కొడుకును చంపిన తండ్రి | father killed his son | Sakshi
Sakshi News home page

కొడుకును చంపిన తండ్రి

Sep 30 2016 11:13 AM | Updated on Jul 30 2018 8:29 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కన్న కొడుకునే బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కన్న కొడుకునే బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురంలోని చంద్రబాబుకొట్టాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రిటైర్డ్ ఏఎస్సై ఇరిగప్ప కుమారుడు జితేంద్ర(30) ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆర్థిక విషయాల్లో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుగున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన ఇరిగప్ప కొడుకు తలపై బండరాయితో మోది హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement