నాందేడ్‌లో మరోమారు బాంబు కలకలం | Once again caused a bomb in Nanded | Sakshi
Sakshi News home page

నాందేడ్‌లో మరోమారు బాంబు కలకలం

Published Thu, Jul 30 2015 11:33 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నాందేడ్‌లో మరోమారు బాంబు కలకలం - Sakshi

నాందేడ్‌లో మరోమారు బాంబు కలకలం

నేను నరేంద్ర మోదీని...

సాక్షి, ముంబై: ‘నేను నరేంద్ర మోదీని. నాందేడ్ రైల్వేస్టేషన్‌లో ఎవరో బాంబు పెట్టారు’ అని ఓ ఆగంతకుడి బెదిరింపు ఘటనను మరవకముందే మరోమారు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాందేడ్ జిల్లాలోని ముత్కేడ్ రైల్వే స్టేషన్‌లో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గురువారం తెల్లవారుజామున వదంతులు వినిపించాయి. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, డాగ్‌స్క్వాడ్, బాంబ్ డిటెక్టర్ల సహాయంతో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేదని పోలీసులు నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement