వైభవంగా అమ్మవారి రథోత్సవం
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఊరేగింపు ముందు భక్తులు కోలాటం ప్రదర్శించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు