార్టియంకు రూ.6,833 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఈ ఏడాది సీబీఐ దర్యాప్తు చేస్తున్న బ్యాంకు ఫ్రాడ్ కేసుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు తాజాగా నోయిడా, రూర్కీ, కాన్పూర్, ఫతేపూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సీబీఐ అధికారులు ‘శ్రీలక్ష్మి కాట్సిన్’ చైర్మన్ మాతా ప్రసాద్ అగర్వాల్తోపాటు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్కుమార్ అగర్వాల్, డైరెక్టర్ శారదా అగర్వాల్, డిప్యూటీ ఎండీ దేవస్ నారాయణ్ గుప్తాను నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే తమ బ్యాంకును మోసగించినట్లు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆరోపించింది. తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారని, ఇలా చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని తేల్చిచెప్పింది. రుణం కోసం తప్పుడు పత్రాలు సమర్పించారని, అబద్ధాలు చెప్పారని పేర్కొంది. వస్త్ర వ్యాపారం చేసే శ్రీలక్ష్మి కాట్సిన్ సంస్థ తమ వద్ద అధికంగా నిల్వలు ఉన్నట్లు బ్యాంకులకు ఫోర్జరీ రికార్డులు సమర్పించింది. రూ.7,926 కోట్లకు పైగా రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా బ్యాంకులను దగా చేసిన హైదరాబాద్కు చెందిన ట్రాన్స్ట్రాయ్(ఇండియా) లిమిటెడ్పై గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రేమ.. పెళ్లి పేరిట ఈ ‘రుచి’ మోసాలు ఇన్నన్నీ కావు
లక్నో: ఆమె ప్రేమిస్తే యువకులు కుటుంబాలను వదిలేసి వచ్చేస్తారు. ఆమె లోకంలో మునిగి తేలుతారు. ఆ యువతి కోసం కుటుంబాలను వదిలేసి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. అందం.. ఆకర్షణీయంగా కనిపించే అమ్మాయి ఇలా యువకులను ప్రేమించి.. పెళ్లాడి.. వారిని దోచేసుకుని మాయమవడం ఆమెకు పరిపాటి. యువకుల వీక్నెస్ను పట్టుకున్న ఆమె నిత్య పెళ్లికూతురిలా మారిపోయింది. పెళ్లి చేసుకున్న యువకుల నుంచి నగదు, ఆభరణాలు.. కుదిరితే ఆస్తులు రాయించుకుని పారిపోతుంది. అలాంటి ఆమెపై ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బాబుపూర్వకు చెందిన అమిత్ శర్మ గోవింద్నగర్లో నివసించే రుచివర్మను ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. గాఢంగా ప్రేమించుకుంటున్న వీరిరువురు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా 2020 జూన్ 4వ తేదీన ఆర్య సమాజ్లో పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు. అప్పుడు కరోనా మొదటి దశ ఉండడంతో ఆ పెళ్లికి ఎవరినీ పిలవలేకపోయారు. వివాహానంతరం వీరిద్దరి కాపురం సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లి నవంబర్ 23వ తేదీన వచ్చి బంధువుల పెళ్లి ఉందని చెప్పి రుచి వర్మను తన వెంట తీసుకెళ్లింది. ఆ సమయంలో రుచి తనతో పాటు రూ.50 వేల నగదు, విలువైన ఆభరణాలు తీసుకెళ్లింది. పెళ్లి కోసం వెళ్లిన తన భార్యకు రోజు ఫోన్ చేస్తుండగా స్విచ్ఛాఫ్ వస్తోంది. వస్తుందని భావించగా కొన్ని రోజులైనా రాకపోవడంతో నేరుగా అత్తింటి వారికి వెళ్లాడు. ‘నిన్ను తీసుకెళ్లడానికి వచ్చా రా’ అని అడగ్గా అతడితో వెళ్లేందుకు భార్య రుచి వర్మ నిరాకరించింది. తల్లి కూడా పంపించేందుకు ససేమిరా చెప్పింది. బిత్తరపోయిన అమిత్ అక్కడ తెలిసిన వారి వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమె నిజ స్వరూపం బయటపడింది. పుట్టింటికి వచ్చిందే మరో వ్యక్తితో పెళ్లి చేసుకునేందుకు వచ్చిందని తెలిసి షాక్ తిన్నాడు. మొదట ఈ విషయాన్ని నమ్మలేదు. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోతో అవాక్కయాడు. దీనిపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడితో పాటు మరొకరిని కూడా రుచి వర్మ పెళ్లి చేసుకుని మోసం చేసిందని తెలుసుకున్నాడు. ఆమె విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమ.. పెళ్లి పేరిట మోసం చేసి అందిన కాడికి దోచుకుని వెళ్తుందని ఆమె నిజస్వరూపం బట్టబయలైంది. ఆమె నిత్య పెళ్లి కూతురిలా తయారు కావడానికి తల్లి సహకరిస్తోందని తెలిసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్నీ చేసినా అమిత్ మాత్రం రుచి వర్మతో కలిసి ఉండాలని ఉందని పోలీసులకు చెప్పాడు. న్యాయం చేయాలని అమిత్ పోలీసులను విజ్ఞప్తి చేశాడు. -
అమ్మేవి చాయ్, సమోసాలు సంపాదన మాత్రం కోట్లు!
సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ లక్షలు అర్జించే వారు కోట్లు వెనకేసుకోవడం మనకి తెలిసిందే. అయితే రోడ్డు పై టీ స్టాల్, సమోసా అమ్మకునే వ్యక్తులు కూడా ఇలా కోట్లు కూడబెడుతున్నారని మీకు తెలుసా. ఈ నమ్మలేని నిజాలు కాన్పూర్లోని జీఎస్టీ, ఆదాయ శాఖ అధికారుల పరిశీలనలో బయటపడ్డాయి. అక్కడ పలు ప్రాంతాల్లో రహదారిపై చాట్, క్రిస్పీ-కచోరి, చాయ్-సమోసా, పాన్ షాపుల వాళ్లలో కొందరు కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంట. ఈ పుట్ పాత్ వ్యాపారులంతా ఆహార భద్రతకు భరోసా ఇచ్చే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ తీసుకోకుండా చాలా సంవత్సరాలుగా ఈ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. కొందరు పేదలుగా కనిపించే ఈ కనపడని కోటీశ్వరులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది వ్యాపారులు మిలీనియర్లుగా బయటకు పడ్డారు. డేటా సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలను పరిశీలించినప్పుడు, ఐటి విభాగం అధికారులు సైతం నివ్వెరపోయారు. వీరిలోని చాలా మంది వద్ద ఖరీదైన కార్లు, ఎకరాల్లో భూములు లాంటివి కోనుగులు చేస్తూ ఆస్తులు భారీగానే కూడబెడుతున్నారని తెలిపారు. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని వెల్లడించారు. హిందూస్థాన్లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ వ్యాపారులు జిఎస్టి రిజిస్ట్రేషన్ వెలుపల ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదట. కాని నాలుగేళ్లలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని వెల్లడించింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో పలు ఆస్తులను కొనుగోలు చేశారని, దక్షిణ కాన్పూర్లో కూడా ఆస్తులు కొన్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు ఈ విషయాలపై పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
Ram Nath Kovind: రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత..మహిళ మృతి
కాన్పూర్(యూపీ): రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్లో ట్రాఫిక్ను నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ మహిళ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. అఖిలభారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం చీఫ్ వందన మిశ్రా(50) ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను కాకాదేవ్లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వారి వాహనం వెళ్తున్న గోవింద్పురీ వంతెన మార్గంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాహన శ్రేణి వెళ్తోంది. ప్రోటోకాల్లో భాగంగా ఆ మార్గంలో ట్రాఫిక్ను పోలీసులు ఆపడంతో భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. అందులో వందన వాహనం చిక్కుకుంది. కాన్వాయ్ వెళ్లాక వందనను ఆస్పత్రికి తరలిలించగా అప్పటికే ఆమె మరణించారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు కారకులంటూ ఒక సబ్–ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అసీమ్ అరుణ్ చెప్పారు. ఘటనపై క్షమాపణలు చెప్పారు. మృతి విషయం తెల్సి రాష్ట్రపతి కోవింద్ ఆవేదన వ్యక్తంచేశారని చెప్పారు. అంత్యక్రియలకు హాజరై రాష్ట్రపతి తరఫున సానుభూతిని పోలీస్ కమిషనర్ తెలిపారు. -
బంగారు మాస్కు ధర 5 లక్షలు..
కాన్పూర్: కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరైంది. ముఖ్యంగా మాస్కుల పుణ్యమాని తోటి మనుషుల ముఖాలు చూడటం అరుదైపోయింది. ఈనేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని మనోజ్ సెనగర్ అనే వ్యక్తి బంగారు మాస్కుతో వార్తల్లో నిలిచాడు. కాన్పూర్లో నివాసం ఉండే ఇతడికి బంగారం అంటే మక్కువట. ఇక రూ.5 లక్షల విలువైన బంగారంతో తయారు చేసిన ఈ మాస్కులో శానిటైజర్ వ్యవస్థ ఉండడం విశేషం. దీంతో ఈ బంగారు మాస్కును మరే విధంగానూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన శానిటైజేషన్ వ్యవస్థ వల్ల దీనిని దాదాపు ఇది 36 నెలల వరకు వినియోగించవచ్చని సెనగర్ తెలిపాడు. ఇక ఈ మాస్కుకు శివ శరణ్ అని పేరు కూడా పెట్టారు. మెడలో బంగారు గొలుసులు వేసుకుని తిరిగే సెనగర్ను అక్కవి స్థానికులు బప్పీ లాహరి, గోల్డెన్ బాబా అని పిలుస్తుంటారు. పేరుకు తగ్గట్టే ఏకంగా 5 లక్షల విలువైన బంగారు మాస్కుతో ఆయన మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. అతని వద్దనున్న రివాల్వర్కు బంగారు కవర్, మూడు బంగారు బెల్టులు ఉన్నాయి. ఇంత విలువైన సొత్తును దొంగలు, శత్రువులను నుంచి కాపాడుకోవడానికి ఇద్దరు బాడీగార్డులను నియమించుకున్నాడు. చదవండి: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్పై ఈసీ అనర్హత వేటు -
పెళ్లైన 2 నెలలకు భార్య మహిళ కాదని తెలిసింది..
లక్నో: ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ వ్యక్తికి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి మహిళ కాదు.. ఓ ట్రాన్స్జెండర్ అని తెలిసి కుప్పకూలాడు. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది ఏప్రిల్ 28న వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్య అతడికి దూరంగా ఉండసాగింది. ఎన్ని సార్లు దగ్గరవుదామని ప్రయత్నించినా.. ఏదో ఓ కారణం చెప్పి అతడిని దూరం పెట్టసాగింది. గట్టిగా అడిగితే.. ఆరోగ్యం బాగాలేదని తెలిపేది. పెళ్లై రెండు నెలలు గడుస్తున్నా.. భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సదరు వ్యక్తిలో అనుమానం మొదలయ్యింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా షాకింగ్ విషయం తెలిసింది. సదరు వ్యక్తి భార్య అసలు మహిళే కాదని.. ట్రాన్స్జెండర్ అని తెలిపారు వైద్యులు. మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చదవండి: మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’ -
యూపీలో ఘోర ప్రమాదం
-
ఫొటో షేర్ చేసి చిక్కుల్లో పడ్డ కుల్దీప్ యాదవ్!
లక్నో: టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తీరుపై కాన్పూర్ జిల్లా యంత్రాంగం అసహనం వ్యక్తం చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండానే గెస్ట్హౌజ్లో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న అతడి వ్యవహారశైలిని తప్పుబట్టింది. కాగా 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్, స్థానిక గోవింద్నగర్లోని జగదీశ్వర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్ నగర్ నిగం అతిథి గృహంలోనే టీకా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను కుల్దీప్ ట్విటర్లో షేర్ చేశాడు. కోవిడ్పై పోరులో అంతా ఒక్కటి కావాలని, అవకాశం ఉన్నవాళ్లు త్వరితగతిన టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ పోస్టు కాన్పూర్ జిల్లా అధికారుల కంటపడింది. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కుల్దీప్ వ్యవహరించిన తీరుపై వారు విస్మయానికి గురయ్యారు. ఇక ఈ విషయంపై స్పందించిన కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ తివారి విచారణకు ఆదేశించారు. ఎవరి అనుమతితో గెస్ట్హౌజ్లో కుల్దీప్ వ్యాక్సిన్ వేసుకున్నాడనే అంశంపై ఆరా తీస్తున్నారు. కాగా ఐపీఎల్-2021 వాయిదా పడటంతో కుల్దీప్ యాదవ్ ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాదవ్ -
బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడికి యత్నం..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై సోమవారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బాంబు దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్నపోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సురేంద్ర మిథాని గోవింద్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కన్పూర్లోని పండునగర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్కు చెందిన వారని పోలీసులు విచారణలో గుర్తించారు. ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్ పోలీస్ అవుట్పోస్ట్ ఇన్చార్జ్ ఆనంద్ ప్రకాశ్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే సురేంద్ర మిథాని.. తన వ్యక్తిగత సిబ్బందిని అభినందించారు. అదే విధంగా ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. (చదవండి:కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి) -
కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి
లక్నో: తన కుమార్తెతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి కుమార్తె ఉండడాన్ని చూసిన ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి వారిని హత్య చేసి తలుపు పెట్టి బయటకు వచ్చాడు. తన కుమారుడు అదృశ్యమయ్యాడని బాలుడి తండ్రి ఫిర్యాదు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు బయటకు వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ట్రక్ డ్రైవర్ కుమార్తె ఓ బాలుడిని ప్రేమిస్తుంది. వారి ఇంట్లో వాళ్లు శనివారం వేరే గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడు వెంటనే అమ్మాయి ఇంట్లోకి దూరిపోయి గడియ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ యువతి బంధువు ఇంటికి బయట నుంచి తలుపేశాడు. ఈ విషయాన్ని ఆ యువతి తండ్రికి సమాచారం అందించాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదని ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం బాలుడు ఎక్కడ ఉన్నాడో ఒకరు సమాచారం ఇవ్వడంతో తండ్రికి అక్కడకు వెళ్లాడు. తలుపు తీసి చూడగానే బాలిక బాలుడు రక్తపు మడుగులో కనిపించాడు. బాలిక తండ్రి గొడ్డలితో కూతురితో పాటు ఆ బాలుడిని హత్య చేశాడు. ఈ ఘటనతో ఊరి జనమంతా షాక్ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తండ్రిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. చదవండి: లాక్డౌన్ ఉల్లంఘన: 2 వేల బైక్లు సీజ్ -
కరోనా విలయ తాండవం.. కాన్పూర్లో మరణ మృదంగం
-
భార్యతో వాదించలేక నాలుక కోసుకున్న భర్త
లక్నో: తరచూ భార్యతో గొడవ.. ఇంటికొస్తే చాలు రోజు పేచీనే. దీంతో ఆమె తీరుతో విసుగు చెందాడు. అయినా కూడా ఆ భర్త పుట్టింటికి వెళ్లిన భార్యను పిలిచి కలిసి ఉందామని ప్రేమగా కోరాడు. కానీ ఆమె వినిపించుకోకుండా మళ్లీ గొడవకు దిగింది. ఆమెతో వాదించడమే వేస్ట్.. అని భావించి ఇక ఆమెతో వాదన దిగకుండా ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు ఆ భర్త. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాన్పూర్ జిల్లా గోపాల్పూర్ గ్రామంలో నిషా, ముకేశ్ భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే భార్య కొన్ని రోజులుగా భర్తతో గొడవపడుతోంది. దీంతో విబేధించి కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం భార్యకు ఫోన్ చేసి ముకేశ్ పిలుపించుకున్నాడు. వచ్చాక మళ్లీ కలిసి జీవించుదామని కోరాడు. అయితే ఆమె అప్పుడు కూడా గొడవ పెట్టుకుంది. దీంతో అతడు విసుగు చెంది వెంటనే బ్లేడ్తో నాలుక కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు లబోదిబోమన్నాడు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని కాన్పూర్లోని పెద్దాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. చదవండి: అమ్మ, అక్కను చితకబాదిన యువకుడు -
ప్రాణం తీసిన డ్రాయర్ గొడవ
కాన్పూర్: లోదుస్తువు (అండర్వేర్) దొంగలించి సరదాగా వేసుకుని మిత్రుడిని ఆటపట్టిద్దామని భావించగా అది కాస్త అతడి ప్రాణం మీదకు వచ్చింది. అండర్వేర్ వేసుకున్నాడనే కోపంతో గొడవ జరిగి చివరకు ఆ యువకుడి హత్యకు దారి తీసింది. సరదాగా జరిగిన వాగ్వాదం కాస్త చివరకు కత్తితో పొడుచుకునే వరకు వెళ్లింది. క్షణికావేశంలో జరిగిన ఆ వాగ్వాదంలో ఓ యువకుడి ప్రాణం పోయి స్థాయికి చేరింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాన్పూర్ దేహక్ జిల్లాలోని ఓ పారిశ్రామిక వాడలో అజయ్ కుమార్, వివేక్ శుక్లా ఒకే గదిలో ఉంటున్నారు.సరదాగా అజయ్ను ఆట పట్టిద్దామనే ఉద్దేశంతో వివేక్ అతడి అండర్వేర్ దొంగతనం చేశాడు. అయితే గదిలో అండర్వేర్ కోసం వెతకగా అజయ్కు కనిపించలేదు. దీంతో వివేక్ను అడగ్గా.. తాను వేసుకున్నానని వివేక్ సరదాగా ఆట పట్టించాడు. అయితే అజయ్ కోపంతో అతడితో వాగ్వాదం చేశాడు. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన అజయ్ క్షణికావేశంలో కూరగాయలు కోసే కత్తితో వివేక్ను పొడిచాడు. పలుసార్లు పొడవడంతో వివేక్ తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళన చెందిన అజయ్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు లాలా లజపతిరాయ్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
‘పాకిస్తాన్ వెళ్లి పెద్ద తప్పు చేశాను’
లక్నో: 28 ఏళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లి.. గూఢచర్యం ఆరోపణల కింద దాదాపు 8 ఏళ్ల పాటు కరాచీ జైల్లో గడిపి భారత్కు తిరిగి వచ్చిన వ్యక్తికి స్థానికులు, పోలీసులు పూల మాలలతో స్వాగతం పలికారు. స్వదేశంలో తనకు లభించిన ఆత్మీయత, ఆదరణ చూసి ఆ వ్యక్తి ఏకధాటిగా కన్నీరు కార్చాడు. అనవసరంగా పాకిస్తాన్ వెళ్లాను. వారు మనల్ని శత్రువులుగా చూస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. కాన్పూర్కు చెందిన షంసుద్దీన్(70) 1992లో 90 రోజుల వీసా మీద పాకిస్తాన్ వెళ్లాడు. ఆ తర్వాత 1994లో పాక్ పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లు బాగానే గడిచింది. ఆ తర్వాత 2012లో గూఢచర్యం ఆరోపణలపై పాక్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి కరాచీ జైలులో ఉంచారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది అక్టోబర్ 26న విడుదల అయ్యాడు. అత్తారీ-వాగా సరిహద్దు ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అమృత్సర్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నాడు. అనంతరం నగరంలోని బజారియా పోలీస్స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ తిర్పురారీ పాండే, షంసుద్దీన్కు పూల మాలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు అతన్ని కంఘి-మోహల్లోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన రాక కోసం ప్రజలు అక్కడ గుమిగూడారు. జనం అతనిని చుట్టుముట్టి పూల మాలలు వేసి కౌగిలించుకున్నారు. దశాబ్దాల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చినందుకు ఆయనను అభినందించారు. దాదాపు 28 ఏళ్ల పాటు సొంత దేశానికి, పుట్టిన వారికి, ఇంటికి దూరంగా ఉన్న షంసుద్దీన్ స్వస్థలం చేరుకోగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆత్మీయులను చూసి ఆనందంతో ఏడ్చేశాడు. (చదవండి: మాజీ సైంటిస్ట్కు 1.3 కోట్ల పరిహారం) అనంతరం షంసుద్దీన్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్లో భారతీయులను చాలా నీచంగా చూస్తారు’ అని మీడియాతో తెలిపాడు. "వారు మనల్ని శత్రువుల్లా చూస్తారు. పాకిస్తాన్లో లంచం, అవినీతి భారీ ఎత్తున ఉంది" అన్నారు. అంతేకాక పాక్ వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను. అక్కడే చనిపోతానేమో అనుకున్నాను. కానీ అదృష్టం బాగుండి బతికుండగానే నా వారి దగ్గరకు వచ్చాను అని కన్నీటి పర్యంతమయ్యాడు. -
ట్రోలింగ్: యూపీ పోలీసుల బిత్తిరి చర్య
కాన్పూర్ : మాస్క్ ధరించలేదన్న కారణంతో పోలీసులు ఓ మేకను అరెస్ట్ చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బెకన్గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోడ్డుపై మేకను తీసుకెళ్తున్న దాని యజమానిని పోలీసులు అడ్డగించి.. మేకకు మాస్కు పెట్టలేదేంటని ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు బిత్తరపోయిన మేక యజమాని భయంతో మేకను అక్కడే వదిలేసి అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు దానిని స్టేషన్కు తరలించారు. కాసేపయ్యాక యజమాని వచ్చి మేక కనపించలేదు. దాంతో అతను పోలీస్స్టేషన్ వెళ్లక తప్పలేదు. మాస్కు లేకపోవడంతో మేకన అరెస్టు చేశామని పోలీసులు చెప్పడంతో అతను షాక్ తిన్నాడు. ఎలాగోలా పోలీసులు బతిమాలుకుని మేకను విడిపించుకున్నాడు. అయితే, మాస్క్ ధరించకపోతే మేకను అరెస్ట్ చేయడమేంటని పోలీసులన అడగ్గా.. వారు తమ చర్యను సమర్థించుకున్నారు. కుక్కలకు కూడా మాస్కులు పెడుతున్నప్పుడు మరి మేకలకు కూడా మాస్కులు ఎందుకు ఉండకూడదంటూ ఎదురు ప్రశ్నించారు. ఇంకెప్పుడూ మేకను రోడ్డుపైకి తీసుకురానని యజమాని పోలీసులకు తెలిపాడు. రోడ్డుపైకి రావాల్సి వచ్చినా మాస్కు పెడతానని చెప్పాడు. పోలీసుల బిత్తిరి చర్యపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. (గ్రామస్తుల త్యాగంతో పిచ్చుక, పిల్లలు క్షేమం) -
హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో కలకలం సృష్టించిన ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ సంజీత్ యాదవ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసు డిపార్ట్మెంట్ నలుగురిని సస్పెండ్ చేసింది. వీరిలో ఐపీఎస్ అధికారి అపర్ణ గుప్తా కూడా ఉన్నారు. సంజీత్ యాదవ్ను గత నెల 22న కిడ్నాప్ చేసి రూ. 30లక్షలు ఇవ్వాల్సిందిగా నిందుతులు అతడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జూలై 13న పోలీసుల సమక్షంలో కిడ్నాపర్లు అడిగిన మొత్తం చెల్లించామని.. అయినా సంజీత్ను వదిలివేయలేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు గురువారం ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో సంజీత్ యాదవ్ను గత నెల 26న చంపి, నదిలో పడేసినట్లు వెల్లడించారు. అయితే సంజీత్ కుటుంబ సభ్యులు మాత్రం ఓ నెల రోజుల నుంచి కిడ్నాపర్లు తమకు ఫోన్ చేస్తున్నారని.. రూ. 30లక్షలు ఇస్తే సంజీత్ని వదిలేస్తామని చెప్పినట్లు తెలిపారు. (‘హత్య చేసి నదిలో పడేశారు’) ఈ క్రమంలో ఏరియా ఇన్చార్జ్ అపర్ణ గుప్తాను కలిసి కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బును అందించామన్నారు. అంతేకాక డబ్బు సంచిన ఓ రైల్వేట్రాక్పై పడేశామని చెప్పారు. కానీ పోలీసులు కిడ్నాపర్లకు డబ్బు ముట్ట చెప్పి.. వారికి పారిపోయే అవకాశం ఇచ్చారని సంజీత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇంతవరకు సంజీత్ మృతదేహాన్ని కూడా కనుక్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదన ఇలా ఉండగా పోలీసులు మాత్రం ఆ సంచిలో డబ్బు లేదని వెల్లడించారు. అంతేకాక సంజీత్ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు అపర్ణ గుప్తాతో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. అంతేకాక ‘సంజీత్ కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు డబ్బు చెల్లించామని చెబుతున్నారు. కానీ ఇంతవరకు జరిగిన దర్యాప్తులో డబ్బు చెల్లించినట్లు తెలియలేదు. ఏది ఏమైనా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. డబ్బు చెల్లించినట్లు తెలిస్తే.. వారికి అందజేస్తాం. ఈ కేసుతో మా డిపార్ట్మెంట్ అధికారులకు సంబంధం ఉన్నట్లు తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు) -
22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..
లక్నో: కరుడుగట్టిన నేరస్తుడు, పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన వికాస్ దుబే కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసు దళంపై వికాస్, అతని అనుచరులు ఈ నెల రెండో తేదీ రాత్రి కాల్పులకు దిగి పరారైన సంగతి తెలిసిందే. సరిగ్గా 22 ఏళ్ల క్రితం కూడా వికాస్ ఇదే తరహాలో తప్పించుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. అప్పుడు వికాస్ బిక్రూ గ్రామానికి సర్పంచ్గా ఉన్నాడు. హత్యాయత్నం అభియోగాలపై వికాస్ను అరెస్టు చేసేందుకు వెల్లిన పోలీసులను అతని కుటుంబ సభ్యులు, అనుచరులు రోడ్డు తవ్వేసి అడ్డుకున్నారు. మారణాయుధాలతో దాడికి దిగారు. అయితే, సంఖ్యా పరంగా కొద్దిమందే ఉండటంతో పోలీసులు వెనుదిరిగారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత జులై 2 వ తేదీ రాత్రి అలాంటి ఘటనే పునరావృతమైంది. కాకపోతే ఈసారి ఎనిమిది మంది పోలీసులు అమరులు కాగా, అదే వికాస్ చావుకు ముహూర్తం పెట్టింది. హత్యాయత్నం ఆరోపణలపై వికాస్ గ్యాంగ్ను అదుపులోకి పోలీసులు వెళ్లగా.. బుల్డోజర్లతో రోడ్డును ధ్వంసం చేసి అడ్డుకున్నారు. భవనంపైనుంచి పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దాంతో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత పోలీసుల ఎన్కౌంటర్లో వికాస్ హతమయ్యాడు. (చదవండి: నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్రెడ్డి) మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అతను పట్టుబడగా.. పోలీసులు కాన్పూర్కు తీసుకెళ్తుండగా వారి వాహనం బోల్తా పడింది. ఇదే అదనుగా వికాస్ తప్పించుకునే యత్నం చేశాడు. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో బుల్లెట్ గాయాలతో నేరగాడు మృత్యువాతపడ్డాడు. దుబే అనుచురుల్లో మరో ఐదురుగు కూడా పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. ఇదిలాఉండగా.. వికాస్ అనుచరుడు జయ్కాంత్ వాజ్పేయి, అతని మిత్రుడు ప్రశాంత్ శుక్లాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. (దుబే ఎన్కౌంటర్ : తీవ్ర రక్తస్రావం, షాక్తో మృతి) -
వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!
లక్నో : గ్యాంగ్స్టర్ వికాస్దూబే మరో అనుచరుడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కన్పూర్లో పోలీసులపై దాడికి తెగబడ్డ కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబే సహాయకుడు శశికాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శశికాంత్తో సహా ఇప్పటి వరకు నలుగురిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై పోలీస్ అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ. ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులు భాగస్వాయ్యం అయినట్లు వెల్లడించారు. వీరిలో నలుగురిని అరెస్టు చేయగా వికాస్ దూబేతో సహా ఆరుగురు నిందితులను వివిధ ఘటనల్లో పోలీసుల విచారణలో మరణించినట్లు పేర్కొన్నారు. మిగతా 11 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. (గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అరెస్ట్) అలాగే కాన్పూర్ ఆకస్మిక దాడిలో యూపీ పోలీసుల నుంచి నేరస్తులు ఎత్తుకెళ్లిన రెండు రైఫిల్స్ను కూడా శశికాంత్ అరెస్ట్ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై దాడి ఘటన అనంతరం పోలీసుల నుంచి నేరస్తుల ముఠా దోచుకున్న అన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈనెల 3న వికాస్దూబే అనుచరులు కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే. పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎనిమిది మంది మరణానికి కారణమైన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే గత శుక్రవారం పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. (రౌడీషీటర్ల కాల్పులు.. 8 మంది పోలీసుల మృతి) చదవండి : గ్యాంగ్స్టర్ దుబే హతం -
వికాస్ దుబే వెనుకున్న వారెవరు?
కాన్పూర్: ఎన్నో నేరాలకు పాల్పడటమే కాక ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబేని శుక్రవారం ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పుడు కాస్తా ప్రశాంతంగా ఉందని తెలిపారు. వికాస్ దుబే చేతిలో హత్యకు గురయిన జితేందర్ పాల్ సింగ్ తండ్రి తీర్థ్ పాల్ మీడియాతో మాట్లాడారు. కొడుకు పోయిన బాధలో ఉన్న తనకు దూబే ఎన్కౌంటర్ వార్త కాస్తా ఊరటనిచ్చింది అన్నారు. ‘ఉత్తరప్రదేశ్ పోలీసులను చూస్తే.. చాలా గర్వంగా ఉంది. వారు చేసిన పనులు నాకు కాస్తా ఓదార్పునిచ్చాయి. యోగి ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. (రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం) మరణించిన ఎస్సై నెబ్యులాల్ బింద్ తండ్రి కలికా ప్రసాద్ బింద్ మాట్లాడుతూ.. ‘వికాస్ దుబేని హతమార్చారనే వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. ఇకపోతే వికాస్ దుబేకి సాయం చేసిన డిపార్టుమెంట్ వ్యక్తులకు కూడా కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మరణించిన సుల్తాన్ సింగ్ భార్య షర్మిలా వర్మ దుబే మృతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. కానీ అతడి వెనక ఉన్న వారి గురించి మనకు ఎలా తెలుస్తుంది’ అన్నారు.(ఒక్కసారిగా కుప్పకూలిన నేర సామ్రాజ్యం!) ఉజ్జయిన్లో పోలీసుల చేతికి చిక్కిన వికాస్ దుబేను కాన్పూర్ తీసుకువస్తుండగా పోలీసుల వాహనం రోడ్డు మీద బోల్తా పడింది. ఇదే అదునుగా భావించి వికాస్ దుబే పోలీసులను గాయపర్చి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిని ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. -
రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం
లక్నో: గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్పై అతని భార్య రిచా దుబే స్పందించారు. పోలీసులపై మారణకాండకు పాల్పడ్డ వికాస్ ఇలాంటి చావుకు అర్హుడే అని ఆమె వ్యాఖ్యానించారు. కాన్పూర్లోని భైరోఘాట్లో వికాస్ దుబే అంత్యక్రియల్లో రిచా పాల్గొన్నారు. ఆమె వెంట కుమారుడు, తన తమ్ముడు దినేష్ తివారీ ఉన్నారు. దుబే మృతదేహానికి ఎలక్ట్రిక్ క్రిమేషన్ మెషీన్లో.. అతని బావమరిది దినేష్ తివారీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈక్రమంలో వికాస్ ఎన్కౌంటర్ కావడంపై స్పందించాలనే వార్తా రిపోర్టర్లపై ఆమె మండిపడ్డారు. వికాస్ చాలా పెద్ద తప్పు చేశాడని, అతనికి చావు ఇలా రాసి పెట్టి ఉందని రిచా చెప్పారు. మీవల్లే వికాస్కు ఈ గతి పట్టిందని, దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆమె రిపోర్టర్లకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అరెస్ట్) రూరల్ ఎస్పీ బ్రిజేష్ శ్రీవాత్సవ సమక్షంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ వికాస్ అంత్యక్రియలు జరిగాయి. కాగా, శుక్రవారం ఉదయం వికాస్ దుబే పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. అతన్ని ఉజ్జయినిలో పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసలు కాన్పూర్కు తరలిస్తుండగా వారి వాహనం బోల్తా పడింది. అదే అదనుగా భావించి దుబే తప్పిచుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో పోలీసులకు అతనికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కాల్పుల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది కూడా గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. (ఒక్కసారిగా కుప్పకూలిన నేర సామ్రాజ్యం!) -
గ్యాంగ్స్టర్ దుబే హతం
-
గ్యాంగ్స్టర్ దుబే హతం
కాన్పూర్: పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, డీఎస్పీ సహా ఎనిమిది మంది మరణానికి కారణమైన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే శుక్రవారం పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో గురువారం అరెస్ట్ అయిన తరువాత, దుబేను అక్కడి నుంచి యూపీలోని కాన్పూర్కు తీసుకువస్తుండగా, శుక్రవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ శివార్లలోని భావుంటి వద్ద హైవేపై జనçపసంచారం లేని చోట దుబేను తీసుకువస్తున్న కారు బోల్తా పడింది. ఇదే అదనుగా ప్రమాదంలో గాయపడిన పోలీసు నుంచి పిస్టల్ను లాక్కొని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆ క్రమంలో తనను అడ్డుకున్న పోలీసులపై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. కారు బోల్తాపడిన ఘటనలో, తదనంతర ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్కు చెందిన ఇద్దరు సహా 8 మంది పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ‘ప్రమాదం అనంతరం ఒక పోలీసు నుంచి తుపాకీ లాక్కుని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆయనను చుట్టుముట్టిన పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించారు. ఆ మాటలను వినకుండా, పోలీసులపై.. వారిని చంపే ఉద్దేశంతో దుబే కాల్పులు జరపడం ప్రారంభించాడు. దాంతో, స్వీయ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు’ అని వివరించారు. గాయపడిన దుబేను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు ఒక పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే దుబే చనిపోయాడని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్బీ కమల్ మీడియాకు తెలపడం గమనార్హం. ఆయన మృతదేహంపై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయని, మూడు ఛాతీ భాగంలో, ఒకటి చేతిపై ఉందని వివరించారు. పోలీసుల్లో ఒకరికి భుజంపై, మరొకరికి చేతిపై బుల్లెట్ గాయాలున్నాయన్నారు. దుబేకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా నెగెటివ్గా ఫలితం వచ్చిందని చెప్పారు. మొత్తం ఆరుగురి ఎన్కౌంటర్ 8 మంది పోలీసుల మృతికి కారణమైన కాన్పూర్ కాల్పుల ఘటనలో ఇప్పటివరకు ప్రధాన నిందితుడైన వికాస్ దుబే సహా మొత్తం ఆరుగురు వేర్వేరుగా జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లలోనే హతమవడం గమనార్హం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ పట్టణం లోని మహాకాళేశ్వరుడి ఆలయానికి గురువారం దుబే వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అక్కడే అరెస్ట్ చేసి అనంతరం, యూపీ పోలీసులకు అప్పగించారు. అక్కడి నంచి దుబేను కాన్పూర్కు తీసుకువస్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొద్ది గంటల ముందే సుప్రీంలో కేసు వికాస్ దుబే ఎన్కౌంటర్ జరగడానికి కొన్ని గంటల ముందే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దు బేను ఎన్కౌంటర్లో హతమార్చే అవకాశముందని, అలా జరగకుండా అడ్డుకోవాలని కోరుతూ ఓ లాయర్ పిటిషన్ వేశారు. చాప్టర్ క్లోజ్ యూపీ సివిల్ డిఫెన్స్ ఐజీ అమితాబ్ ఠాకూర్ ఈ ఎన్కౌంటర్ను ముందే ఊహించారు. ‘వికాస్ దుబే లొంగిపోయాడు. రేపు ఉదయం ఆయన పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది.ఆ క్రమంలో పోలీసుల చేతిలో చనిపోయే అవకాశం కూడా ఉంది. దుబే చాప్టర్ క్లోజ్ అవుతుంది’ అని గురువారం ట్వీట్ చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలి గతవారం పోలీసు బృందంపై వికాస్ దుబే జరిపిన కాల్పుల ఘటన నుంచి నేటి దుబే ఎన్కౌంటర్ వరకు అన్ని ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరపాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. ‘నేరస్తులు చనిపోయారు. కానీ ఇన్నాళ్లు వారిని కాపాడిన వారినేం చేస్తారు?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్నించారు. మొత్తం ఘటనకు సంబంధించి వాస్తవాలు బయటకురావాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్ డిమాండ్ చేశారు. 30 ఏళ్ల నేర చరిత్ర యూపీలో కరడు గట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే(56)కు 30 ఏళ్ల నేర చరిత్ర ఉంది. మొత్తం అతనిపై 62 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 5 హత్యలు, మరో ఎనిమిది హత్యాయత్నం కేసులు. వారం క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం అతని తలపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. 1990లో కాన్పూర్లో ఒకరిపై దాడి చేసిన కేసులో వికాస్ దుబే పేరు తొలిసారిగా వినిపించింది. ఆ తర్వాత రెండేళ్లకి కాన్పూర్ శివాలి పోలీస్స్టేషన్ ప్రాంతంలో దళిత యువకుడి హత్య కేసులో అతను నిందితుడు. ఈ ఘటన తర్వాత ఒక ముఠాను ఏర్పాటు చే సుకొని డాన్గా ఎదిగాడు. దోపిడీలు, దొంగతనాలు చేస్తూ రాజకీయాల్ని వాడుకున్నాడు. 1995–96లో బీఎస్పీలో చేరాడు. పోలీసు శాఖలో అతనికి సన్నిహితులు ఎక్కువ. ఎప్పుడైనా ప్రభుత్వం అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే వికాస్ దుబేకి ఉప్పందిపోయేది. అలా తన చుట్టూ పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బీజేపీ నేత శుక్లా హత్యతో సంచలనం 2001లో ఆనాటి యూపీ సర్కార్లో సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ నేత సంతోశ్ శుక్లాను పట్టపగలు అందరూ చూస్తుండగా పోలీస్స్టేషన్లోనే చంపడంతో వికాస్ దుబే పేరు వింటేనే అందరిలోనూ వణుకుపుట్టింది. ఆరు నెలల అనంతరం అతను లొంగిపోయాడు. కానీ, కేసు విచారణ సమయంలో పోలీసులే సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో 2005లో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సన్నాహాలు వికాస్ సొంతూరు బిక్రులో గత 15 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. వికాస్ దుబే ఎవరి పేరు చెబితే అతనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే కావాలని కలలుగన్నాడు. ఎలాగైనా చట్టసభల్లోకి వెళ్లడమే లక్ష్యమని పలుమార్లు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాడు. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున కాన్పూర్ జిల్లా రణియా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తూనే బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నించాడు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు అతని ప్రయత్నాలను సాగనీయలేదని తెలుస్తోంది. పోలీసుల అదుపులో భార్య, కుమారుడు వికాస్ దుబే తల్లిదండ్రులు రామ్కుమార్ దుబే, సరళాదేవి. తల్లి సరళాదేవి చాలా సంవత్సరాలుగా వికాస్ దుబేని దూరం పెట్టారు. తన చిన్న కుమారుడు దీపూతో కలిసి ఉంటున్నారు. వికాస్ పట్టుబడితే కాల్చి చంపేయమని బహిరంగంగానే చెప్పారు. వికాస్ దుబే భార్య రిచా స్థానిక రాజకీయాల్లో ఉన్నారు. ఘిమవూ పంచాయతీ సభ్యురాలిగా నెగ్గారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆకాశ్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రెండో కుమారుడు షాను లక్నోలో తల్లితో కలిసి ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. వికాస్ భార్య, రెండో కొడుకు, వారింట్లో పనివాడిని పోలీసులు ఇప్పటికే నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది మంది పోలీసుల్ని చంపడానికి చేసిన కుట్రలో రిచా హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్కౌంటర్పై అనుమానాలు ఈ ఎన్కౌంటర్పై పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఉజ్జయిన్లో అరెస్ట్ చేసే సమయంలో ఎలాంటి ప్రతిఘటన చూపని దుబే, ఆ తరువాత కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడని ప్రశ్నించారు. దుబేను తీసుకువెళ్తున్న పోలీస్ కాన్వాయ్ను ఫాలో అవుతున్న మీడియా వాహనాలను ఒక దగ్గర నిలిపేశారని, అక్కడికి కొద్ది దూరంలో, కాసేపటికే ఎన్కౌంటర్ జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఉజ్జయిన్ నుంచి బయల్దేరిన సమయంలో ప్రమాదం జరిగిన వాహనంలో కాకుండా, వేరే వాహనంలో దుబే కూర్చుని ఉన్న వీడియో క్లిప్పింగ్లు కూడా వైరల్ అయ్యాయి. ఈ అనుమానాలను యూపీ పోలీసులు కొట్టివేశారు. చెక్ చేయడం కోసమే మీడియాను ఆపి ఉండొచ్చని పేర్కొన్నారు. బిక్రు గ్రామంలో పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఇప్పటివరకు 21 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఆరుగురు ఎన్కౌంటర్లలో చనిపోయారని ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. -
‘వికాస్ దూబే పోతే.. మరో 10 మంది వస్తారు’
లక్నో: ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వికాస్ దూబే చేతిలో హతమైన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా కుటుంబ సభ్యులు దీనిపై స్పందించారు. ‘వికాస్ దూబేను చంపేశారు.. మరి అతడికి సాయం చేసిన వారి సంగతి ఏంటి.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు’ అని దేవేంద్ర మిశ్రా బందువు ఒకరు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను భావిస్తున్న ఏకైక న్యాయం ఏమిటంటే, ప్రస్తుతం దేవేంద్ర మిశ్రా హంతకుడు సజీవంగా లేడు అనే కారణంతో మా కుటుంబ సభ్యునికి నిర్వహించాల్సిన ఆచారాలను జరపొచ్చు. అయితే మన సమాజంలో ఒక జబ్బు ఉంది. అది ఎప్పటికి అలానే ఉంటుంది. అది ఏంటంటే వికాస్ దూబేకు సాయం చేసిన వారు బాగానే ఉన్నారు. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక వికాస్ దూబే పోతే.. అతడి స్థానంలోకి మరో పది మంది వస్తారు. దీనికి ముగింపు ఎప్పుడు’ అని ఆయన ప్రశ్నించారు.(దూబే హతం: ‘మాకు పండుగ రోజే’) అంతేకాక ‘వికాస్ దూబే కేసును ఇలా ముగించడం కరెక్ట్ కాదు. ఎన్నికల్లో అతడి సాయం తీసుకున్న రాజకీయ నాయకుల మాటేంటి. దూబే లాంటి ఒక నేరస్తుడు పోలీస్ స్టేషన్లోనే ఒకరిని చంపి.. బయటకు వెళ్లగల్గుతున్నాడంటే దానికి కారణం ఎవరు. దీని మూలలా వరకు వెళ్లి పరిశీలించాలి. దూబే బతికి ఉంటే.. కనీసం కొంతమంది వైట్ కాలర్ నేరస్తుల గురించి అయినా తెలిసేది. వికాస్ దూబే కేసుకు ఇది సరైన ముగింపు కాదని నా అభిప్రాయం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అన్నాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినలో గురువారం పట్టుబడ్డ వికాస్ దూబేను ఈ రోజు కాన్పూర్కు తరలిస్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనం రోడ్డు మీద అదుపు తప్పి బోల్తా పడింది. ఇదే అదునుగా భావించిన వికాస్ గుప్తా.. పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిని ఎన్కౌంటర్ చేశారు. -
‘తుపాకుల మోత.. ఇక్కడ నుంచి వెళ్లిపోండి’
లక్నో: ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసులను కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్లో హతమయిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్కు తరలించేందుకు తీసుకెళ్లారు. అయితే మరో గంటలో కాన్పూర్ చేరతామనగా.. వికాస్ దూబేను తీసుకెళ్తున్న వాహనం భారీ వర్షం కారణంగా హైవే మీద బోల్తా పడింది. ఈ క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన వికాస్ దూబేను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ క్రమంలో హైవే మీద వెళ్తున్న కొందరు ప్రయాణికులు దీని గురించి మాట్లాడుతూ.. అక్కడ మాకు తుపాకులు పేలిన శబ్దం వినిపించింది. అక్కడికి వెళ్లి చూడాలని ప్రయత్నించాం కానీ పోలీసులు మమ్మల్ని వెనక్కి పంపిచారు అని ఆశిష్ పాశ్వన్ అనే వ్యక్తి తెలియజేశాడు. ఆ తర్వాత కాసేపటికి ప్రైవేట్ వెహికల్లో అందరు ఆస్పత్రికి వెళ్లారని తెలిపాడు. ఇదిలా ఉండగా వికాస్ దూబే ఎన్కౌంటర్పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతడిని విచారిస్తే.. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే యోగి ప్రభుత్వం వికాస్ దూబేని ఎన్కౌంటర్ చేసిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. (అచ్చం అందులో ఉన్నట్లే దూబే హతం!) -
దూబే హతం: ‘మాకు పండుగ రోజే’
లక్నో : గ్యాంగ్స్టర్ వికాస్ దూబే మరణ వార్తను విన్న ఆయన స్వస్థలం కాన్పూర్కు సమీపంలోని బిక్రూ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వికాస్ దూబే అరాచకాలకు ఇప్పటికి తెరపడిందని వారు సంబరపడుతున్నారు. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గ్యాంగ్స్టర్ పోలీసుల చేతిలో మరణించాడని తెలుసుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామంలో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను గ్యాంగ్స్టర్ దూబే, ఆయన సహచరులు పొట్టనపెట్టుకోవడాన్ని గ్రామస్తులు, సైనికులు గుర్తుచేసుకున్నారు. దూబే అరాచకాలకు తామంతా బాధితులమేనని స్ధానికులు, ఇరుగుపొరుగు వారు వాపోయారు. గతంలో గ్యాంగ్స్టర్ వేధింపులపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని 2013లో ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎలాంటి ఫలితం లేదని స్ధానికులు చెప్పుకొచ్చారు. (వికాస్ దూబే ఎన్కౌంటర్: అనేక అనుమానాలు!) వికాస్ దూబే నేరసామ్రాజ్యం బలహీనపడటం తాము ఎన్నడూ చూడలేదని.. పలువురు రాజకీయ నేతలు ఆయనకు సహకరించేవారని గుర్తుచేసుకున్నారు. ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే దూబేకు రాఖీ కట్టి ఆయన తనకు సోదరుడని చెప్పుకున్నారని తెలిపారు. దూబే చిన్నపాటి విషయాలకే తమ తండ్రులు, బంధువులను దారుణంగా కొట్టేవారని, గ్యాంగ్స్టర్ ఆయన మనుషులు తమ వీధి వెంట వెళ్లే సమయంలో తాము తలపైకి ఎత్తరాదని, వారికి నమస్తేలు పెట్టడం తప్పనిసరని స్ధానికులు చెప్పుకొచ్చారు. గ్యాంగ్స్టర్ పీడ విరగడైన ఈ రోజు తమకు పండుగ రోజు కంటే తక్కువేమీ కాదని సంతోషం వ్యక్తం చేశారు.చివరికి అరాచక శకం ముగిసిందని, భగవంతుడు తమ ప్రార్ధనలను విన్నాడని అన్నారు. రౌడీషీడర్పై తాము పోలీసులు, మంత్రులకు ఇచ్చిన ఫిర్యాదులు, వినతిపత్రాల కాపీలను వారు ఓ జాతీయ వెబ్సైట్కు చూపారు. గ్యాంగ్స్టర్ వికాస్ దూబే శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. వికాస్ దూబేపై హత్య కేసులు సహా మొత్తం 60 క్రిమినల్ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. 20 ఏళ్ల కిందట పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేసిన కేసులో వికాస్ దూబే నిందితుడు కాగా ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి గ్యాంగ్స్టర్ బయటపడ్డాడు. చదవండి : గ్యాంగ్స్టర్ వికాస్ దూబే హతం -
‘తనిఖీ లేకుండా 700కిలోమీటర్లు ఎలా వెళ్లాడు’
లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటన తర్వాత పరారీలో ఉన్న వికాస్ దూబే దాదాపు 700కిలోమీటర్లు ప్రయాణించాడు. కారులో రోడ్డు మార్గం ద్వారా హరియాణాలోని ఫరిదాబాద్ చేరుకుని అక్కడ నుంచి రాజస్తాన్ కోటా మీదుగా ఉజ్జయిని ఆలయం చేరుకున్నాడు.(‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’) ఈ క్రమంలో వికాస్ దూబే అరెస్ట్పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ స్పందించారు. ‘ఎలాంటి తనిఖీ లేకుండా వికాస్ దూబే 700 కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. దారుణమైన ఎన్కౌంటర్ తర్వాత యూపీ ప్రభుత్వం వికాస్ దూబే గురించి అప్రమత్తం చేయడంలో విఫలమయ్యింది. అందువల్లే అతను ఉజ్జయిని చేరుకోగలిగాడు. ఇది ప్రభుత్వ వైఫల్యాలనే కాక అతడికి గవర్నమెంట్తో కల సంబంధాలను సూచిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. వికాస్ దూబేని అరెస్ట్ చేశారా లేక అతడే లొంగిపోయాడా అనే దాని గురించి వివరణ ఇవ్వాల్సిందిగా సమాజ్వాద్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అతడికి సంబంధించిన కాల్ రికార్డ్స్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని కోరింది. మరో ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ‘మేం వికాస్ దూబేను అరెస్ట్ చేయలేదు.. అతడు ఉజ్జయినిలో లొంగిపోయాడు. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత అతడు అండర్గ్రౌండ్లోకి వెళ్లకుండా తిరుగుతూనే ఉన్నాడు. దీని గురించి దర్యాప్తు చేయాలి’ అంటూ ట్వీట్ చేశారు. అయితే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా మాత్రం వికాస్ దూబేను అరెస్ట్ చేశామని.. అతడు లొంగిపోలేదని స్పష్టం చేశాడు. బిట్టు, సురేష్ అనే ఇద్దరు అనుచరులతో కలిసి వికాస్ దూబే రాజస్తాన్ కోటా ద్వారా మధ్యప్రదేశ్లో ప్రవేశించాడని తెలిపారు. ఇందుకు గాను అతడు వికాస్ పాల్ అనే నకిలీ ఐడీని ఉపయోగించాడు అని తెలిపాడు. -
ఉజ్జయినిలో గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అరెస్ట్
-
గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అరెస్ట్
భోపాల్: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతడు "నేను వికాస్ దూబేను, కాన్పూర్ వాలా" అని గట్టిగా అరవడం గమనార్హం. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను బలి తీసుకున్న ఘటనలో వికాస్ దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటివరకు అతని నలుగురి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్స్టర్కు అత్యంత సన్నిహితుడు, అతని బాడీగార్డు అమర్ దూబేను పోలీసులు మంగళవారం ఎన్కౌంటర్లో కాల్చి చంపేశారు. ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు ఉంది. వికాస్ దూబేకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని పోలీసులు గురువారం హతమార్చారు. ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసినట్లు తెలిపారు. (వికాస్ దూబేపై నగదు బహుమతి 5 లక్షలకు పెంపు) దీంతో ఇప్పటివరకు అతని ముగ్గురు అనుచరులు మరణించారు. ఇక హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ హోటల్లో వికాస్ దూబే ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం రాగా వారు అక్కడికి చేరుకునేసరికి పరారయ్యాడు. తాజాగా అతడు నోయిడాలో ఓ ఆటోలో వెళ్తున్నట్లు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో నోయిడాలో అతని కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. అనంతరం వికాస్ దూబే ఉజ్జయినిలో ప్రత్యక్షమయ్యాడని తెలుసుకున్న పోలీసులు ఈసారి అతడు పారిపోవడానికి వీలులేకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ముప్పేట దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. (వికాస్ దూబే సహచరుడు అమర్ ఎన్కౌంటర్!) -
కాన్పూర్ ఎన్కౌంటర్లో కీలక పరిణామం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో 8 మంది పోలీసులను హతమార్చిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాన్పూర్లోని బిక్రూ గ్రామంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సమాచారం లీక్ చేసిన ఆరోపణలపై సస్పెండ్ అయిన చౌబేపూర్ స్టేషన్ అధికారి వినయ్ తివారీ, బీట్ ఇన్ చార్జి కేకే శర్మలను బుధవారం రోజున అరెస్ట్ చేశారు. కాగా.. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పారిపోయి ఇతర పోలీసుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేసి, చౌబేపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరుడు దయా శంకర్ అగ్నిహోత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: వికాస్ దూబే సహచరుడు అమర్ ఎన్కౌంటర్! Former Station Officer of Chaubepur, Vinay Tiwari (pic 1) and Beat Incharge KK Sharma (pic 2) have been arrested. They were present during #KanpurEncounter but fled the site of incident during the operation: IG Kanpur Range Mohit Agarwal. #VikasDubey pic.twitter.com/0jPfHwIklB — ANI UP (@ANINewsUP) July 8, 2020 -
వికాస్ దూబే సహచరుడు అమర్ ఎన్కౌంటర్!
లక్నో : కరుడు గట్టిన గ్యాంగ్స్టర్ వికాస్దూబేను పట్టిస్తే అందించే నగదు బహుమతిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు మరోసారి పెంచారు. ఇటీవల ఈ నగదు బహుమతిని 2.5 లక్షలుగా ప్రకటించిన పోలీసులు దీన్ని 5 లక్షలకు పెంచారు. హర్యానాలోని ఫరీదాబాద్లో గల ఓ హోటల్లో వికాస్ దూబే ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం అందగా, అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే విషయం తెలుసుకున్న వికాస్ దూబే సదరు హోటల్ నుంచి పరారయ్యాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే వికాస్ దూబేను పట్టిస్తే 5 లక్షల నగదు బహుమతి ఇస్తామని బుధవారం యూపీ పోలీసులు ప్రకటించారు. ఇదిలావుండగా కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దూబేను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై అతడి గ్యాంగ్ కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే.(ఆ హోటల్లో గ్యాంగ్స్టర్ వికాస్ దూబే..!) మరోవైపు వికాస్ దూబే అత్యంత సన్నిహితుడు అమర్ దూబేను బుధవారం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాల్చి చంపారు. వికాస్ దూబే పర్సనల్ బాడీ గార్డు కూడా అయిన అమర్ దూబేను హామీర్ పూర్లో ఎన్ కౌంటర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గతవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో అమర్ దూబే హస్తం కూడా ఉంది. ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు ఉంది. మరోవైపు చౌబేపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్ప్టర్కు చెందిన మరో సహచరుడైన శ్యామ్ బాజ్పాయ్ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇక యూపీ, హర్యానా పోలీసులు సంయుక్తంగా వికాస్ దూబే కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రాం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పోలీసులు, ప్రజలను అప్రమత్తం చేశారు. (‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’) -
చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న వికాస్ దూబే!
-
ఆ హోటల్లో దాక్కొన్న గ్యాంగ్స్టర్..!
చండీగఢ్: ఎన్నో అకృత్యాలకు పాల్పడి, పోలీసుల ప్రాణాలు బలిగొన్న ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్లో గల ఓ హోటల్లో అతడు ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న వికాస్ దూబే సదరు హోటల్ నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో హోటల్ నుంచి సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి కోసం మళ్లీ గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రాం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పోలీసులు, ప్రజలను అప్రమత్తం చేశారు. గ్యాంగ్స్టర్ దేశ రాజధానిలో లొంగిపోనున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా వికాస్ దూబేను పట్టిస్తే రూ. 2.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.(ఒక్క ఫోన్ కాల్... అంతా తలకిందులైంది!) ఇదిలా ఉండగా.. కాల్పులకు తెగబడి ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు బలిగొన్న వికాస్ దూబేకు రాజకీయ నాయకులతో పాటు పోలీసులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా.. దాదాపు 200 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా విచారణకు హాజరుకానున్నారు. కాగా ప్రస్తుతం వికాస్ దూబే అనుచరుడు దయా శంకర్ అగ్నిహోత్రితో పాటు దూబే కోడలు చామా, వారి పనిమనిషి రేఖా అగ్నిహోత్రితో పాటు సురేశ్ వర్మ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దూబేను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై అతడి గ్యాంగ్ కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే.(‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’) -
‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’
లక్నో: ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబేకు సహకరించిన మరో ముగ్గురిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. దూబే కోడలు చామాతో పాటు వారి పని మనిషి, దూబే అనుచరుడి భార్య రేఖా అగ్నిహోత్రి, పక్కింటి వ్యక్తి సురేశ్ వర్మను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దూబే గ్యాంగ్ పోలీసులపై విరుచుకుపడిన సమయంలో చామా, రేఖా ఇంట్లోనే ఉన్నారు. దుండగుల కాల్పుల్లో గాయాల పాలైన ఓ పోలీసు అధికారి తలుపు తెరవాల్సిందిగా కోరగా.. చామా అందుకు నిరాకరించింది. (నేర సామ్రాజ్యం) మరోవైపు.. రేఖా, సురేశ్ వర్మ దూబేకు ఎప్పటికప్పుడు పోలీసులు ఎక్కడ ఉన్నారన్న సమాచారం అందించారు. అంతేగాక.. ‘‘ పోలీసులందరినీ చంపేయండి. ఒక్కరూ బతికి ఉండకూడదు’’అంటూ గట్టిగా కేకలు వేస్తూ పోలీసుల జాడ తెలియజేశారు. ఇదిలా ఉండగా.. గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకునే క్రమంలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. కాగా కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దూబే గ్యాంగ్ పోలీసులపై కాల్పులకు తెగబడిన విషయం విదితమే.(పోలీసులతో సంబంధాలు.. ఇంట్లో బంకర్!) ఈ ఘటనలో ఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరుడు దయా శంకర్ అగ్నిహోత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక వికాస్ దూబేను పట్టిస్తే రూ.2.5 లక్షలు బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ఇది వరకే ప్రకటించారు. ఇక దుబే స్వగ్రామం బిక్రూలోని అతడి సొంతింటిని పోలీసులు బుల్డోజర్లతో శనివారం నేలమట్టం చేయించిన విషయం తెలిసిందే. ఇంటి ఆవరణలో ఉన్న ఖరీదైన కార్లను కూడా ధ్వంసం చేయించారు. -
నేర సామ్రాజ్యం
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రూరల్ జిల్లా బిక్రూలో గత గురువారం అర్థరాత్రి దాటాక పేరుమోసిన నేరగాడు వికాస్ దూబే ఎనిమిదిమంది పోలీసుల ప్రాణాలు బలిగొన్న ఉదంతం దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. ఆ రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్న వికాస్ దూబే ముఠా తమను అరెస్టు చేయడానికొచ్చిన పోలీసు బృందంపై గుళ్లవర్షం కురిపించి తప్పించుకుపారిపోవడం, ఇప్పటికి నాలుగు రోజులు గడుస్తున్నా దూబే ఆచూకీ లేకపోవడం గమనిస్తే ఆ రాష్ట్రంలో పోలీసు శాఖ ఎంత నిస్సహాయ స్థితిలో పడిందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చిలో అధికారంలోకొచ్చినప్పుడే నేరగాళ్ల అంతుచూస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ఎన్కౌంటర్ల పరంపర సాగింది. నిరుడు డిసెంబర్లో విడుదలైన గణాంకాల ప్రకారం 17,745మంది నేరగాళ్లు లొంగిపోవడమో, తమ బెయిల్ రద్దు చేసు కుని జైలుకుపోవడమో జరిగితే...113మంది ఈ ఉదంతాల్లో మరణించారు. దాదాపు 2,000మంది గాయపడ్డారు. మొత్తంగా అప్పటికి యూపీలో 5,178 ఎన్కౌంటర్లు జరిగాయి. కానీ ఈ ఎన్కౌంటర్ల సెగ నేర చరిత్రగల వికాస్ దూబేను తాకలేదు. పోలీసుల దృష్టిలో పడకపోవడానికి అతగాడు సాధారణ నేరస్తుడు కాదు. 60 కేసుల్లో ముద్దాయిగా వున్న కరుడుగట్టిన నేరస్తుడు. 2001లో బీజేపీ హయాంలో సంతోష్ శుక్లా అనే మంత్రిని నడిరోడ్డుపై ఆపి గొడవపెట్టుకుని తీవ్రంగా కొట్టడమేకాక, ఫిర్యాదు చేయడానికి ఆయన పోలీస్స్టేషన్కు వెళ్తే అక్కడే కాల్చిచంపిన దుర్మార్గుడు. ఆ కేసులో పోలీసులెవరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో నిర్దోషిగా బయటికొచ్చాడు. ఈలోగా జైల్లో వుంటూనే ఇద్దరిని హత్య చేయించాడు. 2017లో సైతం అరెస్టయి ప్రత్యర్థిని హతమార్చడానికి పథకరచన చేశాడని చెబుతారు. అయినా సులభంగా బెయిల్పై బయటకు రాగలిగాడు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎవరూ అడ్డురాకుండా వుండేందుకూ, జిల్లా రాజకీయాల్లో తన మాటే చలా మణి అయ్యేందుకూ అతను బెదిరింపులు, అపహరణలు, హత్యలు వగైరాలు కొనసాగిస్తూనే వున్నాడు. భారీయెత్తున ఆయుధాలు పోగేసుకోవడం, అవసరమైతే తప్పించుకుపోవడానికి వీలుగా రహస్య మార్గం ఏర్పాటు చేసుకోవడంవంటివి పూర్తికావడానికి కొన్ని నెలలో, సంవత్సరాలో కాదు... దశాబ్దాలకాలం పట్టివుంటుంది. అయినా అన్ని వ్యవస్థలూ కళ్లు మూసుకున్నాయి. యూపీలో రాజకీయాలు, నేరాలు చెట్టపట్టాలేసుకుంటున్న ఉదంతాలు బయటపడుతూనే వున్నాయి. ఎక్కడికక్కడ నేరగాళ్లు సొంత సామ్రాజ్యాలు నిర్మించుకోవడం, తమ మాటకు ఎదురు చెప్పేవారిని బెదిరించడం, హత్యలు చేయడం ఒకప్పుడు చాలా ఎక్కువ. ఇలాంటి ఇతివృత్తాలతో గతంలో చాలా హిందీ సినిమాలు వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చాక సాగించిన ఎన్కౌంటర్ల వల్ల నేర సామ్రాజ్యాలు తుడిచిపెట్టుకుపోతాయని కొందరు నిజంగానే ఆశపడ్డారు. కానీ వాటి బారినపడినవారిలో చాలామంది ఛోటా మోటా నేరస్తులేనని, కొందరు అమాయకులు కూడా వున్నారని మీడియా కథనాలు వెల్లడించాయి. పైగా నేరాలు తగ్గకపోగా అవి మరింత పెరిగాయి. నిరుడు విడుదలైన 2018 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం మహిళలపై నేరాల్లో యూపీ దేశంలోనే అగ్రభాగాన వుంది. మరోపక్క యూపీ ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో వుంది. తాజా ఉదంతం జరిగిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యాపారినుంచి దోచుకున్న మొత్తాన్ని తిరిగి అతనికి ఇచ్చేయాలని దూబేను బతిమాలడానికి ఒక పోలీసు బృందం వెళ్తే అతని ముఠా కొట్టి పంపించింది. ఆ తర్వాత ఇరుగు పొరుగు పోలీస్స్టేషన్లనుంచి పోలీసుల్ని పంపితే వారు కూడా అతని ధాటికి తట్టుకోలేక వెనక్కొచ్చారు. చివరకు దాదాపు 50మంది పోలీసులు దాడికి వెళ్లినప్పుడు డీఎస్పీని, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, మరో నలుగురు కానిస్టేబుళ్లను ఆ ముఠా చిత్రహింసలు పెట్టి కాల్చిచంపింది. ఒక నేరగాడిని పోలీసులు బతిమాలే స్థితి ఎందుకొచ్చింది? అతనికి రాజకీయంగా పలుకుబడి వుందన్న భయమో, మరొకటో లేకపోతే ఇది జరిగేదా? గతంలో ఎస్పీ, బీఎస్పీ ప్రభు త్వాలున్నప్పుడు సైతం నేరాలు అధికంగానేవుండేవి. కానీ ఇలా దాడిచేసిన ఉదంతాలు లేవు. మరి ఈ మూడేళ్లుగా యోగి ప్రభుత్వం ఎన్కౌంటర్లతో సాధించిందేమిటి? ఈ ఉదంతంలో పోలీసుల తీరు ఎన్నో అనుమానాలు కలగజేస్తుంది. దాడికి వెళ్తున్న తమ సహచరుల వివరాలను కొందరు పోలీసులు ముందే అతనికి చేరేశారంటే అది కేవలం అతనిచ్చే డబ్బుకు ఆశపడటం వల్లనా లేక ఉన్నతస్థాయిలో అతనికి సంబంధాలున్నాయన్న కారణం చేతనా అన్నది తేలాలి. ఎందుకంటే ఈ ఉదంతంలో మరణించిన డీఎస్పీ దేవేందర్ మిశ్రా మూడు నెలలక్రితమే స్థానిక పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎస్ఎస్పీకి లేఖ రాశారని చెబుతున్నారు. అదే నిజమైతే ఎస్ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో విచారించాలి. ఆయన చురుగ్గా వ్యవహరించివుంటే పోలీసుల విలువైన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడేది కాదు. ప్రస్తుతం దాడి సమాచారాన్ని దూబేకు అందించారన్న ఆరోపణపై ఇద్దరు ఎస్ఐలు సహా అర డజనుమంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. పేరుమోసిన నేరగాళ్ల తీరుతెన్నులపైనా, వారి కుండే సంబంధబాంధవ్యాలపైనా ఇన్ని దశాబ్దాలుగా పాలకులకు తెలియలేదంటే ఎవరూ నమ్మ లేరు. ఇంటెలిజెన్సు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అలాంటి సమాచారం ఎప్పటికప్పుడు వస్తూనే వుంటుంది. ఎడాపెడా ఎన్కౌంటర్లతో ఆర్భాటం చేయడానికి బదులు అటువంటి వ్యవస్థలను ప్రక్షా ళన చేసి పదునుదేర్చి వుంటే కాన్పూర్ జిల్లాలో ఈ దుస్థితి తలెత్తేది కాదు. సాధ్యమైనంత త్వరగా వికాస్ దూబేను సజీవంగా పట్టుకోవడం, పూర్తి స్థాయిలో పోలీసు శాఖను ప్రక్షాళన చేయడం యోగి సర్కారు కర్తవ్యం. -
యూపీ గ్యాంగ్స్టార్ కేసులో కొత్తకోణం
లక్నో : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టార్ వికాస్ దూబే ఉదంతంలో సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి. అతనికి ఇంతకు ముందు నుంచే అధికార బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధిచిన ఓ వీడియో జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సారాంశం పలు అనుమానాలకు తావిస్తోంది. 2017లో ఓ కేసు విచారణ నిమిత్తం కన్పూర్ పోలీసులు దూబేను స్టేషన్కు తీసుకువచ్చారు. విచారణలో భాగంగానే పోలీసులు అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయగా... అధికార బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అభిజిత్ సంగా, భగ్వతీ సాగర్ పేర్లు చెప్పి ఆ కేసు నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. (తొలి రౌండ్లోనే విరుచుకుపడుతూ కాల్చారు) అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ దూబేను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గతవారం జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో దూబే పారిపోవడానికి సహకరించిన చౌబేపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి వినయ్ తివారీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికాస్తో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు కరడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. ఆయనకున్న రాజకీయ సంబంధాలపూ కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. (పోలీసులతో సంబంధాలు.. ఇంట్లో బంకర్!) -
రూ. 50 వేలు, లక్ష.. 2.5 లక్షలు
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబే తలపై పెట్టిన నగదు బహుమతిని మరోసారి పెంచారు. వికాస్ దూబే పట్టిస్తే రూ.2.5 లక్షలు బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. వికాస్ దూబేను అతని అనుచరులను పట్టిస్తే 50వేల నగదు బహుమతి ఇస్తామని ఇంతకు ముందు యూపీ పోలీసులు ప్రకటించారు. కానీ వికాస్ దూబే జాడ దోరక్కపోవడంతో నగదు బహుమతిని రూ. లక్షకు పెంచారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ నగదు బహుమతి ఏకంగా 2.5లక్షలు పెంచినట్లు సోమవారం ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్సీ అవస్థీ వెల్లడించారు. (చదవండి : ఉత్తరప్రదేశ్లో ఘోరం) భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చెక్ పోస్ట్ వద్ద దూబే ఫోటోను ఉంచామన్నారు. అతని ఆచూకి తెలియజేసినవారి వివరాలను రహస్యం ఉంచడంతో పాటు నగదు బహుమతి అందిస్తామని డీజేపీ పేర్కొన్నారు. దూబే చివరిసారిగా యూపీలోని ఆరయ్య ప్రాంతంలో గుర్తించినట్లు సమాచారం. అతను మధ్యప్రదేశ్ లేదా రాజస్తాన్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి : ఒక్క ఫోన్ కాల్... అంతా తలకిందులైంది!) కాగా కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దుబే గ్యాంగ్ పోలీసులపై కాల్పులకు తెగబడిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే. ఇప్పటికే వికాస్ దూబే ప్రధాన అనుచరుడు దయా శంకర్ అగ్ని హోత్రిని యూపీ పోలీసులు కల్యాణ్ పూర్ లో అరెస్టు చేశారు. వికాస దూబేను పట్టుకోవడం కోసం దాదాపు 25 బృందాలు రంగంలోకి దిగాయి. -
మమ్మల్ని మేము కాపాడుకునేందుకు పరిగెత్తాం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో కరడుకట్టిన నేరగాడు వికాస్ దూబే అనుచరులు పోలీసులపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి నాటి ఈ ఘటనలో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు నేలకొరిగారు. ఈ ఘోరకలి నుంచి గాయాలతో బయటపడ్డ బిథూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై పోలీస్ కౌశలేంద్ర ప్రతాప్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రమాదం జరిగిన రోజు అసలేం జరిగిందన్న విషయాన్ని సోమవారం ఆయన వివరించారు. "హిస్టరీ షీటర్ వికాస్ దూబే ఇంటి దగ్గర రోడ్డు బ్లాక్ చేసి ఉంది. దీంతో ఆ ఇంటికి 150 నుంచి 200 మీటర్ల దూరంలోనే మా వాహనాలను నిలిపివేశాం. అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ అతని ఇంటికి వెళ్లాం. అయితే మేము వస్తున్నామని పక్కా సమాచారం అందుకున్న నేరస్థులు అప్పటికే మాకోసం ఇంటి పైకప్పుపై కాపు కాసి ఉన్నారు. (పోలీసులతో సంబంధాలు.. ఇంట్లో బంకర్!) ఇద్దరు పోలీసులను కాపాడాను మేము అన్నివైపులా కాల్పులు జరిపాం, కానీ వారు పై నుంచి కాల్పులు జరపడంతో మా వైపు పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. దీంతో మమ్మల్ని మేము రక్షించుకునేందుకు పరిగెత్తాం. వారిపై తిరుగు కాల్పులతో జరిపేందుకు ప్రయత్నించాం కానీ, వారు ఇంటిపై ఉండటంతో సరిగా గుర్తించలేకపోయాం. అప్పటికే వాళ్లు తీవ్రస్థాయిలో కాల్పులకు ఎగబడటంతో మొదటి రౌండ్లోనే చాలామంది పోలీసులు గాయపడ్డారు. నాతో ఉన్న ఇద్దరు పోలీసులు కూడా గాయపడటంతో వారిని రక్షించడం నా బాధ్యతగా భావించి అతికష్టం మీద వారిని అక్కడ నుంచి బయటకు తీసుకువచ్చాను" అని తెలిపారు. మరోవైపు వికాస్ దూబేకు సహకరిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై సస్పెన్షన్ వేటు విధించారు. కాగా ప్రధాన నిందితుడు వికాస్ దూబేపై ఇప్పటికే 60 కేసులు నమోదై ఉన్నాయి. అతడి తలపై ఉన్న లక్ష రూపాయల రివార్డును తాజాగా రెండున్నర లక్షలకు పెంచారు. అంతకుముందు 50 వేల రూపాయలుగా ఉన్న రివార్డును ఆదివారం లక్షకు పెంచిన సంగతి తెలిసిందే. (ఉత్తరప్రదేశ్లో ఘోరం) -
ఒక్క ఫోన్ కాల్... అంతా తలకిందులైంది!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబేకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను పట్టుకునేందుకు వస్తున్నారన్న సంగతి దుబేకు ముందే తెలుసునని, తనకు ఆ సమాచారం ఇచ్చింది కూడా పోలీసులేనని అతడి అనుచరుడు శంకర్ అగ్రిహోత్రి వెల్లడించాడు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దుబే గ్యాంగ్ పోలీసులపై కాల్పులకు తెగబడిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో దుబే గ్యాంగ్లో పనిచేసే అగ్నిహోత్రిని కల్యాణ్పూర్లో శనివారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు బికూ గ్రామానికి వచ్చే ముందే వికాస్కు ఓ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అతడు వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన వికాస్.. తన అనుచరులకు ఫోన్ చేసి 25-30 మంది.. పోలీసులను అడ్డుకునేలా పథకం రచించాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి బదులిస్తూనే అతికష్టం మీద వికాస్ ఉన్న ఇంటి వద్దకు చేరుకోగా.. తమ గ్యాంగ్లోని ఇతర సభ్యులు వారిపై కాల్పులు జరిపారని పేర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తాను ఓ గదిలో ఇరుక్కుపోయినందున.. బయట ఏం జరుగుతుందో చూడలేకపోయానని చెప్పుకొచ్చాడు. కాగా వికాస్ దూబేకు సమాచారం ఇచ్చినట్టుగా భావిస్తున్న ఎస్హెచ్ఓ వినయ్ తివారిని ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 24 మంది పోలీసులతో సంబంధాలు వికాస్ దూబే దాదాపు 24 మంది పోలీసులతో కాంటాక్ట్లో ఉన్నట్లు అతడి కాల్డేటా ద్వారా వెల్లడైంది. చౌబేపూర్, శివరాజ్పూర్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే పలువురు అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అతడి మీద దాదాపు 60 కేసులు ఉన్నా ఇంతవరకు టాప్ క్రిమినల్స్ జాబితాలో చేరలేదని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది.(ఉత్తరప్రదేశ్లో ఘోరం) ‘ప్రభుత్వ కారు’ను ఉపయోగించేవాడు వికాస్ దూబే సోదరుడు దీప్ ప్రకాశ్ ఇంటి వద్ద పోలీసులు ఓ అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. 2014లో గవర్నర్ హౌజ్ వద్ద జరిగిన వేలంలో అతడు ఈ కారును కొనుగోలు చేశాడు. అయితే ప్రభుత్వ వాహనానికి సంబంధించిన పత్రాలను నేటికీ తన పేరు మీదకు బదిలీ చేయించుకోక పోవడం గమనార్హం. అంతేగాక ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా తీసుకోకుండా దాదాపు ఆరేళ్లుగా అన్ని రకాల పన్నులు ఎగ్గొట్టడం సహా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వికాస్ ఈ కారును ఉపయోగించేవాడు. దుండగుల కాల్పుల్లో మృతిచెందిన పోలీసుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు కాగా 2004లో రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాన్ని కొనుగోలు చేసింది. గవర్నర్ ప్రిన్సిపల్ కార్యదర్శి పేరిట దీనిని రిజిస్టర్ చేయించారు. దాదాపు 10 ఏళ్లు ఈ కారును ఉపయోగించిన తర్వాత వేలం వేయగా.. వికాస్ సోదరుడు దీనిని దక్కించుకున్నాడు. ఇక ఈ అంబాసిడర్లోనే వికాస్ తిరిగేవాడని, రాజకీయ నాయకులు, ఇతర ప్రభుత్వాధికారులను కలిసేందుకు ఇందులోనే వెళ్లేవాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వ వాహనాన్ని అడ్డుకుపెట్టున్నాడని పేర్కొన్నాయి. ఇంట్లోనే బంకర్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఇంట్లో ఓ బంకర్ ఉందని కాన్పూర్ పోలీసులు తెలిపారు. అందులోనే అతడు మారణాయుధాలు, పేలుడు పదార్థాలు దాచేవాడని పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి నాటి ఘటనలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాడు. ఎన్కౌంటర్లో భాగంగా దుండగులు 200-300 బుల్లెట్లు పేల్చినట్లు వెల్లడించారు. అంతేగాక ఏకే 47 సహా పలు పోలీస్ పిస్టోళ్లను వారు దోచుకెళ్లినట్లు వెల్లడించారు. క్రూరత్వానికి పరాకాష్ట వికాస్ దూబే గ్యాంగ్ ఘాతుకానికి బలైన 8 మంది పోలీసుల అటాప్సీ నివేదికలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. బిల్హౌర్ సర్కిల్ ఆఫీసర్(సీఓ) దేవేంద్ర మిశ్రా తలను వికాస్ అనుచరులు గొడ్డలితో నరికి చంపి... అతడి కాలి వేళ్లను కత్తిరించడం సహా శవాన్ని ఛిద్రం చేసి అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు వెల్లడైంది. కాగా పోలీసులపై కాల్పుల ఘటనలో వికాస్ దూబేతోపాటు 18 మందిపై పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాన నిందితుడు వికాస్ దూబే తలపై రూ.50 వేలు రివార్డు, అగ్నిహోత్రి తలపై రూ.25 వేలు రివార్డు పోలీసుల ఇది వరకే ప్రకటించారు. అతడి కోసం దాదాపు 25 బృందాలు రంగంలోకి దిగాయి. -
కాన్పూర్ ఎన్కౌంటర్: శవపరీక్షలో విస్తుగొలిపే..
లక్నో: ఉత్తరప్రదేశ్లో వికాస్ దూబే అనే గ్యాంగ్స్టర్ అతడిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీతో సహా మొత్తం 8 మంది పోలీసులు మృతిచెందారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి శవపరీక్ష నివేదికల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఎనిమిది మంది పోలీసుల శవపరీక్ష నివేదికలు శనివారం విడుదలయ్యాయి. చనిపోవడానికి ముందు పోలీసులను అతి క్రూరంగా హింసించబడ్డారని వైద్యులు ఆ నివేదికలో పేర్కొన్నారు. బిల్హౌర్ సర్కిల్ ఆఫీసర్(సీఐ) దేవేంద్ర మిశ్రా తలను వికాస్ దూబే మనుషులు గొడ్డలితో నరికినట్లు శవపరీక్షలో వెల్లడైంది. అతని కాలు కత్తిరించబడి, శరీరం తీవ్రంగా గాయాలపాలైనట్లు తేలింది. అదే విధంగా పోలీసుల వద్ద నుంచే దూబే అనుచరులు తుపాకులు లాక్కొని మరీ కాల్పులు జరిపినట్లుగా తెలిసింది. (యూపీ గ్యాంగ్స్టర్ అనుచరుడి అరెస్టు) కానిస్టేబుల్స్ బబ్లు, రాహుల్, సుల్తాన్ బుల్లెట్ గాయాలతో మరణించినట్లు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు తెలిపారు. అదే విధంగా కానిస్టేబుల్ జితేంద్ర పాల్కుపై ఎకే-47తో కాల్పులు జరిగినట్లు చెప్పారు. మరణించిన పోలీసుల భుజాలపై తీవ్రమైన గాయాలు ఉండటంతో వైద్యులు షాక్కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నివేదికలపై కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ శనివారం మాట్లాడుతూ.. దుబే గ్యాంగ్ మనుషులు మావోయిస్టులు దాడి చేసే విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. ఇక దుబే గ్యాంగ్లో పని చేసే దయా శంకర్ అగ్నిహోత్రిని కాన్పూర్ నగరం సమీపంలోని కల్యాణ్పూర్లో శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(వికాస్ దూబేకు సాయం.. పోలీస్ అధికారిపై వేటు) చదవండి: గ్యాంగ్స్టర్ ఇల్లు కూల్చివేత, సరళాదేవీ విచారం -
గ్యాంగ్స్టర్ వికాస్ దుబే అనుచరుడి అరెస్టు
లక్నో/కాన్పూర్: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దుబే అనుచరుల్లో ఒకడిని పోలీసులు అరెస్టు చేశారు. దుబే గ్యాంగ్లో పనిచేసే దయా శంకర్ అగ్నిహోత్రిని కాన్పూర్ నగరం సమీపంలోని కల్యాణ్పూర్లో శనివారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసే క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయని, ఆ క్రమంలో అగ్నిహోత్రి కుడి కాలుకు బుల్లెట్ గాయమైందని పేర్కొన్నారు. కాగా, పోలీసులపై కాల్పుల ఘటనలో వికాస్ దుబేతోపాటు 18 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాన నిందితుడు వికాస్ దుబే తలపై రూ.50 వేలు రివార్డు, అగ్నిహోత్రి తలపై రూ.25 వేలు రివార్డు పోలీసుల ఇదివరకే ప్రకటించారు. (చదవండి: గ్యాంగ్స్టర్ ఇల్లు కూల్చివేత, సరళాదేవీ విచారం) పోలీసుల విచారణలో అగ్నిహోత్రి కీలక సమాచారం వెల్లడించినట్టు తెలిసింది. దుబేను పట్టుకునేందుకు పోలీసులు వస్తున్న సంగతి తమకు ముందే తెలుసని అగ్నిహోత్రి విచారణలో చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ నుంచి సమాచారం అందిందని నిందితుడు వెల్లడించినట్టు పోలీసులు చెప్పారు. కాగా, కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి కాల్పుల ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం మరో ఎన్కౌంటర్లో ఇద్దరు నేరస్తులను పోలీసులు హతమార్చారు. కరుడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. (చదవండి: వికాస్ దూబేకు సాయం.. పోలీస్ అధికారిపై వేటు) -
ఉత్తరప్రదేశ్లో ఘోరం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో నేరగాళ్లు రెచ్చిపోయారు. వికాస్ దూబే అనే హిస్టరీ షీటర్ను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం మరో ఎన్కౌంటర్లో ఇద్దరు నేరస్తులను పోలీసులు హతమార్చారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కరడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. బిక్రూ గ్రామంలో అతడు మకాం వేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయం గుర్తించిన వికాస్ దూబే ఆ గ్రామానికి దారితీసే రోడ్లపై తన అనుచరులతో అడ్డుకట్టలు వేయించాడు. పోలీసులు అతికష్టం మీద వికాస్ ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఇంటిపై నుంచి అతడి అనుచరులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, మరో పౌరుడు గాయపడ్డారు. మృతిచెందిన, గాయపడిన పోలీసుల వద్ద ఉన్న ఏకే–47, ఇన్సాస్ రైఫిల్, గ్లాక్ పిస్టల్, రెండు .9 ఎంఎం పిస్టళ్లను వికాస్ దూబే అనుచరులు ఎత్తుకెళ్లారు. ఉన్నతాధికారులు వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నివాడా గ్రామం వద్ద దుండగులు ఎదురుపడడంతో కాల్పులు జరిపారు. ఇందులో వికాస్ అనుచరులైన ప్రేమ్ ప్రకాశ్, అతుల్ దూబే అనే ఇద్దరు హతమైనట్లు అధికారులు ప్రకటించారు. బిక్రూలో పోలీసుల వద్ద అపహరించిన ఒక పిస్టల్ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వికాస్ దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చనిపోయిన పోలీసులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం కాన్పూర్లో నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. నేరగాళ్ల చేతిలో ఎనిమిది మంది పోలీసులు చనిపోవడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యూపీలో గూండారాజ్కు ఇది మరో నిదర్శనమని ఆరోపించారు. యూపీలో నేరగాళ్లకు జంకూగొంకూ లేకుండా పోయిందని, విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. -
యజమానురాలి మృతి.. కుక్క ఆత్మహత్య
లక్నో: విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జీవి ఈ భూ ప్రపంచం మీద మరోకటి ఉండదు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో చోటు చేసుకుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న యజమానురాలి మృతిని తట్టుకోలేక ఓ కుక్క ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పన్నేండేళ్ల క్రితం డాక్టర్ అనితా రాజ్ సింగ్ తన ఆస్పత్రి సమీపంలో గాయాలతో పడి ఉన్న ఓ కుక్క పిల్లను చూసింది. జాలితో దాన్ని చేరదీసి వైద్యం చేయించింది. గాయాలు మానిన తర్వాత డాక్టర్ అనిత ఆ కుక్క పిల్లను తనతో పాటు తీసుకెళ్లి.. జయ అని పేరు పెట్టి పెంచుకోసాగింది. ఈ క్రమంలో డాక్టర్ అనిత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు బుధవారం మరణించింది. ఈ క్రమంలో అనిత మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. ఇన్ని ఏళ్లు తనను ప్రేమగా చూసుకున్న యజమానురాలు అలా విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ కుక్క తట్టుకోలేకపోయింది. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. -
పక్కా ప్లాన్తో పోలీసులపై కాల్పులు
లక్నో : ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు చనిపోగా, అయిదుగురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశశ్రాతో పాటు ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున 1.30 గంటలకు చోటుచేసుకుంది. ఇటీవల హత్యాయత్న కేసుకు సంబంధించి రౌడీ షీటర్ వికాస్దూబేపై రాహుల్ తీవారీ అనే గ్రామస్థుడు ఫిర్యాదు చేయడంతో.. అతడిని పట్టుకునేందుకు డీఎస్పీ దేవేందర్ మిశ్రా ఆధ్వర్యంలోని 16 మంది పోలీసుల బృందం గురువారం రాత్రి బిక్రూ గ్రామానికి వెళ్లారు. పోలీసులు గ్రామానికి చేరుకోగానే అక్కడ వారి కదలికలను గుర్తించిన నేరస్థులు పోలీసులు బయటకు వెళ్లకుండా రోడ్లన్నీ దిగ్భంధించారు. పోలీసులు తమ వాహనాల నుంచి కిందకు దిగగానే నేరస్థులు తమ భవనాలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. (పోలీసులపై కాల్పులు.. 8 మంది మృతి) నేరస్థులు ఎత్తైన ప్రదేశం నుంచి కాల్పులు జరపడంతో డీఎస్పీ సహా ఎనిమిది పోలీసులు మరణించారు. పోలీసులపై దాడి తర్వాత దూబే మనుషులంతా అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో మరో అయిదుగురు పోలీసులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డీజీపీ హెచ్సీ అవస్థీ తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. ఆరు జిల్లాలతో కూడిన కాన్పూర్ డివిజన్లోని అన్ని సరిహద్దులను మూసివేసినట్లు డీజీపీ తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పించారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.(‘మహా’ పెరుగుదల: ఒక్క రోజే 6330 కేసులు) పోలీసుల వివరాల ప్రకారం... కరుడు గట్టిన రౌడీ షీటర్ వికాస్ దూబే బిక్రూ గ్రామానికి చెందిన వ్యక్తి. అతను అదే గ్రామంలో ఓ ప్రైవేటు గ్యాంగ్ ముఠాను నడుపుతున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్లో ఎక్కువగా యువతను చేర్చుతూ, వారికి కావాల్సిన ఆయుధాలను కూడా సమకూరుస్తాడు. అతడిపై హత్య, దొంగతనాలు, కిడ్నాప్లతో సహా 60 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2000 ఏడాదిలో తారాచంద్ ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ సిద్ధేశ్వర్ పాండే హత్య కేసులో దూబే పేరు కూడా ఉంది. అదే విధంగా 2001లోనూ అప్పటి మంత్రిగా పదవిలో ఉన్న బీజేపీ నేత సంతోష్ శుక్లాను శివలి పోలీస్ స్టేషన్లో హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దూబే ప్రధాన నిందితుడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అయితే ఈ కేసులో దూబేను సెషన్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఇక బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వికాస్ దూబే నగర పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యారు. -
పోలీసులపై కాల్పులు జరిపిన రౌడీలు..
-
రౌడీషీటర్ల కాల్పులు.. 8 మంది పోలీసుల మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. డీఎస్పీతో పాటు 8 మంది పోలీసులను కాల్చి చంపారు. కాన్పూర్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ కిరాతక ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారని యూపీ ప్రభుత్వం తెలిపింది. కాన్పూర్ శివారులోని చౌబెపూర్లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు పోలీసుల బృందం కాన్పూర్ వెళ్లింది. పోలీసులపై రౌడీషీటర్లు అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది పోలీసులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అదనపు డీజీపీ(శాంతి భద్రతలు), కాన్పూర్ ఎస్పీ, ఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల మృతి ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం), డీజీపీతో మాట్లాడిన ఆయన ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఏడీజీ జేఎన్ సింగ్ తెలిపారు. ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించామన్నారు. గాయపడిన నలుగురు పోలీసులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బీజేపీకి చెందిన మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా రౌడీషీటర్ వికాస్ దూబేపై 57 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2001లో శివలి పోలీస్ స్టేషన్లో సంతోష్ శుక్లాను హత్య చేసినట్లు దుబేపై ఆరోపణలు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ కేబినెట్లో శుక్లా మంత్రిగా పనిచేశారు. -
స్టేట్ హోంలో 57 మందికి కరోనా.. ఐదుగురికి గర్భం!
లక్నో: కరోనా కట్టడి, మహిళల రక్షణపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసే మరో ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగుచూసింది. స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్గా తేలడం.. వారిలో ఐదుగురు గర్భవతులు ఉండటం అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. వివరాలు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ ప్రభుత్వ షెల్టర్ హోంలో ఉంటున్న బాలికలకు ఇటీవల కోవిడ్ నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో 57 మందికి కరోనా సోకిన విషయం బయటపడింది. అంతేగాకుండా వారిలో ఐదుగురు గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. (మతిభ్రమించిన మహిళపై రాళ్ల దాడి) ఈ నేపథ్యంలో సీపీఐ(ఎమ్) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి ఆదివారం కాన్పూర్ ఎస్ఎస్పీ దినేశ్ కుమార్ను కలిసి షెల్టర్ హోం ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. హోంలో ఉన్న బాలికలు గర్భవతులు కావడం, వారిలో ఒకరికి హెచ్ఐవీ పాజిటివ్, మరొకరికి హెపటైటిస్ సీ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయని.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. రెస్క్యూ హోంలో ఉన్న వారికి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం లోపించిందని మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పూనం కపూర్.. హోంలో చేరిన తర్వాత ఎవరూ గర్భం దాల్చలేదని.. వీరంతా లైంగికదాడి కేసుల్లో బాధితులు అని పేర్కొన్నారు. (ఆరోగ్యశాఖ కార్యాలయంలో కరోనా) ఇక కాన్పూర్ జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవ్ రామ్ తివారి ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘‘వివిధ జిల్లాల్లోని శిశు సంక్షేమ కమిటీల నుంచి ఇక్కడి హోంకు ఐదుగురు బాలికలు వచ్చారు. వారంతా లైంగిక దాడి బాధితులు. ఇక్కడికి రావడానికి ముందే వారు గర్భవతులుగా ఉన్నారు’’ అని వివరణ ఇచ్చారు. అదే విధంగా హోంలో రెండు రోజుల క్రితం ఇద్దరికి వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని.. అనంతరం మరో 55 మంది శాంపిల్స్ పరీక్షించగా వారు కూడా మహమ్మారి బారిన పడినట్లు తేలిందన్నారు. కరోనా బాధితులను కోవిడ్ ఆస్పత్రులకు తరలించి.. మిగిలిన వారికి క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు. కాగా ఉత్తరప్రదేశ్లో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 507 మంది కోవిడ్తో మరణించారు. ఇక కాన్పూర్లోనూ కరోనా పంజా విసురుతోంది. ప్రస్తుతం అక్కడ 400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
మాస్కు లేదని ఐజీకే జరిమానా.. అయితే,
లక్నో: మాస్కు ధరించని కాన్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్కు చలాన్ తప్పలేదు. అయితే, ఆయనకెవరూ ఫైన్ వేయలేదు. నైతిక విలువలకు కట్టుబడే తనే స్వయంగా చలాన వేయించుకున్నారు. వివరాలు.. తనిఖీలకు వెళ్తున్న క్రమంలో ఐజీ అగర్వాల్ తన కార్యాలయం నుంచి కారిడార్లోని వాహనం వరకు మాస్కు లేకుండా వచ్చారు. వెంటనే తన తప్పును తెలుసుకుని వాహనంలో ఉన్న మాస్కు పెట్టుకున్నారు. అయినప్పటికీ విధుల్లో ఉన్న సిబ్బందితో చర్చించి... నిబంధనల ప్రకారం తనకు జరిమానా విధించాలని చెప్పారు. దాంతో వారు ఐజీకి రూ.100 చలాన్ విధించారు. దీనిపై అగర్వాల్ మాట్లాడుతూ.. ‘విధుల్లో భాగంగా బయటికి వెళ్తున్న సమయంలో మాస్కు లేకుండా బయటికొచ్చా. కానీ, నా తప్పిదాన్ని సిబ్బంది తెలియజేశారు. దాంతో మరోమాట లేకుండా నిబంధనలు అతిక్రమించినందుకు చలాన్ వేయమని చెప్పా. ఆ మొత్తం చెల్లించా. నైతిక విలువలకు కట్టుబడే ఈ పనిచేశా. ఇతరులకు చెప్పే ముందు మనం పాటించాలి కదా అని’ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. చలాన రశీదు ఫొటో పెట్టారు. కాగా, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మాస్కు లేనిదే బయట తిరిగితే రూ.100 ఫైన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఇక ఐజీ చర్యపై ట్విటర్లోప్రశంసలు కురుస్తున్నాయి. कल बर्रा थाना क्षेत्र मे भ्रमण दौरान गाड़ी से उतरते वक़्त IG रेंज द्वारा मास्क धारण नहीं किया गया था,यद्यपि कुछ ही सेकेन्ड मे उन्होने मास्क पहन लिया, फिर भी उन्होंने स्वयं चालान करवाया व जुर्माना राशि जमा की ताकि जनता व अन्य पुलिस कर्मियों में मास्क पहनने की जागरूकता पैदा हो । pic.twitter.com/ZlVIg1M4D8 — IG RANGE KANPUR (@igrangekanpur) June 6, 2020 -
లాక్డౌన్ లవ్: యాచకురాలితో ప్రేమ, ఆపై
కాన్పూర్: కరోనాను ఎదిరించి మరీ కొందరు పెళ్లి చేసుకుంటున్నారు. అందులో ఉత్తర ప్రదేశ్కు చెందిన జంట కూడా ఉంది. కానీ వీరి పెళ్లి ఆన్లైన్లో జరగలేదు. అలా అని కుటుంబసభ్యులు, బంధుగణాల మధ్యనూ జరగలేదు. అతి సాదాసీదాగా జరిగింది. వాళ్లు ఒకరినొకరిని ఇష్టపడ్డారు. కానీ వారి జంటను వరుడి తరుపు కుటుంబసభ్యులు ఇష్టపడలేదు. కారణం ఆమె ఓ యాచకురాలు. వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన నీలమ్.. ఓ యాచకురాలు. ఎవరైనా కనికరించి కాస్త చిల్లర వేస్తే తప్ప కడుపు నిండేది కాదు. అలాంటిది లాక్డౌన్ వల్ల ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పస్తులతోనే కాలం వెళ్లదీస్తోంది. అనిల్ ఓ డ్రైవర్. కటిక పేదలకు లాక్డౌన్ మోసుకొచ్చిన కష్టాలను కళ్లారా చూసి చలించిపోయాడు. వారికి పట్టెడన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. (కేసు వెనక్కి తీసుకోలేదని.. కొట్టి చంపారు) భిక్ష వదిలి పెళ్లి దిశగా అడుగులు.. అలా ఓ రోజు ఆహారం పంచిపెడుతుండగా కాన్పూర్లోని కకాడియో క్రాసింగ్ దగ్గర ఫుట్పాత్ మీద అడుక్కుంటున్న నీలమ్ను చూశాడు. అందరితోపాటు ఆమెకూ ఆహారం పంపిణీ చేశాడు. ఆమెతో మాట కలిపి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అలా మొదలైన స్నేహం ప్రేమ వరకూ వెళ్లింది. దీంతో ఆమెను యాచక వృత్తి వదులుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిండుమనసుతో అంగీకరించడంతో స్థానిక బుద్ధాశ్రమంలో సామాజిక కార్యకర్తల మధ్య వివాహం చేసుకున్నాడు. ఈ విషయం గురించి నీలమ్ మాట్లాడుతూ.. "నా తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించగా తల్లి కొంతకాలం క్రితం కాలం చేసింది. ఈ సమయంలో అండగా ఉండాల్సిన అన్నావదినలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పొట్ట నింపుకునేందుకు రోడ్ల వెంబడి యాచించడం మొదలు పెట్టాను. లాక్డౌన్ వల్ల జీవితం మరింత అగమ్యగోచరంగా మారిన స్థితిలో అనిల్ కనిపించి, నా జీవితంలో వెలుగులు నింపాడు" అని చెప్పుకొచ్చింది. (గోల్డీ కల్యాణం) -
అయ్యో.. ఆమె చనిపోలేదు!
న్యూఢిల్లీ: ఈ రెండు ఫొటోల్లో కన్పిస్తున్న వైద్యురాలి పేరు మనీషా పాటిల్ అని, మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల ఈ యువ డాక్టర్ కోవిడ్ రోగులకు సేవలు అందిస్తూ కరోనా బారిన పడి మరణించినట్టు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో మందిని కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడిన ఆమె తనను తాను రక్షించుకోలేకపోయిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంటూ ఫేస్బుక్లో షేర్ చేశారు. ఈ ఫోటో ఫేస్బుక్, ట్విటర్లో వైరల్గా మారింది. పూనమ్ వర్మ అనే ఫేస్బుక్ పేజీ నుంచి పోస్టయిన ఈ ఫొటోకు ఇప్పటివరకు 29 వేలకు పైగా లైకులు, 5 వేలకు కామెంట్లు రాగా, 1100 మందిపైగా షేర్ చేశారు. (కరోనా: పతంగులు ఎగరేయొద్దు) అయితే సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇండియా టుడే నకిలీ వార్తల వ్యతిరేక విభాగం(ఎఫ్డబ్ల్యూఏ) తేల్చింది. ఈ ఫొటోలోని యువతి పేరు రిచా రాజ్ఫుత్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఆమె హోమియోపతి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తాను చనిపోలేదని, తన ఇంట్లో క్షేమంగా ఉన్నానని ఎఫ్డబ్ల్యూఏతో చెప్పారు. అసలు తాను కరోనా రోగులకు చికిత్స చేయడం లేదని వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో పెట్టిన రెండు ఫొటోలు తనవేనని, ఇవి పాతవని.. కరోనా సంక్షోభం సమయంలో తీసినవి కాదని డాక్టర్ రిచా రాజ్ఫుత్ స్పష్టం చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. (కరోనా వైరస్.. మరో దుర్వార్త) -
కరోనా: పతంగులు ఎగరేయొద్దు
కాన్పూర్(ఉత్తరప్రదేశ్): కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గాలిపటాలు ఎగరేయొద్దని ప్రజలకు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇళ్లలో గడుపుతున్న జనంలో కొంతమంది కాలక్షేపానికి పతంగులు ఎగరవేస్తున్నారు. దీన్ని గుర్తించిన కాన్పూర్ పోలీసులు పతంగులు ఎగరేయొద్దని బాలీవుడ్ హిట్ పాటలతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘గాలిపటాలు ఎగరవేయడం మానండి. మాట వినకుంటే జైలుకు వెళ్లడం ఖాయం’ అనే అర్థం వచ్చేలా పాటలతో కాన్పూర్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పతంగులు ఎగరేయొద్దని పిల్లకు చెప్పాలని తల్లిదండ్రులకు సూచించారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో 1,868 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ సోకిన వారిలో 289 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ ఎగబాకుతోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు, మృతుల సంఖ్య 872కు చేరింది. కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ను కేంద్రం పొడిగించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రజలు మరికొంత కాలం ఇళ్లకు పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. చదవండి: కరోనా వైరస్.. మరో దుర్వార్త -
కేసు వెనక్కి తీసుకోలేదని.. కొట్టి చంపారు
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. లైంగిక వేదింపుల కేసును వెనక్కి తీసుకోనందుకు మైనర్ బాలిక తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దాడిలో బాధితురాలికి కూడా తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో 2018లో జరిగిన లైంగిక దాడి నిందితులు చేసిన దాష్టీకమే ఇది. చదవండి: దారుణం: మంచానికి కట్టేసి తగలబెట్టారు! కాన్పూర్కి చెందిన మైనర్ బాలికపై అబిద్, మింటు, మహబూబ్, చాంద్ బాబు, జమీల్, ఫిరోజ్ అనే ఆరుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం నిందితులు బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్పై బయటికొచ్చిన ఆ యువకులు బాధితురాలి ఇంటికి వెళ్లి కేసును విత్ డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించారు. చదవండి: వీడియో తీసుకుని... ఉరి వేసుకుని... ఇందుకు కుటుంబసభ్యులు నిరాకరించడంతో బాధితురాలి తల్లిని తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. కిందపడిపోయిన ఆమె తలపై కాలితో తన్నుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మహిళతోపాటు కూతురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఆస్పత్రిలో చనిపోయారు. -
ఉత్తర్ప్రదేశ్లో 'డాక్టర్ బాంబ్' అరెస్ట్
కాన్పూర్ : పెరోల్పై ఉండి కనిపించకుండా పోయినా జలీస్ అన్సారీని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు శుక్రవారం కాన్పూర్లో అరెస్టు చేశారు.1993 ముంబై వరుస పేళుళ్ల కేసులో జలీస్ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. కాన్పూర్లోని మసీదు నుంచి ప్రార్థన అనంతరం బయటికి వస్తున్న జలీల్ అన్సారీ యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్సారీని లఖ్నవూ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 'డాక్టర్ బాంబ్'గా పేరు పొందిన 68 ఏళ్ల ముంబై పేళుళ్ల కేసులో అన్సారీ రాజస్తాన్లోని అజ్మీర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే నెల ముందు అన్సారీకి 21 రోజుల పెరోల్ రావడంతో అతని స్వస్థలమైన మోమిన్పూర్కు వచ్చాడు. కాగా జనవరి 17న అన్సారీ పెరోల్ పూర్తవడంతో ఉదయం 11 గంటల కల్లా జైలుకు రావాల్సి ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ముంబైలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కాన్పూర్లోని మసీదు నుంచి బయటకు వస్తున్న జలీస్ అన్సారీని అరెస్టు చేశారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో అన్సారీ బాంబులు సరఫరా చేసినట్లు తేలడంతో సుప్రీంకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన సిమి, ఇండియన్ మొజాహిద్దీన్ ఉగ్రవాదులకు బాంబులు ఎలా తయారు చేయాలనే దానిపై శిక్షణ కూడా ఇచ్చాడు. 1993 జరిగిన ముంబై వరుస పేళుళ్లలో 317 మంది చనిపోగా, వందల మంది గాయపడ్డారు. -
పోలీసు కాల్పులకు ఇదిగో సాక్ష్యం
-
పోలీసు కాల్పులకు ఇదిగో సాక్ష్యం
కాన్పూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఇప్పటికీ చల్లారలేదు. పలుచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి మరణానికి పోలీసులు కారణం కాదని, పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపలేదని పోలీసు ఉన్నతాధికారులు ఒకటికి పదిమార్లు చెప్పుకొచ్చారు. కానీ పోలీసులు యథేచ్ఛగా కాల్పులు జరిపిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శనివారం సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో 15 మంది చనిపోగా పలువురు బుల్లెట్ల దాడిలో గాయాలతో బయటపడ్డారు. అయితే తాము ఎలాంటి కాల్పులు జరపలేదని పోలీసులు ప్రకటించారు. యూపీ పోలీసు ఉన్నతాధికారులు సైతం.. నిరసనకారులే కొంతమంది తుపాకీలు వినియోగించారని, ఇప్పటివరకు 400కు పైగా ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కానీ తాజా వీడియోలో సేఫ్ జాకెట్ ధరించిన ఓ పోలీసు ఒక చేత్తో లాఠీ, మరో చేత్తో రివాల్వర్ పట్టుకొని ఓ మూలకు వేగంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిపై రివాల్వర్తో కాల్పులు జరిపినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆ సమయంలో ఆందోళనకారులెవరూ రాళ్లు రువ్వడం కానీ పోలీసులపై దాడికి దిగినట్లుగానీ కనిపించకపోవడం గమనార్హం. -
‘నమామి గంగా’పై మోదీ సమీక్ష
కాన్పూర్: గంగా నది శుద్ధీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలకు ప్రత్యక్ష తార్కాణంగా నిలవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నమామి గంగా ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి మొదటి భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శనివారం ఈ భేటీ జరిగింది. నదీ జలాలను రక్షించేందుకు అది ప్రవహిస్తున్న రాష్ట్రాలకు 2015–20 వరకు రూ. 20 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చిందని సంబంధిత వ్యవహారాల అధికారులు తెలిపారు. భేటీ అనంతరం మోదీ అరగంట పాటు గంగానదిలో బోటు షికారుకు వెళ్లారు. ప్రయాణం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఘాట్ మెట్లు ఎక్కుతుండగా ఆయన పట్టు జారి పడిపోయారు. వెంటనే ఆయన వెంట ఉన్న బలగాలు ఆయనకు సహాయం చేశాయి. అన్ని మెట్లలో ఒక మెట్టు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఘటన జరిగినట్లు ఎస్పీజీ బలగాలు తెలిపాయి. -
గంగా నదిలో మోదీ పడవ ప్రయాణం
-
గంగా నదిలో మోదీ పడవ ప్రయాణం
కాన్పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో శనివారం పవవ ప్రయాణం చేశారు. కాన్పూర్లోని అటల్ ఘాట్ నుంచి మొదలైన ఈ ప్రయాణంలో ప్రధానితోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ (సీఎం నితీష్కుమార్ స్థానంలో) ఉన్నారు. ప్రతిష్టాత్మక నమామి గంగా కార్యక్రమంలో భాగంగా గంగా ప్రక్షాళనకు జరుగుతున్న పనులను ప్రధాని పర్యవేక్షించారు. తొలిసారిగా జరుగుతున్న నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. గంగా ప్రక్షాళన తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రధాని మోదీ కాన్పూర్లో పర్యటిస్తున్నారని పీఎంఓ కార్యాలయం ట్విటర్లో పేర్కొంది. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి కాన్పూర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కాగా, నమామి గంగా ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేసి గంగా నదిని శుద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. -
పోకిరీని రఫ్పాడించిన చంచల్
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు, దాడులతో అట్టుడికిపోతోంది. అయితే ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రం బాలికలను వేధిస్తున్న ప్రబుద్ధిడికి తగిన శాస్తి చేసిన వైనం ఆకట్టుకుంటోంది. కాన్పూర్, బీతూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక బాలికలు పాఠశాలకు వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ ఆ పోకిరీని పట్టుకుని రఫ్పాడించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమే బీతూర్ పోలీస్ స్టేషన్లోని యాంటీ రోమియో స్క్వాడ్ మహిళా కానిస్టేబుల్ చంచల్ చౌరాసియా. రోమియోల భరతం పట్టే పనిలో ఉన్న చంచల్ అతగాడి కాలర్ పట్టుకుని మరోసారి ఇలాంటి వేధింపులకు గురి చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు బూటు తీసి ఒకటి కాదు రెండు కాదు 22 సార్లు వాయించి పడేసారు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. #WATCH A woman constable thrashes a man for allegedly harassing girls on their way to school in Bithur area of Kanpur. (10.12.19) pic.twitter.com/avQpgk73Va — ANI UP (@ANINewsUP) December 11, 2019 -
ఛాయ్వాలా కాదు.. బడా దిల్వాలా!
‘మహ్మద్ మెహబూబ్ మాలిక్... కాన్పూర్కు చెందిన ఛాయ్వాలా. ఓ చిన్న షాపు కలిగిన అతడు 40 మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. తన ఆదాయంలో 80 శాతం మేర వారి విద్య కోసమే ఖర్చు చేస్తున్నాడు. ఇదే నిజంగా ఎంతో స్పూర్తిదాయకం కదా’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్కు చెందిన టీ షాపు యజమానిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు లక్ష్మణ్ చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో అతడికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇతను ఛాయ్వాలా కాదు.. బడా దిల్వాలా’ అంటూ అతడిని అభినందిస్తున్నారు. ఇక లక్ష్మణ్ ట్వీట్కు స్పందించి టీ వాలా మహ్మద్... హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అంటూ బదులిచ్చాడు. కాగా కాన్పూర్కు చెందిన మహ్మద్ మెహబూబ్ మాలిక్కు సామాజిక సేవ చేయడంలో ముందుంటాడు. టీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న అతడు దాదాపు 40 మంది చిన్నారులను చదివిస్తున్నాడు. మా తుజే సలాం పేరిట ఫౌండేషన్ నెలకొల్పి అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అంతేకాదు ఎన్నికల సమయంలోనూ మరక మంచిదే అంటూ ఓటు విలువను తెలియజేస్తూ ఓటర్లను చైతన్యవంతం చేయడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టాడు. Mohammad Mahboob Malik, a tea seller from Kanpur takes care of education for 40 children. He has a small tea shop and spends 80% of his income on the education of these children. What an inspiration ! pic.twitter.com/H1FTxeYuz7 — VVS Laxman (@VVSLaxman281) November 6, 2019 -
నేను చచ్చిపోయాను.. సెలవు కావాలి!
సాక్షి, లక్నో : సెలవు పెట్టడానికి ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి రాసిన కారణం తెలిస్తే మన కళ్లు పెద్దవికాక మానవు. తన చావును కారణంగా చూపి సెలవు తీసుకోవటం, దానికి స్కూలు ప్రిన్సిపల్ ఆమోదం తెలపడంతో ఈ ఘటన వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్కు చెందిన ఓ ఎనిమిద తరగతి విద్యార్థి సెలవు కోసం చీటీ రాసి ప్రిన్సిపల్ను సంప్రదించాడు. ఆ సెలవు చీటీలో ‘‘ అయ్యా! నేను ఈ రోజు ఉదయం(ఆగస్టు 20, 2019) 10గంటలకు చనిపోయాను. కావునా, నేను తొందరగా ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం అర్థరోజు సెలవు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని రాశాడు. విద్యార్థి అందులో ఏం రాశాడో చదవకుండానే ప్రిన్సిపల్ సంతకం చేసి పంపించేశాడు. ఓ పిచ్చి కారణానికి సెలవు దొరకటంతో సదరు విద్యార్థి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కొద్దిరోజులు ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉన్న విద్యార్థి! ఆ తర్వాత తన మిత్రులతో సెలవు చీటీ సంగతులు పంచుకున్నాడు. దీంతో ఆనతికాలంలో పాఠశాల మొత్తం ఈ విషయం పాకిపోయింది. అతడు రాసిన సెలవు చీటీ సోషల్ మీడియాలో సైతం వైరలై విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. అయితే దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించలేదు. కానీ, తమ స్కూలు ప్రిన్సిపల్కు సెలవు చీటీల్లో ఏముందో పూర్తిగా చదివే అలవాటు లేదని కొందరు ఉపాధ్యాయులు అతడ్ని వెనకేసుకు రావటం గమనార్హం. -
వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై..
కాన్పూర్ : తనను లైగింకంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ 16 ఏళ్ల బాలికకు చేదు అనుభవం ఎదురైంది. బాలిక ఫిర్యాదును స్వీకరించకపోవడమే కాకుండా.. అభ్యంతరకర ప్రశ్నలు అడిగి ఆమెను వేధింపులకు గురిచేశాడో పోలీసు అధికారి. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలకు జరిగే అవమానాలకు ఇది నిదర్శనం అని ప్రియాంక అన్నారు. కాగా బాలికను వేధింపులకు గురిచేసిన హెడ్ కానిస్టేబుల్ను అధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. కాన్పూర్ చెందిన ఓ దినసరి కూలీల కుమార్తెను గత కొద్దిరోజులుగా కొంత మంది దుండగులు లైగింకంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు తట్టుకోలేక బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను సంప్రదించారు. తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన హెడ్ కానిస్టేబుల్ థార్బాబు ఆమెను అసభ్యకర ప్రశ్నలు అడుగుతూ వేధింపులకు గురిచేశారు. ‘చేతికి ఉంగరం ఎందుకు ధరించావు? నీకు నెక్లెస్ ఎందుకు? నువ్వు చదువుకోలేదు కానీ ఒంటి నిండా బంగారం వేసుకున్నావు. ఇవన్ని ధరించాల్సిన అవసరమేంటి? ఇవి చాలు నువ్వు ఎలాంటి దానివో అర్థం చేసుకోవడానికి’ అంటూ హెడ్ కానిస్టేబుల్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలిక తల్లిదండ్రులు సమాధానం చెప్పబోతుండగా వారిని అడ్డుకున్నారు. బాలిక ఎం చేసిందో మీకు ఎలా తెలుసు? మీరు ప్రతిసారి ఇలా వచ్చి ఇబ్బంది పెట్టకండి అంటూ వారిపై సీరియస్ అయ్యారు. ఇదంతా అక్కడే ఉన్న బాలిక సోదరుడు మొబైల్ ద్వారా వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ వీడియోను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వేధింపులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘ రాష్ట్రంలో ఒకవైపు నేరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తున్నారు’ అంటూ వైరల్ అయిన వీడియోను పోస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పందించారు. విచారణ ప్రారంభించామని, త్వరలోనే సదరు హెడ్ కానిస్టేబుల్పై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. छेड़खानी की रिपोर्ट लिखवाने गई लड़की के साथ थाने में इस तरह का व्यवहार हो रहा है। एक तरफ उत्तर प्रदेश में महिलाओं के खिलाफ अपराध कम नहीं हो रहे, दूसरी तरफ कानून के रखवालों का ये बर्ताव। महिलाओं को न्याय दिलाने की पहली सीढ़ी है उनकी बात सुनना। Video credits @benarasiyaa pic.twitter.com/J0FdqBR2Tt — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 25, 2019 -
‘బుమ్రా బౌలింగ్ వెనుక రాకెట్ సైన్స్’
కాన్పూర్: భారత అత్యుత్తమ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. తన బౌలింగ్ టెక్నిక్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ యూనిట్లో బుమ్రానే కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. భారత జట్టులోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ప్రధాన బౌలర్గా ఎదిగిపోయాడు బుమ్రా. అయితే, బుమ్రా బౌలింగ్ విజయం వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సంజయ్ మిట్టల్ కనిపెట్టానని అంటున్నారు. బుమ్రా స్పీడ్, సీమ్ పొజిషన్ వెనుక రాకెట్ సైన్స్ దాగి ఉందని తన స్టడీ ద్వారా వెల్లడైందన్నారు. బుమ్రా రివర్స్ మాగ్నస్ ఫోర్స్ను రాబట్టి బ్యాట్స్మన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్పష్టం చేశారు. 1,000 ఆర్పీఎమ్తో బుమ్రా బంతులు వేస్తున్నాడు కాబట్టి 0.1 నిష్పత్తిలో ఆ బంతికి స్పిన్ తోడవుతుందని తెలిపారు. వేగంతో పాటు సీమ్ కలిగిన బుమ్రా విసిరే బంతికి స్పిన్ తోడవడంతో బంతి దిశ మారి మాగ్నస్ ఫోర్స్ కాస్త రివర్స్ మాగ్నస్ ఫోర్స్గా రూపాంతరం చెందుతుందని ఆయన వెల్లడించారు. దీనివల్ల బంతి నేలను తాకిన తర్వాత అనూహ్యంగా బౌన్స్ అవుతుందని అన్నారు. దాంతో బ్యాట్స్మెన్ బుమ్రా బంతుల్ని ఎదుర్కోవడంలో శ్రమించాల్సి వస్తుందన్నారు. బుమ్రా యాక్షన్ భిన్నంగా ఉండటం కూడా అతను వైవిధ్యమైన బంతులు వేయడానికి దోహద పడుతుందన్నారు. -
కోతి ఎంత పని చేసింది.. వీడియో వైరల్
సాక్షి, కాన్పూర్ : కాన్పూర్లోని ఒక టోల్ బూత్లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. టోల్బూత్లోకి చొరబడిన ఒక కోతి అక్కడున్నగల్లా పెట్టెలోని డబ్బులను చాలా ఒడుపుగా లాక్కుపోయింది. ఏప్రిల్ 25న కాన్పూర్ డిహత్ ప్రాంతంలోని బారా టోల్ ప్లాజాలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో వీడియో వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజిలోని వీడియో ప్రకారం.. టోల్ బూత్ వద్ద ఒక తెల్ల కారు ఆగింది. ఒక కోతి దాని నుండి దూకి.. విండోంలోంచి బూత్లోకి ప్రవేశించింది. అక్కడున్న ఉద్యోగి భుజం మీద నుంచి దర్జాగా నేరుగా క్యాష్ బ్యాక్స్లో ఉన్న నగదును లాక్కుని ఉడాయించింది. ఏం జరుగుతోందో అక్కడున్న అపరేటర్కి అర్థమయ్యేలోపే క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. దీనిపై టోల్ మేనేజ్మెంట్ సీనియర్ అధికారి మనోజ్ శర్మ మాట్లాడుతూ.. కోతి ఎత్తుకెళ్లిన సొమ్ము మొత్తం 5 వేల రూపాయలని చెప్పారు. ఈ విషయంలో కోతికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వుంటారని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. తాజా ఘటనపై ఫిర్యాదు నమోదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కారు డ్రైవర్ వాదిస్తున్నారు. -
కోతి ఎంత పనిచేసింది.. వీడియో వైరల్..
-
చెల్లి ప్రియాంకతో రాహుల్ సరదా కబుర్లు
రాయ్బరేలీ: మంచి సోదరుడు ఎలా ఉండాలనే దానికి రాహుల్ కొత్త అర్థం చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్, ఆయన సోదరి ప్రియాంక యూపీలోని కాన్పూర్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. అప్పుడు వీరిద్దరూ సరదాగా మాట్లాడారు. ‘మంచి సోదరుడంటే అర్థం ఏంటో చెప్తాను. ఎన్నికల ప్రచారంలో సుదూర ప్రయాణాలు చేసే నాకేమో చిన్న హెలికాప్టర్. చాలా తక్కువ దూరాలకు ప్రయాణించే ప్రియాంకకు మాత్రం సువిశాలమైన హెలికాప్టర్’ అంటూ సరదాగా అన్నారు. దీంతో ప్రియాంక ‘అంతా అబద్ధం’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘ఏదేమైనా నేను నా చెల్లిని ప్రేమిస్తున్నాను’ అని రాహుల్ మాట్లాడారు. వీరిద్దరి సరదా సంభాషణ వీడియో రాహుల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. 70 ఏళ్లలో ఏ పార్టీ గబ్బర్సింగ్ ట్యాక్స్ తేలేదు గత 70 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) వంటివి విధించలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు పేరుతో ప్రజలను మోసం చేశారని, ఇది ఓ అవివేకమైన చర్య అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ఉంచాహార్లో ర్యాలీలో మాట్లాడారు. దేశంలో ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేయకుండా మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. మోదీకి ఈ ఖాళీలను భర్తీ చేయడం ఇష్టం లేదని, కేవలం ఆయన తన మిత్రులకే సాయం చేస్తారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 22 లక్షల జాబ్లను భర్తీ చేస్తామని.. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించారు. దీనిలో కనీస మద్దతు ధర, తుపాను వంటి విపత్తులు సంభవించినప్పుడు అందించే పరిహారం, బీమా సమాచారం సహా పలు వివరాలు ఉంటాయని తెలిపారు. -
చెల్లెలి కోసం పెద్ద త్యాగం చేశా : రాహుల్
కాన్పూర్: ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆయన సోదరి ప్రియాంకగాంధీ మధ్య కాన్పూర్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్, ప్రియాంకలు బిజీగా ఉన్నారు. కాన్పూర్ ఎయిర్పోర్టులో శనివారం చెల్లెలు ప్రియాంకను కలిసిన రాహుల్ సరదాగా మాట్లాడారు. 'నేను చాలా మంచి అన్నయ్యను. చెల్లెలి కోసం పెద్ద త్యాగం చేశాను. ఎన్నికల ప్రచారానికి వెలుతున్న సోదరికి విశాలమైన హెలీకాప్టర్ను కేటాయించా. సుదూర ప్రయాణాలు, సుడిగాలి పర్యటనలు చేస్తున్న నేను మాత్రం చిన్న హెలీకాప్టర్తో సరిపెట్టుకున్నా' అని నవ్వుతూ అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రియాంక నా పరువు తీయకు సోదరా అంటూ అడ్డుకునేందకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి ప్రచారానికి వాళ్లు వెళ్లిపోయారు. ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్నవాళ్లు ఆసక్తిగా తిలకించారు. కాన్పూర్ హెలీప్యాడ్లో జరిగిన ఈ సరదా ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఉద్దండుల కర్మభూమి కనౌజ్
లోక్సభ ఎన్నికల నాలుగో దశలో పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్లోని 13 నియోజకవర్గాల్లో ఆసక్తికర పోటీ జరుగుతోంది. అవధ్ ప్రాంతంలోని ఐదు సీట్లు(ఉన్నావ్, హర్దోయ్, కాన్పూర్, ఖేరీ, మిస్రిక్), బుందేల్ఖండ్లోని మూడు స్థానాల్లో(జాలోన్, ఝాన్సీ, హమీర్పూర్) పాలకపక్షమైన బీజేపీకి బీఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాలతోపాటు షాజహాన్పూర్, ఫరూఖాబాద్, ఇటావా, కనౌజ్, అక్బర్పూర్లో ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న కనౌజ్లో ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ కోడలు డింపుల్ మరోసారి పోటీలో ఉండగా, ఉన్నావ్లో బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ సాక్షీ మహారాజ్ మళ్లీ బరిలోకి దిగారు. ఫరూఖాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కిందటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పోటీచేస్తున్నారు. కాన్పూర్లో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ స్థానంలో సత్యదేవ్ పచౌరీని ఆ పార్టీ రంగంలోకి దింపింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో మిగిలిన సీట్లలో మాదిరిగానే ఈ నెల 29న పోలింగ్ జరిగే ఈ 13 స్థానాల్లో మహాగuŠ‡బంధన్ సగం వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. త్రిముఖ పోటీలు జరిగే అనేక సీట్లలో బీజేపీ గెలుపు కాంగ్రెస్ చీల్చుకునే ఓట్లపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు. మొదటి రెండు దశల్లో పోలింగ్ జరిగిన పశ్చిమ యూపీ, దాని పరిసర ప్రాంతాల నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ సంతృప్తికర స్థాయిలోనే జరిగిందనే వార్తల నేపథ్యంలో రెండు పార్టీలు ఎన్నికల్లో బాగానే కలిసి పనిచేస్తున్నాయి. ములాయం పోటీచేస్తున్న మైన్పురీలో ఆయనతోపాటు బీఎస్పీ నాయకురాలు మాయావతి ఒకే వేదిక నుంచి ప్రసంగించడం, ఆమెకు ములాయం, మాజీ సీఎం అఖిలేశ్ ఇస్తున్న గౌరవ మర్యాదలు రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు గట్టిగా కృషిచేయడానికి దారితీసింది. వరుసగా దళితులు, బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఈ రెండు పక్షాల మధ్య పొత్తు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిస్తోందని పోలింగ్ సరళిని బట్టి అంచనావేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కొనసాగితే నాలుగో దశలో పోలింగ్ జరిగే అవధ్, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో కూడా ఎస్పీ, బీఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. డింపుల్ యాదవ్, సల్మాన్ ఖుర్షీద్, సత్యదేవ్ పచౌరీ, సాక్షీ మహారాజ్, అనూ టండన్ ఉద్దండుల కర్మభూమి కనౌజ్ మాజీ సీఎం అఖిలేశ్ భార్య, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్ మూడోసారి కనౌజ్ నుంచి పోటీచేస్తున్నారు. 1998 నుంచీ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోట కనౌజ్ నియోజకవర్గం. ములాయం ఈ స్థానం నుంచి మూడు సార్లు గెలుపొందారు. 1967లో సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా గెలుపొందగా, 1984లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేంద్ర మంత్రి అయ్యారు. 2009లో కనౌజ్తోపాటు ఫిరోజాబాద్ నుంచి కూడా పోటీచేసి గెలిచిన అఖిలేశ్ ఫిరోజాబాద్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున డింపుల్ పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి, బాలీవుడ్ నటుడు రాజ్బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం పదవి చేపట్టాక కనౌజ్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆమె తన సమీప అభ్యర్థి సుబ్రత్ పాఠక్పై 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి నిర్మల్ తివారీకి లక్షా 27 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎస్పీకి బీఎస్పీ మద్దతు ఇవ్వడంతో డింపుల్ విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. కిందటిసారి ఓడిపోయిన సుబ్రత్ పాఠక్ మరోసారి బీజేపీ టికెట్పై పోటీచేస్తుండడంతో డింపుల్కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. యాదవులతోపాటు గణనీయ సంఖ్యలో ఉన్న బ్రాహ్మణుల ఓట్లు ఈ వర్గానికి చెందిన పాఠక్కే పడితే డింపుల్కు గట్టి పోటీ తప్పదు. నామినేషన్ రోజు డింపుల్ ఊరేగింపులో పాల్గొన్న ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ మద్దతుదారుల సంఖ్యను బట్టి ఆమె విజయం సునాయాసమని మహా కూటమి అంచనావేస్తోంది. సాక్షీ మహారాజ్కు సాటి ఎవరు? ముస్లింలు, బీజేపీ వ్యతిరేకులపై దూకుడుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సిట్టింగ్ సభ్యుడు సాక్షీ మహారాజ్ (డా.సచ్చిదానంద్ హరి సాక్షి)కు ఆలస్యంగా ఉన్నావ్లో పోటీకి మరోసారి బీజేపీ టికెట్ లభించింది. 63 ఏళ్ల ఈ హిందూ సన్యాసి 2014లో ఉన్నావ్ స్థానంలో తన సమీప ఎస్పీ అభ్యర్థి అరుణ్శంకర్ శుక్లాపై 3 లక్షల పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి బ్రజేష్ పాఠక్కు రెండు లక్షలకు పైగా ఓట్లు దక్కాయి. 2009లో ఇక్కడ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి అన్నూ టండన్ లక్షా 97 వేల ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సాక్షి మహారాజ్ బీసీ వర్గానికి చెందిన లోధా కులానికి చెందిన నేత. 1991లో మథుర నుంచి, 1996, 98లో ఫరూఖాబాద్ నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్న ఉన్నావ్లో కింద టిసారి ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులిద్దరూ ఈ వర్గం వారే. అయితే, ఈ వర్గం ప్రజలు యూపీలో కాషాయపక్షం వైపు మొగ్గు చూపడంతో సాక్షి గెలుపు సాధ్యమైంది. ఈసారి కూడా ఎస్పీ, కాంగ్రెస్ తరఫున అరుణ్శంకర్ శుక్లా, అనూ టండన్ పోటీకి దిగారు. పొత్తులో భాగంగా బీఎస్పీ పోటీలో లేదు. 1999 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఏ పార్టీ వరుసగా రెండు సార్లు ఉన్నావ్లో గెలవలేదు. మహా కూటమి అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న సాక్షి ఈ ఆనవాయితీ నిజమైతే గెలవడం కష్టమే. ఫరూఖాబాద్లో సల్మాన్ ఖుర్షీద్ మరో ప్రయత్నం! రెండో యూపీఏ సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేసిన వివాదాస్పద కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మరోసారి ఫరూఖాబాద్ నుంచి రంగంలోకి దిగారు. ఆయన ఇక్కడ 1991, 2009లో రెండుసార్లు విజయం సాధించారు. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నాలుగో స్థానంలో నిలవడమేగాక డిపాజిట్ కోల్పోయారు. 2014లో బీజేపీ అభ్యర్థి ముకేష్ రాజ్పుత్ తన సమీప ఎస్పీ అభ్యర్థి రామేశ్వర్ యాదవ్పై లక్షన్నరకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ తరఫున రాజ్పూత్, ఖుర్షీద్ బరిలోకి దిగారు.ఈసారి మహాగuŠ‡బంధన్ తరఫున బీఎస్పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్ పోటీకి దిగారు. సల్మాన్ ఖుర్షీద్ మాజీ రాష్ట్రపతి డా.జాకిర్హుస్సేన్ మనవడు. 1984లో ఖుర్షీద్ తండ్రి ఖుర్షీద్ ఆలం ఖాన్ విజయం సాధించాక మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. కిందటి ఎన్నికల్లో ఖుర్షీద్ ఫరూఖాబాద్లో డిపాజిట్ దక్కించుకోలేదంటే కాంగ్రెస్ ఇక్కడ ఎంత బలహీనమైందో అర్థంచేసుకోవచ్చు. విద్యావంతుడు, ప్రసిద్ధ లాయర్ అయిన ఖుర్షీద్ నెహ్రూగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరు సంపాదించారు. కాన్పూర్లో కొత్త నేత యూపీలో మొదటి పారిశ్రామిక నగరంగా పేరొందిన కాన్పూర్ స్థానం నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ కిందటి ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. 85 ఏళ్ల జోషీకి మళ్లీ పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో సత్యదేవ్ పచౌరీ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. గతంలో కాన్పూర్ నుంచి మూడుసార్లు వరుసగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ (కాంగ్రెస్)ను 2014లో జోషీ రెండు లక్షల 22 వేలకు పైగా ఆధిక్యంతో ఓడించా రు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎస్పీ. బీఎస్పీ కూటమి తరఫున శ్రీరాం కుమార్(ఎస్పీ) బరిలోకి దిగారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేత జైస్వాల్కు బీజేపీ కొత్త అభ్యర్థికి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బుందేల్ఖండ్పై బీజేపీ పై చేయి సాధిస్తుందా? యూపీ, మధ్యప్రదేశ్లో విస్తరించి ఉన్న బుందేల్ఖండ్ ప్రాంతంలోని మూడు యూపీ లోక్సభ స్థానాల్లో బీజేపీ, మహా కూటమి మధ్య హోరాహోరీ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జాలోన్(ఎస్సీ), ఝాన్సీ, హమీర్పూర్ సీట్లలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతుంది. ఈ ప్రాంతంలోని బందా స్థానంలో మే ఆరున పోలింగ్ జరుగుతుంది. బ్రాహ్మణులు, రాజపుత్రులతోపాటు బీసీలు, దళితులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ముస్లింల జనాభా బాగా తక్కువ. ఈ కారణంగా బీజేపీ, ఎస్పీబీఎస్పీ కూటమి మధ్య బుందేల్ఖండ్లో గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నా మొగ్గు కాషాయపక్షానికే ఉందని కొందరు ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నాలుగు సీట్లలో అత్యధికంగా 44.86 శాతం ఓట్లు సాధించి అన్నింటినీ కైవసం చేసుకుంది. మూడేళ్ల తర్వాత జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని 45.01 శాతానికి పెంచుకుని ఈ ప్రాంతంలోని మొత్తం 20 సీట్లలో విజయం సాధించింది. 1996, 1998 ఎన్నికల్లో సైతం బీజేపీ ఇక్కడ తిరుగులేని విజయం సాధించింది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసిపోటీచేయడంతో బీజేపీకి తొలిసారి ఊహించని పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ రెండు సార్లు ఒక్కొక్క సీటునే గెలుచుకుంది. జాలోన్, హమీర్పూర్లో బీఎస్పీ పోటీచేస్తుండగా, ఝాన్సీలో ఎస్పీ అభ్యర్థిని నిలిపింది. స్వల్ప సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లతోపాటు ఎస్సీ, బీసీ వర్గాల ఓట్లు అత్యధికంగా మహా కూటమి అభ్యర్థులకు పడితే కిందటి పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ నూరు శాతం విజయాలు సాధించడం కష్టమే. 2014 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు దక్కిన ఓట్లను కలిపి చూస్తే బందా, ఝాన్సీలో ఈ కూటమి విజయానికి అవకాశాలున్నాయి. వరుస కరువు కాటకాలతో ఇబ్బందులుపడుతున్న బుందేల్ఖండ్ ప్రజలకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం లభించలేదు. హిందుత్వ రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉన్న ఈ మూడు సీట్లలో ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఎంత వరకు ఉందనేది అంచనాలకు అందడం లేదు. -
పట్టాలు తప్పిన హౌరా ఎక్స్ప్రెస్
లక్నో : హౌరా - న్యూఢిల్లీ పూర్వ ఎక్స్ప్రెస్ శనివారం పట్టాలు తప్పింది. కాన్పూర్ పట్టాణానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్ప్రెస్.. కాన్పూర్ జిల్లాలోని రూమ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం 12.54 గంటలకు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభంవించలేదని.. ఓ ఎనిమిది మంది ప్రయాణికులకు మాత్రం తీవ్ర గాయాలయ్యానని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 900 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లు, బస్సులు వినియోగిస్తున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాలు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
‘నేను ఇందిరను కాదు.. ఆమెలానే సేవ చేస్తాను’
లక్నో : ప్రజలకు సేవ చేయడంలో తప్ప మిగతా ఏ విషయాల్లోనూ నన్ను నానమ్మతో పోల్చకండి అంటున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కార్యకర్తలు తనను తన నానమ్మ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చడంపై స్పందిస్తూ.. ఈ విధంగా వ్యాఖ్యనించారు ప్రియాంక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా నానమ్మతో నన్ను పోల్చడం తగదు. నేను ఏ విషయంలోనూ ఆమెతో పోటీ పడలేను. కానీ ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే కోరిక నానమ్మ మనసులో చాలా బలంగా ఉండేది. అదే లక్షణం నాకు, నా సోదరునికి కూడా అబ్బింది. దాన్ని మాత్రం మా నుంచి ఎవరు వేరు చేయలేరు. అందుకు మీరు అనుమతించినా.. ఇవ్వకపోయినా ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’ అని తెలిపారు. ఈ క్రమంలో ప్రియాంక బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ ఐదేళ్లలో వారు తమ అభివృద్ధి గురించి ఆలోచించారు తప్ప ప్రజలకు చేసిందేమి లేదని మండిపడ్డారు. బీజేపీ తీరు పట్ల దేశంలో అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం వల్ల నిజంగా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. కాన్పూర్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. కానీ నేటికి ఇక్కడ నిరుద్యోగం, రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రూ. 140 కోట్లు దోచేశారు
లక్నో : కాన్పూర్లో చోటు చేసుకున్న ఓ దొంగతనం పోలీసులతో పాటు జనాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. బిర్హానా రోడ్లో ఉన్న ఓ జ్యూవెలరి షాప్లో దాదాపు 140 కోట్ల రూపాయల విలువ చేసే సొత్తు చోరికి గురయినట్లు తెలిసింది. అయితే ఐదేళ్ల క్రితం మూసి వేసిన షాప్లో ఇంత భారీ దొంగతనం జరగడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాలు.. పార్టనర్ల మధ్య విబేధాలు తలెత్తడంతో బిర్హానా రోడ్డులో ఉన్న ఈ జ్యూవెలరి షాప్ని ఐదేళ్ల క్రితం మూసి వేశారు. ఈ వివాదం గురించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే కోర్టు పోలీసలు అధ్వర్యంలో షాప్ను ఒపెన్ చేయవచ్చంటూ ఆదేశించింది. దాంతో మరి కొద్ది రోజుల్లోనే షాప్ను తిరిగి తెరవాలని భావిస్తుండగా ఈ దొంగతనం చోటు చేసుకుంది. దొంగలు షాప్ నుంచి 10 వేల క్యారెట్ల విలువైన వజ్రాలు, 500 కేజీల వెండి, 100 కేజీల బంగారంతో పాటు 5 వేల క్యారెట్ల విలువ గల ఆభరణాలు దోచుకెళ్లినట్లు తెలిసింది. వీటితో పాటు షాప్కు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా తస్కరించినట్లు సమాచారం. షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు. షాప్ చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలిస్తున్నారు. -
విషం తాగిన ఐపీఎస్ అధికారి
కాన్పూర్ : ఓ యువ ఐపీఎస్ అధికారి బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ పోలీసు సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న సురేంద్రదాస్ బుధవారం తన అధికారిక నివాసంలో విషం తాగారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. తన నివాసంలో కదలిక లేకుండా పడి ఉన్న సరేంద్రదాస్ను సిబ్బంది గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని, అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. లక్నోలో నివాసముంటున్న సురేంద్రదాస్ తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. 2014 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సురేంద్రదాస్కు మంచి పేరుంది. అతని భార్య డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా భార్యతో తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం. అందుకే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. -
కుక్కను మేక అని నమ్మించి...
కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఓ వ్యక్తి దగ్గర ఉన్న మేకను దొంగిలించాలని భావించిన కొందరు దొంగలు.. అది మేక కాదు కుక్క అని చెప్పి ఆ వ్యక్తిని నమ్మిస్తారు. దొంగల మాటలు నమ్మిన ఆ వ్యక్తి మేకను కుక్కగా భావించి దాన్ని వదిలేసి వెళ్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి మోసపూరిత సంఘటనే ఒకటి కాన్పూర్లో జరిగింది. కుక్కను మేక అని నమ్మించి దుండగుడు ఓ అమాయకుడిని బురడీ కొట్టించాడు. పది వేల రూపాయలు విలువ చేసే మేకను ఎత్తుకుపోయాడు. వివరాల ప్రకారం.. కాన్పూర్కు చెందిన అశ్రఫ్ బక్రీద్ పర్వదినం సందర్భంగా తన దగ్గర ఉన్న మూడు నల్ల మేకలను అమ్మడానికి స్థానిక సంతకు తీసుకెళ్లాడు. రెండు మేకలను అమ్మాడు. మూడో మేకను ఒక దగ్గర కట్టేసి.. దాన్ని అమ్మడం కోసం సంతంతా తిరుగుతున్నాడు. అయితే ఇంతలో ఒక వ్యక్తి అశ్రఫ్ దగ్గరకు వచ్చి నీ మేక తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను ఓ చోట కట్టేశాను, వెళ్లి ఆ మేకను తెచ్చుకోమని చెప్పాడు. ఆ విషయం విన్న అశ్రఫ్, ఆ వ్యక్తి చెప్పిన మాటలను నిర్ధారించుకోకుండా, సరాసరి ఆ వ్యక్తి చెప్పిన చోటకే వెళ్లాడు. అక్కడ మొహం కనపడకుండా పూలతో అలంకరించిన ఒక నల్ల జంతువును చూశాడు. అయితే అశ్రఫ్ ఏ తాడుతో తన మేకను కట్టేసాడో అచ్చం అలాంటి తాడుతోనే ఆ నల్ల జంతువును కూడా కట్టి వేసి ఉంచాడు దుండగుడు. దాంతో అశ్రఫ్ దాన్ని తన మేకగానే భావించి వెళ్లి తాడు విప్పడానికి ప్రయత్నించాడు. అంతే ఆ మేక కాస్తా మొరగడం ప్రారంభించింది. మేక మొరగడమేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే అది మేక కాదు.. కుక్క కాబట్టి మొరిగింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న అశ్రఫ్ ప్రారంభంలో తన మేకను కట్టివేసిన ప్రదేశానికి వెళ్లాడు. కానీ అక్కడ అశ్రఫ్ మేక లేదు. మేక తప్పించుకు పోయిందని చెప్పిన వ్యక్తి తనని బురిడి కొట్టించి మేకను దొంగలించాడని అశ్రఫ్కు అర్ధమయ్యింది. దాంతో ఈ విషయం గురించి అక్కడ మార్కెట్ అధికారులకు చెప్పి సాయం చేయమని కోరారు. కానీ వారు అశ్రఫ్ అమాయకత్వానికి నవ్వడంతో అవమానం భరించలేని అశ్రఫ్ అక్కడ నుంచి వెళ్లి పోయాడు. -
గంగా నదిలో ఆరుగురు చిన్నారుల గల్లంతు
కాన్పూర్ : గంగా నదిలో ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం కాన్పూర్లోని గంగా నదిలో స్నానానికి వెళ్లిన చిన్నారులు, నీటిలో మునిగిపోయారు. వారంత కూడా 10 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల వారని తెలుస్తోంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు, ఈతగాళ్లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. ఆరుగురు చిన్నారులు నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశాం. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాలను కాన్పూర్లోని హాలెత్ హాస్పిటల్కు తరలించామన్నారు. -
మొబైల్లో పోర్న్ చిత్రాలు చూసి..
కాన్పూర్ : యూపీలోని మహరాజ్గంజ్లో దారుణం జరిగింది. నాలుగేళ్ల పసిపాపై 6 నుంచి 12 సంవత్సరాల వయసున్న నలుగురు మైనర్ బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మొబైల్ పోన్లో నగ్న చిత్రాలు చూసిన అనంతరం వారు ఈ ఘోరానికి పాల్పడ్డారు. నిందితులను మూడు రోజుల రిమాండ్ అనంతరం కౌన్సెలింగ్ కోసం జువెనిల్ హోంకు తరలించారు. పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన నలుగురు బాలురను మంగళవారం కాన్పూర్ పోలీసులు జువెనిల్ కోర్టులో హాజరుపరిచారు. వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని కోర్టు పేర్కొంటూ మూడురోజుల రిమాండ్కు తరలించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు జువెనిల్ హోంలో మూడు రోజుల బాలల సైకియాట్రిస్ట్తో కౌన్సెలింగ్ ఇస్తామని కాన్పూర్ ఎస్పీ ఏకే మీనా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు మైనర్ బాలురు మొబైల్ ఫోన్లో నగ్న చిత్రాలను చూసిన క్రమంలో ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల పాపను సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులకు అపస్మారక స్థితిలో కనిపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం తనపై జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు మహరాజ్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
వైరల్ : పార్క్లో కుటుంబంపై బౌన్సర్ల వీరంగం
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. సోమవారం సరదాగా కాన్పూర్లోని బ్లూ వరల్డ్ థీమ్ వాటర్ పార్క్కు వెళ్లిన ఓ కుటుంబంపై బౌన్సర్లు విరుచుకుపడ్డారు. పార్క్లో అనుమతి లేకుండా రైడ్ చేశారని ఆరోపిస్తూ బౌన్సర్లు ఆ కుటుంబంతో వాగ్యూద్ధానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. బౌన్సర్లు ఆ కుటుంబ సభ్యులను కిందపడేసి మరి పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆ కుటుంబానికి చెందిన మహిళ జుట్టు పట్టి లాగుతూ అమానుశంగా దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో వారు ఏం చర్చించారో స్పష్టంగా లేకపోయినప్పటికీ.. వారి మధ్య అసభ్యకరమైన దూషణలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పార్క్లో ఓ కుటుంబంపై బౌన్సర్లు దాడి
-
వాజ్పేయి కోలుకోవాలని బీజేపీ కార్యకర్తల పూజలు
సాక్షి, లక్నో : ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాజ్పేయి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ కాన్పూర్లో బీజేపీ కార్యకర్తలు పూజలు నిర్వహించారు. పూర్తి ఆరోగ్యంతో వాజ్పేయి ఇంటికి చేరుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రార్థనలు చేశారు. తొలుత రొటీన్ చెకప్లో భాగంగా వాజ్పేయిని ఎయిమ్స్కు తరలించినట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. వాజ్పేయికి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఎయిమ్స్లో వాజ్పేయిని పరామర్శించి, చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
ఏసీ ఫెయిల్..ఐదుగురి మృతి
కాన్పూర్: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఎయిర్ కండీషనింగ్ పనిచేయకపోవడం వల్ల 24 గంటల వ్యవధిలో ఐదుగురు వృద్ధులు మృతిచెందారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలోని లాలా లజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ కారణంగా ఇంద్రపాల్(75), గంగా ప్రసాద్ యాదవ్(75), రసూల్ భక్ష్, మురారీ లాల్(65) అనే వృద్ధులతో పాటు మరో వృద్ధుడు కూడా మృతిచెందారు. వీరిలో ఇద్దరు గుండె ఆగిపోవడం వల్ల మరణించగా..మరో ముగ్గురు దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ చనిపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా.. ఎయిర్ కండీషనింగ్(ఏసీ)లో సమస్యలు ఉన్నట్లు తమకు తెలుసునని, రెండు రోజుల క్రితమే మెడిసిన్ డిపార్ట్మెంట్ ఐసీయూలో ఏసీ ప్లాంట్ను మూసివేశామని ఐసీయూ ఇంచార్జ్ సౌరవ్ అగర్వాల్ తెలిపారు.నిన్న ఏసీ ప్లాంట్లో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఉన్న సమస్యను పరిష్కరించామని, కానీ మళ్లీ సమస్య ఉత్పన్నమైందని ఆసుపత్రి పిన్సిపల్ నవనీత్ కుమార్ తెలిపారు. పరిస్థితి విషమించిన రోగులు మాత్రమే ఐసీయూలో ఉన్నారని, కేవలం ఏసీ ఫెయిల్ కావడం వల్లే రోగులు చనిపోలేదని ఆయన అన్నారు. ఈ సంఘటన గోరఖ్ పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఘటనను తలపిస్తోంది. గత సంవత్సరం ఆక్సిజన్ కొరత వల్ల సుమారు 60 మంది శిశువులు వారం వ్యవధిలో చనిపోయారు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టంతో ఈ గొడవ సద్దుమణిగింది.ఏసీ ఫెయిల్ సంఘటనపై నలుగు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశిస్తున్న కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ తెలిపారు. -
తాగి గొడవకు దిగిన నటుడు..
కాన్పూర్, ఉత్తరప్రదేశ్ : నటుడు రాజా చౌదరి మరో కాంట్రావర్సీలో చిక్కుకున్నారు. శుక్రవారం కాన్పూర్లో మద్యం సేవించిన ఆయన పలువురితో గొడవపడ్డారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాట్లాడిన పశ్చిమ కాన్పూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ మెడికల్ టెస్టుల కోసం రాజాను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. బిగ్బాస్-2 సీజన్తో రాజా పాపులర్ అయ్యారు. కాగా, రాజాకు 1998లో శ్వేత తివారీతో వివాహం జరిగింది. ఆయనపై గృహ వేధింపుల కేసు కూడా నమోదైంది. 2007లో శ్వేతతో ఆయన విడిపోయారు. 2012లో అధికారికంగా ఇరువురికి విడాకులు మంజూరు అయ్యారు. 2011లో పొరుగు ఇంటి వ్యక్తి పేరు మీద సెల్ఫోన్ కనెక్షన్కు రాజా దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి రాజాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాను అరెస్టు చేశారు. 2013లో ముంబైకి చెందిన అభినవ్ కోహ్లి అనే యువతిని రాజా వివాహం చేసుకున్నారు. ఆమెతో విభేదాలు రావడంతో విడిపోయారు. అనంతరం 2015లో ఢిల్లీకి చెందిన స్నేహితురాలు శ్వేత సూద్ను పెళ్లి చేసుకున్నారు. -
మద్యం మత్తులో నటుడి హల్ చల్
లక్నో: భోజ్పురి నటుడు రాజా చౌదరి మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచాడు. పీకల దాకా తాగి హల్ చల్ చేస్తూ ప్రజలపై దాడికి దిగాడు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజా మద్యం మత్తులో ఊగిపోతూ కనిపించిన వారిపై చెయ్యి చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాజాను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక ఎస్సై తెలిపారు. కాగా, హిందీ బిగ్బాస్-2 షో ద్వారా రాజా పాపులర్ అయ్యాడు. ఆ షో రన్నరప్ కూడా. నటి శ్వేతా తివారీ మాజీ భర్త అయిన రాజా గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇదే తరహాలో పలువురిపై చెయ్యి చేసుకుని కేసులు ఎదుర్కొంటున్నాడు. -
మా మతం అమ్మాయితో నీకేంట్రా పని?
లక్నో: వేరే మతానికి చెందిన యువతితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కారణంతో ఓ యువకుడిని చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. వెంబడించి మరీ ఆ యువతి ముందే అతనిపై దాడి చేశారు. ‘మా మతానికి చెందిన అమ్మాయితో నీకేంట్రా పని?’ అంటూ పిడిగుద్దులు గుప్పించారు. ఆపై ఆ దాడిని చిత్రీకరించి వాట్సాప్లో రాత్రికి రాత్రే వైరల్ చేశారు. కాన్పూర్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఇస్లాం మతానికి చెందిన యువకుడు ఆ యువతికి మధ్య మూడేళ్ల స్నేహం ఉంది. శుక్రవారం ఆమె ఊరెళ్తుండటంతో స్టేషన్కి వెళ్లి ఆమెను కలిశాడా యువకుడు. అయితే అతనికి తెలీకుండా అనుసరించిన కొందరు వ్యక్తులు.. అక్కడికక్కడే ఆ యువకుడిని దొరకబుచ్చుకుని దాడి చేశారు. మీ మధ్య సంబంధం ఏంటని? ఆ యువతిని వాళ్లు నిలదీయగా.. మధ్యలో జోక్యం చేసుకుని ఆ ముస్లిం యువకుడు చెప్పిన సమాధానం వారిలో మరింత ఆగ్రహం తెప్పించింది. ‘నిన్ను ఇవాళ చంపకపోతే మా పేరు మార్చుకుంటాం’ అంటూ వారు అతనిపై విరుచుకుపడ్డారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో ఇప్పుడు స్థానికంగా వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతోంది. ‘తాము కేవలం స్నేహితులం మాత్రమేనని, చెప్పేది వినకుండా తనపై దాడి చేశారని’ బాధిత యువకుడు వాపోతున్నాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాన్పూర్ పోలీసులు నిందితులను హిందూ అతివాద సంస్థకు చెందిన సభ్యులుగా గుర్తించి, వారి కోసం గాలింపు చేపట్టారు. (మానవత్వానికి మతం అడ్డుకాదు)