మంజునాథ కమిషన్ ఈ నెల 28, 29 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనుంది.
హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్ ఈ నెల 28, 29 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనుంది.
ఈ కమిషన్ను కలిసేందుకు కేవలం 1500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. కమిషన్ ముందు సామరస్య పూర్వకంగా తమ సమస్యలు చెప్పాలని ఎస్పీ సూచించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన మంజునాథ కమిషన్ను బీసీ సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.