Kanpur
-
ఇజ్రాయెల్ మెషీన్తో చిటికెలో నవయవ్వనం, కట్ చేస్తే రూ. 35 కోట్లు
ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి. ముఖం మీద చిన్నముడత కూడా ఉండకూడదు. దీనికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఈ క్రేజ్నే క్యాష్ చేసుకొంటున్నారు మరికొంతమంది కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులను నమ్మించి వలలో వేసుకుంది. "ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మెషిన్" ద్వారా అందర్నీ నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి నమ్మబలికారు. అలా ఏకంగా 35 కోట్ల రూపాయలను దండుకుంది. ఇందుకోసం కాన్పూర్లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ - ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. "ఆక్సిజన్ థెరపీ" తో ఏకంగా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90వేలు... ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్ చేశారు. అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాను రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు రూజ35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు. ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. -
భారత్- బంగ్లా టెస్టుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట కూడా డౌటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా ప్రారంభం కాలేదు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ పార్క్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అయితే ప్రస్తుతం కాన్పూర్లో వర్షం కురవడం లేదు. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. గ్రీన్ పార్క్ స్టేడియంలో మెరుగైన డ్రైనజీ వ్యవస్ధ లేకపోవడంతో గ్రౌండ్ను రెడీ చేసేందుకు సిబ్బందికి కష్టతరం అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు అంపైర్లు పిచ్ను పరిశీలించనున్నారు. కాగా ఇప్పటికే రెండో రోజు(శనివారం) ఆట కనీసం బంతి పడకుండానే రద్దు అయింది. ఇప్పుడు మూడో రోజు ఆటకు కూడా భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మళ్లీ వర్షం ఏమైనా తిరుగుముఖం పడితే మూడో రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశముంది. కాగా బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
Ind vs Ban 2nd Test: 35 ఓవర్లకే ముగిసిన ఆట
IND vs BAN 2nd test live updates and highlights: టీమిండియా- బంగ్లాదేశ్ తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. వర్షం కారణంగా 35 ఓవర్లకే ఆగిపోయింది. దీంతో శుక్రవారం ఆట పూర్తయినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. కాన్పూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లా 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఆటంకంటీమిండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటకు ఆటంకం కలిగింది. వెలుతురులేమి కారణంగా ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.సెంచరీ మార్కు దాటిన బంగ్లాదేశ్34 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 102-3.మొమినుల్ హక్ 36, ముష్ఫికర్ రహీం 5 పరుగులతో ఆడుతున్నారు. అశ్విన్ మ్యాజిక్.. బంగ్లా మూడో వికెట్ డౌన్కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో రూపంలో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన శాంటో.. అశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 30 ఓవర్లకు బంగ్లా స్కోర్: 80/3. క్రీజులోకి రహీం వచ్చాడు.నిలకడగా ఆడుతున్న బంగ్లాబంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో మమూనల్ హాక్(17), శాంటో(28) పరుగులతో ఉన్నారు. కాన్పూర్లో వర్షం కూడా మొదలైంది.రెండో వికెట్ డౌన్..షాద్మాన్ ఇస్లాం రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షాద్మాన్.. ఆకాష్ దీప్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ శాంటో వచ్చాడు. 13 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 37/2తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాబంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ ఆకాష్ దీప్ బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ను పెవిలియన్కు పంపాడు. జైశ్వాల్ స్లిప్లో అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్రీజులోకి మమూనల్ హాక్ వచ్చాడు.5 ఓవర్లకు బంగ్లా స్కోర్: 13/05 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(8), జకీర్ హసన్(0) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్నభారత్..కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లా మాత్రం రెండు మార్పులు చేసింది. జట్టులోకి టాస్కిన్ ఆహ్మద్, నహిద్ రాణా స్ధానంలో ఖాలీల్ ఆహ్మద్, తైజుల్ ఇస్లాం వచ్చారు. గ్రీన్ పార్క్ పిచ్ కాస్త స్పిన్కు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన అదనపు స్పిన్నర్తో బంగ్లా ఆడుతోంది.తుది జట్లుబంగ్లాదేశ్: షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్టాస్ ఆలస్యంకాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమవ్వాల్సిన రెండో టెస్టుకు వరుణుడు ఆడ్డంకిగా మారాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.ప్రస్తుతం వర్షం ఆగడంతో గ్రౌండ్ను సిద్దం చేసే పనిలో సిబ్బంది పడ్డారు. దీంతో 9:00 గంటలకు పడాల్సిన టాస్ కాస్త ఆలస్యం కానుంది. మైదానాన్ని అంపైర్లు 9:30లకు పరిశీలించనున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు బయటకు వచ్చి సాధన చేస్తున్నారు. -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. భారత్ క్లీన్ స్వీప్పై కన్నేయగా.. మరోవైపు బంగ్లా ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట తొలి రెండు రోజుల పాటు కాన్పూర్లో భారీ వర్షం కురిసే అవకాశన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27(శుక్రవారం), శనివారం నాడు 90 శాతానికి పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఆదివారం కూడా వర్షం కురవడానికి 50 శాతం ఆస్కారం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ తెలుపుతుంది.ఆఖరి రెండు రోజులకు ఎటువంటి వర్షం ముప్పులేనిట్లు సమాచారం. అయితే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఆప్రమత్తమైంది. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ నుంచి అదనపు కవర్లను తెప్పించేందుకు యూపీసీఎ సిద్దమైంది. ముందు జాగ్రత్తగా మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచాలని యూపీసీఎ అధికారులు భావిస్తున్నారు. అయితే కాన్పూర్ గ్రౌండ్లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. దీంతో చిన్నపాటి వర్షం పడిన కూడా మ్యాచ్కు తీవ్ర అంతరాయం కలిగే చాన్స్ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా ఈ సిరీస్ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో కాన్పూర్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇరు జట్లు ఇప్పటికే కాన్పూర్కు చేరుకున్నాయి. -
గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే?
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు సమయం అసన్నమైంది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి టెస్టులో విఫలమైన బంగ్లాదేశ్ కనీసం కాన్పూర్ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.మూడేళ్ల తర్వాత..కాగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 2021లో న్యూజిలాండ్తో భారత్ తలపడింది. ఆఖరి సెషన్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో కివీస్ అసాధారణ పోరాటం కనబరిచింది. ఈమ్యాచ్తోనే రచిన్ రవీంద్ర కివీస్ తరపున టెస్టు క్రికెట్లోకకి అడుగుపెట్టాడు.బంగ్లాకు స్పిన్ ఉచ్చు..ఇక రెండో టెస్టుకు ముందు భారత జట్టు మెనెజ్మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. ఈ మ్యాచ్ కోసం గ్రీన్ పార్క్ మైదానంలో బ్లాక్ సోయిల్ పిచ్ను తాయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గరుండి పిచ్ను తాయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ సోయిల్ పిచ్ బౌన్స్ తక్కువగా ఉండి, టర్న్ ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ కొనసాగే కొద్దీ వికెట్ స్లో కానుంది. దీంతో ఈ ట్రాక్పై స్పిన్నర్లు పండుగ చేసుకుంటారు. ఈ క్రమంలో భారత స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరోసారి బంగ్లా బెండు తీసే అవకాశముంది. మరోవైపు బంగ్లాలో కూడా షకీబ్, మెహదీ హసన్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు.కాగా చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెడ్ సాయిల్ పిచ్ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఈ వికెట్ పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్, స్పిన్కు సహకరించింది. కానీ నల్లమట్టి పిచ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో కాన్పూర్ టెస్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: IT 2024: జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్ -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద భారీ భద్రత
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్పై టీమిండియా కన్నేసింది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో బంగ్లాతో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ సోమవారం గ్రీన్ పార్క్ స్టేడియం ముందు అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బంగ్లా జట్టు బస చేసే హోటల్ వద్ద భద్రతను భారీగా పెంచినట్లు కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు.యూపీ పోలీస్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అదనపు భద్రతను ఏర్పాటు ఆయన వెల్లడించారు. అదే విధంగా మ్యాచ్ జరిగే సమయంలో సీనియర్ ర్యాంక్ స్ధాయి ఆధికారులు కూడా బందోబస్తులో ఉంటరాని హరీష్ చందర్ స్పష్టం చేశారు. కాగా రెండో టెస్టు కోసం ఇరు జట్లు మంగళవారం సాయంత్రం కాన్పూర్కు చేరుకోనున్నాయి.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర
కాన్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్పై రైల్వే సిబ్బందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.కాన్పూర్లోని ప్రేమ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్లో ఎల్పీజీ సిలిండర్ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్పీఎఫ్కి, డిపార్ట్మెంట్లోని ఇతర అధికారులకు తెలియజేశారు.ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్పై ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్లోని ప్రయాగ్రాజ్ డివిజన్ పీఆర్వో అమిత్ సింగ్కు సమాచారం అందించారు.ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్పూర్- పూణె స్పెషల్ రైలు -
తల లేకుండా మహిళ మృతదేహాం.. యూపీలో కలకలం
లక్నో: ఉత్తరప్రదేశ్లో తలలేకుండా.. నగ్నంగా గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. కాన్పూర్ సమీపంలోని గుజైనా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం మహిళ నగ్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలిపై అత్యాచారం చేసి, హత్యచేసి రహదారిపై పడేసే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు. అయితే ఆమె ఎవరు? అనేది ఇంకా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.బుధవారం ఉదయం 5 గంటలకు తలలేని మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహాం పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలం దగ్గర ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు కానీ.. హైవేకి అవతలి వైపున ఉన్న ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కొన్ని గంటల ముందు అలాగే ఉన్న ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. ఫుటేజీలో మహిళ బూడిద రంగు ప్యాంటు ధరించి కనిపించగా.. మృతదేహానికి సమీపంలోనూ బూడిద రంగు దుస్తులముక్కలు కనిపించాయని పేర్కొన్నారు. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జిల్లాలో మహిళ మిస్సింగ్పై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: శ్రుతి జీవితంలో మరో పెను విషాదంమరోవైపు ఘటనా స్థలిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి, ఆమె దంతాలు, ఎముకల నుంచి నమూనాలను సేకరించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా నేరమా? బాధితురాలు స్థానిక మహిళేనా? వేరే ప్రాంతానికి చెందింది అనేది నిర్దారించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరిగిన మరో షాకింగ్ ఘటన ఇది.. తల లేకుండా.. నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని కాన్పూర్ జాతీయ రహదారిపై గుర్తించారు.. ఈ అంశంపై నిప్పక్షపాతంగా విచారణ జరిపించి.. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా నిందితులకు కఠిన శిక్ష విధించాలి’ అని డిమాండ్ చేశారు. -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్స్టార్స్తో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్స్టార్స్కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్కు ఫోర్తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
యూపీలో మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్-కాన్పూర్ రైల్వే లైన్లో కాస్గంజ్ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ట్రాక్పై ఉంచిన భారీ కర్ర దుంగను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొంది. దానిని రైలు ఇంజిన్ 550 మీటర్ల దూరంవరకూ ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ ముందు భాగంలో దుంగ ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ డివిజన్లో వారం వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. గత శుక్రవారం నాడు పంకిలో బండరాయిని ఢీకొనడంతో సబర్మతి ఎక్స్ప్రెస్ బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా కాస్గంజ్ నుండి ఫరూఖాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (05389) భటాసా స్టేషన్ సమీపంలో ట్రాక్పై ఉంచిన భారీ కర్ర దుంగను ఢీకొంది. నాలుగున్నర అడుగుల పొడవున్న దుంగ బరువు 35 కిలోలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ జహీర్ అహ్మద్, ఆర్పీఎఫ్ ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అంకుష్ కుమార్, ఇంజన్ విభాగానికి చెందిన రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ కర్ర దుంగను తొలగించి 33 నిమిషాల తర్వాత రైలును పంపించారు. ఘటనా స్థలానికి 50 అడుగుల దూరంలో ఒక పొలంలో మృతదేహం పడివుండటాన్ని వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చిడతలు వాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యే సందడి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో లోక్సభ నాలుగో దశ పోలింగ్ సందడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్కు చేరుకోవడం ప్రారంభించారు. ఈ దశలో యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు.కాన్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతాని సందడి చేశారు. చిడతలు, తాళాలు, డోలు వాయిస్తూ ఊరేగింపుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటర్లందరూ ఉత్సాహంగా బయటకు వచ్చి ఓటేసేలా చైతన్యపరచడానికి ఇలా చేసినట్లు ఆయన వివరించారు. -
Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
కనౌజ్/కాన్పూర్: విపక్షాల ‘ఇండియా’ కూటమి తుపాను ఉత్తరప్రదేశ్లోకి దూసుకొస్తోందని ఈ ధాటికి మరోసారి మోదీ ప్రధాని కాలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యూపీలో 80 స్థానాలకుగాను కనీసం 50 చోట్ల మా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని కనౌజ్, కాన్పూర్లలో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశ ప్రధానిగా మోదీ మరోసారి పగ్గాలు చేపట్టలేరని లిఖితపూర్వక గ్యారెంటీగా భావించండి. ఇక అంతా అయిపోయింది. బీజేపీ ఓటమి ఖాయం. అందుకు అనుగుణంగానే విపక్షాల కూటమి చాన్నాళ్ల క్రితమే ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించింది. విద్వేష బజార్లలో ప్రేమ దుకాణాలను తెరిచాం. భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర చేశాం. దేశవ్యాప్తంగా విపక్షాల సమావేశాలు నిర్వహించాం’’ అని అన్నారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న మోదీ ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఓటర్లు పదేళ్ల నుంచి చూస్తున్నారు. ఒక్కసారైనా మోదీ అదానీ, అంబానీల పేరెత్తలేదు. కానీ ఇప్పుడు ఓటమి సుడిగుండం నుంచి కాపాడతారేమోనని వాళ్ల పేర్లు తొలిసారిగా ప్రస్తావిస్తున్నారు. ఓడిపోతున్నాను.. కాపాడండి అదానీ, అంబానీజీ అంటూ మోదీ ప్రాథేయపడుతున్నారు’’ అని రాహుల్ వెటకారంగా మాట్లాడారు. మోదీకి టెంపో బాగా తెలుసు టెంపోల నిండా అదానీ, అంబానీల నుంచి నగదు మూటలు వచ్చినందుకేæ కాంగ్రెస్ నోరుమూసుకుందని మోదీ అనడంపై రాహుల్.. ‘‘ అంటే మోదీకి తరచూ అదానీ డబ్బులను టెంపోలో పంపిస్తారన్నమాట. ఏ రకం టెంపోలో డబ్బులు పంపిస్తారో ఆయనకు బాగా తెలుసు. టెంపోల గురించి మోదీకి బాగా అవగాహన ఉన్నట్లుంది’’ అని అన్నారు. -
బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
బాకీ తీర్చని ఓ టీనేజర్పై సీనియర్లు దాష్టికానికి దిగారు. తీర్చాల్సిన బాకీ కంటే ఎన్నో రెట్ల డబ్బులివ్వాలంటూ బెదిరించారు. ఇవ్వలేనని చెప్పడంతో వేధింపులకు దిగారు. ఆ వేధించడం మరీ హింసాత్మకంగా ఉండడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఉత్తరప్రదేశ్ ఎటావాకు చెందిన టీనేజర్.. నీట్ కోచింగ్ కోసం కాన్పూర్ వచ్చాడు. కోచింగ్ సెంటర్లో సీనియర్లతో స్నేహం కుదిరి..వాళ్లు ఉంటున్న ప్లాట్కి మకాం మార్చాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ కోసం వాళ్ల దగ్గరి నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. అయితే గేమ్లో ఆ డబ్బంతా పొగొట్టుకున్నాడు.దీంతో.. ఆ సీనియర్లు 20 వేలకు బదులు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. సదరు విద్యార్థి చెల్లించకలేకపోయేసరికి.. అతన్ని చిత్రహింసలు పెడుతూ ఆ తతంగం అంతా వీడియో తీశారు. ఆ విద్యార్థినిని కింద పడేసి చితకబాదారు. కాళ్లు మొక్కుతున్నా విడిచిపెట్టకుండా.. బలవంతంగా అతని దుస్తులు విప్పించారు. మర్మాంగానికి ఇటుకను కట్టి వేలాడదీస్తూ వేధించారు. ఈ దాష్టీకం ఇంతటితోనే ఆగలేదు. అతని వెంట్రుకల్ని తగలబెట్టే ప్రయత్నమూ చేశారు.#UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray.Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y— Siraj Noorani (@sirajnoorani) May 7, 2024చివరకు బాధితుడు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎటావా పోలీసులు నిందితులను పిలిపించి.. కేవలం మందలించి వదిలేశారు. ఈలోపు టీనేజర్ను వేధించిన వీడియోలు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వీడియోలో ఉన్న ఆరుగురు నిందితులను గుర్తించి.. అరెస్ట్ చేశారు. ఒక ముఠాగా మారి కోచింగ్సెంటర్కు వచ్చే విద్యార్థులను వీళ్లు టార్గెట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. -
స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి నానారావ్ పార్కులో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఎన్నాళ్లయినా అందుబాటులోకి రాకపోవడంపై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కాన్పూర్ పట్టణంలోని నానారావ్ పార్క్ ఎంతో పురాతనమైనది. యోగి ప్రభుత్వం పార్కు నిర్వహణ, సుందరీకరణకు సంబంధించి పలు వాగ్దానాలు చేసింది. వీటిలో స్విమ్మింగ్ పూల్ను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒకటి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తికాలేదు. దీనిపై ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఆయన ఒక చిన్న బాత్ టబ్తో ఈ పార్కుకు చేరుకుని, దానిని నీటితో నింపారు. ఆ తర్వాత ఆ టబ్లో ఆయన కూర్చున్నారు. దానిలోనే ఎంజాయ్ చేస్తూ, స్వీట్లు కూడా తిన్నారు. పైగా పక్కనే ఒక బ్యానర్ తగిలించి, దానిపై ‘రూ.11 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు’ అని రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్విమ్మింగ్ పూల్పై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, నగర ప్రజలు వేసవిలో ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోతున్నారని వాపోయారు. ఈ కొలను 2023లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదన్నారు. దీని నిర్మాణంలో ఆర్థిక సమస్య లుంటే తమకు తెలియజేయాలని, అప్పుడు ప్రజల నుండి విరాళాలు సేకరించి అందజేస్తామన్నారు. -
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాద్లో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్ అసద్ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపారు. -
‘దోమలు బాబోయ్ దోమలు’.. రైల్వే మంత్రికి ప్రయాణికుని ఫిర్యాదు!
దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. -
తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్ మ్యాచ్.. ఛార్జర్ కేబుల్తో ఉరేసి..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్ మ్యాాచ్ను యావత్ క్రికెట్ అభిమానులంతా ఆసక్తికరంగా వీక్షించారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ పోరును, టీవీ, హాట్స్టార్, పలుచోట్ల భారీ స్క్రీన్ల ద్వారా ఉత్కంఠగా చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫైనల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. అయితే వరల్డ్ కప్ తుది పోరు ఓ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ తండ్రి.. మ్యాచ్ మధ్యలో టీవీ ఆపేశాడన్న కోపంతో కన్న కొడుకుతో వాగ్వాదానికిదిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో కొడుకును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం వెలుగుచూసింది,. వివరాలు.. కాన్పూర్కు చెందిన గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలో అతడి కుమారుడు దీపక్.. తనకు ఆకలిగా ఉండటంతో త్వరగా వంట చేయాలని కోరాడు. తన మాటలను తండ్రి పట్టించుకోకుండా మ్యాచ్లో లీనమైపోవడంతో దీపక్ టీవీని ఆఫ్ చేశాడు. దీంతో గణేష్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కొడుకుతో గొడవపడ్డాడు. ఇది ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. చదవండి: అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి! అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్ ప్రసాద్.. పక్కనే ఉన్న మొబైల్ ఛార్జర్ కేబుల్తో కొడుకును ఉరేసి చంపాండు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. మెట్లపై దీపక్ మృతదేహాన్ని పడి ఉండటాన్ని గుర్తించిన వారి బంధువు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాన్పూర్ ఏసీపీ బ్రిజ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమైందని వెల్లడించారు. నిందితుడు హత్యకు మొబైల్ ఛార్జర్ కేబుల్ను ఉపయోగించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారని చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ తరుచూ మద్యం సేవించి గొడవ పడుతుంటారని తెలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల దీపక్ తన తల్లిని కొట్టాడంతో గతవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. -
దీపావళి విషాదం: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి!
దీపావళి రోజున ఉత్తరప్రదేశ్(యూపీ)లోని కాన్పూర్ దేహత్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో బాంబు పేలడంతో రసూలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్ నుంచి కాన్పూర్ నగర్ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్కు తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
30 ఏళ్ల మహిళతో తండ్రి సహాజీవనం.. తట్టుకోలేక కొడుకుల కిరాతకం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోరం వెలుగుచూసింది. తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేని కొడుకు వారి ఇద్దరిని అంతమొందించాలని పథకం వేశాడు. మధ్యలో తాత అడ్డు రావడంతో ముగ్గురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తాత, సహజీవనం చేస్తున్న మహిళ మృత్యువాత పడగా.. తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం కాన్పూర్ దేహత్ జిల్లాలో గురువారం ఉదయం జరిగింది.. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. రామ్ ప్రకాశ్ ద్వివేది(83), అతని కుమారుడు విమల్(63), అతని భాగస్వామి ఖుష్బు(30)కలిసి అమ్రోదా పట్టణంలో నివసిస్తున్నారు. విమల్ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విమల్ కొడుకు లలిత్(42), సోదరుడు అక్షత్(18) గురువారం ఉదయం తండ్రి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. తాత, తండ్రి, మహిళను విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం రామ్ ప్రకాశ్, ఖుష్బును కత్తితో పొడిచి చంపారు. నిందితుల దాడి నుంచి తప్పించుకొని విమల్ ఇంటి నుంచి బయటకు పరుగెత్తాడు. ఈ విషయాన్ని గమనించిన ఇంటి పక్కన ఉండే మున్నా వెంటనే పక్క ఇంట్లో ఉంటున్న విమల్ అన్న కమల్కు సమాచారం అందించాడు. అతడువిమల్ను జిల్లా ఆసుపత్రికి అటు నుంచి కాన్పూర్లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్షత్ లలిత్లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 30 ఏళ్ల ఖుష్బుతో తండ్రి సంబంధపై ఇద్దరు కుమారులు అసంతృప్తిగా ఉన్నారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ పాండే తెలిపారు. విచారణలో రామ్ప్రకాష్, ఖుష్బులను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. -
రొట్టె కోసం రక్తపాతం..అన్నను హత్య చేసిన తమ్ముడు!
యూపీలోని కాన్పూర్లో రొట్టె ముక్కకోసం అన్నదమ్ములు రక్తం కళ్లజూసుకున్నారు. రొట్టె కోసం జరిగిన వివాదంలో తమ్ముడు అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అన్నయ్య.. తమ్ముని కోసం ప్రత్యేకంగా రొట్టెలు తయారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అన్నను హత్య చేసిన తమ్ముడు అంతటితో ఆగక సోదరుని మృతదేహంతో ఏమి చేశాడో తెలిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ ఉదంతం కాన్పూర్లోని బిల్హౌర్ పరిధిలోని నానామవు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలో కల్లూ, భూరా అనే అన్నదమ్ములుంటున్నారు. వీరిలో కల్లూ పెద్దవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే అతని సోదరుడు భూరాకు వివాహం జరిగింది. అతని భార్య రక్షాభంధన్ కోసం పుట్టింటికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు భర్తకు, కల్లూకు వంటవండేది. తాజాగా భూరా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతూ అన్నతో తాను ఇంటికి వచ్చేసరికి రొట్టెలు తయారు చేసిపెట్టాలని కోరాడు. అయితే రాత్రి భూరా ఇంటికి వచ్చేసరికి కల్లూ అతని కోసం రొట్టెలు తయారు చేయలేదు. వెంటనే కోపంతో రగిలిపోయిన భూరా తన అన్నను ‘రొట్టెలు ఎందుకు తయారు చేయలేదని’ అడిగాడు. దానికి సమాధానంగా కల్లూ ‘నువ్వు నాకు రొట్టెలు తయారు చేయలేదు కనుక నేను నీకు రొట్టెలు తయారు చేయలేదు’ అని అన్నాడు. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇంతలో తమ్మడు ఇంటి బయట ఉన్న పెద్ద బండరాళ్లు తీసుకు వచ్చి ఏకధాటిగా అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మృతిచెందినా తమ్ముని ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అన్న మృతదేహానికి తాడుకట్టి, దానికి లాక్కుంటూ గ్రామం శివారులకు తీసుకువచ్చాడు. అక్కడున్న నదిలోని పడవలో అన్న మృతదేహాన్ని ఉంచి, నది మధ్యలో దానిని వదిలివేశాడు. అయితే తమ్ముడు అన్న మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నప్పుడు గ్రామానికి చెందిన కొందరు దానిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్ ఢులా మాట్లాడుతూ తమ విచారణలో నిందితుడు.. రొట్టె కోసం తనకు, తన అన్నకు వివాదం జరిగిందని, ఈ నేపధ్యంలోనే తాను అన్నను హత్యచేశానని తెలిపాడన్నారు. నదిలోని కల్లూ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
జైలు భయంతో బల్లిని మింగేశాడు..!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి బల్లిని మింగేశాడు. కాన్పూర్ జిల్లాలోని మల్లవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యాచార కేసులో అదుపులోకి తీసుకున్న మహేశ్ అనే నిందితున్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. నిందితున్ని రాత్రి సమయంలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సమయంలోనే మహేశ్ నోట్లో బల్లి ఉండటం చూసి కంగుతిన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన వైద్యులు మహేశ్ కడుపులో నుంచి బల్లిని బయటకు తీశారు. ప్రాణాపాయం ఏం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే.. ఈ అత్యాచార కేసులో మహేశ్పై చేసిన ఫిర్యాదును బాధితురాలు వెనక్కి తీసుకున్నారు. బల్లిని ఎందుకు మింగావని మహేశ్ను పోలీసులు అడగగా.. జైలంటే చాలా భయమని తెలిపాడు. అందుకే బల్లని మింగి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఇదీ చదవండి: హరిద్వార్లో రాకాసి మేఘం.. చూస్తే..! -
SUV పైన బోటు.. అందులో ఎమ్మెల్యే.. వీడియో వైరల్
లక్నో: ఇటీవల కాన్పూర్ లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోజులు గడుస్తున్నా నిలిచిపోయిన నీటిని తొలగించడానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిరసనగా తన SUV వాహనం మీదకు బోటు ఎక్కించి అందులో కూర్చుని నగరమంతా తిరుగుతూ నిరసన తెలిపారు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. కాన్పూర్లో ఇటీవల కుండపోతగా వానలు కురిశాయి. దీంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు ఆర్య నగర్ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. తన SUV పైకి ఒక బోటును ఎక్కించి అందులో కూర్చుని తెడ్డు చేతపట్టుకుని నగరమంతా ఈదారు. కాన్పూర్ లోని సరసయ్య ఘాట్ దగ్గర మొదలైన ఈ కార్యక్రమం బడా చౌరాహా, మేష్టన్ రోడ్, మూలం గంజ్ ఎక్స్ ప్రెస్ రోడ్, ఫూల్ బాగ్ మీదుగా కొనసాగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వీఐపీ రోడ్, సివిల్ లైన్స్, బాబుపూర్వ, రాయ్ పూర్వలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయని ఇక జుహీ బ్రిడ్జి వద్దైతే ఆ వరద ఉధృతికి ఇటీవల ఒక డెలివరీ ఏజెంటు కూడా చనిపోయాడని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ప్రజలను కూడా లైఫ్ జాకెట్లు, బోట్లు వాడమని సలహా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. कानपुर में सपा विधायक @AmitabhBajpai का जलभराव को लेकर अनोखा प्रदर्शन। अपनी कार के ऊपर नाव रख उसपर सवार होकर सड़कों पर निकले नगर निगम की विफलता पर किया प्रदर्शन ,उनका कहना है कि बारिश के चलते शहर बन गया था टापू pic.twitter.com/yEO1zFUtf5 — Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) June 30, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు -
కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి!
ఉత్తర ప్రదేశ్లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేదుకు ఓ కారును దొంగతనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే కారును దొంగిలించారు కానీ తరువాతే అసలు విషయం తెలిసింది. ముగ్గురిలో ఎవరికి కూడ డ్రైవింగ్ రాదని.. దీంతో చేసేదేం లేక కారును దాదాపు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారు. అమినా చివరకు పోలీసులకు పట్టుబట్టారు. అసలేం జరిగిందంటే.. కాన్పూర్లోని దబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అమన్ గౌతమ్, సత్యం కుమార్ కాలేజీ విద్యార్థులు. వీరికి అమిత్ వర్మతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి మే 7న కారు మారుతి వ్యాన్ను దొంగిలించాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారమే కారును దొంగిలించారు. అయితే అక్కడే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో ఎవరికి కారు డ్రైవింగ్ రాదని అర్థమైంది. అయినా కారును వదిలి వెళ్లాలని అనిపించలేదు. దీంతో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 కిలోమీటర్లు దబౌలి నుంచి కళ్యాణ్పూర్ వరకు వ్యాన్ను తోసుకుంటూ వెళ్లారు. 10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వచ్చి ఆ కారును అమ్మేయాలని కుట్ర పన్నారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. ఒకవేళ కారు కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. చదవండి: స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది! -
సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రితో జంప్ అయ్యింది. ఏడాది క్రితం యువతిని ప్రియుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి కమలేష్తో పరిచయం కాగా, తర్వాత అతనితో ఆ యువతి పారిపోయింది. కమలేష్ కుమారుడికి 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి తరచుగా ప్రియుడి ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్తో ఆమెకు చనువు ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది. వారు ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. 2022 మార్చిలో ఇంటి నుండి పరారీ అయ్యారు. చదవండి: బెట్టింగ్లో భారీ నష్టం.. అయ్యో మధు! యువతి కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. కమలేష్ కుమారుడిని పోలీసులు విచారించగా.. ఆ యువతి కమలేష్ను కలిసేందుకు వచ్చేదని కుమారుడు చెప్పడంతో నిజం వెలుగు చూసింది. ఏడాదిపాటు వేట సాగించిన పోలీసులు కమలేష్, ఆ యువతిని ఢిల్లీలో గుర్తించారు. కమలేష్, యువతి సహజీవనం సాగిస్తున్నారు. ఇష్టపూర్వకంగానే కమలేష్తో వెళ్లినట్లు యువతి చెప్పడంతో షాక్ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్గా ఉండగలవని.. -
మీరు సూపర్ మేడం.. ఐఏఎస్ అధికారిణిపై నెటిజన్ల ప్రశంసల వర్షం..
లక్నో: సామాన్య ప్రజలు తమ సమస్యల గోడు వినిపించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగుతుంటారు. ఒక్కోసారి వారిని పట్టించుకునేవారే ఉండరు. ఉన్నత అధికారులను నేరుగా కలిసే అవకాశమే తక్కువ. అయితే ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఓ ఐఏఎస్ అధికారిణి సౌమ్య పాండే మాత్రం తన సింప్లిసిటీతో నెటిజన్ల మనసులు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకం ద్వారా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు తనకు సాయం చేయాలని వెళ్లిన ఓ పెద్దాయన ధనీరామ్ సమస్యను ఆమె దగ్గరుండి తెలుసుకున్నారు. ఎండలోనూ అతని దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి కచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. చీఫ్ డెవలెప్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య.. ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దివ్యాంగుడైన ధనీరామ్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసేందుకు అవసరమైన సాయం అంధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సౌమ్య పాండే.. ధనీరామ్ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంత పెద్ద హోదాలో ఉండి సామాన్యుడితో సౌమ్య పాండే ప్రవర్తించిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. నవ భారత్లో సరికొత్త ఉత్తర్ప్రదేశ్ ఇది.. చూడండి ఐఏఎస్ అధికారి సామాన్యుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఎలా తీసుకుంటున్నారో.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
రైల్వే కానిస్టేబుల్ పాడుపని.. సిట్జర్లాండ్ మహిళలతో అసభ్యంగా..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో ఓ రైల్వే కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. తేజస్ ఎక్స్ప్రెస్లో స్విట్జర్లాండ్కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై భౌతికంగా దాడి చేయబోయాడు. ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అతిథి అని కూడా చూడకుండా విదేశీ మహిళను వేధించిన ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్. గత ఏడాదిన్నరగా యూపీ ఫిరోజాబాద్లోని ఆర్పీఎఫ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
‘బుల్డోజర్ న్యాయం’ ఎన్నాళ్లు?
బుల్డోజర్లే సర్వరోగ, సర్వ సమస్యల నివారిణిగా భావించటం ఎంత ప్రమాదకరమో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కనీసం ఇప్పటికైనా అర్థమైవుండాలి. ఆ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా మడౌలీలో ‘ఆక్రమణలు’ తొలగించే పేరిట సోమవారం బుల్డోజర్లు వీరంగం వేస్తుండగా హఠాత్తుగా ఒక గుడిసెలో మంటలు ఎగసి తల్లీకూతుళ్లిద్దరు సజీవదహనమయ్యారు. బాధితుల బంధువులు చెబుతున్నట్టు ఇవి దారుణ హత్యలా, అధికారులంటున్నట్టు ఆత్మహత్యలా అనేది తేలడానికి కొంత సమయం పడుతుంది. కానీ ప్రభుత్వ చర్య ఏదైనా చట్టాలకు అనుగుణంగానే ఉండాలని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం చెప్పి చాన్నాళ్లవుతున్నా ఆ రాష్ట్రంలో బుల్డోజర్ల వినియోగం ఆగలేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తను కించపరిచారని ఆరోపిస్తూ నిరుడు జూన్లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా ప్రయాగ్రాజ్, షహ్రాన్పూర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాక ఆ నిరసనలకు సూత్రధారులుగా భావిస్తున్నవారి ఇళ్లను బుల్డోజర్లు పంపి నేలమట్టం చేశారు. నిజానికి ఇది యూపీకే పరిమితమై లేదు. బీజేపీ సర్కారుండే మధ్యప్రదేశ్లో నిరుడు ఏప్రిల్లో మతపరమైన ఘర్షణలు జరిగాక 16 ఇళ్లనూ, 29 దుకాణాలనూ అధికారులు కూల్చేశారు. అదే నెలలో బీజేపీ అధీనంలోని అప్పటి ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మత ఘర్షణలు జరిగిన జహంగీర్పురిలో ఇదే పద్ధతిలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశారు. నిజానికి చట్టబద్ధ పాలన అనే భావన రాజ్యాంగంలో లిఖితపూర్వకంగా ఎక్కడా ఉండదు. కానీ అది సవరణకు వీలుకాని రాజ్యాంగ మౌలిక నిర్మాణ స్వరూపమని నిపుణులంటారు. ప్రజాస్వామ్యంలో సాధారణ పౌరులు మొదలుకొని అత్యున్నత స్థానాల్లో ఉండేవారి వరకూ అందరూ చట్టానికి లోబడి వ్యవహరించాల్సినవారే. కానీ ఈ ‘బుల్డోజర్ న్యాయం’ అన్ని చట్టాలనూ, నిబంధనలనూ బేఖాతరు చేస్తోంది. సాధారణంగా అయితే అక్రమమని తేలిన నిర్మాణాలను గుర్తించాక వాటి యజమానులకు అధికారులు ముందుగా నోటీసులివ్వాలి. వారినుంచి సంజాయిషీలు తీసుకున్నాక అవసరమైన వ్యవధినిచ్చి నిర్మాణాలు తొలగించాలి. కానీ ఈ ఉదంతాలన్నిటా జరుగుతున్నది వేరు. ఏదైనా ఘర్షణల్లో నిందితులుగా గుర్తించినవారి ఇళ్లనూ, దుకాణాలనూ ఒక పద్ధతి ప్రకారం కూల్చేస్తున్నారు. నామమాత్రంగా నోటీసులిచ్చి కనీసం వారి సామాన్లు తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. మడౌలీ ఉదంతమే తీసుకుంటే గత నెల 14న కిషన్ గోపాల్ దీక్షిత్ అనే ఆసామి ఇంటితోపాటు మరికొన్ని ఇళ్లను చెప్పాపెట్టకుండా వచ్చిన అధికారులు కూల్చేశారు. వేరే ఆశ్రయం పొందటం అసాధ్యం కావటంతో కూల్చినచోటే దీక్షిత్ కుటుంబం చిన్న గుడిసె వేసుకుని ఉంటోంది. సరిగ్గా నెల తర్వాత మళ్లీ వచ్చిన అధికారులు ఆ గుడిసెవైపు బుల్డోజర్ను గురిపెట్టారు. తామంతా గుడిసెలో ఉండగానే భయభ్రాంతుల్ని చేసి పంపేయటానికి బుల్డోజర్ను ప్రయోగించారని, దానికి లొంగకపోవటంతో గుడిసెకు నిప్పంటించమని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశించారని బాధితుడు శివం దీక్షిత్ అంటున్నాడు. తానూ, తండ్రి స్వల్పగాయాలతో తప్పించుకున్నా తల్లి, 21 ఏళ్ల సోదరి సజీవదహనమయ్యారని చెబుతున్నాడు. బుల్డోజర్ల ప్రయోగం మొదలెట్టినప్పుడు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ఎక్కువ సందర్భాల్లో ఒక మతంవారినే దృష్టిలో పెట్టుకుని ఈ కూల్చివేతలు జరగటం అందుకు కారణం కావొచ్చు. కానీ ఇలాంటి ధోరణి చివరకు అరాచకానికి దారితీస్తుందని చాలామంది హెచ్చరించారు. విచక్షణ మరిచి సమస్య ఉన్నచోటికల్లా బుల్డోజర్లు వెళ్లడం మొదలైతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించటం కష్టం. ఆమధ్య ఒక ఉదంతంలో రాళ్లు విసిరాడని ఆరోపణలొచ్చిన యువకుడు రెండు చేతులూ లేని వికలాంగుడు. అతని దుకాణాన్ని అధికారులు కూల్చేశారు. ఈ మాదిరి ఘటనల్లో అధికారులు తమ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా? మడౌలీ ఉదంతంలో తల్లీకూతుళ్లు సజీవదహనమయ్యారని తెలియగానే సబ్డివిజనల్ మేజిస్ట్రేట్తో సహా అధికారులంతా పరారయ్యారు. వారు అక్కడే ఉంటే ఏం జరిగేదో! దోషులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చేసిన ప్రకటనకు పెద్దగా విలువుండదు. బుల్డోజర్లను ఇష్టానుసారం వినియోగించే స్వేచ్ఛ ప్రభుత్వమే ఇచ్చినప్పుడు ఇలాంటి విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేముంది? ఈ ఉదంతాల్లో చివరకు దోషులుగా తేల్చేదెవరిని? శిక్షించేదెవరిని? నేరారోపణలు చేయటం, దాన్ని న్యాయస్థానాల్లో నిరూపించటం, తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు శిక్షించటం అనే ప్రక్రియలుంటాయి. ఈ మూడు పాత్రలనూ ఒకరే పోషించాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్యం మంటగలుస్తుంది. సాధారణ ప్రజానీకం సైతం ఈ ధోరణినే అనుసరించే ప్రమాదం ఉంటుంది. ఏతావాతా ఈ మాదిరి చర్యలు ఒకరకమైన అరాచకానికి దారితీస్తాయి. బుల్డోజర్ల గురించి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనప్పుడు అసలు కారణాలు దాచి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలుండటంవల్లే కూల్చామని యూపీ సంజాయిషీ ఇస్తోంది. ఒక ప్రభుత్వం తన చర్యల ఆంతర్యాన్ని తానే చెప్పుకోలేని దుఃస్థితిలో ఉండటం అధికార యంత్రాంగానికి నైతికబలం ఇవ్వగలదా? రెండు నిండు ప్రాణాలు బలిగొన్న మడౌలీ ఉదంతానికి మూలం ఎక్కడుందో ఇప్పటికైనా ఆదిత్యనాథ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరెక్కడా ఇలాంటి ఉదంతాలు పునరావృతం కానీయకుండా, చట్టవిరుద్ధతకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి. -
ఏం తెలివిరా నాయనా.. బ్యాంకులో కోటి విలువ చేసే బంగారం చోరి!
దొంగలు దొంగతనం చేసేందుకు తమ రూట్ మార్చుకుంటున్నారు. దొంగతనం కోసం క్రేజీగా థింక్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. కేటుగాళ్లు ఏకంగా బ్యాంక్ను టార్గెట్ చేసి రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం దొంగిలించారు. వారు దొంగతనం చేసి ప్లాన్ చూసి పోలీసులు ఖంగుతిన్నారు. వివరాల ప్రకారం.. కాన్పూర్లోని ఎస్బీఐ భనుతి శాఖలో భారీ దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన విషయంలో ఉద్యోగులు ఆఫీసుకు వచ్చిన తర్వాత వారికి ఈ విషయం బోధపడింది. అయితే, దొంగతనం కోసం దొంగలు మాస్టర్ ప్లాన్ వేసి స్కెచ్ గీసుకున్నారు. ప్లాన్ ప్రకారం.. ఆఫీసు పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకులోని స్ట్రాంగ్రూంలోకి 10 అడుగుల సొరంగం తవ్వి బ్యాంక్లోకి చేరుకున్నారు. అనంతరం.. లాకర్ను పగలగొట్టి అందులో ఉన్న రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం చోరీ చేశారు. ఉదయం బ్యాంక్కు వచ్చిన ఉద్యోగులకు ఈ విషయం తెలిసి షాకయ్యారు. ఈ క్రమంలో ఎంత సొమ్ము దొంగతనం చేశారో తెలుసుకునేందు బ్యాంకు అధికారుల తల ప్రాణం తోకకు వచ్చింది. కొన్ని గంటల తర్వాత ఎంత సొమ్ము చోరీకి గురైందో అంచనా వచ్చారు. దీంతో, వెంటనే బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో రంగంలో దిగిన టీమ్.. ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాల ద్వారా దొంగల కోసం గాలింపు ప్రక్రియ చేపటినట్టు తెలిపారు. అయితే, బ్యాంకు గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. #Kanpur में सचेंडी स्थित #SBI बैंक की शाखा में चोरों ने रात के समय सुरंग बनाकर गोल्ड रूम का दरवाजा तोड़ा और अंदर जितना भी सोना रखा था, सब चुरा कर ले गए। सुबह जब बैंक कर्मचारी शाखा पहुंचे और उन्हें इसका पता लगा तो तुरंत पुलिस को सूचना दी गई।#UPPolice pic.twitter.com/9171dEY2zi — UP Tak (@UPTakOfficial) December 24, 2022 -
షాకింగ్ ఘటన: కాళ్లు తెగిపడి పట్టాలపై దీనంగా రోదిస్తూ..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో హేయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వీధి వ్యాపారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఆ కంగారులో ఆ యువకుడు రైలు పట్టాల మీదకు పరిగెత్తాడు. అయితే వేగంగా దూసుకొచ్చే రైలు అతన్ని చిధిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాకు చేరింది. యూపీ కాన్పూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాహిబ్ నగర్కు చెందిన అర్సలాన్ అనే 18 ఏళ్ల యువకుడు.. కళ్యాణ్పూర్ ప్రాంతంలోని జీడీ రోడ్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు.. చిరువ్యాపారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే యత్నం చేశారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ కూరగాయల దుకాణం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. Shocker from Kanpur ! Policemen threw away a street vendor Irfan's articles on railway tracks in Kalyanpur. He was hit by Memu train while picking them back. He has lost both his legs. Police were clearing sides of GT Road of vendors selling vegetables, and other goods. pic.twitter.com/gbzY71rLg2 — Haidar Naqvi🇮🇳 (@haidarpur) December 2, 2022 ఆపై అర్సలాన్పై హెడ్ కానిస్టేబుల్ రాకేష్ చెయ్యి చేసుకుని.. అతని కూరగాయల తూకం రాయిని దూరంగా విసిరేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. అది రైలు పట్టాలపై పడడంతో దానిని తెచ్చుకునేందుకు పరిగెత్తాడు ఆ యువకుడు. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. అతని కాళ్లను ఛిద్రం చేసేసింది. అక్కడికక్కడే కాళ్లను పొగొట్టుకున్న ఆ యువకుడు బాధతో పట్టాల మధ్యలో పడి విలపిస్తూ సాయం కోసం చేతులు చాచాడు. అక్కడే ఉన్న కొందరు అతన్ని రోదన పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇంతలో జనం తిరగబడతారనే భయంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ను పట్టాల మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. రాకేశ్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడ కొందరు తీసిన వీడియోల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: పాముకి స్నానం.. ఇలాంటి వీడియోను చూశారా? -
రైల్లో ఘోర ప్రమాదం...సరాసరి మెడలోకి దిగిన రాడ్
ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాచల్ ఎక్స్ప్రెస్ రైలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్లోలో విండో సీటులో కూర్చొన్న వ్యక్తి కూర్చొన్నట్లుగానే చనిపోయాడు. అనుహ్యంగా ఒక ఇనుపరాడ్ కిటికి అద్దాలను పగలుగొట్టుకుంటూ వచ్చి సరాసరి విండోసీటు వద్ద కూర్చొన్న వ్యక్తి మెడలోకి దిగిపోయింది. దీంతో ఆ వ్యక్తి రక్తపు మడుగులో అలా కూర్చొనే మృతి చెందాడు. ప్రయాగ్రాజ్ డివిజన్ వద్ద ఉదయం 8.45 నిమిషాలకు ఈ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. దీంతో రైలుని అలీఘర్ జంక్షన్ వద్ద నిలిపేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడు హరికేష్ కుమార్ దూబేగా గుర్తించారు. రైల్వే ట్రాక్ పనుల్లో వినియోగించే ఇనుపరాడ్ కిటికి అద్దాలు పగలిపోయాలా లోపలికి దూసుకొచ్చి కిటికి వద్ద కూర్చొన్న హరికేష్ దూబే మెడకు గుర్చుకుందని చెప్పారు పోలీసులు. ఉత్తర మధ్య రైల్వే ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. (చదవండి: సౌండ్ వినలేక పేషెంట్ వెంటిలేటర్నే ఆపేసింది! నివ్వెరపోయిన పోలీసులు) -
పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లో 17 ఏళ్ల అమ్మాయిని బెదిరించాడు ఓ యువకుడు. పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో ముక్కలు ముక్కలుగా నరికేస్తానని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ ఆకతాయి పేరు ఫయాజ్. చాలా కాలంగా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఆమె స్కూల్కు వెళ్లే సమయంలో వెంటపడి తరచూ ఇబ్బందిపెడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వాళ్లు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ అతని బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. చివరకు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే అమ్మాయి అందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫయాజ్ ఆమెను భయపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ముక్కలు ముక్కలుగా నరికేస్తానని బెదిరించాడు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులను అశ్రయించారు. ఫిర్యాదు అనంతరం పోలీసులు ఫయాజ్ ఇంటికి వెళ్లగా.. కుటుంబసభ్యులు వాళ్లతో గొడవకు దిగారు. పలితంగా మరికొంత మంది పోలీసులను పిలిపించి అధికారులు ఫయాజ్ను అరెస్టు చేశారు. అతడిపై అక్టోబర్ 16న పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు తెలిపారు. చదవండి: కోటిన్నర నగలు కొట్టేశారు -
అమానుష ఘటన: బాలుడి చేతిలో డ్రిల్లింగ్ మిషన్ దింపిన టీచర్!
ఇటీవల కాలంతో ఉపాధ్యాయులు చిన్న చిన్న విషయాలకే కాస్త ఫ్రస్టేషన్కి గురయ్యి విద్యార్థులకు అత్యంత అమానుషమైన పనిష్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయుడు కొడవలితో పాఠశాల్లో హల్చల్ చేస్తూ... అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. అంతకు ముందు మరొక ప్రబుద్ధుడు స్ప్రుహ తప్పి పడిపోయాలా ఒక విద్యార్థిని కర్రతో దాడి చేసి చంపేశాడు. ఇలాంటి ఉదంతాలను మర్చిపోక మునుపే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒక విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్తో పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థికి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థి సిసామౌ నివాసి. అతను కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్నగర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఐతే సదరు విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థిని ఇంటికి పంపించడంతో ఫ్రాథమిక చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి నిర్వాకానికి ఆగ్రహం చెందిన బాధితుడు బంధువులు పాఠశాలకు చేరుకుని గొడవ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న ప్రాథమిక శిక్ష అధికారి, బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కాన్పూర్కి చెందిన ప్రాథమిక శిక్షా అధికారి సుజిత్ కుమార్ మాట్లాడుతూ...ఈ మొత్తం ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ప్రేమ్ నగర్, శాస్త్రి నగర్లోని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక పంపుతారు. ఈ ఘటనలో ఎవరైనా దోషులుగా తేలితే వారు శిక్షార్హమైన చర్యల ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. (చదవండి: క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు.. ) -
రాక్షసత్వం: ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు
కాన్పూర్: స్థానికులు, సీసీటీవీ కెమెరా సాక్షిగా ఓ వ్యక్తి రాక్షసత్వానికి పాల్పడ్డాడు. తనను చూసి తదేకంగా మొరుగుతుందనే కోపంతో ఇటుక రాయితో వీధి కుక్కను కొట్టి చంపేశాడు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇటుక రాయితో నిద్రిస్తున్న కుక్క తలపై కొట్టడంతో.. రక్తం మడుగులో పడి అది మరణించింది. పక్కనే కొందరు చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డగించే యత్నం చేయలేదు. అయితే ఆ కుక్కలు నిద్రించిన చోట దుకాణం ఉండడం, ఆ ఓనర్ సీసీ టీవీ ఫుటేజీలో జరిగిన దారుణం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని జాకీగా గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తనను చూసి పదే పదే మొరగడంతో తట్టుకోలేక కోపంతోనే చంపేశానని జాకీ నేరం ఒప్పుకున్నాడు. #kanpur-जूही में युवक ने सो रहे बेजुबान के सिर पर ईंट से हमला कर मौत के घाट उतारा,तस्वीरें सीसीटीवी में कैद, संवेदनहीन नज़र आई @Uppolice,@kanpurnagarpol के जूही इंस्पेक्टर ने आरोपी की गिरफ्तारी तो छोड़िए FIR तक दर्ज़ नही की।@myogiadityanath @brajeshlive @bstvlive pic.twitter.com/8Lxgv0SA8v — दीपक मिश्रा 'अज्ञात' (@Deepak_mishra13) October 16, 2022 -
ఫోన్ కొట్టేసిన దొంగ పోలీస్.. వీడియో వైరల్!
లక్నో: దొంగల బారీనుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే చోరీకి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో జరిగింది. రాత్రివేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నఇద్దరు పోలీసులు పక్కన మంచంపై నిద్రిస్తున్న ఓ వ్యక్తిని చూసి ఆగారు. అనంతరం ఓ పోలీసు ఆ వ్యక్తి వద్దకు వెళ్లాడు. హాయిగా నిద్రపోతున్న వ్యక్తి మంచంపై ఉన్న ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం చక్కా దాన్ని చూసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోను ఓ వ్యక్తి ట్వీట్టర్లో షేర్ చేశాడు. పోలీసుల తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనాలు చేయడమేంటని మండిపడ్డారు. ఇలాంటి వారికి పోలీసులుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. Shameful act of Kanpur Police The soldiers patrolling at night stole the phone of the sleeping person, the incident was captured in CCTV @drlaxmanbjp Anna Any words on this ?#doubleengine sarkaaru👇 pic.twitter.com/YdnFcbmxpb — AkshayKTRS (@AkshayKtrs) October 9, 2022 చదవండి: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు.. -
శివుడి ఎదుట మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్న మేక.. ఏం కోరుకుందో ఏమో?
జంతువులు దేవుళ్లను ప్రార్థించడం ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చూసే ఉంటాము. కాగా, తాజాగా ఓ మేక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివుడి గర్భగుడి ముందు ఓ మేక మొకాళ్ల మీద నిలబడి ప్రార్ధనలు చేసింది. దీంతో, మేకకు చూసిన భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ ఘటనను సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్న ఆనందేశ్వర్ మందిరంలో ఉన్న శివుడు గర్భగుడి ముందు ఓ మేక తన మొకాళ్ళ మీద మోకరిల్లి దేవుడికి ప్రార్థనలు చేసింది. గుడిలో ఉన్న భక్తులతో కలిసి ప్రార్థనలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. कानपुर के आनंदेश्वर मंदिर में बकरे का अनोखा अंदाज, बाबा को झुक-झुककर किया प्रणाम, श्रद्धालुओं की तरह टेका माथा#kanpur #Kanpurnews #Anandeshwarmandir #Hinduism #kanpurtemple #Uniquevideo pic.twitter.com/AjPTuqfMxF — Journalist Prabhat Kashyap (@Prabhat_1090) October 9, 2022 -
ఘోర ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 26 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా ఘటమ్పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ నీటిలో పడటంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే చంద్రికా దేవి ఆలయాన్ని దర్శించుకుని ఉన్నావ్ నుంచి కాన్పూర్కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, క్షతగాత్రులకు 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. -
హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని..
లక్నో: కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా వర్ణిస్తుంటారు. కానీ కొన్ని రకాల కుక్కలు మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మనుషులపై దాడి చేస్తుంటాయి. ఎక్కడి పడితే అక్కడ కొరికి కరిచేస్తుంటాయి. ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు దాడి చేస్తున్న ఘటన ఎక్కువ అవుతున్నాయి. అంతేగాక కుక్కల బారిన పడి అనేక చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను చాలానే చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుక్క దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో చోటుచేసుకుంది. పిట్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది. క్రూరమైన కుక్క ఆవు దవడను తన నోటితో బలంగా కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది. ఆవును రక్షించడానికి కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్కు ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది. అయితే అప్పటికే ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుక్క లైసెన్స్ చూపించాల్సిందిగా యాజమానిని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కుక్కను కూడా స్వాధీనం చేసుకొని బోనులో ఉంచారు. ఆవును పశువైద్యశాలకు పంపించారు. అలాగే దానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే నిరంజన్ తెలిపారు. కాగా పిట్బుల్ జాతికి చెందిన కుక్కలు మనుషులపై దాడి చేసే ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గత రెండు నెలల్లో వేర్వేరు సంఘటనల్లో దాదాపు అర డజను మంది పిట్బుల్ దాడిలో గాయపడ్డారు. कानपुर के सरसैया घाट पर ‘पिटबुल कुत्ते’ ने कर दिया गाय पर हमला। - ग्रामीणों की काफी देर की मशक्कत के बाद गाय को पिटबुल की कैद से छुड़ाया जा सका। - इस बीच पिटबुल डॉग ने गाय का जबड़ा चबा लिया। - इस घटना के बाद घाट पर जाने से कतरा रहे हैं सैलानी। pic.twitter.com/yvbBN5EgSS — Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022 -
ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. సస్పెన్షన్ వేటు
లక్నో: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు అధికారులు. ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్ క్రైమ్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్నాడు అజయ్ గుప్తా అనే కానిస్టేబుల్. ప్రధాని నరేంద్ర మోదీపై, ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై అసభ్యకరమైన ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతని ట్వీట్లు స్క్రీన్ షాట్ల రూపంలో బాగా వైరల్ అయ్యాయి. అలా విషయం ఉన్నతాధికారుల దృష్టితో వెళ్లింది. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు సందర్భంగా పోలీస్ మెడల్ కోసం తన పైస్థాయి అధికారుల నుంచి డీజీపీ కార్యాలయం స్థాయి వరకు నిలదీస్తూ ట్విటర్లో పోస్టులు చేశాడు అజయ్ గుప్తా. ఈ క్రమంలో అతని పాత ట్వీట్ల బండారం బయటపడింది. దీంతో అతను తన అకౌంట్ను డిలీట్ చేయగా.. అప్పటికే అభ్యంతకర ట్వీట్ల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ‘‘ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అతను చేసిన కొన్ని పోస్టులు మరీ మితిమీరి ఉన్నాయి. పోలీస్ సిబ్బంది అనే స్పృహ లేకుండా పోస్టులు చేశాడు. ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే. డిపార్టమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించాం అని పోలీస్ కమిషనర్ బీపీ జోగ్దంద్ తెలిపారు. ఇదీ చదవండి: తాగొద్దు అన్నందుకు ఇంటి ఓనర్ హత్య.. ఆపై సెల్ఫీ!! -
యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ మంత్రి రాకేశ్ సచాన్కు కాన్పూర్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 1991 అక్రమ ఆయుధాల కేసులో శనివారం ఆయనను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ నిర్ణయంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి, ఆయన మద్దతుదారులు, న్యాయవాదులు వెంటనే కోర్టు గది నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని, ప్రస్తుత పరిణామాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు శనివారం రాత్రి రాకేశ్ సచాన్పై కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కాన్పుర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీ ఫిర్యాదు అందినట్లు చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాకేశ్ సచాన్ 1993 నుంచి 2002వరకు సమాజ్వాదీ పార్టీలో ఉన్నారు. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఫతేపూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ములాయం సింగ్, శివ్పాల్ సింగ్కు సన్నిహితుడని గుర్తింపు ఉంది. అయితే ఎస్పీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: ప్రభుత్వం ఏర్పడి 36 రోజులు.. ఇప్పటివరకు నోచుకోని మంత్రివర్గ విస్తరణ -
‘నా భార్య అలిగి వెళ్లిపోయింది..3 రోజులు లీవ్ ఇవ్వండి సార్’
లక్నో: ఏదైనా పని ఉందనో, లేక ఆరోగ్యం బాగోలేదనో సెలవు తీసుకుంటారు ఎవరైనా. కానీ, తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, బుజ్జగించి తిరిగి తీసుకొచ్చేందుకు మూడు రోజులు సెలవు కావాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి కోరాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. ప్రేమ్ నగర్ బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు శాంషద్ అహ్మెద్. తనకు సెలవు ఎంత ముఖ్యమో వివరించారు. తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆమెను బుజ్జగించి తిరిగి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు అహ్మెద్. ‘నేను మానసికంగా బాధపడుతున్నా. ఆమెను బుజ్జగించి తీసుకొచ్చేందుకు వారి ఊరికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు, నగరం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.’అని హిందీలో లేఖ రాశారు అహ్మెద్. క్లర్క్ అభ్యర్థనను బీడీఓ అధికారి ఆమోదించారు. Kanpur man seeks leave to make amends with wife, letter goes #viral pic.twitter.com/4RmVvL2JQh — Aaquil Jameel (@AaquilJameel) August 3, 2022 ఇదీ చదవండి: బాధలో ఉన్న వ్యక్తిని తల్లిలా ఓదార్చిన కోతి.. నెటిజన్లు ఫిదా! -
దారుణం.. కట్నం కోసం స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్!
లక్నో: దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు.. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని కన్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, అతడి స్నేహితులపై ఛకేరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2020, మార్చి 6 నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె భర్త, ఆడపడుచు రూ.2 లక్షలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు. అయితే.. అడిగిన డబ్బు, కారు ఇవ్వలేకపోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు. నలుగురు కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనను చంపేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్ పతాక్ తెలిపారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
ఎయిర్పోర్ట్కి శంకర్ పేరు
భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను లాహోర్ జైలులో ఉరి తీశారన్న వార్తతో ఆగ్రహించిన ప్రజానీకం పలుచోట్ల గట్టిగా నిరసనలు తెలిపింది. కాన్పూర్లో ఘోరమైన మత కల్లోలాలు జరిగాయి. నాలుగు వందల మంది వరకు చనిపోయారు. అలాంటి సమయంలో ఆ రక్తపాతం నుంచి, ఆ మౌఢ్యం నుంచి అటు హిందువులను, ఇటు ముస్లిం మతానికి చెందిన అమాయకులను రక్షించడానికి ఒక జాతీయ కాంగ్రెస్ నాయకుడు, గాంధీజీ అనుచరుడు నేరుగా రంగంలో దిగారు. అదే అదనుగా ఒక మూక ఆయన మీద పడి, కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసింది. రెండురోజులకు గాని ఆయన మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఆయనే గణేశ్శంకర్ ‘విద్యార్థి’. గణేశ్ శంకర్ విద్యార్థి (1890–1931) ఒక పేద కుటుంబంలో పుట్టారు. అలహాబాద్ సమీపంలోన అట్టార్సుయి ఆయన జన్మస్థలం. ఆయన అభిరుచి అంతా పత్రికా రచనే. ‘స్వరాజ్య’ పత్రికకు రచనలు పంపించేవారు. ఆ రచనల కోసం ఆయన పెట్టుకున్న పేరు ‘విద్యార్థి’. చివరికి ఆయనే ‘ప్రతాప్’ అనే వారపత్రిక ఆరంభించారు. ‘అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిని నేను. ఉద్యోగులు, జమీందార్లు, పెట్టుబడిదారులు, కులీనులు ఎవరు ఈ పనికి పాల్పడినా నేను వారిపై పోరాడతాను. అమానవీయతకు వ్యతిరేకంగా నా ప్రాణమొడ్డి పోరాడతాను. అందుకు భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడని కాంక్షిస్తున్నాను’ అని ఒక సందర్భంలో విద్యార్థి అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన పోరాటానికి, కృషికి గౌరవ సూచకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2017 జూలై 18న కాన్పూర్ విమానాశ్రయానికి ‘గణేశ్ శంకర్ విద్యార్థి ఎయిర్పోర్ట్’ అని పేరు పెట్టింది. (చదవండి: నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్లోని పహార్తలి యూరోపియన్ క్లబ్... ప్రీతిలతా వడ్డేదార్) -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. నూపుర్ శర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆదివారం వెల్లడించింది. నవీన్ కుమార్ జిందాల్ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్గా ఉన్నారు. సస్పెన్షన్ లెటర్లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామం’ అని బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది. కాగా, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పరేడ్ మార్కెట్లోని దుకాణాలను మూసివేయాలని ముస్లిం వర్గం పిలుపునిచ్చింది. యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొవడలు చెలరేగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు. చదవండి: డబ్బులు వృధా చేసుకోవద్దు. మా వద్ద లేనిది ఈడీ మాత్రమే: సంజయ్ రౌత్ ఇదిలా ఉండగా.. వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాలలోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు నూపుర్ శర్మపై హైదరాబాద్, పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. అన్ని మతాలను గౌరవిస్తాం అయితే నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటుకు కొద్దిసేపటి ముందే బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని అన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందనని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీస్తే, మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. -
కాన్పూర్ హింస..800 మందిపై కేసులు
కాన్పూర్/లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు 800 మందికి పైగా కేసులు నమోదు చేశారు. వీరిలో 24 మందిని అరెస్ట్ చేసి, 12 మందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో రికార్డింగ్ల ఆధారంగా హింసకు పాల్పడిన 36 మందిని గుర్తించామని కాన్పూర్ పోలీస్ కమిషనర్ వీఎస్ మీనా వెల్లడించారు. బేకన్గంజ్ ఎస్హెచ్వో నవాబ్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ అసిఫ్ రజా ఫిర్యాదుల వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఘర్షణలకు సూత్రధారిగా అనుమానిస్తున్న మౌలానా మొహమ్మద్ అలీ(ఎంఎంఏ)జౌహార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా గ్రూప్ చీఫ్ హయత్ జఫర్ హస్మితోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తదితర సంస్థలతో లింకులున్నట్లు తేలితే కఠినమైన జాతీయ భద్రతా చట్టంతోపాటు గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కమిషనర్ మీనా వెల్లడించారు. విదేశీ నిధులు అందాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కుట్రదారుల ఆస్తులను జప్తు చేస్తామన్నారు. ఇటీవల ఓ టీవీలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత నూపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ శుక్రవారం కాన్పూర్లోని కొన్ని ప్రాంతాల్లో కొందరు దుకాణాలను మూసివేయించేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులు సహా మొత్తం 40 మంది గాయపడ్డారు. -
జాతీయ చెస్ చాంపియన్షిప్ విజేతగా అర్జున్..
కాన్పూర్: టోర్నీలో పరాజయమెరుగని గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ సీనియర్ జాతీయ చెస్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. సీనియర్ టైటిల్ సాధించిన తొలి తెలంగాణ ఆటగాడిగా ఘనత వహించాడు. ఆఖరి 11వ రౌండ్ గేమ్లో 18 ఏళ్ల అర్జున్ మాజీ చాంపియన్ సేతురామన్ (8)తో ‘డ్రా’ చేసుకున్నాడు. టైటిల్ రేసులో ఉన్న గుకేశ్కు గురువారం ఇనియన్ జతయ్యాడు. గుకేశ్ కూడా ఆర్యన్ చోప్రా (8)తో డ్రా చేసుకోగా, ఇనియన్... మిత్రభా గుహా (బెంగాల్)ను ఓడించాడు. దీంతో అర్జున్తో పాటు తమిళ గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ఇనియన్ ఉమ్మడిగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... చివరకు టైబ్రేక్ స్కోరుతో అర్జున్ను విజేతగా ఖరారు చేశారు. గుకేశ్, ఇనియన్లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. తెలంగాణ ఆటగాడికి ట్రోఫీతో పాటు రూ. 6 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. చదవండి: టీమ్ ఈవెంట్లో ఇషాకు స్వర్ణం -
సంయుక్తంగా అగ్రస్థానంలో అర్జున్
జాతీయ సీనియర్ పురుషుల చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్, తమిళనాడు గ్రాండ్మాస్టర్ గుకేశ్ 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. కాన్పూర్లో జరుగుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్లో అర్జున్ 41 ఎత్తుల్లో ఇనియన్ (తమిళనాడు)తో ‘డ్రా’ చేసుకోగా... గుకేశ్ 64 ఎత్తుల్లో అభిజిత్ గుప్తా (పీఎస్పీబీ)పై గెలిచాడు. నేడు చివరిదైన 11వ రౌండ్ గేముల్లో సేతురామన్ (పీఎస్పీబీ)తో అర్జున్, ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)తో గుకేశ్ ఆడతారు. -
Punjab Election 2022: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన
-
ఆడుకుంటానని చెప్పి వెళ్లాడు.. ఆపై చేనులో దుస్తులు లేకుండా!
వావీవరుసలు, వయో భేదం లేకుండా.. చివరికి మూగ జీవాలను వదలకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి మానవ మృగాలు. ఈ క్రమంలో యూపీలో జరిగిన ఓ ఘోరం.. వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఓ దళిత మైనర్ చిన్నారిని అత్యంత క్రూరంగా హత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ అవుటర్ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం రైతుది. అతని పదేళ్ల కొడుకు సోమవారం మధ్యాహ్నం.. ఆడుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా వెతిక్కి.. రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ లోపు ఊరి బయట ఆవ చేనులో ఓ బాలుడి మృతదేహాన్ని పనులకు వెళ్లిన ఓ మహిళ గుర్తించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అది కనిపించకుండా పోయిన మైనర్దేనని తేలింది. బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. దుస్తులు యాభై మీటర్ల దూరంలో పడేసి ఉన్నాయి. ఘాతుకానికి పాల్పడే సమయంలో ప్రతిఘటించడంతో ఆ పిల్లాడిపై బండరాళ్లతో దాడి చేసి ఉంటారని, కన్నుకి తీవ్రంగా గాయమైందని, ఒంటిపై పంటి గాట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ లైంగిక దాడి జరిగిందా? ఎలా హత్య చేశారు? అనే విషయాల నిర్ధారణకై శవపరీక్ష కోసం ఎదురుచూస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని కాన్పూర్ ఏఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు. మరోవైపు చనిపోయింది పదేళ్ల బాలుడు కావడం, ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటడంతో.. గ్రామస్థుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కాసేపు రహదారి దిగ్భంధించి నిరసనలు వ్యక్తం చేశారు. ఆపై పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
కాన్పూర్లో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి, విషమంగా తొమ్మిది మంది!
Kanpur Bus Accident: ఉత్తర ప్రదేశ్లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి జనాల మీదకు దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలు అయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి.. జనాల మీదకు దూసుకెళ్లింది. ఆపై బస్సు ఓ ట్రాఫిక్ బూతును ఈడ్చుకుంటూ వెళ్లి.. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కును ఢీ కొట్టి ఆగిపోయింది. ఘటన తర్వాత బస్సు డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు ఈస్ట్ కాన్పూర్ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులకు దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు.. వాళ్లలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకులు ఫేయిల్ అయినందునే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటన సమయంలో 20 మందికి పైగా గుంపు అక్కడ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. #Police_Commissionerate_Kanpur_Nagar के घण्टाघर से टाटमील चौराहे के बीच हुयी घटना व की गयी कार्यवाही के सम्बन्ध में पुलिस उपायुक्त पूर्वी @dcpekanpur द्वारा दी गयी बाइट।@Uppolice pic.twitter.com/QpGho35a0M — POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) January 30, 2022 ఇదిలా ఉండగా.. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు పొలిటీషియన్లు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. कानपुर में हुई बस दुर्घटना में कई लोगों के हताहत होने की खबर से अत्यंत दुःख हुआ है। इस घटना में अपने प्रियजनों को खोने वाले परिवारों के प्रति मेरी गहन शोक-संवेदनाएं। मैं घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ। — President of India (@rashtrapatibhvn) January 31, 2022 कानपुर से सड़क हादसे का बहुत ही दुखद समाचार प्राप्त हुआ। मृतकों के परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि घायलों को जल्द स्वास्थ्य लाभ मिले। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 30, 2022 -
నోట్ల గుట్టల మాయగాడు.. కొత్త ట్విస్ట్
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు. అలా అనలేదు.. మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు. పొలిటికల్ డ్రామా.. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్రాజ్ జెయిన్కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా. ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు. చదవండి: పీయూష్పై ఇంతకాలం అనుమానం ఎందుకు రాలేదంటే.. -
ప్రధాని మోదీ నోట ‘పీయూష్ జైన్’ మాట
PM Modi And Amit shah Slams SP Chief Akilesh Yadav Over Piyusj Jain Issue: యూపీ కాన్ఫూర్ వ్యాపారి పీయూష్ జైన్ వ్యవహారం ఆర్థిక నేరంగానే కాదు.. రాజకీయంగానూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ అత్తరు వ్యాపారి అయిన పీయూష్ నుంచి దాదాపు 200 కోట్లకు పైనే విలువైన సంపదను అధికారులు రికవరీ చేసుకోవడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ తరుణంలో యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. పీయూష్ వ్యవహారం ఆధారంగా ప్రతిపక్షంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాన్పూర్లో మంగళవారం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగించిన ప్రధాన మోదీ.. సమాజ్వాదీ పార్టీ, ఆ పార్టీ చీఫ్ అఖిలేష్పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేసినా.. అది తాము చేసిందేనని, బీజేపీ క్రెడిట్ను ఊరికే లాక్కుంటోందని వాళ్లు(అఖిలేష్ను ఉద్దేశించి) అంటారు కదా. మరి ఇప్పుడు నోట్ల కట్టలు నిండిన డబ్బాలు బయటపడ్డాయి. మరి బాధ్యతగా ఎందుకు ముందుకు రావడం లేదు. నోళ్లు మూసుకుని కూర్చుకున్నారు వాళ్లంతా. 2017కి ముందు దాకా అత్తరు అవినీతి యూపీలో ఏ విధంగా గుభాలించిందో అందరికీ తెలిసిందే అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా చూస్తోంది. ఇది వాళ్లు సాధించిన ప్రగతి. వాస్తవ పరిస్థితి. యూపీ ప్రజలు ప్రతీది గమనిస్తున్నారు. వాళ్లకు ప్రతీది అర్థమవుతోంది. గత ప్రభుత్వం ఎన్నికల గెలుపును.. దోచుకునేందుకు దొరికిన లాటరీగా భావించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం నిజాయితీతో బాధ్యతాయుతంగా పని చేస్తోందని అని వ్యాఖ్యానించారు ప్రధాని. షా నేరుగా.. అయితే ప్రధాని మోదీ పరోక్షంగా కామెంట్స్ చేస్తే.. కేంద్ర మంత్రి అమిత్ షా నేరుగా పేర్లతో విమర్శించడం విశేషం. ఈమధ్య సమాజ్వాదీ పార్టీకి చెందిన ఓ పర్ఫ్యూమ్ వ్యాపారి దొరికాడు. మేమేందుకు దాడులు చేయించామా? అనుకుంటూ అఖిలేష్ గారు మెలికలు తిరిగిపోతున్నారు. 250కోట్ల డబ్బు. ఎక్కడిది అఖిలేష్గారూ అంటూ సూటిగా ప్రశ్నించారు షా. అఖిలేష్ ఏమన్నాడంటే.. ఇక ప్రధాని, షాల ఆరోపణలపై ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సాదాసీదాగా స్పందించాడు. పొరపాటున వాళ్లకు చెందిన వ్యాపారిపైనే బీజేపీ దాడులు చేయించుకుందంటూ కౌంటర్ ఇచ్చారు. అతని(పీయూష్) కాల్ రికార్డులు పరిశీలిస్తే.. అతనితో టచ్లు ఉన్న బీజేపీ నేతల పేర్లు బయటపడతాయి. ఎస్పీ నేత పీయూజ్రాజ్ జెయిన్కు బదులు.. బహుశా పీయూష్ జైన్ మీద దాడులు చేసి ఉంటారేమో అంటూ సెటైరిక్గా స్పందించారు అఖిలేశ్. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేత.. లెక్కించేందుకు నాలుగు రోజులు?
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. తనిఖీల్లో భాగంగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ డబ్బును లెక్కించేందుకే దాదాపు నాలుగు రోజులు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్: ఒక్కరోజే 156 కొత్త కేసులు, మహారాష్ట్రను దాటేసిన ఢిల్లీ ఇక, సోదాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్లో 4, కన్నౌజ్లో 7, ముంబయిలో 2, దిల్లీలో ఒక ఆస్తికి చెందిన పత్రాలను గుర్తించారు. మరో రెండు ఆస్తులు దుబాయిలో ఉన్నట్లు తేలింది. కన్నౌజ్లో పీయూష్ జైన్ పూర్వీకుల ఇంట్లో 18 లాకర్లను అధికారులు గుర్తించారు. మరో 500 తాళాలు కూడా దొరికాయని సమాచారం. పన్ను ఎగవేత మొత్తంగా 1000కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ముందు ప్రేమ, ఆపై దూరం.. తట్టుకోలేక ఒకరినొకరు పొడుచుకున్న ప్రేమికులు సంబంధిత వార్త: గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే, షాక్లో అధికారులు.. ఫోటోలు వైరల్! -
సార్.. ఫోజులు తర్వాత.. ముందు గ్యాస్ వెలిగించు
లక్నో: సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా శ్రమించిన వారు విన్ అవుతుంటే.. ఏం లేకపోయినా.. హడావుడి చేసే బాపతు బ్యాచ్ మాత్రం తుస్సుమంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. సార్ చాలా శ్రమ పడి ఫోజులిచ్చారు కానీ.. మీ ప్రయత్నం వృథా అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు.. కాన్పూర్ కమిషనర్, ఐఏఎస్ అధికారి రాజ్ శేఖర్ ఆదివారం వంటింట్లో గరిటె పట్టిన ఫోటోని ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి.. వంటలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను.. ఉదయం టిఫిన్ కోసం పోహా తయారు చేస్తున్నాను.. అది కూడా హోం మినిస్టర్ అధ్వర్యంలో’’ అనే క్యాప్షన్తో ఫోటోని షేర్ చేశారు. (చదవండి: ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!) Please wish me Good Luck. Trying my luck in Cooking…😊 Preparing the Poha for the Breakfast under guidance of Home Minister…😊 pic.twitter.com/y607j5Yzr1 — Raj Shekhar IAS (@rajiasup) December 19, 2021 ఇక దీనిలో రాజ్ శేఖర్.. నీటుగా సూటు బూటు వేసుకుని తయారయి ఉన్నారు. అన్నింటికంటే.. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. వంట చేస్తున్నానని చెప్పారు.. కానీ గ్యాస్ వెలిగించి లేదు. ఇది గమనించుకోకుండా.. ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ నెటిజనులు ఎంత జాగ్రత్తగా గమనిస్తారో తెలుసు కదా.. దాంతో కమిషనర్ పరువు పొగొట్టుకునే పరిస్థితి తలెత్తింది. (చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి) ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ‘‘సార్.. వంట బాగా చేశావ్.. స్టవ్ వెలిగిస్తే.. ఇంకా బాగుండేదేమో’’.. ‘‘సూటు బూటు వేసుకుని వంట చేస్తారా ఎవరైనా’’.. ‘‘గ్యాస్ ధర చుక్కలనంటుతుంది.. మీరేమో మంటతో పని లేకుండా వంట చేశారు.. ఆ టెక్నిక్ మాకు కూడా చెప్పండి’’.. ‘‘ఈ ఫోటోని గనక ఐక్యరాజ్యసమితి చూస్తే.. దెబ్బకు మూర్ఛపోతుంది.. మీ ఐడియాను తెగ ప్రశంసిస్తుంది.. గ్లోబల్ వార్మింగ్ కూడా సగానికి సగం తగ్గుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. Cooking without fire while dressed in a suit ...yeah you do need help. Help in staging social media pics https://t.co/XQsfY2RpvQ — Lady Andolan Jeevi 🏳️🌈 (@LadyDramadragon) December 20, 2021 చదవండి: మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా? -
ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!
లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన తర్వాత వైద్య సిబ్బంది ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో.. సరైన అవగాహన లేకపోవడం.. వైరస్ గురించి పూర్తిగా తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆలోచించి చాలా మంది వైద్య సిబ్బంది రోజుల తరబడి ఆస్పత్రులకే పరిమితం అయ్యారు. కరోనా వైద్య సిబ్బందిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేసిందని విశ్లేషకులు తెలిపారు. వైరస్ తన రూపు మార్చుకుంటూ.. దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ జనాలను భయపెడుతుంది. ఇది డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ భయంతో ఓ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్య, బిడ్డలను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. నిందితుడి పేరు డాక్టర్ సుశీల్ కుమార్. ఇతడు కాన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు(18), కుమార్తె(15) ఉన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు తెలిసినప్పటి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. (చదవండి: Omicron India: భారత్లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదు.. ఎక్కడంటే) తన భార్య, బిడ్డలు మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ముందుగానే చంపేస్తే మంచిదని ఆలోచించాడు. విచక్షణ మరచిపోయి.. అత్యంత దారుణంగా వారిని హత్య చేశాడు. ఆ తర్వాత తన సోదరుడికి కాల్ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. నిందితుడు సోదరుడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు పారిపోయాడు. (చదవండి: Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్తో ముప్పు లేదు) సంఘటన స్థలంలో పోలీసులుకు ఓ డైరీ, హత్యకు వాడిన సుత్తి లభించింది. మృతులను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డైరీ చదివిన పోలీసులు షాక్ అయ్యారు. దానిలో నిందితుడు తాను నయం కానీ ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు రాసుకున్నాడు. అలానే ‘‘ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరం. అది అందరిని చంపేస్తుంది. నా అజాగ్రత్త వల్ల నేను తప్పించుకోలేని ఓ ప్రమాదంలో చిక్కుకున్నాను. నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ముందే సురక్షితమైన ప్రాంతానికి పంపాలి’’ అని రాసుకున్నాడు. డైరీ పరిశీలించిన పోలీసులు నిందితుడు తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడికి కోసం గాలిస్తున్నారు. చదవండి: వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్! -
ద్రవిడ్ రూటే సెపరేటు! గ్రౌండ్స్మెన్కు రూ.35 వేలు.. కారణం
ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్ ఆడుతుంది అంటే పిచ్ మన బౌలర్లకు అనూకూలంగా తయారు చేయడం సహజం. కానీ రాహుల్ ద్రవిడ్ రూటు మాత్రం సెపరేటు. టీమిండియాకు హెడ్కోచ్గా ఎంపికైనప్పటి నుంచి తనమార్క్ కోచ్ అంటే ఏంటో చూపిస్తూ వచ్చాడు. తాజాగా న్యూజిలాండ్, టీమిండియా మధ్య ముగిసిన తొలి టెస్టు గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. చదవండి: Rahane-Dravid: రహానే ఫామ్పై ఆందోళన వ్యర్థం: ద్రవిడ్ కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టుకు స్పోర్టింగ్ పిచ్ తయారు చేయాలంటూ గ్రౌండ్ మేనేజ్మెంట్ను కోరినట్లు తెలిసింది. అందుకు ద్రవిడ్ తన పర్సనల్ అకౌంట్ నుంచి రూ.35 వేలు గ్రీన్పార్క్ గ్రౌండ్స్మెన్కు ఇచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యుపీసీఏ) మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ద్రవిడ్పైన ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ యూపీ క్రికెట్ తెలిపింది. ద్రవిడ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆట ఫెయిర్గా.. స్పోర్టివ్గా ఉండాలని భావించేవాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా ద్రవిడ్లో అదే తీరు కనబడిందని.. పిచ్ తమకు అనుకూలంగా కాకుండా స్పోర్టింగ్ పిచ్ను తయారు చేయమని చెప్పడం ఒక్క ద్రవిడ్కు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం ద్రవిడ్ చేసిన పని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. '' మ్యాచ్ డ్రాగా ముగిసింది అన్న బాధ కంటే ద్రవిడ్ చేసిన పని ఆనందం కలిగించింది.. ఎంతైనా కోచ్గా ద్రవిడ్ రూటే సెపరేటు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Rachin-Ajaz Patel: రచిన్, ఎజాజ్ పటేల్.. భారత్తో బంధం -
IND Vs NZ 1st Test: జడేజా, అయ్యర్ అర్థశతకాలు.. ముగిసిన తొలిరోజు ఆట
►న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదటి రోజు ఆటను ముగించింది. తొలిరోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 75*, రవీంద్ర జడేజా 50* పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరిమధ్య ఇప్పటివరకు ఐదో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతకముందు శుబ్మన్ గిల్ 52 పరుగులు చేసి ఔట్ కాగా.. మిగతా టీమిండియా బ్యాటర్స్లో రహానే 35, పుజారా 26, మయాంక్ 13 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 3 వికెట్లు తీశాడు. ఓవరాల్గా తొలి రోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కాగా వెళుతురు లేమితో అంపైర్లు ఆరు ఓవర్లు ముందే ఆటను నిలిపివేశారు. ► తొలి టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 80 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 69, రవీంద్ర జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►అరంగేట్ర టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం మూడో సెషన్లో బ్యాటింగ్ కొనసాగిస్తున్న టీమిండియా 72 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అయ్యర్ 54, రవీంద్ర జడేజా 29 పరుగులతో ఆడుతున్నారు. ► 106 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగుల చేసిన పుజారా, సౌథీ బౌలింగ్లో బ్లండెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి భారత్ 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే (17), శ్రేయాస్ అయ్యర్(6)పరుగులతో ఉన్నారు. ►82 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన గిల్, కైల్ జామీసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఛతేశ్వర్ పుజారా(8), రహానే (0)పరుగులతో ఉన్నారు. ►న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్(40), ఛతేశ్వర్ పుజారా(8) పరుగులతో ఉన్నారు. ►టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జెమీషన్ బౌలింగ్లో బ్లండెల్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో నయా వాల్ ఛతేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. ►పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 24-1. ►భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా గురువారం జరుగుతున్న తొలి టెస్ట్లో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడించిన న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు కివీస్ కూడా టి20 సిరీస్లో ఎదురైన క్లీన్స్వీప్ పరాభవాన్ని రూపుమాపేందుకు తొలి టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ సారి సీనియర్ల గైర్హాజరీలో భారత యువ జట్టు బరిలోకి దిగుతున్నది. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్తో టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కాగా భారత్ గడ్డపై కివీస్ చివరి సారిగా 1988లో టెస్టు మ్యాచ్ గెలిచింది. భారత జట్టు: శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్విల్లే చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక.. -
IND Vs NZ 1st Test: ప్రాక్టీస్లో చమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు
-
భారత ఓపెనర్ల కంటే ఆ ఇద్దరు బాగా ఆడుతారు.. గెలుపు ఖాయం
Aakash Chopra makes his predictions for the 1st IND vs NZ Test: కాన్పూర్ వేదికగా గురువారం నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్పై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. భారత ఓపెనర్ల కంటే పుజారా, రహానే కలిసి ఎక్కువ పరుగులు చేస్తారని అతడు జోస్యం చెప్పాడు. "పుజారా, రహానే కలిసి భారత ఓపెనర్ల కంటే ఎక్కువ పరుగులు చేస్తారు. పుజారాపై కూడా ఒత్తిడి ఉంది. కానీ లీడ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్తో పూజారా తిరిగి తన ఫామ్ను అందుకున్నాడు. ఇద్దరు ఓపెనర్లు కూడా కొత్తవారే. అదే విధంగా న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ ఇద్దరూ స్పిన్కు బాగా ఆడుతారు. ఈ మ్యాచ్లో వారిద్దరూ కలిసి 125 కంటే ఎక్కువ పరుగులు చేస్తారని నేను భావిస్తున్నాను" అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక భారత స్పిన్నర్ల గురించి మాట్లాడూతూ.. ఈ మ్యాచ్లో భారత్ ఎంత మంది స్నిన్నర్లతో బరిలోకి దిగుతోందో నాకు తెలియదు. కానీ ఈ మ్యాచ్లో స్పిన్నర్లు పదికి పైగా వికెట్లు తీస్తారని నేను భావిస్తున్నాను " అని చోప్రా తెలిపాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆకాశ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. కాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమిండియా బరిలోకి లోకి దిగనుంది. చదవండి: Dinesh Karthik: మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ -
జికా వైరస్ కలకలం..100 దాటిన కేసులు
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో జికా వైరస్ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా మరో 16 జికా వైరస్ కేసులు నమోదు కావడంతో యూపీలో ఈ కేసుల సంఖ్య 100 దాటింది. ఇక ప్రత్యేకంగా కాన్పూర్లో అత్యధిక జికా వైరస్ కేసులు నమోదు అవుతూ ఆ ప్రాంతాన్ని వణికిస్తోన్నాయి. కాన్పూర్లో అక్టోబరు 23న తొలి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. జికా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. చదవండి: అరుణాచల్ ప్రదేశ్లో గ్రామం.. ‘అది చైనాలోనే ఉంది’ -
యూపీలోని కాన్పూర్లో విజృంభిస్తోన్న జికా వైరస్
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ విజృంభిస్తుండగా, గత వారం రోజులుగా కాన్పూర్లో పెరుగుతున్న జికా వైరస్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. దోమల ద్వారా సంక్రమించే ఈ కేసుల సంఖ్య సోమవారంనాటికి 89కి చేరింది. బాధితుల్లో ఒక గర్భిణీ, 17 మంది పిల్లలు ఉండటం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. మొదటి జికా కేసు అక్టోబర్ 23న గుర్తించగా, గత వారంలో కేసుల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడెస్ ఈజిప్టి దోమల ద్వారా జికా వ్యాపిస్తుంది. నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. డెంగ్యూ, చికున్ గున్యా వ్యాప్తికి కారకాలు కూడా. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్ర బారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాగా జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని, అనేక వైద్య బృందాలు వ్యాధిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాన్పూర్ జిల్లా మెడికల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ సింగ్ తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్తోపాటు, వైరస్ను వ్యాప్తి చేసే దోమ సంతానోత్పత్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. -
Zika Virus: కాన్పుర్లో 25 జికా వైరస్ కేసులు నమోదు
-
Zika Virus: కాన్పుర్లో 25 జికా వైరస్ కేసులు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్లో బుధవారం 25 కొత్త జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన 11 కేసులతో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 36 జికా వైరస్ కేసులు నమోదైనట్లు కాన్పుర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నెపాల్ సింగ్ తెలిపారు. 36 జికా కేసుల్లో ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ 400 నుంచి 500 ఇళ్లలో ఉన్నవారి నుంచి సాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ప్రతి ఇంటిలోను సాంపిల్స్ సేకరించే కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. జికా వైరస్ కేసులు పెరుగుతన్నాయని ఎవరూ ఆందోళన చెందవద్దని, నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాన్పుర్లోని తివారీపూర్, అష్రఫాబాద్, పోఖర్పూర్, శ్యామ్ నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో కొత్త జికా వైరస్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. -
Prerna Verma: 3 వేలతో వ్యాపారం ప్రారంభించి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్
Prerna Verma: Kanpur Based Entrepreneur Inspiring Story In Telugu: రోజువారీ అవసరాలకు కూడా వెతుక్కునే కుటుంబంలో పుట్టి పెరిగింది ప్రేరణ వర్మ. రోజువారీ ఖర్చుల కోసం అని ఉంచిన మూడు వేల రూపాయలతో కాన్పూర్లో మొదలు పెట్టిన లెదర్ వ్యాపారంతో నేడు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దిశగా ఎదిగింది. నేడు రోజూ రెండు కోట్ల రూపాయల టర్నోవర్తో లెదర్ కంపెనీని నడుపుతుంది. తన కుటుంబానికి అండగా ఉండటంతో పాటు, మరికొందరికి ఉపాధి కల్పిస్తోంది. ఎన్నో అవార్డులనూ సొంతం చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూరు నివాసి అయిన 38 ఏళ్ల ప్రేరణ వర్మ టెన్త్ క్లాస్ నుంచే ట్యూషన్లు చెప్పేది. ఆ తర్వాత కాలేజీ, ఉద్యోగం ఏ పనులు చేస్తున్నా ట్యూషన్లు ఆపలేదు. ‘‘ఏ పనులు మానేసినా ఆ నెల గడవదు అనే భయం వెంటాడేది. ఇంట్లో అమ్మ, తమ్ముడు, నేను. కొన్ని కారణాల రీత్యా మా నాన్నకు దూరమయ్యాం. ఇంటి బాధ్యత నా మీదనే ఉండటంతో సంపాదన గురించి ఎప్పుడూ ఆలోచించేదాన్ని. 2004లో మార్కెటింగ్ విభాగంలో ఓ సైబర్ కేఫ్లో పనిచేసేదాన్ని. ఓ అమ్మాయి అలా బయటకు వెళ్లి పనిచేయడమే మా చుట్టుపక్కల పెద్ద విషయంగా భావించేవారు’’ అని తన జీవితం తొలినాళ్లను గుర్తుచేసుకుంటుంది ప్రేరణ. వ్యాపారంలో మోసం ఆ తర్వాత వచ్చిన గడ్డు పరిస్థితులు, దాటిన విధానాల గురించి చెబుతూ... ‘‘సైబర్ కేఫ్లో ఓ పెద్దాయన కలిశాడు. తనతో పాటు మార్కెటింగ్ పనులు చేయమని సూచించాడు. దీంతో నేనూ వారి కంపెనీలో భాగస్వామినయ్యాను. ఎలాంటి ఒప్పంద పత్రాలు లేకపోవడంతో నెలన్నరలోనే అక్కణ్ణుంచి బయటకు రావాల్సి వచ్చింది. అది నాకు అనుభవాన్ని నేర్పింది. కానీ, ఇంటిని నిలబెట్టుకోవడానికి ఉద్యోగం తప్పనిసరి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. ‘ఇప్పుడేం చేయాలి?’ అనేది పెద్ద సందిగ్ధం. ఉద్యోగం లేకుండా జీవించే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎవరికోసమో మార్కెటింగ్ పనులు చేశాను. ఇప్పుడు నాకోసం నేనే ఎందుకు వ్యాపారం ప్రారంభించకూడదు అనుకున్నాను. కానీ, నా దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాయం పొందేందుకు డబ్బు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆ డబ్బుతోనే ఇంట్లో ఒక గదిలో లెదర్ నుంచి తాళ్లు తీసే పనిని మొదలుపెట్టాను. అవకాశం ఉన్న చోట, పరిశ్రమలకు వెళ్లి కొనుగోలుదారులను వెతికేదాన్ని. సరఫరా చేసే విధానం గురించి అడిగేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది. అనుకున్న సమయానికి డెలివరీ చేశాను. ఆ విధంగా వ్యాపారానికి పునాది పడింది. వినియోగదారులను సంపాదించడం ద్వారా మాత్రమే ఈ పరిశ్రమలో ఉండగలను అని తెలుసుకున్నాను. సొంతంగా కంపెనీ.. ‘క్రియేటివ్ ఇండియా’ అనే పేరుతో సంస్థ ప్రారంభించి నేటికి 15 ఏళ్లు. లెదర్ తాళ్లు తయారీనే కాదు, ఎగుమతి కూడా చేస్తాను. ఈ పనిని మొదలుపెట్టినప్పుడు ఎవరూ దీనిని ఒక పనిగా గుర్తించలేదు. ప్రాక్టీస్ మీద సాధించాను. నేను ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాలేదు. నేటికీ వ్యాపారంలో ఆడపిల్లలు చాలా తక్కువ. చాలా మంది నన్ను చూసి హేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆడపిల్లలు ఇలాంటి వ్యాపారాలు ఎలా చేస్తారు, అసాధ్యం అన్నారు. కానీ, నేను ఈ లెదర్ వ్యాపారంలో విజయం సాధించాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నది సాధించాను. రోజుకు రెండు కోట్ల టర్నోవర్తో కంపెనీని నడుపుతున్నాను. ఎక్కడకు వెళ్లినా వెళ్లినా అక్కడ కనీసం రెండు, మూడు వాహనాలైనా నా కోసం ఎదురుచూస్తుంటాయి. ప్రోత్సాహక అవార్డులు ఒక అమ్మాయి ఇంటి గుమ్మం బయట నుంచి పని చేస్తే ఆ కుటుంబసభ్యులే అనుమానంగా చూస్తారు. కానీ, 2010లో నాకు ఎక్స్పోర్ట్ బిజినెస్ అవార్డు వచ్చినప్పుడు నేను సరైన సమాధానం చెప్పాను అనిపించింది. ఆ తర్వాత 2015లో హస్తకళల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి, 2016లో జాతీయ ఉత్పాదక మండలి, 2017లో మళ్లీ హస్తకళల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి అవార్డులు వరుసగా వరించాయి’’ అని ప్రేరణ తన విజయం గురించి, అనుభవించిన గడ్డు స్థితి గురించి వివరిస్తారు. ఎవరైనా ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రేరణ స్ఫూర్తి కథనాన్ని చదివితే చాలు, తప్పక ప్రేరణ పొందుతారు. ‘విజయం ఒక్కరోజులో సాధ్యం కాదు, అందుకోసం ఓ తపస్సు చేయాలని చెబుతున్న ప్రేరణ వర్మ నేడు ఎంతోమంది మగువలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నా దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాయం పొందేందుకు డబ్బు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆ మూడు వేల రూపాయలతో ఇంట్లోనే ఒక గదిలో లెదర్ నుంచి తాళ్లు తీసే పనిని మొదలుపెట్టాను. – ప్రేరణ చదవండి: Pink Cafe: చాయ్తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి
ఉత్తరప్రదేశ్: సినిమాల్లో మాదిరి నిజ జీవితం అన్ని జరగవు. అయితే కొన్ని సంఘటనలు చూస్తే సినిమాల్లో మాదిరిగా చేస్తున్నారో లేక వాటిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్నారో కూడా తెలియదు. కానీ కాన్పూర్కి చెందిన పంకజ్ అనే వ్యక్తి 1999లో వచ్చిన బ్లాక్బస్టర్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాల్లో హీరో మాదిరిగా చేశాడు. (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....గుర్గామ్లోని ఓ ప్రైమేట్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తికి ఈ ఏడాది మేలో కోమల్ అనే ఆమెతో వివాహం అయ్యింది. అయితే పంకజ్ భార్య కోమల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనితో మాట్లాడకుండా దూరంగానే ఉండేది. అంతేకాక తనతోనే కాక ఇంట్లో వాళ్ల ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండేది. చివరికి అతను కోమలిని ఎంతో ప్రయత్నించి అడగగా ఆమె తాను పింటూ అనే వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పింది. దీంతో పంకజ్ తన అత్తమామలకు ఈ విషయాన్నితెలియజేశాడు. అయితే పంకజ్ అత్తమామలు కోమల్కు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఆమె అంగీకరించ లేదు. ఆ తర్వాత ఈ విషయం గృహ హింస నిరోధక విభాగం, ఆశాజ్యోతి సెంటర్కు చేరుకుంది. వారు పంకజ్కి అతని భార్య కోమల్, పింటూ, వారి బంధవులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కోమల పింటూనే వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకోవడంతో చివరికి పంకజ్ వారి వివాహానికి అంగీకరించాడు. ఈ మేరకు పంకజ్ దగ్గరుండి మరీ లాయర్ సమక్షంలో తన భార్య ప్రేమించిన పింటూతో ఘనంగా వివాహం జరింపించాడు. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
అత్యాచారం చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల అమ్మాయిని ఆమె పనిచేసే కంపెనీ యజమాని అత్యాచారం చేయడమే కాకుండా పదో అంతస్తు నుంచి కిందకి తోసి హత్య చేశాడు. డీసీపీ మూర్తి గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కాన్పూర్లో డెయిరీని నిర్వహించే ప్రతీక్ వైష్ (40)అనే వ్యక్తి తన దగ్గర సెక్రటరీగా పని చేసే 19 ఏళ్ల అమ్మాయికి ఆఫీసు పని ఉందని మభ్యపెట్టి కళ్యాణ్పూర్లో ఉన్న తన ఫ్లాట్కి తీసుకువెళ్లాడు. ఇంటికి తీసుకువెళ్లాక తనతో సెక్స్ చేస్తే డబ్బులు ఇస్తానని ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయమంతా పోలీసులకి చెబుతానని ఆమె గట్టిగా బెదిరించడంతో పదో అంతస్తులో ఉన్న తన ఇంటి బాల్కనీ నుంచి ఆమెని కిందకి తోసేశాడు. దీంతో ఆ అమ్మాయి మరణించింది. మొదట పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రతీక్ ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసు విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ప్రతీక్ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా అతనిని న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: హైదరాబాద్: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
సెంట్రల్ బ్యాంకుకు టోకరా.. మరో భారీ ‘రుణ’ కుంభకోణం
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్న బాగోతాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబుల బండారం బట్టబయలవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శ్రీలక్ష్మి కాట్సిన్తోపాటు ఆ సంస్థ చైర్మన్ కమ్ ఎండీ మాతా ప్రసాద్ అగర్వాల్, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీరు భారీగా రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. ఫలితంగా బ్యాంకుల కన్సార్టియంకు రూ.6,833 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఈ ఏడాది సీబీఐ దర్యాప్తు చేస్తున్న బ్యాంకు ఫ్రాడ్ కేసుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు తాజాగా నోయిడా, రూర్కీ, కాన్పూర్, ఫతేపూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సీబీఐ అధికారులు ‘శ్రీలక్ష్మి కాట్సిన్’ చైర్మన్ మాతా ప్రసాద్ అగర్వాల్తోపాటు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్కుమార్ అగర్వాల్, డైరెక్టర్ శారదా అగర్వాల్, డిప్యూటీ ఎండీ దేవస్ నారాయణ్ గుప్తాను నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే తమ బ్యాంకును మోసగించినట్లు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆరోపించింది. తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారని, ఇలా చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని తేల్చిచెప్పింది. రుణం కోసం తప్పుడు పత్రాలు సమర్పించారని, అబద్ధాలు చెప్పారని పేర్కొంది. వస్త్ర వ్యాపారం చేసే శ్రీలక్ష్మి కాట్సిన్ సంస్థ తమ వద్ద అధికంగా నిల్వలు ఉన్నట్లు బ్యాంకులకు ఫోర్జరీ రికార్డులు సమర్పించింది. రూ.7,926 కోట్లకు పైగా రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా బ్యాంకులను దగా చేసిన హైదరాబాద్కు చెందిన ట్రాన్స్ట్రాయ్(ఇండియా) లిమిటెడ్పై గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రేమ.. పెళ్లి పేరిట ఈ ‘రుచి’ మోసాలు ఇన్నన్నీ కావు
లక్నో: ఆమె ప్రేమిస్తే యువకులు కుటుంబాలను వదిలేసి వచ్చేస్తారు. ఆమె లోకంలో మునిగి తేలుతారు. ఆ యువతి కోసం కుటుంబాలను వదిలేసి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. అందం.. ఆకర్షణీయంగా కనిపించే అమ్మాయి ఇలా యువకులను ప్రేమించి.. పెళ్లాడి.. వారిని దోచేసుకుని మాయమవడం ఆమెకు పరిపాటి. యువకుల వీక్నెస్ను పట్టుకున్న ఆమె నిత్య పెళ్లికూతురిలా మారిపోయింది. పెళ్లి చేసుకున్న యువకుల నుంచి నగదు, ఆభరణాలు.. కుదిరితే ఆస్తులు రాయించుకుని పారిపోతుంది. అలాంటి ఆమెపై ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బాబుపూర్వకు చెందిన అమిత్ శర్మ గోవింద్నగర్లో నివసించే రుచివర్మను ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. గాఢంగా ప్రేమించుకుంటున్న వీరిరువురు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా 2020 జూన్ 4వ తేదీన ఆర్య సమాజ్లో పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు. అప్పుడు కరోనా మొదటి దశ ఉండడంతో ఆ పెళ్లికి ఎవరినీ పిలవలేకపోయారు. వివాహానంతరం వీరిద్దరి కాపురం సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లి నవంబర్ 23వ తేదీన వచ్చి బంధువుల పెళ్లి ఉందని చెప్పి రుచి వర్మను తన వెంట తీసుకెళ్లింది. ఆ సమయంలో రుచి తనతో పాటు రూ.50 వేల నగదు, విలువైన ఆభరణాలు తీసుకెళ్లింది. పెళ్లి కోసం వెళ్లిన తన భార్యకు రోజు ఫోన్ చేస్తుండగా స్విచ్ఛాఫ్ వస్తోంది. వస్తుందని భావించగా కొన్ని రోజులైనా రాకపోవడంతో నేరుగా అత్తింటి వారికి వెళ్లాడు. ‘నిన్ను తీసుకెళ్లడానికి వచ్చా రా’ అని అడగ్గా అతడితో వెళ్లేందుకు భార్య రుచి వర్మ నిరాకరించింది. తల్లి కూడా పంపించేందుకు ససేమిరా చెప్పింది. బిత్తరపోయిన అమిత్ అక్కడ తెలిసిన వారి వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమె నిజ స్వరూపం బయటపడింది. పుట్టింటికి వచ్చిందే మరో వ్యక్తితో పెళ్లి చేసుకునేందుకు వచ్చిందని తెలిసి షాక్ తిన్నాడు. మొదట ఈ విషయాన్ని నమ్మలేదు. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోతో అవాక్కయాడు. దీనిపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడితో పాటు మరొకరిని కూడా రుచి వర్మ పెళ్లి చేసుకుని మోసం చేసిందని తెలుసుకున్నాడు. ఆమె విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమ.. పెళ్లి పేరిట మోసం చేసి అందిన కాడికి దోచుకుని వెళ్తుందని ఆమె నిజస్వరూపం బట్టబయలైంది. ఆమె నిత్య పెళ్లి కూతురిలా తయారు కావడానికి తల్లి సహకరిస్తోందని తెలిసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్నీ చేసినా అమిత్ మాత్రం రుచి వర్మతో కలిసి ఉండాలని ఉందని పోలీసులకు చెప్పాడు. న్యాయం చేయాలని అమిత్ పోలీసులను విజ్ఞప్తి చేశాడు. -
అమ్మేవి చాయ్, సమోసాలు సంపాదన మాత్రం కోట్లు!
సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ లక్షలు అర్జించే వారు కోట్లు వెనకేసుకోవడం మనకి తెలిసిందే. అయితే రోడ్డు పై టీ స్టాల్, సమోసా అమ్మకునే వ్యక్తులు కూడా ఇలా కోట్లు కూడబెడుతున్నారని మీకు తెలుసా. ఈ నమ్మలేని నిజాలు కాన్పూర్లోని జీఎస్టీ, ఆదాయ శాఖ అధికారుల పరిశీలనలో బయటపడ్డాయి. అక్కడ పలు ప్రాంతాల్లో రహదారిపై చాట్, క్రిస్పీ-కచోరి, చాయ్-సమోసా, పాన్ షాపుల వాళ్లలో కొందరు కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంట. ఈ పుట్ పాత్ వ్యాపారులంతా ఆహార భద్రతకు భరోసా ఇచ్చే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ తీసుకోకుండా చాలా సంవత్సరాలుగా ఈ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. కొందరు పేదలుగా కనిపించే ఈ కనపడని కోటీశ్వరులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది వ్యాపారులు మిలీనియర్లుగా బయటకు పడ్డారు. డేటా సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలను పరిశీలించినప్పుడు, ఐటి విభాగం అధికారులు సైతం నివ్వెరపోయారు. వీరిలోని చాలా మంది వద్ద ఖరీదైన కార్లు, ఎకరాల్లో భూములు లాంటివి కోనుగులు చేస్తూ ఆస్తులు భారీగానే కూడబెడుతున్నారని తెలిపారు. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని వెల్లడించారు. హిందూస్థాన్లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ వ్యాపారులు జిఎస్టి రిజిస్ట్రేషన్ వెలుపల ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదట. కాని నాలుగేళ్లలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని వెల్లడించింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో పలు ఆస్తులను కొనుగోలు చేశారని, దక్షిణ కాన్పూర్లో కూడా ఆస్తులు కొన్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు ఈ విషయాలపై పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
Ram Nath Kovind: రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత..మహిళ మృతి
కాన్పూర్(యూపీ): రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్లో ట్రాఫిక్ను నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ మహిళ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. అఖిలభారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం చీఫ్ వందన మిశ్రా(50) ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను కాకాదేవ్లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వారి వాహనం వెళ్తున్న గోవింద్పురీ వంతెన మార్గంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాహన శ్రేణి వెళ్తోంది. ప్రోటోకాల్లో భాగంగా ఆ మార్గంలో ట్రాఫిక్ను పోలీసులు ఆపడంతో భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. అందులో వందన వాహనం చిక్కుకుంది. కాన్వాయ్ వెళ్లాక వందనను ఆస్పత్రికి తరలిలించగా అప్పటికే ఆమె మరణించారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు కారకులంటూ ఒక సబ్–ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అసీమ్ అరుణ్ చెప్పారు. ఘటనపై క్షమాపణలు చెప్పారు. మృతి విషయం తెల్సి రాష్ట్రపతి కోవింద్ ఆవేదన వ్యక్తంచేశారని చెప్పారు. అంత్యక్రియలకు హాజరై రాష్ట్రపతి తరఫున సానుభూతిని పోలీస్ కమిషనర్ తెలిపారు. -
బంగారు మాస్కు ధర 5 లక్షలు..
కాన్పూర్: కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరైంది. ముఖ్యంగా మాస్కుల పుణ్యమాని తోటి మనుషుల ముఖాలు చూడటం అరుదైపోయింది. ఈనేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని మనోజ్ సెనగర్ అనే వ్యక్తి బంగారు మాస్కుతో వార్తల్లో నిలిచాడు. కాన్పూర్లో నివాసం ఉండే ఇతడికి బంగారం అంటే మక్కువట. ఇక రూ.5 లక్షల విలువైన బంగారంతో తయారు చేసిన ఈ మాస్కులో శానిటైజర్ వ్యవస్థ ఉండడం విశేషం. దీంతో ఈ బంగారు మాస్కును మరే విధంగానూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన శానిటైజేషన్ వ్యవస్థ వల్ల దీనిని దాదాపు ఇది 36 నెలల వరకు వినియోగించవచ్చని సెనగర్ తెలిపాడు. ఇక ఈ మాస్కుకు శివ శరణ్ అని పేరు కూడా పెట్టారు. మెడలో బంగారు గొలుసులు వేసుకుని తిరిగే సెనగర్ను అక్కవి స్థానికులు బప్పీ లాహరి, గోల్డెన్ బాబా అని పిలుస్తుంటారు. పేరుకు తగ్గట్టే ఏకంగా 5 లక్షల విలువైన బంగారు మాస్కుతో ఆయన మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. అతని వద్దనున్న రివాల్వర్కు బంగారు కవర్, మూడు బంగారు బెల్టులు ఉన్నాయి. ఇంత విలువైన సొత్తును దొంగలు, శత్రువులను నుంచి కాపాడుకోవడానికి ఇద్దరు బాడీగార్డులను నియమించుకున్నాడు. చదవండి: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్పై ఈసీ అనర్హత వేటు -
పెళ్లైన 2 నెలలకు భార్య మహిళ కాదని తెలిసింది..
లక్నో: ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ వ్యక్తికి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి మహిళ కాదు.. ఓ ట్రాన్స్జెండర్ అని తెలిసి కుప్పకూలాడు. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది ఏప్రిల్ 28న వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్య అతడికి దూరంగా ఉండసాగింది. ఎన్ని సార్లు దగ్గరవుదామని ప్రయత్నించినా.. ఏదో ఓ కారణం చెప్పి అతడిని దూరం పెట్టసాగింది. గట్టిగా అడిగితే.. ఆరోగ్యం బాగాలేదని తెలిపేది. పెళ్లై రెండు నెలలు గడుస్తున్నా.. భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సదరు వ్యక్తిలో అనుమానం మొదలయ్యింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా షాకింగ్ విషయం తెలిసింది. సదరు వ్యక్తి భార్య అసలు మహిళే కాదని.. ట్రాన్స్జెండర్ అని తెలిపారు వైద్యులు. మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చదవండి: మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’ -
యూపీలో ఘోర ప్రమాదం
-
ఫొటో షేర్ చేసి చిక్కుల్లో పడ్డ కుల్దీప్ యాదవ్!
లక్నో: టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తీరుపై కాన్పూర్ జిల్లా యంత్రాంగం అసహనం వ్యక్తం చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండానే గెస్ట్హౌజ్లో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న అతడి వ్యవహారశైలిని తప్పుబట్టింది. కాగా 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్, స్థానిక గోవింద్నగర్లోని జగదీశ్వర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్ నగర్ నిగం అతిథి గృహంలోనే టీకా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను కుల్దీప్ ట్విటర్లో షేర్ చేశాడు. కోవిడ్పై పోరులో అంతా ఒక్కటి కావాలని, అవకాశం ఉన్నవాళ్లు త్వరితగతిన టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ పోస్టు కాన్పూర్ జిల్లా అధికారుల కంటపడింది. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కుల్దీప్ వ్యవహరించిన తీరుపై వారు విస్మయానికి గురయ్యారు. ఇక ఈ విషయంపై స్పందించిన కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ తివారి విచారణకు ఆదేశించారు. ఎవరి అనుమతితో గెస్ట్హౌజ్లో కుల్దీప్ వ్యాక్సిన్ వేసుకున్నాడనే అంశంపై ఆరా తీస్తున్నారు. కాగా ఐపీఎల్-2021 వాయిదా పడటంతో కుల్దీప్ యాదవ్ ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాదవ్ -
బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడికి యత్నం..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై సోమవారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బాంబు దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్నపోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సురేంద్ర మిథాని గోవింద్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కన్పూర్లోని పండునగర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్కు చెందిన వారని పోలీసులు విచారణలో గుర్తించారు. ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్ పోలీస్ అవుట్పోస్ట్ ఇన్చార్జ్ ఆనంద్ ప్రకాశ్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే సురేంద్ర మిథాని.. తన వ్యక్తిగత సిబ్బందిని అభినందించారు. అదే విధంగా ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. (చదవండి:కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి) -
కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి
లక్నో: తన కుమార్తెతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి కుమార్తె ఉండడాన్ని చూసిన ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి వారిని హత్య చేసి తలుపు పెట్టి బయటకు వచ్చాడు. తన కుమారుడు అదృశ్యమయ్యాడని బాలుడి తండ్రి ఫిర్యాదు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు బయటకు వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ట్రక్ డ్రైవర్ కుమార్తె ఓ బాలుడిని ప్రేమిస్తుంది. వారి ఇంట్లో వాళ్లు శనివారం వేరే గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడు వెంటనే అమ్మాయి ఇంట్లోకి దూరిపోయి గడియ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ యువతి బంధువు ఇంటికి బయట నుంచి తలుపేశాడు. ఈ విషయాన్ని ఆ యువతి తండ్రికి సమాచారం అందించాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదని ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం బాలుడు ఎక్కడ ఉన్నాడో ఒకరు సమాచారం ఇవ్వడంతో తండ్రికి అక్కడకు వెళ్లాడు. తలుపు తీసి చూడగానే బాలిక బాలుడు రక్తపు మడుగులో కనిపించాడు. బాలిక తండ్రి గొడ్డలితో కూతురితో పాటు ఆ బాలుడిని హత్య చేశాడు. ఈ ఘటనతో ఊరి జనమంతా షాక్ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తండ్రిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. చదవండి: లాక్డౌన్ ఉల్లంఘన: 2 వేల బైక్లు సీజ్ -
కరోనా విలయ తాండవం.. కాన్పూర్లో మరణ మృదంగం