
సదరమ్ క్యాంపులు నిర్వహించాలి : ఎంపీ వైవీ
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సదరమ్ క్యాంపు నిర్వహించాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
దివ్యాంగుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నియోజకవర్గంలో సదరమ్ క్యాంప్ ఏర్పాటు చేసి రిమ్స్ వైద్యులచే పరీక్షలు నిర్వహించి అక్కడే సర్టిఫికెట్లు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని అధికారులను కోరినట్లు చెప్పారు. ఇటీవల కంభం, కనిగిరిలో దివ్యాంగుల స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించామని దానికి 750 మంది హాజరైతే వారిలో కేవలం 232 మందికి మాత్రమే సదరమ్ సర్టిఫికెట్లు ఉన్నాయని, మిగిలిన వారు క్యాంపు నుంచి వెనుదిరాగాల్సి వచ్చిందని వివరించినట్లు తెలిపారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు.